
4194 వార్తలు

బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ కుమార్ కుమార్తెకు లైంగిక వేధింపుల కేసులో మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు ఒకరిని అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని మహారాష్ట్ర సైబర్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు యశస్వీ మీడియాకు వెల్లడించారు. తన కుమార్తె వేధింపులకు గురవుతున్నట్లు అక్షయ్ కుమర్ స్వయంగా అధికారుల దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. ధైర్యంగా తనకు ఎదురైన ఇబ్బందిని చెప్పడం వల్లే నిందితుడిని పట్టుకోవడం సాధ్యమందని తెలిపారు. గతేడాది అక్టోబర్లో ముంబై పోలీస్ హెడ్క్వార్టర్స్లో జరిగిన ఓ కార్యక్రమంలో అక్షయ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ గురించి అక్షయ్ మాట్లాడుతూ.. తన ఇంట్లో జరిగిన ఓ ఘటన గురించి తెలిపారు. తన కుమార్తె ఆన్లైన్లో గేమ్స్ ఆడుతుండగా.. గుర్తు తెలియని ఓ వ్యక్తి ఆమెకు అసభ్యకరంగా మెసేజ్ చేశాడని అన్నారు. ఆమె న్యూడ్ ఫోటోలను పంపించాలని అతను అడిగాడని పేర్కొన్నారు. ఈ విషయం అక్షయ్ కుమార్తె ఇంట్లో చెప్పడంతో వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పాఠశాల విద్యార్థులకు సైబర్ క్రైమ్పై అవగాహన కల్పించేలా సైబర్ ఎడ్యుకేషన్ను వీక్లీ సబ్జెక్ట్గా పెట్టాలని ప్రభుత్వానికి సూచించారు

బెంగళూరు: ఐపిఎల్లో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. జిటిపై ఆర్సిబి ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. ఆర్సిబి విజయంలో విరాట్ కీలక పాత్ర పోషించాడు. 44 బంతుల్లో 81 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కించుకున్నాడు. జిటి తొలుత మూదు వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. అనంతరం 18.5 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ సెంచరీ వృధాగా మారింది. ఆర్సిబి తొలి ఓవర్లో విరాట్ కోహ్లీ ఔట్ నుంచి తప్పించుకున్నాడు. సిరాజ్ బౌలింగ్లో బంతి విరాట్ బ్యాట్ అంచుకు తగిలి వాషింగ్టన్ సుందర్ చేతిలో పడింది. ఈజీ క్యాచ్ను సుందర్ మిస్ చేయడంతో విరాట్ బతికిపోయాడు. తొలి ఓవర్లోనే విరాట్ వికెట్ పడి ఉంటే గెలిచే అవకాశాలు ఉండేవి కావు. ఈ తప్పిదంతోనే జిటి ఓటమిని చవి చూసింది.

భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ రికార్డుల రారాజు. అతడు ఇప్పటికే ఎన్నో రికార్డులను తిరగరాశాడు.. సృష్టించాడు కూడా. ప్రస్తుతానికి జాతీయ జట్టులో కేవలం వన్డే ఫార్మాట్లోనే కొనసాగుతున్న కోహ్లీ.. ఐపిఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కాగా, శుక్రవారం గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో కోహ్లీ వీర విహారం చేశాడు. 44 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సులతో 81 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా కూడా నిలిచాడు. ఈ క్రమంలో కోహ్లీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపిఎల్లో 800 ఫోర్లు, ఒకే ఫ్రాంచైజీ (ఆర్సిబి) తరఫున 300 సిక్సులు బాదిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఐపిఎల్ చరిత్రలో ఈ ఘనతలను ఇప్పటివరకూ ఏ ఆటగాడు సాధించలేదు. గుజరాత్పై మ్యాచ్ తర్వాత విరాట్ ఖాతాలో 807 ఫోర్లు, 303 సిక్సులు ఉన్నాయి. వేర్వేరు ఫ్రాంచైజీల తరఫున 300 సిక్సులు మాత్రం క్రిస్ గేల్ (కెకెఆర్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, పంజాబ్ కింగ్స్, ఆర్సిబి-357), రోహిత్ శర్మ (డెక్కెన్ ఛార్జర్స్, ముంబై ఇండియన్స్-310) సాధించారు. అయితే ఫోర్ల విషయంలో మాత్రం ఎవరూ కోహ్లీకి చేరువలో లేరు










