
4203 వార్తలు

హైదరాబాద్: మాజీ సిఎం కెసిఆర్, మాజీ మంత్రులు కెటిఆర్, హరీశ్ రావులకు హైకోర్టులో ఊరట లభించింది. మిలియన్ మార్చ్ సందర్భంగా నమోదైన కేసులను కోర్టు కొట్టివేసింది. ట్యాంక్బండ్పై 2011లో నిర్వహించిన మిలియన్ మార్చ్లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దర్యాప్తులో భాగంగా కెసిఆర్, కెటిఆర్, హరీశ్రావును నిందితులుగా చేర్చారు. ఈ కేసులో వీరికి ఎలాంటి సంబంధం లేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు. దీంతో వీరిపై నమోదైన కేసులను కోర్టు కొట్టివేసింది.


న్యూఢిల్లీ: రాజ్యసభ ఎంపి రాఘవ్ చద్దా శుక్రవారం ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా వేస్తూ.. ఆయనతో కలిపి ఏడుగురు సభ్యులు కూడా ఆప్ నుంచి బయటకు వచ్చి బిజెపిలో చేరుతున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు. ఆప్లో పూర్తి అవినీతి పరుల చేతిలో ఉందని ఎద్దేవా చేశారు. దీనిపై ఆప్ మొట్టమొదటి సరిగా స్పందించింది. రాఘవ్ కామెంట్స్పై ఆ పార్ట్ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపి సంజయ్ సింగ్ తీవ్రంగా స్పందించారు. రాఘవ్ చద్దా సహా మిగిత వారు పార్టీకి, పంజాబ్కు తీవ్ర ద్రోహం చేశారంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని తమ పార్టీ చద్దాను ఎమ్మెల్యేగా, ఆపై ఎంపిగా తీర్చిదిద్దిందని, కానీ చివరకు ఆయన బిజెపి పంచన చేరాడని విమర్శించారు.







రోజురోజుకు వేడి తీవ్రత పెరుగుతోంది. దీంతో వేడి నుండి ఉపశమనం పొందడానికి చాలామంది ఇంట్లోకి కూలర్ కొంటుంటారు. మీరు కూడా కేవలం రూ.5,000 లోపు ధరలో రూమ్ కూలర్ కొనాలని ప్లాన్ చేస్తుంటే, మీకో గుడ్ న్యూస్! ఈ ధర పరిధిలో అనేక కంపెనీలు అద్భుతమైన ఫీచర్లతో ఎయిర్ కూలర్లను తీసుకువస్తున్నాయి. ఈ జాబితాలో బజాజ్, కెన్స్టార్, హవెల్స్, హిండ్వేర్ వంటి బ్రాండెడ్ కంపెనీల ఎయిర్ కూలర్లు ఉండటం విశేషం. ఈ క్రమంలో రూ.5,000 లోపు ధరలో లభించే ఎయిర్ కూలర్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం. బజాజ్ 25L ఎయిర్ కూలర్బజాజ్ 25L ఎయిర్ కూలర్ 44% డిస్కౌంట్ తర్వాత కేవలం రూ.4,799 కే లభిస్తోంది. దీని ఎయిర్ త్రో 16 అడుగులు. ఇది ఇన్వర్టర్ కంపాటిబిలిటీ, 4-వే స్వింగ్, 3-స్పీడ్ కంట్రోల్ వంటి ఫీచర్లతో కూడా వస్తుంది. కాగా, దీనికి 1 సంవత్సరం వారంటీ ఉంది. హిండ్వేర్ 25L కూలర్25 లీటర్ల స్టోరేజ్ సామర్థ్యం గల ఈ ఎయిర్ కూలర్లో డస్ట్-ఫ్రీ ఫిల్టర్ టెక్నాలజీ, ఐస్ ఛాంబర్, హనీకోంబ్ ప్యాడ్లు ఉన్నాయి. ఇది ఇన్వర్టర్ కంపాటిబుల్. 46% తగ్గింపు తర్వాత ఈ కూలర్ను అమెజాన్లో రూ. 4,821 కు కొనుగోలు చేయవచ్చు. హవెల్స్ 17L ఎయిర్ కూలర్43% తగ్గింపు తర్వాత, 17 లీటర్ల ని



