
4340 వార్తలు

నవతెలంగాణ -ఆత్మకూరుఆత్మకూరు మండలం జయశంకర్ గ్రామం అక్కంపేటలోని అంగన్వాడీ సెంటర్లో పోషణ పక్వాడ్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సమాజ మద్దతు పెంపొందించడం, ఆత్మవిశ్వాసంతో పాఠశాలకు సిద్ధం కావడం, పిల్లల విద్య, వైద్యం, పోషణపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డాక్టర్ కె. నరసింగరావు, స్కూల్ టీచర్లు, అంగన్వాడీ హైమావతి, ఏఎన్ఎం సరిత, ఆశలు, వసంత, మాధవి, పిల్లలు పాల్గొన్నారు. మండల పెద్దాపూర్ లోని ఎంజేపీ రెసిడెన్షియల్ స్కూల్లో మండల వైద్యాధికారి డాక్టర్ స్పందన ఆదేశాల మేరకు తల్లిదండ్రుల అంగీకారంతో […] The post అక్కంపేటలో పోషన్ పక్వాడా appeared first on Navatelangana.
నవతెలంగాణ-హైదరాబాద్/ నాచారంమల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కాప్రా సర్కిల్ పరిధిలోని అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యూనియన్కు నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శి టి. కృష్ణ, కార్యనిర్వాహక అధ్యక్షుడు బి. శ్రీధర్, ఉపాధ్యక్షుడు భిక్షపతి, సలహాదారు ఎ. నరేష్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొని కొత్త నాయకత్వాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా బీఎంఎస్ నూతన అధ్యక్షుడిగా బి. రాజ్కుమార్ను ఏకగ్రీవంగా ఎన్నుకోగా, ప్రధాన కార్యదర్శిగా ఎస్. అబ్బులు కొనసాగనున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎ. యాదగిరి, […] The post కాప్రా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యూనియన్కు నూతన కమిటీ appeared first on Navatelangana.
నవతెలంగాణ – మల్హర్ రావుమండలంలోని కొయ్యుర్ గ్రామ ఉప సర్పంచ్ లకావత్ సవేందర్ పుట్టినరోజు వేడుకలు గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యదితిగా సర్పంచ్ కొండ రాజమ్మ హాజరై కేక్ కట్ చేసి స్వీట్స్ పంచిపెట్టి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని, మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజు, జీపీ సిబ్బంది పాల్గొన్నారు. The post కొయ్యుర్ ఉప సర్పంచ్ సవేందర్ పుట్టినరోజు వేడుకలు appeared first on Navatelangana.
నవతెలంగాణ-మిడ్జిల్ మిడ్జిల్ తహశీల్దార్ గా రాఘవేందర్ రెడ్డి గురువారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఇంతకు ముందు మిడ్జిల్ తహశీల్దార్ గా పనిచేసిన పులి రాజు పదోన్నతపై బదిలీ కావడంతో ఆయన స్థానంలో రాఘవెందర్ రెడ్డి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు అందుబాటులో ఉంటూ భూ సమస్యల కోసం కృషి చేస్తానని చెప్పారు. అనంతరం కార్యాలయ సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. The post మిడ్జిల్ తహశీల్దార్ గా రాఘవేందర్ రెడ్డి appeared first on Navatelangana.

ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా వాంఖడే వేదికగా ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. రెండు జట్లు ఐపిఎల్ లో విజయవంతమైనవి. చెరో ఐదు సార్లు టైటిల్ గెలుచుకున్నాయి. కానీ ఐపిఎల్ లో ఈ రెండు జట్లూ తలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ మధ్య ఆసక్తికర సమరం జరగనుంది. చెన్నై జట్టులో బౌలర్ల కొరత తీవ్రంగా వెంటాడుతోంది.


మే నెల 4వ తేదీ టిఎంసి కాలం చెల్లే తేదీ (ఎక్ప్పైరీ డేట్) అవుతుందని ప్రధాని నరేంద్ర మోడీ తేల్చిచెప్పారు. బెంగాల్లో గురువారం ముగిసిన మొదటి రౌండ్ భారీ పోలింగ్ బెంగాల్లో అధికార మార్పిడికి సంకేతాలు ఇస్తోందని మోడీ స్పష్టం చేశారు. మే 4తో ఎన్నికలు అయిపోతాయి. ఓట్ల లెక్కింపుతో టిఎంసి సాగించిన 15 సంవత్సరాల సిండికేట్ వ్యవస్థ, చలాయించిన మహా జంగిల్ రాజ్ కథ ముగుస్తుందని ప్రధాని తెలిపారు. గురువారం ఆయన సౌత్ పరగణా జిల్లాలోని కక్ద్వీప్ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ ప్రాంతం రెండో దఫా పోలింగ్ జరిగే కీలకమైన మథురాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. టిఎంసి సాగించిన భయోత్పాతాల పాలన ఖచ్చితంగా మట్టికరుస్తుంది. ఇకపై బిజెపి వాగ్దానం చేసిన భరోసా హామీతో టిఎంసి చిత్తు కానుందని స్పష్టం చేశారు. ఇప్పుడు జనం పెద్ద ఎత్తున అవినీతి అరాచక పాలనకు వ్యతిరేకంగా ఓటేశారని , త్వరలోనే ఈ విషయం నిర్థారితం అవుతుందని తెలిపారు. ఇన్ని సంవత్సరాల బెంగాల్ పాలనలో టిఎంసి అవినీతి బారిన పడని ఏ ఒక్క రంగం లేదని చురకలు పెట్టారు. అంతటా టిఎంసి సిండికేట్లు , దళారులు దోచుకుతినని రోజు లేదన్నారు. మమత బెనర్జీ పాలనలో తప్పుడు వ




