21550 వార్తలు







తమిళ, తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరో శ్రీరామ్ (శ్రీకాంత్) నటిస్తున్న కొత్త సినిమా ‘ది మేజ్‘. ఈ మూవీలో ప్రియాంక, హ్రితిక శ్రీనివాస్, కమల్ కామరాజు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని డాక్టర్ నైమిష రెడ్డి కసిరెడ్డి సమర్పణలో శ్రౌష కమల ఆర్ట్, యూఆర్ క్రియేషన్స్ బ్యానర్స్ పై డాక్టర్ ఉదయ్ కె. రెడ్డి పాల్వాయి, డాక్టర్ కేఎస్ఆర్ (కరెడ్డి శ్రీధర్ రెడ్డి), డాక్టర్ భరత్ రెడ్డి గోపు, డాక్టర్ అనిరుధ్ రెడ్డి సోమ నిర్మిస్తున్నారు. ‘ది మేజ్‘ చిత్రాన్ని సరికొత్త సైకలాజికల్ థ్రిల్లర్ కథతో దర్శకుడు డాక్టర్ రవికిరణ్ గడలాయ్ రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ చిత్రం నుంచి హీరో ఆనంద్ దేవరకొండ చేతుల మీదుగా ఫస్ట్ సింగిల్ ’నన్నే నన్నే..’ రిలీజ్ చేశారు. శ్రవణ్ భరద్వాజ్ బ్యూటిపుల్ గా కంపోజ్ చేసిన ఈ పాటకు విజయ్ కుమార్ మంచి సాహిత్యాన్ని అందించారు. కపిల్ కపిలన్ మధురంగా పాడారు. హీరోయిన్ పట్ల హీరో ప్రేమారాధన చూపిస్తూ ఆకట్టుకునేలా సాగుతుంది ఈ పాట.

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న కుమారుడు జై కృష్ణ ఘట్టమనేని... అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని కూడా ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. నిర్మాత పి. కిరణ్ నిర్మించిన ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్పై అశ్విని దత్ సమర్పించారు. ఈ చిత్రం గురువారం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ద్వారా జై కృష్ణ ఘట్టమనేని హిట్ను అందుకున్నాడా?.. ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకులను అలరించిందో తెలుసుకుందాం. కథ: శ్రీను (జైకృష్ణ) కొత్తగా తిరుపతిలో అడుగు పెట్టిన కుర్రాడు. అతను సిటీలో ఉన్న చాలా పెద్ద వ్యక్తుల్లో ఒకరైన పెద్దిరెడ్డి (కిక్ శ్యామ్) కూతురైన మంగ (రషా తడాని)ను తొలి చూపులోనే ప్రేమిస్తాడు. అదే పనిగా తన వెంట పడుతున్న శ్రీనును మంగ మొదట పట్టించుకోదు. తర్వాత అతను చేసిన ఒక సాయం వల్ల ఫ్రెండ్గా అంగీకరిస్తుంది. అనంతరం మంగకు శ్రీను ప్రపోజ్ చేయగా.. ఆమె తిరస్కరిస్తుంది. తనకు ఇదివరకే పెళ్లి ఫిక్స్ అవడంతో.. ఆ వివాహమే చేసుకోవాలనుకుంటుంది. కానీ శ్రీను.. పట్టువదలడు. అసలు అతను తిరుపతి





