
4199 వార్తలు

మన తెలంగాణ/హైదరాబాద్ : కేవలం గొర్రెల కాపరులను చెట్లు నరకవద్దని అభ్యర్థిస్తున్న నిజమైన ప్రకృతి ప్రేమికులు దుశ్చర్ల సత్యనారాయణపై జరిగిన దాడి జరగడంపై గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, పర్యావరణ పరిరక్షకులు, జంతు ప్రేమికులు, మాజీ ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. విచారకరమైన విషయం ఏమిటంటే, ఈ ఘటన జరిగిన అదే 70 ఎకరాల అడవిని ఆయనే పోషించి, సంరక్షిం చారని వెల్లడించారు. కొన్ని సార్లు మాటల కన్నా కళే గొప్పగా మాట్లాడుతుందనే కఠోర వాస్తవాన్ని కళ్ళకు కట్టిన సిహెచ్.మృత్యుంజయ శక్తివంతమైన కార్టూన్ను పంచుకున్నారు. ఇటువంటి చర్యలు ఆమోదయోగ్యం కావని, వీటిని కఠినంగా ఎదు ర్కోవాలని, సత్యనారాయణ త్వరగా కోలుకోవాలని మాజీ ఎంపి సంతోష్ ఆకాంక్షించారు. న్యాయం తప్పక గెలవాలని ఆయన అభిలషించారు.



మాయమాటలు చెప్పి సోదరిని పెళ్లి చేసుకున్నాడని ఆగ్రహం మనతెలంగాణ, సిటిబ్యూరోః తమ చెల్లికి మాయమాటలు చెప్పి వివాహం చేసుకున్నాడని ఆగ్రహంతో బావపై బావమర్ధులు దాడి చేసిన సంఘటన బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... వట్టేపల్లికి చెందిన ఆయెషా ఫాతిమా(28) అనే యువతి రెండేళ్ల క్రితం సల్మాన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. సల్మాన్కు అప్పటికే వివాహమై ముగ్గురు పిల్లలున్నారు. అతడిని ఫాతిమా వివాహం చేసుకోవడం ఆమె సోదరులు సమద్, ఇంతియాజ్, సర్ఫరాజ్ కు ఇష్టం లేదు. ఆయెషా ఫాతిమాకు తమ బంధువైన ఓ వ్యక్తితో వివాహం జరిపించాలని భావించారు. కానీ వేరే వ్యక్తిని వివాహం చేసుకోవడంతో సోదరులు చెల్లి ఆయెషా ఫాతిమాపై కోపం పెంచుకున్నారు. ఈ క్రమంలోనే ఆయేషా ఫాతిమా గురువారం బండ్లగూడలోని ఓ ఆస్పత్రిలో కుమారుడికి జన్మనిచ్చింది. డెలివరీ అయిన సోదరిని చూడటానికి ఆస్పత్రికి ముగ్గురు సోదరులు వచ్చారు. ఆ సమయంలో అక్కడే ఉన్న బావ సల్మాన్తో గొడవ పడ్డారు. తన సోదరికి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నావని అతనిపై దాడి చేశారు. అడ్డు వచ్చిన సోదరిపై కూడా చేయి చేసుకున్నారు. సమాచారం తెలుసుకున్న బండ్లగూడ పోలీసులు


లక్షల్లో వసూలు...ఆపై బోర్డు తిప్పేస్తున్న కన్సల్టెంట్లుకోట్లాది రూపాయలు వసూలు చేస్తున్న నిందితులు రోడ్డుపై పడుతున్న నిరుద్యోగులు మనతెలంగాణ, సిటిబ్యూరోః ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్తో ఉద్యోగాలు కోల్పోతున్న వారిని జాబ్ కన్సల్టెంట్లు నిండాముంచుతున్నాయి. మల్టీ నేషనల్ కంపెనీల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగుల నుంచి లక్షలాది రూపాయలు తీసుకుని మోసం చేస్తున్నారు. వందల మంది నుంచి డబ్బులు వసూలు చేసిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించకుండానే బోర్డు తిప్పేసి నిండాముంచుతున్నారు. ఇటీవల కాలంలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఓ సంస్థ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి నిరుద్యోగుల నుంచి ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.2లక్షలకుపైగా వసూలు చేశారు. కొద్ది రోజులు తమ సంస్థ కార్యాలయంలో శిక్షణ కూడా ఇచ్చారు, తమ సంస్థలోనే ఉద్యోగం ఇచ్చినట్లు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చా జీతాలు ఇచ్చారు. ఇలా మూడు నెలలు జీతాలు ఇచ్చిన నిందితులు తర్వాత కార్యాలయానికి తాళం వేసి పరారయ్యారు. కామెల్ క్యూ సాఫ్ట్వేర్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కార్యాలయాన్ని ఓపెన్ చేసిన నిందితులు 450మంది నిరుద్యోగుల నుంచ