రాష్ట్రంలోని పాఠశాలలకు శుక్రవారం(ఏప్రిల్ 24) నుంచి పాఠశాల విద్యాశాఖ వేసవి సెలవులు ప్రకటించింది. జూన్ 11 వరకు వేసవి సెలవులు ఉంటాయి. 12న పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి. గురువారం చివరి పనిదినం కావడంతో చాలా పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు సంబరాలు చేసుకున్నారు. సుమారు నెలన్నర పాటు విద్యార్థులు సెలవుల్లో సరదాగా గడపనున్నారు.

రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగిన పరిస్థితి తీవ్ర ఆందోళన కలిగిస్తోందని రాంచంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. 41 రోజుల ముందుగానే నోటీసు ఇచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు అన్నారు. కార్మికులు న్యాయమైన డిమాండ్లతో ముందుకు వస్తున్నప్పటికీ, ప్రభుత్వం మొండి వైఖరిని ప్రదర్శించడం విచారకరమని అన్నారు. తమ పార్టీ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పూర్తి మద్దతు ప్రకటిస్తోందని ప్రకటించారు. గతంలో కూడా కార్మికుల పక్షాన నిలిచినట్లే, ఇప్పటికీ వారి హక్కుల కోసం అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం ప్రకటించాలని పిలుపునిస్తున్నానని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించి, వారి డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, కార్మికుల ఫిట్మెంట్ను పెంచాలని, 2017 నుంచి రావాల్సిన పీఆర్సీ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలను విడుదల చేయాలని కోరారు.

కాళేశ్వరం అంశంలో హైకోర్టు తీర్పుపై మాజీ మంత్రులు కెటిఆర్, హరీశ్ రావులు ఎందుకు సంబురాలు చేసుకుంటున్నారని ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. త్వరలోనే సంబురాల రాంబాబులను లోపలేస్తామని ఆయన హెచ్చరించారు. గురువారం ఎంపి చామల కిరణ్కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తన సొంత బ్రాండ్ కోసమే కెసిఆర్ కాళేశ్వరం కట్టారని తెలంగాణ సొమ్మును నాశనం చేశారని ఆయన ఆరోపించారు. బ్రాండ్ కోసమే కెసిఆర్ తట్టెడు అబద్ధాలు, పిట్ట కథలు చెప్పారని ఆయన మండిపడ్డారు. రెండు సంవత్సరాలకే కాళేశ్వరం ఎందుకు కుంగిపోయిందని ఎంపి ప్రశ్నించారు. ‘24 గంటల్లో సినిమా చూపిస్తామన్న బిజెపి ఎక్కడికి పోయిందని, సిబిఐ విచారణ ఎందుకు ఆలస్యం అవుతోందని, బిజెపి నాయకులు వెంటనే సిబిఐతో విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. మానిపోయిన గాయానికి మళ్లీ మందు పెట్టేందుకు కెసిఆర్ బయటకు వచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. కెటిఆర్, హరీశ్రావులు ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు. హైకోర్టు తీర్పుపై బిఆర్ఎస్ నాయకులు అబద్ధాలు చెబుతున్నార న్నారు. కాళేశ్వరం కేసులో హైకోర్టు ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదని ఎంపి తెలిపారు. కాళేశ్వరంలో దోపిడీ చేసిన వాళ్లను వ


హైదరాబాద్: రాష్ట్ర కేబినేట్ సమావేశం కొనసాగుతోంది. ఈ భేటీలో కాళేశ్వరంలో లోపాలపై పిసి ఘోష్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టులో సవాల్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసురకుంది. భేటీలో మరికొన్ని కీలక అంశాలపై కూడా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం నడుస్తున్న ఆర్టిసి సమ్మె, అదే విధంగా గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకం జరిపే అంశం, ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలపైనా మంత్రి వర్గంలో చర్చించనున్నట్లు సమాచారం. ఇందిరమ్మ కుటుంబ భీమా విధానాలు, మెట్రో స్వాధీన పరుచుకోవడంతో పాటు దాని నిర్వహణపై చర్చ జరుగనున్నట్లు తెలుస్తోంది.

