
4238 వార్తలు

హైదరాబాద్: ఆర్టిసి సమ్మె నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శంకర్ గౌడ్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ కుటుంబానికి రూ.10 లక్షల సాయం, ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు. శంకర్ గౌడ్ అంత్యక్రియలు పూర్తయ్యేలా జెఎసి నేతలు చొరవ తీసుకోవాలని కోరారు. ఆపత్కాలంలో రాజకీయాలు చేయవద్దని విపక్షాలకు సూచించారు. మరోవైపు డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన సచివాలయంలో ఆర్టిసి జెఎసి నేతలతో మంత్రుల బృందం భేటీ అయింది. ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, వివేక్, అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు.

ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్ రాజ్యసభ పక్షాన్ని బిజెపిలో విలీనం చేస్తున్నామని రాజ్యసభ ఎంపి రాఘవ్ చద్దా తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీలో తిరుగుబాటు జరిగిందని, మూడింట రెండొంతుల మంది బిజెపిలో చేరుతున్నామని అన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో రాఘవ్ చద్దా మీడియాతో మాట్లాడారు. ఆమ్ ఆద్మీ పార్టీకి రాజ్యసభలో 10 మంది సభ్యులు ఉన్నారని, పదిమందిలో ఏడుగురు బిజెపిలో చేరామని రాఘవ్ చద్దా తెలియజేశారు. హర్భజన్ సింగ్, స్వాతి మాలీవాల్, రాజేంద్ర గుప్తా, విక్రం సహానీ కూడా తమతో ఉన్నారని అన్నారు. ఉదయమే ఏడుగురు సభ్యులం వెళ్లి రాజ్యసభ ఛైర్మన్ ను కలిశామని, విలీనపత్రాలపై సంతకాలు చేసి రాజ్యసభ ఛైర్మన్ కు అందించామని అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ..తన సిద్ధాంతాలను తుంగలో తొక్కిందని విమర్శించారు. ప్రస్తుతం ఆప్ ప్రజల కోసం పనిచేయట్లేదని, ప్రస్తుతం ఆప్ ను వ్యక్తిగత లాభాల కోసమే నడుపుతున్నారని మండిపడ్డారు. ఆమ్ ఆద్మీ పార్టీ.. ప్రస్తుతం అవినీతి పరుల చేతుల్లో ఉందని, ఆప్ నేరాల్లో తాను భాగస్వామిని కాదలుచుకోలేదని రాఘవ్ చద్దా పేర్కొన్నారు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్లో ఆరంభంలో ఓటములను ఎదురుకున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆ తర్వాత తిరిగి పుంజుకుంది. వాంఖడే స్టేడియం వేదికగా గురువారం ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో 103 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఐపిఎల్ చరిత్రలో సిఎస్కెకిదే భారీ విజయం కావడం విశేషం. తొలుత బ్యాటింగ్లో సంజూ శాంసన్ సెంచరీతో చెలరేగగా.. ఆ తర్వాత బౌలర్లు అద్భుతంగా రాణించి జట్టుకు విజయాన్ని అందించారు. అయితే ఈ విజయాన్ని తల్లిని కోల్పోయిన ముకేశ్ చౌదరికే అంకితం ఇస్తున్నట్లు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తెలిపాడు. ‘‘ముకేశ్కిది క్లిష్ట సమయం. అతడి తల్లి అనారోగ్యంతో బాధపడుతూ ప్రాణాలు విడిచారు. ఇలాంటప్పుడు మేమంతా అండగా ఉంటాం. అంత్యక్రియలు ముగిసిన వెంటనే అతు జట్టుతో పాటు చేరిపోయాడు. ఎప్పుడు అవసరమైనా జట్టు తోడుగా నిలుస్తుందని అతడికి తెలుసు. ఈ మ్యాచ్ విజయాన్ని ముకేశ్కే అంకితం చేస్తున్నా. అత్యంత బాధాకరమైన పరిస్థితుల్లోనూ బరిలోకి దిగాడు. ఇలా చేయాలంటే మానసికంగానూ దృఢంగా ఉండాలి. అతడి కోసం ముంబైపై విజయం సాధించాలని ముందే బలంగా భావించాం’’ అని రుతురాజ్ అన్నాడు.


హైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డి సర్కార్ నిర్లక్ష్యంతో కార్మికులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఆర్టిసి విలీన ప్రక్రియ పూర్తి చేస్తామని మాటిచ్చి తప్పారని అన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడం లేదని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇంకా ఎంత మందిని బలి తీసుకుంటావని హరీష్ రావు ప్రశ్నించారు. ఆర్టిసి డ్రైవర్ శంకర్ గౌడ్ అమరుడైన రోజును అపాయింటెడ్ డేగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆర్టిసి కార్మికుల పోరాటానికి అండగా ఉంటామని, అధైర్య పడొద్దని భరోసా ఇచ్చారు. శంకర్ గౌడ్ మృతికి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని హరీష్ రావు సూచించారు.




‘ది కేరళ స్టోరి’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్గా ‘ది కేరళ స్టోరీ-2’ సినిమా వచ్చింది. ఫిబ్రవరి 27న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. తాజాగా ఈ సినిమా ఒటిటిలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఒటిటి సంస్థ జి5లో మే 8వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు ప్రత్యేకంగా ఓ పోస్టర్ను రిలీజ్ చేసింది. ఇందులో ముగ్గురు అమ్మాయిలు బుర్ఖాలు వేసుకొని, బొట్టు ధరించి మనకు కనిపిస్తున్నారు. ఇక ఈ సినిమా జి5లో తెలుగు, హిందీ, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.






ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలు అంటే.. దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉండేది. కానీ, కొన్ని సంవ్సరాలుగా బాలీవు్డ్ అంటే క్రేజ్ తగ్గి అంతా సౌతిండియా ఇండస్ట్రీలపైపు చూస్తున్నారు. అందుకు కారణం దక్షిణ ఇండస్ట్రీ డైరెక్టర్లే. తాజాగా మరో బాలీవుడ్ స్టార్ హీరో సౌతిండియా డైరెక్టర్తో పని చేయనున్నారు. ఆ హీరోనే సల్మాన్ ఖాన్. ఆ దర్శకుడే వంశీ పైడిపల్లి. సల్మాన్-వంశీ పైడిపల్లి సినిమాని ‘దిల్’ రాజు, శిరీష్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ సినిమాలో సల్మాన్కి జోడీగా నయనతార నటిస్తోంది. ఇక ఈ సినిమా 2027 రంజాన్ కానుకగా విడుదల చేస్తమని మేకర్స్ ప్రకటించారు, సల్మాన్ ప్రస్తుతం ‘మాతృభూమి’ సినిమా చిత్రీకరణలతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఈ ఏడాది విడుదలకానుంది.







