21497 వార్తలు


హైదరాబాద్: తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ గడువును మరోసారి పొడిగించారు. ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించే గడువును ఆగస్టు 10 వరకు పొడిగించారు. ఆగస్టు 3న ముగియాల్సిన గడువును 10 తేదీ వరకూ పొడిగిస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.

ఎల్ఆర్ఎస్ గడువు మరో నాలుగు నెలల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎల్ఆర్ఎస్ ఫీజులు, ఛార్జీల్లో 25శాతం రాయితీ గడువును 30 నవంబర్ వరకు పొడిగిస్తూ మున్సిపల్ పరిపాలన, అర్బన్ డెవలప్మెంట్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో 1మే నుంచి 31జూలై వరకు ప్రభుత్వం పొడిగించిన విషయం తెలిసిందే. అయితే, ఓటర్లకు సంబంధించిన స్పెషల్ ఇన్ టెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్లానింగ్ అధికారులు, ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ఫలితంగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన నత్తనడకన సాగుతోంది. అయితే, గతేడాదిలో రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ఫీజులో 25 శాతం రాయితీ కల్పిస్తూ 31మార్చి 2026 వరకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. మూడు సార్లు గడువు పొడిగించినా ఇప్పటి వరకు రూ.2వేల కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. అయితే, ఎస్ఐఆర్ కారణంగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించడంలో ఆలస్యం కావడంతో మరో నాలుగు నెలలపాటు 1ఆగస్టు నుంచి 30నవంబర్ వరకు గడువును ప్రభుత్వం పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు దరఖాస్తుదారులు కూడా ఆశించిన స్థాయిలో ఫీజులు చెల్లించకపోవ

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా పార్టీని వీడారు. వ్యక్తిగత కారణాలతో ఆయన పార్టీని వీడినట్టు తెలుస్తోంది. బీజేపీ అగ్రనాయకత్వానికి తన రాజీనామా లేఖను సమర్పించినట్టు పార్టీ వర్గాల సమాచారం. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా ఆయన చురుకుగా ఉండటమే కాకుండా ప్రధానమంత్రి మోదీకి బలమైన మద్దతుదారుగా పేరుంది. రాజీనామా నేపథ్యంలో ఆయన తన ఎక్స్ ఖాతాలో బయో వివారాలు మార్చేశారు. ప్రధానికి జీవితాంతం ఫాలోవర్గా ఉంటానని అందులో పేర్కొన్నారు. అయితే పూనావాలా ఇన్స్టాగ్రామ్ బయోలో మాత్రం బీజేపీ జాతీయ ప్రతినిధిగానే ఆయన పేరు ఉంది.వృత్తి రీత్యా లాయర్, పౌరహక్కుల కార్యకర్త అయిన 38 ఏళ్ల పూనావాలా కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. అయితే 2017లో కాంగ్రెస్ పార్టీ అంతర్గత అధ్యక్ష ఎన్నికల ప్రక్రియను ఆయన వ్యతిరేకిస్తూ పార్టీ నుంచి బయటకు వచ్చారు. పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీని ఎన్నుకునే ప్రక్రియ ఒక నాటకమని, అది అంతకుముందే ఖరారైందని పూనావాలా ఆరోపించారు. పార్టీలో ప్రజాస్వామ్యం లేదని, అర్హత ఆధారంగా కాకుండా కుటుంబ నేపథ్యంతోనే పదవులు ఇస్తున్నారని విమర్శించారు. అనంతరం ఆయన బీజేప

2020 ఫిబ్రవరిలో జరిగిన ఢిల్లీ అల్లర్ల సమయంలో ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారి అంకిత్ శర్మ హత్య కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మాజీ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్కు జీవిత ఖైదు విధిస్తూ ఢిల్లీలోని కర్కర్దూమా కోర్టు తీర్పు వెలువరించింది. ఈ నేరం జరిగిన తీరు అత్యంత క్రూరమైనదని శిక్ష ఖరారు చేస్తూ కోర్టు వ్యాఖ్యానించింది. “హత్యతోనే ఆ క్రూరత్వం ముగిసిపోలేదు. ద్వేషం ఇంకా చల్లారనట్లుగా అంకిత్ శర్మ మృతదేహాన్ని సమీపంలోని మురుగు కాలువలోకి లాక్కెళ్లారు. ఈ నేరం అత్యంత అరుదైన కేసుల కోవకు చేరువగా ఉంది. నేరంలోని అమానవీయత.. శిక్ష తగ్గించేందుకు పరిగణనలోకి తీసుకోవాల్సిన పరిస్థితుల కంటే తీవ్రంగా ఉంది” అని కోర్టు పేర్కొంది. అయితే దోషులు మారే అవకాశం పూర్తిగా లేదని నిర్ధారించాల్సిన అవసరం ఉందని కోర్టు తెలిపింది. నేరంలో దోషుల వ్యక్తిగత పాత్ర స్పష్టంగా లేకపోవడం శిక్ష తగ్గింపునకు పరిగణించాల్సిన ముఖ్యమైన అంశమని పేర్కొంది. వారి విద్యా నేపథ్యం, తప్పుడు సమాచారంతో కూడిన వాతావరణం ప్రభావానికి లోనయ్యే పరిస్థితులు కూడా శిక్ష తగ్గింపునకు అనుకూల అంశాలేనని అభిప్రాయపడింది.ఐబీలో సెక్యూరిటీ అసిస్టెంట్గా పనిచేస్తున్న 26 ఏళ్ల అంకిత్

