
4208 వార్తలు



‘ది కేరళ స్టోరి’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్గా ‘ది కేరళ స్టోరీ-2’ సినిమా వచ్చింది. ఫిబ్రవరి 27న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. తాజాగా ఈ సినిమా ఒటిటిలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఒటిటి సంస్థ జి5లో మే 8వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు ప్రత్యేకంగా ఓ పోస్టర్ను రిలీజ్ చేసింది. ఇందులో ముగ్గురు అమ్మాయిలు బుర్ఖాలు వేసుకొని, బొట్టు ధరించి మనకు కనిపిస్తున్నారు. ఇక ఈ సినిమా జి5లో తెలుగు, హిందీ, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.






ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలు అంటే.. దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉండేది. కానీ, కొన్ని సంవ్సరాలుగా బాలీవు్డ్ అంటే క్రేజ్ తగ్గి అంతా సౌతిండియా ఇండస్ట్రీలపైపు చూస్తున్నారు. అందుకు కారణం దక్షిణ ఇండస్ట్రీ డైరెక్టర్లే. తాజాగా మరో బాలీవుడ్ స్టార్ హీరో సౌతిండియా డైరెక్టర్తో పని చేయనున్నారు. ఆ హీరోనే సల్మాన్ ఖాన్. ఆ దర్శకుడే వంశీ పైడిపల్లి. సల్మాన్-వంశీ పైడిపల్లి సినిమాని ‘దిల్’ రాజు, శిరీష్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ సినిమాలో సల్మాన్కి జోడీగా నయనతార నటిస్తోంది. ఇక ఈ సినిమా 2027 రంజాన్ కానుకగా విడుదల చేస్తమని మేకర్స్ ప్రకటించారు, సల్మాన్ ప్రస్తుతం ‘మాతృభూమి’ సినిమా చిత్రీకరణలతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఈ ఏడాది విడుదలకానుంది.









హైదరాబాద్: ఆర్టిసి డ్రైవర్ శంకర్ గౌడ్ ది ఆత్మహత్య కాదని.. ముమ్మాటికీ సర్కారు హత్యనని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. సిఎం రేవంత్ రెడ్డి కార్మికులకు తీరని ద్రోహం చేస్తున్నారని అందుకే శంకర్ గౌడ్ బలవన్మరణానికి పాల్పడ్డారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సంస్థ పరిరక్షణ, తోటి కార్మికుల హక్కుల సాధన కోసం ప్రాణత్యాగం చేశారని, నర్సంపేట డిపోకు శంకర్ గౌడ్ పార్థివదేహాన్ని తీసుకెళ్లనీయపోవడం దుర్మార్గం అని కెటిఆర్ విమర్శించారు. శంకర్ గౌడ్ కుటుంబానికి బిఆర్ఎస్ నేతలు అండగా నిలిచారని తెలియజేశారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, కార్మికుల అరెస్టు దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అక్రమంగా అరెస్టు చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలని, శంకర్ గౌడ్ కు ఆర్టిసి డిపో దగ్గర నివాళులర్పించేందుకు అవకాశం ఇవ్వాలి అని కోరారు. శంకర్ గౌడ్ కుటుంబానికి రూ. కోటి పరిహారం ఇవ్వాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఉద్యమం నాటి దృశ్యాలు, ఆత్మబలిదానాలని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల వేళ సవాలక్ష హామీలు ఇచ్చారని, రేవంత్ రెడ్డి
నవతెలంగాణ – హైదరాబాద్ : ఆర్టీసీ ఉద్యోగ సంఘాలతో అధికారుల కమిటీ భేటీ ప్రారంభమైంది. ఈ సమావేశంలో ఆర్టీసీ కార్మికుల 32 డిమాండ్లపై చర్చ జరుగుతోంది. సమ్మె విరమించాలని ఆర్టీసీ జేఏసీకి ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అయితే, తమ హామీలను అమలు చేయాలని ఆర్టీసీ జేఏసీ డిమాండ్ చేస్తోంది. ఈ చర్చల ద్వారా కార్మికుల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నారు. The post ఆర్టీసీ ఉద్యోగ సంఘాలతో అధికారుల కమిటీ భేటీ appeared first on Navatelangana.


వతెలంగాణ – పెద్దవూరనాగార్జునసాగర్ నియోజకవర్గం నిడమానూరు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ప్రక్కన మెగావత్ భాస్కర్ నాయక్- భవ్య డాక్యుమెంటేషన్ సెంటర్ నిశుక్రవారం ఏకే పౌండేషన్ ఛైర్మెన్, హైకోర్టు న్యాయవాది కట్టె బోయిన అనిల్ కుమార్ శుక్రవారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్బంగా డాక్యుమెంటేషన్ సెంటర్ ప్రారంభోత్సవం పట్ల హృదయపూర్వక అభినందనలు తెలియజేసి ఈ కొత్త వ్యాపారం మీకు గొప్ప విజయాన్ని, సంతోషాన్ని మరియు నిరంతరం కస్టమర్లను తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని […] The post భవ్య డాక్యుమెంటేషన్ సెంటర్ ని ప్రారంభించిన ఏకే పౌండేషన్ ఛైర్మెన్ appeared first on Navatelangana.
