
4340 వార్తలు


వేసవి సెలవుల్లో హెచ్ఎంలకు పర్యవేక్షణ బాధ్యతలునవతెలంగాణ – మల్హర్ రావుమండల కేంద్రంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఇటీవల టివితోపాటు వివిధ వస్తువులను గుర్తుతెలియని దొంగలు ఎత్తుకెళ్లారు. దీంతో ఉపాధ్యాయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.అలాగే మరికొన్ని పాఠశాలల్లో ఆకతాయిలు మద్యం సేవించి,మద్యం సీసాలు పగలదొట్టడం ఏటా పరిపాటిగా మారుతుంది.మండలంలో 5 జిల్లా పరిషత్,ఒక మోడల్ స్కూల్,ఒక కస్తూరిబ్బా ఆశ్రమ పాఠశాల,రెండు ప్రాథమికోన్నత,28 ప్రాథమిక పాఠశాలున్నాయి. వేసవి సెలవుల సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో భద్రతా ప్రమాణాలపై పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ […] The post ప్రభుత్వ పాఠశాలల్లో వస్తువులు పైలం appeared first on Navatelangana.

నవతెలంగాణ – మల్హర్ రావుమండలంలోని ఇప్పలపల్లి గ్రామపంచాయతీ పరిధిలో నూతనంగా నిర్మాణం చేపడుతున్న శ్రీభక్తఅంజనేయ స్వామి ఆలయ నిర్మాణం కోసం మండల మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు తన వంతుగా రూ.10 వేలు విరాళం ప్రకటించి గురువారం ఆలయ కమిటీకి అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అబ్బినేని లింగస్వామి,ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. The post ఆలయ నిర్మాణానికి మాజీ ఎంపీపీ విరాళం appeared first on Navatelangana.
నవతెలంగాణ – హైదరాబాద్ : ఉత్తరాఖండ్లోని టెహ్రీ గర్వాల్ జిల్లాలో చంబా-కోటీ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక వాహనం అదుపుతప్పి 300 మీటర్ల లోతైన లోయలోకి దూసుకెళ్లడంతో 8 మంది అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. The post లోయలో పడ్డ వాహనం..8 మంది మృతి appeared first on Navatelangana.
నవతెలంగాణ – మల్హర్ రావుమండలంలోని అడ్వాలపల్లిలో ప్రభుత్వ నిషేధిత గుడుంబా తయారీ,విక్రయాలు జోరుగా సాగుతున్నాయనే సమాచారం మేరకు కొయ్యుర్ ఎస్ఐ-2 రాజన్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం గుడుంబా స్థావరాలపై పోలీసులు విస్తృతంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 20 లీటర్ల నాటు సారాయి,150 లీటర్ల పులియపోసిన బెల్లం పానకం స్వాదినపర్చుకున్నట్లుగా పోలీసులు తెలిపారు.గుడుంబా తయారు చేసిన, విక్రయించిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. The post గుడుంబా స్థావరాలపై కొయ్యుర్ పోలీసుల దాడులు appeared first on Navatelangana.
నవతెలంగాణ – మల్హర్ రావుమండలంలోని ఇప్పలపల్లి గ్రామపంచాయతీ పరిధిలో నూతనంగా నిర్మాణం చేపడుతున్న శ్రీభక్తఅంజనేయ స్వామి ఆలయ నిర్మాణం కోసం తాడిచెర్ల సర్పంచ్ బండి స్వామి తన వంతుగా రూ.5,016 వేలు విరాళం ప్రకటించి గురువారం ఆలయ కమిటీకి అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అబ్బినేని లింగస్వామి,ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. The post ఆలయ నిర్మాణానికి సర్పంచ్ బండి స్వామి విరాళం appeared first on Navatelangana.

మెగా పవర్స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘పెద్ది’. ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది. అయితే ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్, సాంగ్స్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర అప్డేట్ సోషల్మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదే పెద్దిలోని ఐటమ్ సాంగ్ గురించి. ఇప్పటికే సినిమా రిలీజ్ ఆలస్యం అవుతుండటంతో చరణ్ ఫ్యాన్స్ నిరాశ చెందారు. ఇంకా సినిమాలో ఐటమ్ సాంగ్ షూటింగ్ పెండింగ్లో ఉంది. అయితే ఇప్పటివరకూ అందులో చరణ్తో కలిసి చిందులు వేసే హీరోయిన్ ఎవరు అనే విషయాన్ని ఇప్పటివరకూ ప్రకటించలేదు. కొద్ది రోజుల క్రితం సంయుక్త మీనన్ ఈ సాంగ్ చేయనుందని టాక్ వినిపించింది. మృణాల్ ఠాకూర్, మానస వారణాసిల పేర్లు కూడా తెర మీదకు వచ్చాయి. అయితే ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్ పేరు వినిపిస్తుంది. ఆ హీరోయినే శృతి హాసన్. శృతి ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడం దాదాపు ఫిక్స్ అయిందని తెలుస్తోంది. అయితే మేకర్స్ ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

