21719 వార్తలు

భారత చైనామెన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ఇంగ్లండ్ గడ్డపై మాయాజాలం సృష్టిస్తున్నాడు. అద్భుతమైన బౌలింగ్తో బ్యాట్స్మెన్లకు చుక్కలు చూపిస్తున్నడు. అక్కడ జరుగుతున్న వన్డే కప్లో ఇప్పటివరకూ మూడు మ్యాచులు ఆడిన అతడు ఆరు వికెట్లు తీశాడు. టోర్నీలో తొలి మ్యాచ్లో గ్లామోర్గన్పై 10 ఓవర్లలో 39 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. రెండో మ్యాచ్లో సస్సెక్స్పై 6.5 ఓవర్లలో 58 పరుగులు ఇచ్చి మరో రెండు వికెట్లు తీశాడు. ఆ తర్వాత వోర్సెస్టర్షైర్పై కేవలం 34 పరుగులు ఇచ్చి మరో రెండు వికెట్లు తీశాడు. దీంతో కుల్దీప్ ప్రాతినిథ్యం వహిస్తున్న యార్క్షైర్ జట్టు విజయాలతో దూసుకుపోతుంది.


శ్రీరామ సాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురవడంతో ప్రాజెక్టులోకి 13714 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091అడుగులు 80.501 టీఎంసీల ఉండగా గురువారం మధ్యాహ్నం వరకు 1065.90 అడుగులు 17.243 టీఎంసీలుగా ఉందని ప్రాజెక్టు ఏ.ఈ.ఈ రవి తెలిపారు. ప్రాజెక్టు నుండి ప్రధాన కాలువ కాకతీయ కాలువ కి 300 క్యూసెక్కులు, మంచి నీటి అవసరాలకు 231 క్యూసెక్కులు ,ఆవిరి రూపంలో 220 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నామన్నారు. మొత్తo కలిపి 751 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టు నుండి ఔట్ ఫ్లో ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.గత ఏడాది ఇదే రోజున ప్రాజెక్టు నీటిమట్టం 1077.10 అడుగులు 37.632 టీఎంసీలుగా ఉందని తెలిపారు. ప్రాజెక్టులోకి ఒకటి జూన్ నుండి ఇప్పటివరకు 4.911 టీఎంసీల నీరు వచ్చి చేరిందని. ఒకటి జూన్ నుండి ఇప్పటివరకు 4.287 టీఎంసీల నీరు విడుదల చేశామని అధికారులు అన్నారు.



ఢిల్లీ: సిజెపి ఆందోళనలో పెల్లెట్ గన్స్ వినియోగంపై విచారణకు సుప్రీంకోర్టు సముఖత వ్యక్తం చేసింది. నీట్ పేపర్ లీక్ నిసనల్లో పెల్లెట్ గన్స్ వాడకంపై సుప్రీంకోర్టుకోర్టు ఫైరయింది. విద్యార్థులపై మెటాలిక్ పెల్లెట్లు వాడటంపై వాడీ వేడీ వాదనలు చేశాయి. పెల్లెట్ గన్స్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని దాఖలైన పిటిషిన్ పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. అత్యవసర పరిస్థితుల్లో పెల్లెట్ గన్స్ వాడే అధికారం పోలీసులకు ఉందని తెలిపింది. జూలై 20న మోహరించిన ఆర్ఎఎఫ్ ఆయుధాల లాగ్స్ భద్రపరచాలని, పెల్లెట్ గన్స్ వాడకంపై స్పష్టమైన ప్రోటోకాల్ ఉండాలని, పెల్లెట్ గన్స్ ను నిషేధించలేమని..వాడటానికి స్పష్టమైన రూల్స్ ఉండాలని ఆదేశించింది. నిరసనల్లో హింసను ప్రేరేపించేవారిని అడ్డుకోవడానికే గ్రేడెడ్ రెస్పాన్స్ విధానాన్ని అనుసరిస్తాయని, గాయపడిన బాధితులకు అత్యుత్తమ చికిత్స అందించాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ మంగళవారానికి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.






న్యూఢిల్లీ: 'ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్' వెబ్ సిరీస్ తో గుర్తింపు పొందిన నటి కీర్తి కుల్హారీ సైబర్ మోసానికి గురయ్యారు. ఆన్లైన్ లావాదేవీల ద్వారా ఆమె బ్యాంక్ ఖాతా నుండి సుమారు రూ. 2.40 లక్షలను సైబర్ మోసగాళ్లు కొట్టేశారు. అనుమానాస్పద లావాదేవీలను గమనించిన ఆమె, వెంటనే ముంబై పోలీసుల సైబర్ విభాగంలో ఫిర్యాదు చేశారు.ప్రాథమిక సమాచారం ప్రకారం.. జూలై 24, 2026 రాత్రి అంధేరీలోని ఒక మల్టీప్లెక్స్లో సినిమా చూస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో కీర్తికి, విదేశీ లావాదేవీకి సంబంధించిన బ్యాంక్ అలర్ట్ వచ్చింది. తన క్రెడిట్ కార్డ్ ఉపయోగించి 'ఏరోమెక్సికో ఎయిర్లైన్స్'కు 2,525 అమెరికన్ డాలర్ల చెల్లింపు జరిగిందని ఆ సందేశంలో ఉంది. అకస్మాత్తుగా వచ్చిన ఆ సందేశంతో షాక్కు గురైన కీర్తి కుల్హారీ, వెంటనే బ్యాంకు కస్టమర్ సర్వీస్ విభాగాన్ని సంప్రదించారు. ఆమె కార్డ్ ఉపయోగించి నాలుగు వేర్వేరు లావాదేవీలు జరిగాయని, వాటి మొత్తం విలువ రూ. 2.43 లక్షలకు పైగా ఉందని బ్యాంక్ దర్యాప్తులో తేలింది. తదుపరి నష్టాన్ని నివారించడానికి బ్యాంక్ వెంటనే ఆమె కార్డును బ్లాక్ చేసింది.ఆ తర్వాత ఆమె ముంబై సైబర్ పోలీసులకు సమాచారం అందించింది. కీర







గత మూడు నాలుగు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మరో రెండు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో రాబోయే రెండు రోజులు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ.. దక్షిణ తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. దక్షిణ తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.ఇక, హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. మంగళవారం, బుధవారం నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లు, పలు కాలనీలు చెరువులను తలపించాయి. వరద నీటి ప్రవాహంతో నాలాలు పొంగిపొర్లాయి. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఓపెన్ నాలాలో పడి ప్రాణాలు కోల్పోయాడు. ఇక, గురువారం కూడా కంటిన్యూగా ముసురు పడుతూనే ఉంది.


హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్టులో బుధవారం రాత్రి ల్యాండింగ్ కావాల్సిన ఓ విమానరం టేకాఫ్ అయిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ నుంచి వచ్చిన ఇండిగో విమానం రాత్రి 20 నిమిషాలు గాల్లోనే చక్కర్లు కొట్టింది. ల్యాండింగ్ అయ్యే సమయానికి క్లియరెన్స్ లేకపోవడంతో పైలట్ తిరిగి టేకాఫ్ తీసుకొన్నారు. ఈ విమానంలో సిఎం రేవంత్ రెడ్డి సహా 229 మంది ప్రయాణికులు ఉన్నారు. రాత్రి 8.35 నిమిషాలకు విమానం సురక్షితంగా ల్యాండ్ అవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