వర్షాలు వస్తుండడంతో కొల్లూరులో గత బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన నాసిరకం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కురుస్తున్నాయని, ఆ ఇళ్లను మర మ్మతులు చేయించి ఆదుకోవాలని లబ్ధిదారులు సిఎం ప్రజావాణిలో ఇంచార్జ్ డాక్టర్ జి.చిన్నారెడ్డితో మొరపెట్టు కున్నారు. శుక్రవారం మహాత్మా జ్యోతిబాఫూలే ప్రజాభవన్లో నిర్వహించిన 243వ సిఎం ప్రజావాణి కార్యక్రమానికి కొల్లూరు డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు తరలివచ్చారు. చిన్నపాటి వర్షాలకే కొల్లూరు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కురుస్తున్నాయని, ఇళ్లన్నీ జలమయమై ఆ ఇళ్లల్లో నివాసం ఉండలేకపోతున్నామని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. కొల్లూరు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రాంగణంలో మెయింటినెన్స్ కూడా సరిగా లేదని రవాణా సౌకర్యం కూడా లేదని లబ్ధిదారులు చిన్నారెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇళ్ల నిర్మాణాలు నాసిరకంగా జర గడం వల్ల ఈ సమస్య ఉత్పన్నమవుతోందని వారన్నారు.వెంటనే స్పందించిన చిన్నారెడ్డి హౌసింగ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్తో ఫోన్లో మాట్లాడి ఈ సమస్యలను వివరించి తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారులను కొల్లూరు డబుల్ బెడ్రూమ్ ప్రాంగణానికి పంపించి ఇళ్లను మరమ్మత్తులు

హైదరాబాద్: మర్రిచెన్నా రెడ్డి మానవ వనరుల కేంద్రంలో ‘శక్తి’ కార్యక్రమాలపై సిఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్2పవర్ కంపెనీ టామ్కామ్ను మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు. పాస్పోర్టు నుంచి విదేశీ కంపెనీల్లో ఉద్యోగాల వరకు ఆ సంస్థ బాధ్యత తీసుకోవాలన్నారు. నూతన ఆవిష్కరణల కోసం యంగ్ ఇ:డియా స్కిల్ యూనివర్సిటీలో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయాలని సిఎం ఆదేశించారు. స్కిల్ యూనివర్సిటీలో విదేశీ భాషలు నేర్పేందుకు ప్రత్యేక వింగ్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు కంపెనీల్లో ఇంటర్న్షిప్ అవకాశం కల్పించాలని చెప్పారు. ఎటిసిల్లో విద్యుత్ వాహనాలు, డ్రోన్ టెక్నాలజీకి సంబంధించిన కోర్సులు ప్రవేశ పెట్టాలన్నారు. డిమాండ్కు తగినట్లుగా నర్సింగ్ కళాశాలలకు అనుమతి ఇవ్వాలని ఆదేశించారు. ఈ సమీక్షలో కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


హైదరాబాద్: సినీ నటి రష్మిక మందన్న ఫ్యాన్స్కి ఇది షాకింగ్ న్యూస్. సినిమా షూటింగ్లో రష్మిక గాయపడ్డారు. షూటింగ్లో భాగంగా ఓ పాటకు డ్యాన్స్ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. తుంటి భాగంలో బలమైన గాయమైనట్లు వైద్యులు గుర్తించారు. ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ప్రస్తుతం రష్మిక, విజయ్ దేవరకొండతో కలిసి ‘రణబాలి’ అనే సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు హీరోయిన్ ప్రాధాన్యమున్న ‘మైసా’లో లీడ్ రోల్ చేస్తుంది.