హైదరాబాద్: మాజీ ఎంఎల్సి కవిత తన పార్టీ పేరును టిఆర్ఎస్గా ప్రకటించారు. తన పార్టీ పేరు 'తెలంగాణ రాష్ట్ర సేన' అని కవిత తెలిపారు. తెలంగాణ ఏర్పడి 12 సంవత్సరాలైనా ప్రజల కల సాకారం కాలేదని, తెలంగాణ ఉద్యమ రథం గాడి తప్పిందని విమర్శించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మునీరాబాద్లోని ప్రొఫెసర్ జయశంకర్ సార్ ప్రాంగణం నుంచి ఆమె మాట్లాడారు. ఆనాడు రాష్ట్రాన్ని పరిపాలించిన కుటుంబంలో తాను కూడా ఓ భాగమని, ఆనాటి పాలనలో తాను భాగమైనందుకు సిగ్గుపడుతున్నానని, ఎన్నో తప్పులు జరిగాయని, ఎన్నో నేరాలు జరిగాయని, తనని క్షమించాలని కవిత కోరారు. తెలంగాణ ఆడబిడ్డలను ఏకం చేసిన ఘనత జాగృతిదేనని, తెలంగాణ కలలన్నీ ఇంకా నిజం కాలేదన్నారు. కలలు కోసం పోరాటాలు సరిపోవని, అందుకే పార్టీ పెట్టానని, తప్పులు సరిదిద్దుకోవడానికే తాను తెలంగాణ రాష్ట్ర సేవ పేరుతో మీ ముందుకొచ్చానని తెలియజేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించానని, తెలంగాణ ప్రజలకు అమ్మగా మారాలనుకుంటున్నానని, బిడ్డల కష్టం తల్లికే తెలుస్తుందని, రాష్ట్ర ప్రజల కష్టాలు తీరుతాయని కవిత స్పష్టం చేశారు. అప్పటి కెసిఆర్ వేరు.. ఇప్పటి కెసిఆర్ వేరు అని విమర్శించారు.

విరూపాక్ష వంటి బ్లాక్బస్టర్ విజయంతో ఫుల్ జోష్లోకి వచ్చిన హీరో సాయి దుర్గ తేజ్, ఆ తర్వాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తేజ్ తన కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సం బరాల ఏటి గట్టు చిత్ర షూటిం గ్లో బిజీగా ఉన్నా రు. దాదాపు ఏడాది కాలంగా నిర్మాణంలో ఉన్న ఈ సినిమా కథ ఎంపిక నుంచి క్యారెక్టరైజేషన్, ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ వరకు ప్రతి అంశంలోనూ తేజ్ కష్టపడుతున్నాడని తెలిసింది. హీరో సాయి దుర్గ తేజ్ చేతిలో ఇప్పటికే పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి. దర్శకుడు సుజీత్తో పాటు సందీప్ తో కూడా కొత్త సినిమాలు చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. వీటితో పాటు మరో రెండు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయని వినికిడి. సంబరాల ఏటి గట్టు విడుదలైన వెంటనే ఆ కొత్త ప్రాజెక్టులపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. ఇక నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా మారేందుకు ఆయన సిద్ధమవుతున్న ట్లు సమాచారం. విజయ్ దుర్గ ప్రొడక్షన్స్ పేరుతో కొత్త బ్యానర్ ప్రారంభించేందుకు తేజ్ రెడీ అవుతున్నారట. త్వరలోనే ఆ నిర్మాణ సంస్థపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని తెలిసింది. ఆ బ్యానర్ మొదటి సినిమాలో త