ఎంగేజ్మెంట్ తర్వాత వివాహం రద్దుజూబ్లీహిల్స్ పిఎస్లో ఫిర్యాదు మనతెలంగాణ, సిటిబ్యూరోః ప్రముఖ వ్యాపారవేత్త, దివీస్ ల్యాబ్స్ యజమాని డాక్టర్ మురళికృష్ణ ప్రసాద్ కుటుంబంలో పెళ్లి పంచాయితీ పోలీస్ స్టేషన్కు చేరింది. వివాహం నిశ్చయం తర్వాత ఇరు కుటుంబాల మధ్య నెలకొన్న విభేదాలతో వివాహ కార్యక్రమం రద్దైనట్లు విశ్వసనీయంగా తెలిసింది. అయితే పెళ్లి నేపథ్యంలో వరకట్నం కింద ఇచ్చిన రూ.5కోట్లు తిరిగి ఇవ్వాలని వరుడి కుటుంబ సభ్యులను పెళ్లి కూతురు తల్లి విజయ కోరినా స్పందనలేకపోవడంతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దివీస్ యజమాని కుమారుడు, ఆర్టిఐ కమిషనర్ కుమార్తెకు వివాహం చేయాలని నిశ్చయించారు. కానీ ఇరుకుటుంబాల మధ్య మనస్పర్ధలు రావడంతో వివాహం రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తాము వరకట్నం కింద ఇచ్చిన రూ. 5కోట్లు తిరిగి ఇవ్వాలని కోరినా వరుడి తరఫున వారు స్పందించకపోవడంతో పెళ్లి కుమార్తె తల్లి విజయ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

మర్చిపోయిన బంగారు ఆభరణాలు పోలీసులకు అప్పగింత మనతెలంగాణ, సిటిబ్యూరో: ఆటో డ్రైవర్ నిజాయితీ చాటుకున్నాడు, ఆటో ప్రయాణికులు మర్చిపోయిన బంగారు ఆభరణాలను పోలీసులకు అప్పగించాడు. పోలీసుల కథనం ప్రకారం...కర్నాటక రాష్ట్రం, గుల్బర్గాకు చెందిన సుజాత ఆర్ హిరేమఠ్ గురువారం నార్సింగి నుంచి బిర్లామందిర్ వరకు ఉబెర్ ఆటోలో ప్రయాణించారు. బిర్లా మందిర్ వద్ద 6.5తులాల బంగారు ఆభరణాలు, రూ.3,500 నగదు ఉన్న బ్యాగును ఆటోలోనే మర్చిపోయారు. తర్వాత గుర్తించినా అప్పటికే ఆటో డ్రైవర్ వెళ్లి పోవడంతో సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సిసిటివి ఫుటేజ్ను పరిశీలించిన పోలీసులు ఆటో నంబర్ను గుర్తించి ఫోన్ చేశారు. చింతల్ బస్తీకి చెందిన కె.నగేష్ పోలీసులు ఫోన్ చేయడంతో బ్యాగు తన ఆటోలోనే ఉందని తెలిపారు. వెంటనే సైఫాబాద్ పోలీస్ స్టేషన్కు వచ్చిన ఆటోడ్రైవర్ నగేష్ నగదు, బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగులను అందించారు. బ్యాగును ఇన్స్స్పెక్టర్ సీతయ్య బాధితులకు అందజేశారు. ఆటోడ్రైవర్ నిజాయితీని మెచ్చిన ఇన్స్స్పెక్టర్ నగదు బహుమతిని అందజేశారు.