చెన్నై: తల్లిదండ్రులతో పోట్లాడి ఓ ట్రాన్స్జెండర్ను ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూర్ జిల్లా ఆవడి ప్రాంతంలో జరిగింది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.... మోరై గ్రామానికి చెందిన ప్రవీణ్ రాజ్ అనే యువకుడు చెన్నైలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కయల్ విళి అనే ట్రాన్స్జెండర్ సోషల్ మీడియాలో పరిచయం కావడంతో ప్రేమగా మారింది. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రవీణ్ రాజు తల్లిదండ్రులు ఈ పెళ్లికి అంగీకరించలేదు. దీంతో ప్రవీణ్ రాజ్ సదరు ట్రాన్స్జెండర్తో సహజీవనం చేస్తున్నాడు. ఈ విషయం తల్లిదండ్రులకు తెలియడంతో కుమారుడిని తన దారిలో తీసుకరావాలని నిర్ణయం తీసుకున్నారు. పండుగకు ఇంటికి వచ్చిన కుమారుడికి బలవంతంగా మత్తు పదార్థాల పునరావాస కేంద్రంలో చేర్పించారు. మే నెలలో తాను కోలుకున్నానని చెప్పడంతో అతడిని ఇంటికి తీసుకొచ్చి మరో యువతితో పెళ్లి చేస్తుండగా అక్కడి నుంచి తప్పించుకున్నారు. కయల్విళితో కలిసి గోపిచెట్టిపాలయంలోని ఓ న్యాయ సహాయ కేంద్రానికి చేరుకొని తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పారు. వెంటనే ఇద్దరికి నిర్వహకులు పెళ







వరంగల్: బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి కన్నుమూశారు. గుండె పోటు రావడంతో యశోద ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. ఐదు రోజులుగా ఆస్పత్రిలో చికిత్సపొందుతూ గత అర్ధరాత్రి 12:51కి మృతి చెందినట్టు వైద్యుల వెల్లడించారు. స్వస్థలం వరంగల్ జిల్లా నల్లబెల్లిలో 1974 ఆగస్టు 6న పెద్ది సదర్శన్రెడ్డి జన్మించారు. 2001లో పెద్ది సుదర్శన్రెడ్డి టిఆర్ఎస్లో చేరారు. 2001లో నల్లబెల్లి జెడ్పీటీసీ, 2016-2018 సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్, 2018లో నర్సంపేట నుంచి ఎమ్మెల్యేగా సేవలందించారు. పెద్ది సుదర్శన్రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ సిఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ఆప్త మిత్రుడిని కోల్పోయానని కెసిఆర్ పేర్కొన్నారు. మొక్కవోని ధైర్యంతో ఉద్యమించిన ధీరుడు పెద్ది అని ప్రశంసించారు. పెద్ది కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని, పెద్ది మరణం పార్టీకి తీరని లోటు అని కెసిఆర్ తెలియజేశారు. నర్సంపేట బిఆర్ఎస్ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని, పెద్ది సుదర్శన్రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. టిఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలోనే ఉన్నారని గుర్తు చేశారు. హైదరాబాద్ నుంచి సుదర్శన్రెడ్డి భ



మన తెలంగాణ/హైదరాబాద్: ఫార్ములా ఈ- కార్ రేసింగ్ వ్యవహారానికి సంబంధించిన కేసులో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మం త్రి కెటిఆర్ శుక్రవారం నాంపల్లి ఎసిబి ప్రత్యేక కోర్టులో విచారణకు హాజరుకానున్నారు. కోర్టు గతంలో విధించిన షరతుల ప్రకారం విచార ణ తేదీల్లో హాజరవాల్సి ఉండటంతో కెటిఆర్ మరోసారి కోర్టుకు రానున్నా రు. ఫార్ములా ఈ కార్ -రేసు నిర్వహణ కోసం విదేశీ సంస్థకు ప్రభుత్వ అనుమతులు, ఆర్థిక శాఖ ఆమోదం లేకుండానే నిధులు బదిలీ చేశారనే ఆరోపణలపై ఏసిబి కేసు నమోదు చేసింది. ప్రభుత్వ నిధుల వినియోగంలో నిబంధనలు ఉల్లంఘించారనే అభియోగాలతో దర్యాప్తు కొనసాగుతోంది. ఇదే వ్యవహారంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) కూడా మనీలాండరింగ్ కోణంలో విచారణ చేపట్టింది. ఇందులో కెటిఆర్తో పాటు మాజీ మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, మాజీ హెచ్ఎండిఎ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలను ఏసిబి నిందితులుగా చేర్చిన విషయం తెలిసిందే. మరోవైపు, ఫార్ములా ఈ-రేసు హైదరాబాద్కు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికే నిర్వహించామని, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్న నిర్ణయాలను ఇప్పుడు రాజకీయ కక్షసాధింపుగా చూపిస్తున్నారని