
4194 వార్తలు


నేడు పంజాబ్తో పోరున్యూఢిల్లీ: ఐపిఎల్లో భాగంగా శనివారం మధ్యాహ్నం పంజాబ్ కింగ్స్తో జరిగే పోరు ఢిల్లీ క్యాపిటల్స్కు సవాల్గా మారింది. ఈ సీజన్లో పంజాబ్ ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్లో కూడా ఓటమి పాలు కాలేదు. ఆడిన ఆరు మ్యాచుల్లో ఐదు విజయాలను అందుకుంది. ఒక మ్యాచ్ వర్షం వల్ల రద్దయ్యింది. ప్రస్తుతం పంజాబ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పంజాబ్ సమతూకంగా ఉంది. ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్సిమ్రాన్ సింగ్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, నెహల్ వధెరా, శశాంక్ సింగ్, జాన్సన్, స్టోయినిస్ తదితరులతో పంజాబ్ బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక చాహల్, అర్ష్దీప్ సింగ్, జాన్సన్, స్టోయినిస్లతో బౌలింగ్ కూడా బాగానే ఉన్న సంగతి తెలిసిందే. ఇలాంటి స్థితిలో ఢిల్లీకి ఈ మ్యాచ్ సవాల్గా తయారైంది. ఇందులో విజయం సాధించాలంటే ఢిల్లీ సర్వం ఒడ్డి పోరాడక తప్పదు. అయితే నిసాంకా, రాహుల్, నితీశ్ రాణా, సమీర్ రిజ్వి, మిల్లర్, స్టబ్స్, అశుతోష్ తదితరులతో ఢిల్లీ బ్యాటింగ్ కూడా బాగానే ఉంది. దీంతో పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయం.

నేడు రాజస్థాన్తో పోరు జైపూర్: హ్యాట్రిక్ విజయాలతో జోరుమీదున్న సన్రైజర్స్ హైదరాబాద్ శనివారం రాజస్థాన్ రాయల్స్తో జరిగే పోరుకు సమరోత్సాహంతో సిద్ధమైంది. రాజస్థాన్ కూడా మెరుగైన ఆటతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ చేతిలో రాజస్థాన్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో గెలిచి ఓటమికి బదులు తీర్చుకోవాలనే లక్షంతో కనిపిస్తోంది. ఇరు జట్లలోనూ స్టార్ ఆటగాళ్లకు కొదవలేదు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాటర్లు, బౌలర్లు అందుబాటులో ఉన్నారు. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్లతో హైదరాబాద్ బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ తదితరులతో రాజస్థాన్ బ్యాటింగ్ కూడా పటిష్టంగా ఉన్న విషయం విదితమే. అయితే వైభవ్ బ్యాటింగ్లో నిలకడ లోపించింది. ఒక మ్యాచ్లో రాణిస్తే మరో దాంట్లో తేలిపోతున్నాడు. ఇది జట్టును కలవరానికి గురి చేస్తోంది. కానీ కీలకమైన హైదరాబాద్ మ్యాచ్లో సత్తా చాటేందుకు తహతహలాడుతున్నాడు. యశస్వి కూడా ఇదే లక్షంతో ఉన్నాడు. రవీంద్ర జడేజా ఫామ్లోకి రావడం జట్టుకు అతి పెద్ద ఊరటగా మారింది. కానీ ధ్రువ్ జురెల్








బెంగళూరు: ఐపిఎల్ సీజన్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయాల పరంపర కొనసాగుతోంది. శుక్రవారం గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో ఆర్సిబి ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ఓపెనర్ సాయి సుదర్శన్ కళ్లు చెదిరే శతకం సాధించాడు. ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న సుదర్శన్ 58 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్స్లతో 100 పరుగులు చేశాడు. తర్వాత బ్యాటింగ్కు దిగిన ఆర్సిబి 18.5 ఓవర్లలోనే ఐదు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ విరాట్ కోహ్లి 44 బంతుల్లోనే 81 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

మేషంబంధువులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. దైవదర్శనాలు చేసుకుంటారు. చేపట్టిన పనుల్లో ప్రతిష్టంభనలు కలుగుతాయి. వృధా ఖర్చులు చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోక పోవడం మంచిది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది.వృషభంనూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. దూర ప్రాంత మిత్రుల నుండి విలువైన విషయాలు సేకరిస్తారు. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలుకు లోటు ఉండదు. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.మిధునంస్థిరాస్తి కొనుగోలు అవరోధాలు తొలగుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రులతో విందువినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. నూతన వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి.కర్కాటకంధన పరంగా ఒడిదుడుకులు ఉంటాయి. దూర ప్రయాణాలలో శ్రమాధిక్యత కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. సోదరులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఉద్యోగమున బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించలేక అధికారుల ఆగ్రహానికి గురికావలసి వస్తుంది.సింహందూర ప్రయాణాలలో మార్గావరోధాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన




మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల పునరుద్ధరణకు సంబంధించి భూపరిశోధన పరీక్షలో ఎన్జిఆర్ఐ భాగస్వామ్యం కావాలి ఎస్ఎల్బిసి సొరంగ మార్గం తవ్వకాల్లో భద్రతా ఏర్పాట్లపై సమగ్ర సర్వే నివేదికను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అందజేసిన ఎన్జిఆర్ఐ మనతెలంగాణ/హైదరాబాద్: శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగ మార్గం తవ్వకాల్లో అనుసరించాల్సిన భద్రతా ఏర్పాట్లపై నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్జిఆర్ఐ) సమగ్రంగా రూపొందించిన నివేదికను శుక్రవారం డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ సచివాలయంలో రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్రెడ్డికి ఎన్జిఆర్ఐ ప్రధాన శాస్త్రవేత్త సత్యనారాయణ సచివాలయంలో అందించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్జిఆర్ఐ సంస్థను అభినందించడంతో పాటు ఎస్ఎల్బిసి పునరుద్ధరణ పనుల పురోగతితో పాటు కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల పునరుద్ధరణకు సంబంధించి ఎన్జిఆర్ఐ ఆధ్వర్యంలో భూపరిశోధన (సాయిలు టెస్ట్) భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. శుక్రవారం బిఆర్ అంబేడ్కర్ సచివాలయంలో మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి సమ


మన తెలంగాణ/హైదరాబాద్ : ఏప్రిల్ ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో భారత దేశంలోని చాలా ప్రాంతాలు తీవ్రమైన ఎండలతో జనాలు అల్లాడిపోతున్నాయి. ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో 43-44 డిగ్రీలు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ ఎండలు మరింత ముదిరే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ క్రమంలోనే దేశ ప్రజలకు మరో చల్లని శుభవార్త కూడా చెప్పింది. గతంతో పోల్చుకుంటే ఈసారి నైరుతి రుతువపనాలు ముందే దేశాన్ని చేరుకుంటాయిన వెల్లడిచింది. యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం-రేంజ్ వెదర్ ఫోర్కాస్ట్స్ అంచనాల ప్రకారం ఈసారి నైరుతి రుతుపవనాలు ముందస్తుగానే పలకరించే అవకాశం ఉందని తెలుస్తోంది. మే చివరి నాటికే దక్షిణ భారతదేశంలో వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. మే 18 నుండి 25 మధ్య నైరుతి రుతుపవనాలు అండమాన్, నికోబార్ దీవుల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని అంచనాలు చెబుతున్నాయి. ఈ ప్రాంతంలో సాధారణం కంటే 30 నుండి 60 మి.మీ ఎక్కువ వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయిని స్పష్టం చేశాయి. ఇక మే 25 నుండి జూన్ 1 మధ్య ఈ రుతుపవనాలు పశ్చిమ దిశగా కదిలి కేరళ తీరాన్ని, తమిళనాడులోని దక్షిణ జిల్లాలను తాకవచ్చని వా