హైదరాబాద్: తెలంగాణ నూతన డిజిపిగా సివి ఆనంద్ను నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత డిజిపి శివధర్ రెడ్డి ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఆ తర్వాత సివి ఆనంద్ మే మొదటి వారంలో బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సివి ఆనంద్ ఉన్నారు. తాజాగా జరిగిన బదిలీల్లో ఆ స్థానంలో శిఖా గోయెల్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.




బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వరుసగా రెండు మ్యాచుల్లో విజయం సాధించిన ఆర్సిబిని గత మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓడించింది. దీంతో ఈ మ్యాచ్లో విజయం సాధించి తిరిగి పుంజుకోవాలని ఆర్సిబి భావిస్తోంది. ఈ మ్యాచ్లో గెలిస్తే ఆర్సిబి పాయింట్స్ టేబుల్లో రెండో స్థానానికి వెళ్లే అవకాశం ఉంది. మరోవైపు హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసిన జిటి ముంబై ఇండియన్స్తో దారుణంగా ఓటమిపాలైంది. దీంతో ఈ మ్యాచ్ విజయం ఆ జట్టుకు కీలకంగా మారింది. ఈ మ్యాచ్లో జిటి జట్టులో రెండు మార్పులు చేసింది. జేసన్ హోల్డర్, మనవ్ సుతార్లను జట్టులోకి తీసుకుంది. ఇక ఆర్సిబి ఒక మార్పుతో బరిలోకి దిగుతుంది. గాయపడిన సాల్ట్ స్థానంలో బెతెల్ జట్టులోకి వచ్చాడు. తుది జట్లు: ఆర్సిబి: విరాట్ కోహ్లీ, దేవ్దత్ పడిక్కల్, రజత్ పాటిదర్(కెప్టెన్), జితేష్ శర్మ(కీపర్), టిమ్ డేవిడ్, రోమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్వుడ్, సుయాష్ శర్మ, రసిక్ సలామ్ దర్. జిటి: సాయి సుదర్శన్,




హైదరాబాద్: మాజీ సిఎం కెసిఆర్, మాజీ మంత్రులు కెటిఆర్, హరీశ్ రావులకు హైకోర్టులో ఊరట లభించింది. మిలియన్ మార్చ్ సందర్భంగా నమోదైన కేసులను కోర్టు కొట్టివేసింది. ట్యాంక్బండ్పై 2011లో నిర్వహించిన మిలియన్ మార్చ్లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దర్యాప్తులో భాగంగా కెసిఆర్, కెటిఆర్, హరీశ్రావును నిందితులుగా చేర్చారు. ఈ కేసులో వీరికి ఎలాంటి సంబంధం లేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు. దీంతో వీరిపై నమోదైన కేసులను కోర్టు కొట్టివేసింది.


న్యూఢిల్లీ: రాజ్యసభ ఎంపి రాఘవ్ చద్దా శుక్రవారం ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా వేస్తూ.. ఆయనతో కలిపి ఏడుగురు సభ్యులు కూడా ఆప్ నుంచి బయటకు వచ్చి బిజెపిలో చేరుతున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు. ఆప్లో పూర్తి అవినీతి పరుల చేతిలో ఉందని ఎద్దేవా చేశారు. దీనిపై ఆప్ మొట్టమొదటి సరిగా స్పందించింది. రాఘవ్ కామెంట్స్పై ఆ పార్ట్ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపి సంజయ్ సింగ్ తీవ్రంగా స్పందించారు. రాఘవ్ చద్దా సహా మిగిత వారు పార్టీకి, పంజాబ్కు తీవ్ర ద్రోహం చేశారంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని తమ పార్టీ చద్దాను ఎమ్మెల్యేగా, ఆపై ఎంపిగా తీర్చిదిద్దిందని, కానీ చివరకు ఆయన బిజెపి పంచన చేరాడని విమర్శించారు.