పశ్చిమబెంగాల్లో ఇదివరకెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో మొదటి దశ పోలింగ్లో అత్యధికంగా 92 శాతం ఓటింగ్ జరగడం ఎవరికి వారే గెలుపు మాకే అన్న ఆశల పల్లకీలో ఊగుతున్నారు. ఈ మొదటి దశ నియోజకవర్గాల పరిధిలో ఓటర్ల జాబితా సవరణ తర్వాత 9.9 శాతం నుండి 11.6 శాతం వరకు ఓటర్ల పేర్లు తొలగించడంతో ఓటర్ల సంఖ్య తగ్గిపోయినప్పటికీ పోలింగ్ శాతం మాత్రం ఎక్కువగానే నమోదు కావడం విశేషం. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గాల పరిధిలో తృణమూల్ కాంగ్రెస్ 92, బిజెపి 59 స్థానాలు సాధించుకున్నాయి. అప్పటి ఎన్నికలకు ఇప్పటి ఎన్నికలకు చాలా తేడా కనిపిస్తోంది. మొత్తం 294 సీట్లకు తానే తృణమూల్ అభ్యర్థినని, తమ అభ్యర్థులపై అసంతృప్తి ఉన్నా తనపై నమ్మకం ఉంచాలని ఉధృతంగా ఆమె ప్రచారం సాగించారు. ఆమె పాప్యులారిటీ ఎన్నికల ప్రచారంలో కేంద్ర బిందువు అయింది. అయితే ఎంతవరకు ఈ పాప్యులారిటీ ఓట్లను కురిపిస్తుందో చెప్పలేం. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఎన్నో లోపాలు ఉన్నాయి. ఇవన్నీ విస్మరించి ఆమె మద్దతుదారులు అలాగే కొనసాగుతారా అన్నది ప్రశ్న. టిఎంసి గత పదిహేనేళ్ల పాలనలో పారిశ్రామిక వృద్ధి లేదు సరికదా క్షీణత కనిపిస్తోంది.

హైదరాబాద్: ఎటిఎంలోకి వెళ్లిన వ్యక్తి ఊపిరాడక మృతి చెందిన సంఘటన హైదరాబాద్లోని మెహదీపట్నంలోని విజయనగర్ కాలనీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మల్లెపల్లిలోని ఓ హెచ్డిఎఫ్సి ఎటిఎం సెంటర్లోకి ఓ వ్యక్తి డబ్బులు డ్రా తీయడానికి వెళ్లాడు. లోపలికి వెళ్లిన తరువాత ఎటిఎం సెంటర్ డోర్ లాక్ కావడంతో అందులోనే ఉండిపోయాడు. బయట నుంచి గాలి వచ్చే అవకాశం లేకపోవడంతో ఊపిరాడక అతడు మృతి చెందాడు. స్థానికులు గమనించి బ్యాంకు సిబ్బందికి సమాచారం ఇచ్చారు. పోలీసులు, బ్యాంకు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహంపై ఎటువంటి గాయాలు లేకపోవడంతో ఊపిరాడక చనిపోయి ఉంటాడని పోలీసుల అనుమానం వ్యక్తం చేశారు. హార్ట్ ఎటాక్ తో చనిపోయాడా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సిసి కెమెరాను పరిశీలిస్తే అన్ని తెలుస్తాయని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

కొన్ని విషయాలకు ప్రత్యేక వివరణలు అక్కర లేదు. అవి ఎంత సీరియస్వి అయినప్పటికీ. సమస్య మొదలైన కొత్తలో కొంత సంక్లిష్టత ఉన్నా ఎక్కువ సమయం అక్కర లేకుండానే అందరికీ అర్థమైపోతాయి. ప్రస్తుత పశ్చిమాసియా యుద్ధం సంగతి అట్లానే మారింది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ల దాడులు ఫిబ్రవరి 28న అకస్మాత్తుగా, నిష్కారణంగా మొదలై నేటికి (ఏప్రిల్ 25) సరిగ్గా 57 రోజులు. ఇందులో సుమారు సగకాలం గడిచేసరికి యుద్ధం ప్రతిష్టంభనలో పడింది. రెండవ సంగతి మొదలైనప్పటి నుంచి అమెరికా, ఇజ్రాయెల్లకు ఇక ముందుకెట్లా సాగాలో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. ఇపుడు తాజా పరిస్థితినే గమనించండి. అటు అమెరికా, ఇటు ఇరాన్ రెండూ కలిసి వేర్వురు విధాలుగా హర్మూజ్ జలసంధిని మూసివేశాయి. జలసంధి ముఖద్వార ప్రాంతం నుంచి అమెరికన్ నౌకలను ఖాళీ చేయించగల శక్తి ఇరాన్కు లేదు. ముఖ ద్వారం నుంచి మొదలుకొని ఉత్తరాన పర్షియన్ సముద్రం వరకు గల జలాలను ఇరాన్ నియంత్రణ నుంచి విముక్తం చేయగల బలం అమెరికాకు లేదు. మరొక స్థాయిలో చూసినపుడు, ఇరాన్ షరతులను అమెరికా గాని, అమెరికా షరతులను ఇరాన్ గాని ససేమిరా అంగీకరించటం లేదు. దానితో అంతా ప్రతిష్టంభన. సమస్య ఏమంటే, విషయమంతా ఇరాన్ కన్న అమెరికా