టీం ఇండియా మాజీ ఆటగాడు అజింక్య రహానే గురువారం అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అతడి సేవలను అభినందిస్తూ.. పలువురు సోషల్మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు. తాజాగా ‘12th ఫెయిల్’ హీరో విక్రాంత్ మాస్సే రహానేపై ప్రశంసలు కురిపిస్తూ.. సోషల్మీడియాలో పోస్ట్ పెట్టాడు. ‘‘అజింక్య రహానే.. మీరు ఈ జెర్సీని ధరించడం వల్ల భారత క్రికెట్ మరింత గొప్పగా మారింది. కొందరు ఆటగాళ్లు రికార్డులను సృష్టిస్తారు. మరికొందరు ప్రమాణాలను నెలకొల్పుతారు. మీరు రెండో జాబితాకు చెందుతారు. వ్యక్తిగతం కంటే జట్టు కోసమే ఆడారు. విజయాలను వినయంతో.. ఎదురుదెబ్బలను ప్రశాంతంగా, హుందాతనంతో స్వీకరించారు. మీ ప్రతిభతోపాటు వ్యక్తిత్వం కూడా స్పూర్తిదాయకమని మాకు గుర్తు చేశారు. రాహుల్ ద్రవిడ్కు మీరే అసలైన వారసుడిగా నిలిచారు. క్రికెట్ ప్రపంచం మీకు రుణపడి ఉండటానికి అదొక్క విషయం చాలు. ప్రచార ఆర్భాటలనే విలువలుగా భావించే ప్రస్తుత పరిస్థితుల్లో.. నిజమైన ప్రతిభకు పిఆర్ అవసరం లేదని నిరూపించారు. నిస్వార్థ సేవ, పట్టుదల, ఆటపట్ల మీకున్న అంకిత భావం తరతరాల పాటు గుర్తుండిపోతుంది. ధన్యవాదాలు జింక్స్’’ అని విక్రాంత్ పోస్ట్ పెట్







నారాయణపూర్: ఛత్తీస్గఢ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ కారణంగా వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. నారాయణపూర్ జిల్లా ఆబూజ్మడ్ అటవీ ప్రాంతంలోని బాలేవాడ సిఆర్పిఎఫ్ క్యాంపును వరద నీరు ముంచెత్తింది. ఒక్కసారిగా వరదపొటెత్తడంతో జవాన్లు చెట్లు, రేకుల షెడ్ల పైకెక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. క్యాంపు మొత్తం వరద నీటిలో మునిగిపోయింది. అధికారులు వెంటనే స్పందించి జవాన్లను సురక్షిత ప్రాంతానికి తరలించారు.

హైదరాబాద్: చట్టం పాలన మాత్రమే కొనసాగాలని..వ్యక్తుల పాలన కాదని హైకోర్టు స్పష్టం చేసింది. వ్యక్తుల ఆధిపత్యం కొనసాగితే ప్రజాస్వామ్యానికి ప్రమాదమని సూచించింది. శాంతా శ్రీరామ్ కన్ స్ట్రక్షన్ కంపెనీ కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బయటకొచ్చిన హైకోర్టు జడ్జిమెంట్ కాపీలో కీలక అంశాలు వెలువడ్డాయి. వ్యక్తి ఆధిపత్యం కొనసాగిందనడానికి ఈ ఘటన ఒక ఉదాహరణ అని తెలిపింది. హైడ్రా కమిషనర్ కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారన్నది స్పష్టమైందని, వివాదస్పద ఆస్తిలోకి యంత్రాలు, సిబ్బందితో ప్రవేశించడం చట్టవిరుద్ధం అని హెచ్చరించింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను వీలైనంత త్వరగా బదిలీ చేయాలని సిఎస్ కు సూచనలిచ్చింది. హైడ్రా కమిషనర్ ను తప్పించాలని ఈ నెల 27 న హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయనుంది. ఈ మేరకు టాటా మోహన్ రావు కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వులను ప్రస్తావించిన హైకోర్టు శిక్షించడంలో కాకుండా క్షమించడంలోనే చట్ట ఔన్నత్యం ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది.




టీం ఇండియా అభిమానులకు బిసిసిఐ శుభవార్త అందించింది. ఇంగ్లండ్తో జరిగిన వన్డే సిరీస్ సందర్భంగా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయం తిరగబెట్టిన సంగతి తెలిసిందే. దీంతో మూడో వన్డేకి అతడు బెంచ్కి పరిమితమయ్యాడు. దీంతో అప్పటి నుంచి అతడు జట్టుకు దూరం కావడంతో.. అతడు లేని లోటు జట్టులో స్పష్టంగా కనిపించింది. అయితే త్వరలో జరగబోయే శ్రీలంక టెస్ట్ సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో బుమ్రా పేరు ఉంది. కానీ, అతడు పూర్తిగా ఫిట్గా ఉంటేనే ఆడుతాడని అధికారులు తెలిపారు. అయితే ఇప్పుడు బిసిసిఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ తీపి కబురు అందించింది. బుమ్రా ఫుల్ ఫిట్గా ఉన్నాడని తెలిపింది. దీంతో శ్రీలంకతో జరిగే రెండు టెస్ట్ల సిరీస్లో అతడు ఆడటం ఖాయమే. ‘‘జస్ప్రీత్ బుమ్రా గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. ఫిట్నెస్ టెస్టులను క్లియర్ చేశాడు. ఇప్పటికే స్క్వాడ్లో ఉన్న అతడు.. రెండు టెస్టులకూ అందుబాటులో ఉంటాడు’’ అని బిసిసిఐ అధికారి ఒకరు తెలిపారు. ఇప్పుడు శ్రీలంకతో టెస్టు సిరీస్లో బుమ్రా ఆడటం భారత్కు అత్యంత కీలకం. ఇద్దరు ప్రధాన పేసర్లు మాత్రమే తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. బుమ్రా ఉంటే ప్రత్యర్థి లంక బ్యాటర్లు హడలెత్తడం ఖాయం.