21536 వార్తలు





నీట్ పేపర్ లీకేజీ ప్రకంపనలు కార్చిచ్చులా చెలరేగిన తరువాత కేంద్ర ప్రభుత్వం మత్తు నిద్రనుంచి మేల్కొని రెండు ప్రధాన నిర్ణయాలు తీసుకుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టిఎ) ప్రక్షాళనకు నిపుణుల కమిటీని నియమించింది. లీకేజీని అరికట్టే చటాన్ని మరింత కట్టుదిట్టం చేసింది. దేశంలో అత్యున్నత విద్యాసంస్థల అడ్మిషన్ల కోసం ప్రవేశ పరీక్షలను నిర్వహించే బాధ్యత ఎన్టిఎదే. కానీ ఎన్టిఎ లోపాలమయం. సరైన పునాది లేని, సరిగ్గా పనిచేయని వ్యవస్థ. వ్యవస్థ మూలాలను సరిదిద్దకుండా కేవలం అప్పటికప్పుడు వచ్చే సమస్యలను సరిష్కరించడమే పనిగా ప్రభుత్వం గడుపుతోంది. 2024లో నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ అయిన తరువాత డాక్టర్ కె. రాధాక్రిష్ణన్ కమిటీ ఎన్టిఎ పనితీరు లోపాలను గుర్తించి 101 సూచనలతో నివేదిక వెలువరించింది. ఆ నివేదిక ప్రకారం ఎన్టిఎలో సంస్కరణలు జరిగితే ఇప్పుడు నీట్ పరీక్ష లీకేజీకి అవకాశమే ఉండేది కాదు. కానీ ఆ నివేదికను కేవలం కాగితాలకే ప్రభుత్వం పరిమితం చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వంటి వ్యవస్తే. డైరెక్టర్ జనరల్, ఇద్దరు అడిషనల్ డైరెక్టర్ జనరల్స్ ఆధ్వర్యంలో 10 క్రియాశీల విభాగాలు పనిచేస్తున్న

ఇస్లామాబాద్: పాకిస్థాన్ రాష్ట్రం క్వెట్టాలో బొగ్గు గనిలో పేలుడు చోటుచేసుకుంది. సోరేంజ్లోని బొగ్గు గనిలో పేలుడు జరగడంతో 32 మంది మృతి చెందారు. బొగు గనిలో పది మంది చిక్కుకున్నారని స్థానిక మీడియా వెల్లడించింది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గనిలో మీథేన్ వాయువు భారీగా పేరుకుపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగినప్పుడు గనిలో42 మంది కార్మికులు ఉన్నట్టు సమాచారం. గనులలో భద్రతా చర్యలు లేకపోవడంతోనే ఈ ప్రమాదాలు జరుగుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.


మన తెలంగాణ/మియాపూర్ : మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2022 డిసెంబర్ లో సంచలనం సృష్టించిన యువతి తల్లి హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ లోని 12వ అదపపు జిల్లా సెషన్స్ కోర్డు గురువారం తీర్పు వెలువరించింది. మియాపూర్ పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ 1582/2022 గా నమోదైన ఈ కేసులో నిందితుగు ఎద్దు సందీప్ కుమార్ అలియాస్ బబ్లూను కోర్డు దోషిగా నిర్ధారించింది. వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాకు చెందిన ఎద్దు సందీప్ కుమార్ అదే జిల్లా కు చెందిన వైభవికి 2018 లో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. కొంతకాలం తరువాత యువతిపై అనుమానం పెంచుకున్న నిందుతుడు తరచూ వేదించడంతో ఆతన్ని దూరం పెట్టింది. అప్పటినుండి యువతి సందీప్ వేరువేరు నెంబర్ల నుండి ఫోన్ చేస్తూ మానసికంగా వేధించాడు. ఈ నేపథ్యంలో 2022 మే నెలలో వైభవ తన తల్లి శోభ, సోదరుడితో కలిసి మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆదిత్య నగర్ లో నివాసముంటుంది. 2022 డిసెంబర్ 13 వ తేది ఉదయం 10.30 గంటల సమయంలో సందీప్ యువతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో గొడవకు దిగాడు. అనంతరం వెంట తెచ్చుకున్న కత్తితో యువతిని, తల్లిని అతిద









దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన నీట్ పేపర్ లీక్ వివాదం.. విద్యార్థుల నిరసనల నడుమ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఈ వ్యవహారంలో మోడీ తప్పుచేశారా? గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చుకున్నారా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దేశంలో అతిపెద్ద పోటీ పరీక్షలలో అక్రమాలు జరగడం, దానిపై స్పందించడానికి సమయం పట్టడం వల్ల కేంద్ర ప్రభుత్వ సుపరిపాలన, పరీక్షా వ్యవస్థల విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారింది. జంతర్ మంతర్ వేదికగా సిజెపి, నిరసనకారులు చేపట్టిన ఉద్యమంలో విద్యాశాఖ మంత్రి రాజీనామా అనేది అత్యంత కీలకమైన, రాజీలేని డిమాండ్ గా మారింది. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, విద్యార్థుల సమస్యలపై ఊపందుకున్న ఈ ఉద్యమం స్వల్ప కాలంలోనే కేంద్ర నిర్ణయాలను ప్రభావితం చేయగలదని నిరూపించింది. పరీక్షల పారదర్శకతపై దేశవ్యాప్తంగా పెరిగిన అసంతృప్తిని చల్లార్చేందుకు ప్రధాని మోడీ ప్రభుత్వం ఈ రాజీనామాను ఆమోదించక తప్పని పరిస్థితి ఏర్పడింది. తొలుత ఉద్యమాన్ని లైట్ తీసుకుంది కేంద్రం. అయితే ఉద్యమం తీవ్రత గురించి ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా హెచ్చరించాయి. అయితే నీట్ పరీక్ష లీక్ వివాదం, విచారణ జరుగుతున్న సమయంలోనే