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు ఆమోదం పొంది ఇప్పటికే పుష్కర కాలం గడిచింది. ఈ 12 ఏండ్లలో బిల్లుకు రెండుసార్లు సవరణలు జరిగినాయి. ఈ రెండు సందర్భాలలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవసరాలను తీర్చడానికి తప్ప తెలంగాణకు ప్రయోజనం చేకూర్చే ఒక్కటంటే ఒక్కటి కూడా ఆ సవరణల్లో చోటు చేసుకోలేదు. మొదటి సవరణ మే 2014 జరిగింది. అప్పటికి తెలంగాణ రాష్ట్రం ఇంకా ఏర్పడనే లేదు. ఎన్నికలు జరిగి తెలంగాణలో కొత్త ప్రభుత్వం జూన్ 2న ప్రమాణ స్వీకారం చేయవలసి ఉన్న సందర్భంగా ఈ సవరణ బిల్లు ఆర్డినెన్స్ను కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. ఈ సవరణలో చేసింది ఏమిటో అందరికీ తెలిసిందే. ఖమ్మం జిల్లాలో ఉన్న ఏడు మండలాలను (చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం, నెల్లిపాక, భద్రాచలం పట్టణం మినహాయించి భద్రాచలం, బూర్గుంపాడు, కుకునూరు, వేలేరుపాడు) తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరపకుండానే చంద్రబాబు నాయుడు ఒత్తిడికి తలొగ్గి మోడీ ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ను జారీ చేసింది. ఇవన్నీ పోలవరం ప్రాజెక్టు ముంపులోకి వచ్చే ప్రాంతాలు కావడంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే వీటిని లాగేసుకోవాలన్న కుట్ర ఇందులో దాగి ఉంది. అప్పుడు తెలంగాణ సమాజం తీవ్రంగా స్పందించింది. తెలంగాణ

భోపాల్: ప్రేమ జంట పారిపోవడంతో యువకుడి తండ్రిని తీవ్రంగా కొట్టి అనంతరం అతడితో మూత్రం తాగించిన సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం రైసెన్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... అగరియా మార్ఖో గ్రామంలో బిహారీ బంజారా అనే వృద్ధుడు(70) తన కుమారుడితో కలిసి ఉంటున్నాడు. విధిషా జిల్లాలోని శంషాబాద్కు చెఇని ఓ మహిళతో బంజారా కుమారుడు ప్రేమలో పడ్డాడు. ప్రేమ జంటలో పారిపోవడంతో బంజారా అనే వృద్ధుడిని మహిళ కుటుంబ సభ్యులు శ్యామ్లాల్, మల్ఖాన్, రోడ్జీ, బీరన్, లక్ష్మణ్లు కిడ్నాప్ చేసి చితకబాదారు. అనంతరం ఆ వృద్ధుడితో మూత్రం తాగించడంతో పాటు వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇటీవల సుప్రీంకోర్టు యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ రోహిత్ నాతన్ కేస్ తీర్పులో ఒబిసి రిజర్వేషన్లలో అభ్యర్థులు క్రీమీలేయరా? లేదా నాన్ క్రీమీలేయరా అనే విషయాన్ని నిర్ధారించేటప్పుడు ప్రభుత్వరంగ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగుల, ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల జీతభత్యాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని నిర్ధారించడానికి తప్పుపడుతూ, చరిత్రాత్మకమైన తీర్పును వెలువరించింది. ఈ తీర్పు కేంద్ర ప్రభుత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ శాఖలో ఒబిసి రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పనిచేస్తున్న అధికారులకు, అదే విధంగా ఉద్యోగుల జీతభత్యాలను మాత్రమే పరిగణనలోకి తీసుకొని ఒబిసి (నాన్ క్రీమీలేయర్) సర్టిఫికెట్ జారీ చేయడానికి ఇబ్బందులకు గురిచేస్తున్న తహసీల్దార్లకు చెంపపెట్టుగా భావించాలి. దేశంలో మొత్తం 8రకాల రిజర్వేషన్లను విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో అమలు చేస్తున్నారు. ఇందులో ఎవరికీ లేని క్రీమీలేయర్ సమస్య కేవలం బిసి రిజర్వేషన్లపై ఉంది. కారణం భారత రాజ్యాంగంలోని లోపాలు నేడు బిసి కులాల పాలిట శాపంగా మారింది. రాజ్యాంగాన్ని సవరిస్తే తప్ప బిసి కులాలకు న్యాయం జరిగే అవకాశాలు లేవు. బిసి రిజర్వేషన్లు క్రీమీలేయర్ సమస్యను