సిడిపిఓ కమలాదేవినవతెలంగాణ-నెల్లికుదురు మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామంలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే ను ఘనంగా నిర్వహించినట్లు సిడిపిఓ కమలాదేవి తెలిపారు. గురువారం పోషణ పక్వాడ్ కార్యక్రమంలో భాగంగా గ్రాడ్యుయేషన్ డే శ్రీ జ్యోతి డి కవిత ఎం కవిత ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలచే ఆక్టివిటీ ప్రోగ్రాం చేయించామని వారి చే పదాలు చెప్పించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ సరిత, ఉషారాణి పంచాయతీ కార్యదర్శి రవి, తల్లులు పాల్గొన్నారు. The post బికే పల్లిలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే appeared first on Navatelangana.
సీడీపీఓ కమలాదేవి, ఐసిడిఎస్ సూపర్వైజర్లు సరిత ఉషారాణినవతెలంగాణ-నెల్లికుదురు మండల కేంద్రంలోని అంగన్వాడి సెంటర్ ఆధ్వర్యంలో పిల్లలచే పదాలు పలికించడం అభినందనీయమని సిడిపిఓ కమలాదేవి తెలిపారు. అంగన్వాడి కేంద్రం విజయ సెంటర్లో పోషణ పక్పాడ్ లో భాగంగా గ్రాడ్యుయేషన్ డే ను ఘనంగా సూపర్వైజర్లు ఉషారాణి సరితలు తో కలిసి గురువారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రంలో దొరికి ఆహారాన్ని అంగన్వాడి సెంటర్ కి వచ్చేటువంటి వారికి సక్రమంగా అందించాలని తద్వారా వారు పిల్లలు […] The post అంగన్వాడి పిల్లలచే పదాలు పలికించడం సంతోషం appeared first on Navatelangana.

రోజురోజుకు వేడి తీవ్రత పెరుగుతోంది. కాబట్టి, ఉదయాన్నే వాకింగ్ చేసేవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదయం వాతావరణం వేడిగా లేకపోయినా అజాగ్రత్తగా ఉండకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాగా, వేసవిలో ఉదయాన్నే ఎలాంటి ఆరోగ్య సమస్యలు, డీహైడ్రేషన్కు గురికాకుంటే ఖాళీ కడుపుతో నడవవచ్చని సూచిస్తున్నారు. అయితే, కొంతమంది మాత్రం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. ఎవరు జాగ్రత్తగా ఉండాలి?ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు ఖాళీ కడుపుతో మార్నింగ్ వాకింగ్ మానుకోవాలి. ఎందుకంటే రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోయే అవకాశం ఉంటుంది. దీంతో తల తిరగవచ్చు. అయితే, మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ సీజన్లో నడకకు వెళ్లే ముందు నానబెట్టిన శనగలు వంటి తేలికపాటి, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఉదయాన్నే ఎక్కువగా తినడం లేదా నడకకు ముందు టీ, కాఫీ తాగడం వంటివి చేయకూడదని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇవి శరీరాన్ని డీహైడ్రేట్ చేసే ప్రమాదం ఉంది. వేసవిలో ఈ సమస్య ఎందుకు?వేసవిలో వేడి తీవ్రత కారణంగా శరీరం చెమట ద్వారా నీటిని కోల్పోతుంది. దీంతో కడుపు ఖాళీగా ఉండి, శరీరం డీహైడ్రేట్ అవుతుంది. దీనివలన నీరసం, తలనొప్పి లేదా డీహైడ్రేషన్కు గురి కా


నవతెలంగాణ – మల్హర్ రావుమండల కేంద్రమైన తాడిచర్ల గ్రామ పరిధిలోని రామారావుపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పాఠశాలలోని విద్యార్థులకు ప్రగతి పత్రాలను గురువారం పంపిణీ చేసినట్లుగా పాఠశాల ప్రాధానోపాధ్యాయురాలు బి.పద్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. పాఠశాల పనిదినం చివరి రోజు విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశము నిర్వహించి విద్యార్థులకు ప్రగతి పత్రాలను అందించడం జరిగిందన్నారు.విద్యార్థుల ప్రగతిపై తల్లిదండ్రులకు వివరించి,వేసవికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు,తల్లిదండ్రులకు అవగాహన కల్పించినట్లుగా తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థుల నమోదును […] The post ప్రభుత్వ విద్యార్థులకు ప్రగతి పత్రాలు పంపిణీ appeared first on Navatelangana.