సైడ్ ఇంచార్జ్ రవికుమార్ రెడ్డి నేతృత్వంలో కార్మికుల సహకారంతో ఈ పనులు నిర్వహించబడినట్లు తెలిపారు. ఈ చర్యలు వాహనదారులకు భద్రతను కల్పించడంతో పాటు రహదారిపై సాఫీగా రాకపోకలు సాగేందుకు దోహదపడతాయని ఆయన నవ తెలంగాణతో పేర్కొన్నారు. The post జాతీయ రహదారిపై భద్రతా చర్యలు appeared first on Navatelangana.
నవతెలంగాణ – మల్హర్ రావుమంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మదుకర్ చిత్రపటానికి బిఆర్ఎస్ నాయకులు పాలాభిషేకం చేశారు. మండలంలోని కిషన్ రావుపల్లి గ్రామం నుండి భూపాలపల్లి మైన్ 1ఇంక్లైన్ బొగ్గు బావి వరకు పారెస్ట్లో రోడ్డు రవాణా సౌకర్యం కోసం పుట్ట మధు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తన కృషి వల్లనే రోడ్డు మార్గం ఏర్పడిందని, ఆ విషయాన్ని మంథని నియోజకవర్గ ప్రజలకు తెలియజేయడానికి గురువారం పాలాభిషేకం చేపట్టినట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు […] The post మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు చిత్రపటానికి పాలాభిషేకం appeared first on Navatelangana.

నవతెలంగాణ – జుక్కల్జుక్కల్ మండల కేంద్రంలో మరియు మహ్మదాబాద్,లాడేగావ్ గ్రామాల్లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీ కాంతారావు గురువారం పాల్గొని ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకి శాలువా కప్పి సత్కరించిన ఎమ్మెల్యే వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో ని అన్ని మండలాల్లో విస్తారంగా నిబంధన ప్రకారం గృహాలు లేని నిరు పేదవారికి గృహాలు మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు. అర్హులను గుర్తించి […] The post ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే appeared first on Navatelangana.
నవతెలంగాణ – జుక్కల్మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జుక్కల్ మండలానికి చెందిన అన్ని శాఖల అధికారులతో పాటు గ్రామ పంచాయతీ సర్పంచులతో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు ప్రక్రియలో భాగంగా ఆన్లైన్ సర్వే కారణంగా లబ్ధిదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై సవివరంగా చర్చించడం జరిగింది. పెండింగ్లో ఉన్న సర్వేలను తక్షణమే పూర్తి చేసి, అర్హులైన ప్రతీ లబ్ధిదారునికి ఇళ్లు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. […] The post సర్పంచులు, అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం appeared first on Navatelangana.

వేసవి కాలంలో చెరకు రసం ఉపశమనాన్ని అందిస్తుంది. కాబట్టి అందరూ దీనిని తాగడానికి ఇష్టపడుతుంటారు. ఈ జ్యూస్ శరీరానికి తాజాదనాన్ని ఇస్తుందని, దానిలోని ఫైబర్ ప్రయోజనకరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే, కొందరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా చెరకు రసాని తాగకూడదని హెచ్చరిస్తున్నారు. డయాబెటిస్, రక్తంలో అధిక రక్త చక్కెర స్థాయిలు ఉన్నవారు చెరకు రసానికి దూరంగా ఉండాలంటున్నారు. ఎందుకంటే? ఈ రసంలో అధిక మొత్తంలో సహజ చక్కెర ఉంటుంది. ఇది రక్తంలో షుగర్ లెవెల్స్ ని అకస్మాత్తుగా పెంచుతుంది. కాబట్టి చెరకు రసం తాగితే మధుమేహ రోగుల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే ప్రమాదం ఉంటుంది.అంతేకాకుండా, అధిక బరువు ఉన్నవారు కూడా చెరకు రసాని తాగడం మానుకోవాలి. ఫలితంగా చెరకు రసంలో కేలరీలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో చక్కెర స్థాయిలను కూడా వేగంగా పెంచుతాయి. కాబట్టి ఈ రెండూ అధిక బరువు ఉన్న వ్యక్తులకు మంచివి కావు. అలా అని ఊబకాయం ఉన్నవారు చెరకు రసాన్ని అస్సలు తాగకూడదని అర్థం కాదు. వారానికి ఒక గ్లాసు చెరకు రసం తాగవచ్చు.తరచుగా అజీర్ణం, కడుపు నొప్పి లేదా అధిక గ్యాస్తో బాధపడేవారు కూడా చెరకు రసం తాగడం మానుకోవాలి. ఎందుకంటే ఈ రసం