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులు చేస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన ప్రస్తుతం ఫౌజీ, స్పిరిట్ చిత్రాల్లో నటిస్తున్నాడు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ వాస్తవానికి ఈ నెలకు ప్లాన్ చేసిన ఒక కీలకమైన షెడ్యూల్ అనూహ్యంగా మే నెలకు వాయిదా పడింది. ఈ మార్పుకు గల ఖచ్చితమైన కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. షూటింగ్ వాయిదా పడటంతో దొరికిన ఈ చిన్న విరామాన్ని ప్రభాస్ తన వ్యక్తిగత సమయం కోసం కేటాయించాడు. ఆయన ప్రస్తుతం హాలీడే టూర్ నిమిత్తం యూరప్ వెళ్ళినట్లు తెలిసింది. ఈ హాలిడే తర్వాత ప్రభాస్ తిరిగి వచ్చి మళ్ళీ షూటింగ్లో చేరతాడు. అయితే ‘స్పిరిట్’ షెడ్యూల్లో జరిగిన ఈ మార్పు ప్రభాస్ తర్వాతి ప్రాజెక్టులపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా వచ్చే నెలలో ప్రారంభం కావాల్సిన ‘కల్కి 2’ షూటింగ్ షెడ్యూల్లో కూడా కొన్ని మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. దీనిపై చిత్ర బృందం నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఢిల్లీ: స్నేహితుడి భార్యపై అత్యాచారం చేసిన అనంతరం ఐఆర్ఎస్ కూతురుపై అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటన ఢిల్లీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రాహుల్ మీనా(19) అనే యువకుడు ఐఆర్ఎస్ ఆఫీసర్ వద్ద ఆఫీస్ బాయ్ పని చేసేవాడు. మంగళవారం సాయంత్ర తన స్నేహితుడితో కలిసి రాహుల్ పక్క గ్రామంలో పెళ్లికి వెళ్లాడు. స్నేహితుడిని అక్కడే వదిలేసి అల్వార్లోని అతడి ఇంటికి రాహుల్ వెళ్లాడు. డోర్ కొట్టగానే స్నేహితుడి భార్య డోర్ తెరవడంతో ఆమెను మరో గదిలో లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం అల్వార్ నుంచి ఢిల్లీలోని ఐఆర్ఎస్ ఆఫీసర్ ఇంటికి వెళ్లాడు. ఇంట్లో కూతరు ఒంటరిగా ఉండడంతో ఆమెపై అత్యాచారం చేసి హత్య చేశాడు. ఐఆర్ఎస్ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అతడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. గతంలో రాహుల్ పలువరిపై అత్యాచారం చేసినట్టు ఆరోపణలు చేస్తున్నారు. కొందరు బాధితురాళ్లు పరువు పోతుందని బయటకు చెప్పుకోవడంలేదని సమాచారం. రాహుల్కు ఉరిశిక్ష వేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