దేశీయ స్మార్ట్ఫోన్ బ్రాండ్ లావా ఇంటర్నేషనల్ నుండి 6GB RAM + 128GB స్టోరేజ్తో కూడిన లావా బోల్డ్ N1 5G కొత్త వేరియంట్ విడుదల చేయబడింది. దీని ముఖ్య ఫీచర్లలో HD+ రిజల్యూషన్ డిస్ప్లే, దుమ్ము, నీటి నిరోధకత కోసం IP54 రేటింగ్ ఉన్నాయి. ఈ పరికరం గత ఏడాది 4GB + 64GB, 4GB + 128GB స్టోరేజీ వేరియంట్ కు ఇది కొత్త అదనంగా మార్కెట్లోకి లాంచ్ అయింది. చాలారోజుల నుంచి తక్కువ ధరలో 5G స్మార్ట్ ఫోన్ కొనాలని చూస్తున్నవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇప్పుడు ఈ కొత్త వేరియంట్ ధర, లభ్యత, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం. లావా బోల్డ్ N1 5G ధర, లభ్యతఈ లావా స్మార్ట్ఫోన్ 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999గా ఉంది. ఈ ఫోన్ మే 1వ తేదీ నుండి అమెజాన్లో కొనుగోలుకు రానుంది. కాగా, ఈ మొబైల్ షాంపేన్ గోల్డ్, రాయల్ బ్లూ రంగులలో లభిస్తోంది. లాంచ్ ఆఫర్లో భాగంగా, ఈ ఫోన్ను రూ.11,999 కే కొనుగోలు చేయవచ్చు.లావా బోల్డ్ N1 5G ఫీచర్లుఈ డ్యూయల్-సిమ్ మొబైల్లో 90Hz రిఫ్రెష్ రేట్తో కూడిన 6.75-అంగుళాల HD+ రిజల్యూషన్ LCD డిస్ప్లే ఉంది. ఈ పరికరంలో యూనిసోక్ T765 ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఉంది. కెమెరా పరంగా, ఇందులో 13-మెగాపిక

హైదరాబాద్: ఆర్టిసి సమ్మె నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శంకర్ గౌడ్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ కుటుంబానికి రూ.10 లక్షల సాయం, ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు. శంకర్ గౌడ్ అంత్యక్రియలు పూర్తయ్యేలా జెఎసి నేతలు చొరవ తీసుకోవాలని కోరారు. ఆపత్కాలంలో రాజకీయాలు చేయవద్దని విపక్షాలకు సూచించారు. మరోవైపు డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన సచివాలయంలో ఆర్టిసి జెఎసి నేతలతో మంత్రుల బృందం భేటీ అయింది. ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, వివేక్, అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు.

ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్ రాజ్యసభ పక్షాన్ని బిజెపిలో విలీనం చేస్తున్నామని రాజ్యసభ ఎంపి రాఘవ్ చద్దా తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీలో తిరుగుబాటు జరిగిందని, మూడింట రెండొంతుల మంది బిజెపిలో చేరుతున్నామని అన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో రాఘవ్ చద్దా మీడియాతో మాట్లాడారు. ఆమ్ ఆద్మీ పార్టీకి రాజ్యసభలో 10 మంది సభ్యులు ఉన్నారని, పదిమందిలో ఏడుగురు బిజెపిలో చేరామని రాఘవ్ చద్దా తెలియజేశారు. హర్భజన్ సింగ్, స్వాతి మాలీవాల్, రాజేంద్ర గుప్తా, విక్రం సహానీ కూడా తమతో ఉన్నారని అన్నారు. ఉదయమే ఏడుగురు సభ్యులం వెళ్లి రాజ్యసభ ఛైర్మన్ ను కలిశామని, విలీనపత్రాలపై సంతకాలు చేసి రాజ్యసభ ఛైర్మన్ కు అందించామని అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ..తన సిద్ధాంతాలను తుంగలో తొక్కిందని విమర్శించారు. ప్రస్తుతం ఆప్ ప్రజల కోసం పనిచేయట్లేదని, ప్రస్తుతం ఆప్ ను వ్యక్తిగత లాభాల కోసమే నడుపుతున్నారని మండిపడ్డారు. ఆమ్ ఆద్మీ పార్టీ.. ప్రస్తుతం అవినీతి పరుల చేతుల్లో ఉందని, ఆప్ నేరాల్లో తాను భాగస్వామిని కాదలుచుకోలేదని రాఘవ్ చద్దా పేర్కొన్నారు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్లో ఆరంభంలో ఓటములను ఎదురుకున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆ తర్వాత తిరిగి పుంజుకుంది. వాంఖడే స్టేడియం వేదికగా గురువారం ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో 103 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఐపిఎల్ చరిత్రలో సిఎస్కెకిదే భారీ విజయం కావడం విశేషం. తొలుత బ్యాటింగ్లో సంజూ శాంసన్ సెంచరీతో చెలరేగగా.. ఆ తర్వాత బౌలర్లు అద్భుతంగా రాణించి జట్టుకు విజయాన్ని అందించారు. అయితే ఈ విజయాన్ని తల్లిని కోల్పోయిన ముకేశ్ చౌదరికే అంకితం ఇస్తున్నట్లు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తెలిపాడు. ‘‘ముకేశ్కిది క్లిష్ట సమయం. అతడి తల్లి అనారోగ్యంతో బాధపడుతూ ప్రాణాలు విడిచారు. ఇలాంటప్పుడు మేమంతా అండగా ఉంటాం. అంత్యక్రియలు ముగిసిన వెంటనే అతు జట్టుతో పాటు చేరిపోయాడు. ఎప్పుడు అవసరమైనా జట్టు తోడుగా నిలుస్తుందని అతడికి తెలుసు. ఈ మ్యాచ్ విజయాన్ని ముకేశ్కే అంకితం చేస్తున్నా. అత్యంత బాధాకరమైన పరిస్థితుల్లోనూ బరిలోకి దిగాడు. ఇలా చేయాలంటే మానసికంగానూ దృఢంగా ఉండాలి. అతడి కోసం ముంబైపై విజయం సాధించాలని ముందే బలంగా భావించాం’’ అని రుతురాజ్ అన్నాడు.


హైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డి సర్కార్ నిర్లక్ష్యంతో కార్మికులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఆర్టిసి విలీన ప్రక్రియ పూర్తి చేస్తామని మాటిచ్చి తప్పారని అన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడం లేదని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇంకా ఎంత మందిని బలి తీసుకుంటావని హరీష్ రావు ప్రశ్నించారు. ఆర్టిసి డ్రైవర్ శంకర్ గౌడ్ అమరుడైన రోజును అపాయింటెడ్ డేగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆర్టిసి కార్మికుల పోరాటానికి అండగా ఉంటామని, అధైర్య పడొద్దని భరోసా ఇచ్చారు. శంకర్ గౌడ్ మృతికి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని హరీష్ రావు సూచించారు.




‘ది కేరళ స్టోరి’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్గా ‘ది కేరళ స్టోరీ-2’ సినిమా వచ్చింది. ఫిబ్రవరి 27న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. తాజాగా ఈ సినిమా ఒటిటిలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఒటిటి సంస్థ జి5లో మే 8వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు ప్రత్యేకంగా ఓ పోస్టర్ను రిలీజ్ చేసింది. ఇందులో ముగ్గురు అమ్మాయిలు బుర్ఖాలు వేసుకొని, బొట్టు ధరించి మనకు కనిపిస్తున్నారు. ఇక ఈ సినిమా జి5లో తెలుగు, హిందీ, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