న్యాయవాదికి బ్రీత్ టెస్టు వ్యవహారంపై హైకోర్టులో విచారణమన తెలంగాణ/హైదరాబాద్ : గాయని మంగ్లీ కేసులో న్యాయవాది సుబ్బారావుకు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయక పోవడంపై న్యాయస్థానం హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. పంజాగుట్ట సిఐ రామకృష్ణను కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదని హైకోర్టు నిలదీసింది. పోలీస్స్టేషన్లో సిసిటివి కెమెరాల ఫుటేజీని భద్రపరిచారా? అని ప్రశ్నించింది. సిసిటివి కెమెరాల ఫుటేజీని కోర్టుకు ఎందుకు అందజేయలేదని ప్రభుత్వ తరఫు న్యాయవాదిపై ఆగ్రహం కనబర్చింది. సిసిటివి కెమెరాల ఫుటేజీ సమర్పించ డానికి కొంత వ్యవధి ఇవ్వాలని ప్రభుత్వ తరఫు న్యాయవాది హైకోర్టును అభ్యర్థించారు. న్యాయవాదికి బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేసిన పంజాగుట్ట ఇన్ స్పెక్టర్పై శాఖపరమైన చర్యలు ఎందుకు తీసుకోలేదు? అని ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులు, అడ్వకేట్లు కలిసి పనిచేయాలని న్యాయస్థానం సూచించింది. స్వేచ్ఛకు భంగం కలిగించేలా పోలీసులు చేయడం సరైంది కాదని హైకోర్టు అభిప్రాయపడింది. గాయని మంగ్లీతో ప్రాణహాని ఉందం టూ డిజిపి శివధర్ రెడ్డికి ఫిర్యాదు చేసినట్లు న్యాయస్థానానికి సుబ్బార

మన తెలంగాణ/హైదరాబాద్ : కేవలం గొర్రెల కాపరులను చెట్లు నరకవద్దని అభ్యర్థిస్తున్న నిజమైన ప్రకృతి ప్రేమికులు దుశ్చర్ల సత్యనారాయణపై జరిగిన దాడి జరగడంపై గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, పర్యావరణ పరిరక్షకులు, జంతు ప్రేమికులు, మాజీ ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. విచారకరమైన విషయం ఏమిటంటే, ఈ ఘటన జరిగిన అదే 70 ఎకరాల అడవిని ఆయనే పోషించి, సంరక్షిం చారని వెల్లడించారు. కొన్ని సార్లు మాటల కన్నా కళే గొప్పగా మాట్లాడుతుందనే కఠోర వాస్తవాన్ని కళ్ళకు కట్టిన సిహెచ్.మృత్యుంజయ శక్తివంతమైన కార్టూన్ను పంచుకున్నారు. ఇటువంటి చర్యలు ఆమోదయోగ్యం కావని, వీటిని కఠినంగా ఎదు ర్కోవాలని, సత్యనారాయణ త్వరగా కోలుకోవాలని మాజీ ఎంపి సంతోష్ ఆకాంక్షించారు. న్యాయం తప్పక గెలవాలని ఆయన అభిలషించారు.



మాయమాటలు చెప్పి సోదరిని పెళ్లి చేసుకున్నాడని ఆగ్రహం మనతెలంగాణ, సిటిబ్యూరోః తమ చెల్లికి మాయమాటలు చెప్పి వివాహం చేసుకున్నాడని ఆగ్రహంతో బావపై బావమర్ధులు దాడి చేసిన సంఘటన బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... వట్టేపల్లికి చెందిన ఆయెషా ఫాతిమా(28) అనే యువతి రెండేళ్ల క్రితం సల్మాన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. సల్మాన్కు అప్పటికే వివాహమై ముగ్గురు పిల్లలున్నారు. అతడిని ఫాతిమా వివాహం చేసుకోవడం ఆమె సోదరులు సమద్, ఇంతియాజ్, సర్ఫరాజ్ కు ఇష్టం లేదు. ఆయెషా ఫాతిమాకు తమ బంధువైన ఓ వ్యక్తితో వివాహం జరిపించాలని భావించారు. కానీ వేరే వ్యక్తిని వివాహం చేసుకోవడంతో సోదరులు చెల్లి ఆయెషా ఫాతిమాపై కోపం పెంచుకున్నారు. ఈ క్రమంలోనే ఆయేషా ఫాతిమా గురువారం బండ్లగూడలోని ఓ ఆస్పత్రిలో కుమారుడికి జన్మనిచ్చింది. డెలివరీ అయిన సోదరిని చూడటానికి ఆస్పత్రికి ముగ్గురు సోదరులు వచ్చారు. ఆ సమయంలో అక్కడే ఉన్న బావ సల్మాన్తో గొడవ పడ్డారు. తన సోదరికి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నావని అతనిపై దాడి చేశారు. అడ్డు వచ్చిన సోదరిపై కూడా చేయి చేసుకున్నారు. సమాచారం తెలుసుకున్న బండ్లగూడ పోలీసులు