చాలామంది ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేసేటప్పుడు రేంజ్కు ప్రాధాన్యత ఇస్తారు. అందుకే అనేక కార్ల తయారీ కంపెనీలు అధిక రేంజ్ ఇచ్చే వాహనాలను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో టాటా నెక్సాన్ ఈవీ, ఎంజి విండ్సర్ ఈవీ, టాటా పంచ్ ఈవీ వంటి మోడళ్లు ఒకే ఛార్జ్పై దాదాపు 400 కి.మీ.లకు పైగా రేంజ్ అందిస్తాయి. దీనివల్ల తరచుగా ఛార్జింగ్ చేయవలసిన అవసరం కూడా తగ్గుతుంది. ఈ నేపథ్యంలో 400 కి.మీ.లకు పైగా రేంజ్ అందిస్తూ, విభిన్న బడ్జెట్ అవసరాలకు సరిపోయే ఐదు ఎలక్ట్రిక్ వాహనాల గురించి ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.టాటా పంచ్ ఈవీటాటా పంచ్ ఈవీ సింగల్ ఛార్జ్ పై దాదాపు 468 కి.మీ.ల వరకు రేంజ్ అందిస్తుంది. ఇది కొత్త ఎలక్ట్రిక్ వాహన కొనుగోలుదారులను ఆకర్షిస్తోంది. ఈ కారు కాంపాక్ట్ సైజు, మంచి రేంజ్ను కలిగి ఉంది. దీని పోటీదారులలో సిట్రోయెన్ EC3 ఒకటి. ఇది రోజువారీ సిటీ డ్రైవింగ్కు చాలా అనువైనది.ఎంజి విండ్సర్ ఈవీ ఈ ఎలక్ట్రిక్ కారు అద్భుతమైన ఫీచర్లు, క్యాబిన్ సౌకర్యానికి ప్రాధాన్యత ఇచ్చే కస్టమర్లను లక్ష్యంగా చేసుకుంది. ఇది పెద్ద టచ్స్క్రీన్, ADAS, విశాలమైన స్థలాన్ని అందిస్తుంది. ఒక ఛార్జ


వరంగల్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టిసి ఉద్యోగుల సమ్మె రెండో రోజు కొనసాగుతోంది. రెండో రోజు తీవ్ర స్థాయిలో నిరసనలు చేపట్టారు. అయితే వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టిసి డిపోలో డ్రైవర్గా పని చేస్తున్న కోలా శంకర్ గౌడ్ ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఆర్టిసిని ప్రభుత్వంలో విలీనం చేయకుండా కాలయాపన చేయడాన్ని నిరసిస్తూ నర్సంపేట బస్టాండ్ ఎదుట ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అక్కడ ఉన్న వాళ్లు మంటలను ఆర్పివేసి శంకర్ గౌడ్ను రక్షించారు. తీవ్రంగా గాయపడిన ఆయన్ను మెరుగైన చికిత్స కోసం వరంగల్కు తరలించారు.

టీవీఎస్ మోటార్ కంపెనీ భారతదేశంలో 2026 టీవీఎస్ రైడర్ 125 రెండు కొత్త వేరియంట్లను విడుదల చేసింది. ఈ కొత్త వేరియంట్లలో అప్డేట్ చేయబడిన ఫీచర్లు, రంగులు ఉన్నాయి. అయితే బైక్ స్పోర్టీ లుక్లో ఎలాంటి మార్పు లేనప్పటికీ ఈ బైక్ అనేక వేరియంట్లలో అందుబాటులో ఉంది. దీని ధర రూ.82,680 (ఎక్స్-షోరూమ్) ఢిల్లీ నుండి ప్రారంభమవుతుంది. కొత్తగా విడుదలైన SXC DD వేరియంట్ ధర రూ.96,725. కాగా, TFT DD వేరియంట్ ధర మాత్రం రూ.98,500గా ఉంది.కొత్త రంగులు, వేరియంట్లుఈ అప్డేట్లో ప్రధాన ఆకర్షణ కొత్త నైట్రో గ్రీన్ కలర్. కంపెనీ ఈ రంగును హెడ్ల్యాంప్ కవర్, ఫ్రంట్ ఫెండర్, ఫ్యూయల్ ట్యాంక్, సైడ్ ప్యానెల్స్తో సహా బైక్ ముందు భాగానికి అప్లై చేసింది. దీనికి అనుబంధంగా లైట్ యాష్ కలర్ గ్రాఫిక్స్ను ఉపయోగించారు. అదనంగా, బైక్కు స్పోర్టీ లుక్ ఇవ్వడానికి ముందు అల్లాయ్ వీల్ ఆకుపచ్చ రంగులో, వెనుకది నలుపు రంగులో ఉంటుంది.టీవీఎస్ రైడర్ 125 ఫీచర్లుటీవీఎస్ రైడర్ 125లో ఎల్ఈడీ హెడ్ల్యాంప్లు, టెయిల్ల్యాంప్లు, గ్లైడ్-త్రూ ట్రాఫిక్ టెక్నాలజీ, సైడ్-స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్, ఫాలో-మీ-హోమ్ హెడ్ల్యాంప్లు ఉన్నాయి. 2026 మోడల్లో అతిపెద్ద అప్డేట్ ఏ