21699 వార్తలు


అమరావతి: శ్రీకాకుళంలో మాజీ సిఎం వైసిపి జగన్ మోహన్ రెడ్డి ఎవరిని పరామర్శిస్తున్నారో, ఎవరిని కాపాడుతున్నారో అందరికీ తెలుసు అని మంత్రి కొలుసు పార్థసారధి తెలిపారు. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి బంధువులను పరామర్శించాలని అన్నారు. శ్రీకాకుళం జిల్లా కొత్తరోడ్డు జంక్షన్ కు జగన్ చేరుకున్నారు. కాన్వాయ్ కొత్త రోడ్డు జంక్షన్ దగ్గర భారీ బందోబస్తు, అంపోలు జంక్షన్ వద్ద మూడెంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంగళగిరిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శ్రీకాకుళంలో మహిళా ఎస్ఐపై దౌర్జన్యం చేశారని, జగన్ వెళ్లే దారిలోనే ప్రధాని మోడీ పర్యటన ఉందని తెలియజేశారు. ప్రధానికి భద్రత కల్పించే దారిలో ఆందోళనలు చేయకూడదని, జగన్ పర్యటనలో ధర్నాలు, ర్యాలీలు, సభకు అనుమతి లేదని పార్థసారధి సూచించారు. పోలీసులపై దాడి చేసే స్థాయికి వైసిపి నేతలు వెళ్లారని, వైసిపి వెంట వెళ్లే యువకుల తల్లిదండ్రులు భయపడుతున్నారని విమర్శించారు. కానిస్టేబుళ్లను దూరం జరిపి మరీ మహిళా ఎస్ఐపై దాడికి దిగారని, భయపెట్టి అధికారంలోకి వచ్చేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలకు తావులేదని పార్థసారధి హెచ్చరించారు.

న్యూఢిల్లీ: ‘వందేమాతరం’ బిల్లుకు లోక్సభ ఆమోద ముద్ర వేసింది. విపక్షాల ఆందోళనల మధ్యే మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందింది. ఈ బిల్లును బుధవారం రాజ్యసభ ఆమోదించిన విషయం తెలిసిందే. వందేమాతర గేయాన్ని అవమానించినా, ఆలపిస్తుండగా ఆటంకం కలిగించినా నేరంగా పరిగణించేందుకే కేంద్రం ఈ బిల్లును తీసుకొచ్చింది. వందేమాతరం బిల్లులో భాగంగా ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్-1971లో సవరణలు చేసింది. రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత ఇది చట్టంగా మారనుంది. ప్రస్తుతం జాతీయ గీతమైన జనగణమనకు ఉన్న చట్టపరమైన రక్షణను వందేమాతరానికీ వర్తింపజేయడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. మరోవైపు ఈ బిల్లుపై ఓటింగ్ ముగిసిన తర్వాత స్పీకర్ ఓం బిర్లా సభను రేపటికి వాయిదా వేశారు.





ఢిల్లీ: పేపర్ లీకేజీ వల్ల నష్టమేపోయేది విద్యార్థులు అని ఎఐసిసి మల్లిఖార్జున ఖర్గే తెలిపారు. విద్యార్థుల ఆవేదనను అందరం అర్థం చేసుకోవాలని అన్నారు. రాజ్యసభలో సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా యాంటీ పేపర్ లీకేజీ విషయంపై ఖర్గే ప్రసంగించారు. నీట్ పేపర్ లీక్ వల్ల చాలామంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని, పేపర్ లీక్ కాకుండా ఏమాత్రం ముందస్తు చర్యలు చేపట్టలేదని ఖర్గే విమర్శించారు. 2024 లోనే ఈ ప్రభుత్వం బిల్లు ఎందుకు తీసుకురాలేదని, విద్యార్థులకు జరిగిన నష్టాన్ని ఎవరు భర్తీ చేయాలి? అని పేపర్ లీక్ వల్ల విద్యార్థులు నష్టపోవాలా? అని ప్రశ్నించారు. పేపర్ లీక్ అనేది తలదించుకోవాల్సిన అంశం అని ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి ప్రధాని నరేంద్ర మోడీ కుర్చీ కాపాడారని ఖర్గే మండిపడ్డారు. ఢిల్లీలో నిరసన చేసిన విద్యార్థులపై లాఠీఛార్జి చేశారని, విద్యార్థులపై బాష్పవాయువు ప్రయోగించారని ఆవేదనవ్యక్తం చేశారు. పోలీసుల చర్యలపై ఇంతవరకు హోమంత్రి అమిత్ షా ఎలాంటి ప్రకటన లేదని, పోలీసులు వ్యవహరించిన తీరుపై అమిత్ షా ఎందుకు మౌనంగా ఉన్నారు? అని ప్రశ్నించారు. ఇంతటి దారుణానికి కారణం ఎవరో తేలాల్సి ఉందని, ఈ దారుణమైన ఘటనకు అమ





న్యూఢిల్లీ: ప్రశ్న పత్రాల లీకేజీ నిరోధానకి ప్రభుత్వం తీసుకొచ్చిన ‘పబ్లిక్ పరీక్షల సవరణ బిల్లు 2026’ రాజ్యసభ ముందుకు వచ్చింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ దీనిని సభలో ప్రవేశపెట్టారు. దీనిపై ఏడు గంటలపాటు చర్చించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా జితేంద్ర సంగ్ మాట్లాడుతూ.. ప్రశ్నపత్రాల లీకులను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని, ఏ మాత్రం సహించే ప్రసక్తే లేదన్నారు. పిల్లల భవిష్యతును ప్రమాదంలో పడేయడాన్ని అనుమతించబోమన్నారు. దేశంలోని విద్యార్థులు, యువత సంక్షేమాన్ని పరిరక్షించడంతో ప్రభుత్వ నిబద్ధతకు ఈ బిల్లు నిదర్శనమని చెప్పారు. ఈ బిల్లును తీసుకురావడానక ప్రధాని ఏ మాత్రం ఆలస్యం చేయలేదని వెల్లడించారు.





చిలకలూరిపేట: పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో మద్యం మత్తులో ఓ యువకుడు కారుతో బీభత్సం సృష్టించాడు. గడియారం స్తంభం సెంటర్ నుంచి కళామందిర్ సెంటర్ వరకు అతివేగంగా కారు నడుపుతూ రోడ్డుపై వెళ్తున్న ద్విచక్ర వాహనాలు, పాదచారులను ఢీకొడుతూ వెళ్లాడు. దీంతో ప్రజలు భయాందోళనతో పరుగులు తీశారు. ఈ ఘటనలో గాయపడిన క్షతగాత్రులను చిలకలూరిపేట ప్రభుత్వ అసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కారు నడిపిన యువకుడిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు.



హైదరాబాద్: విద్యలో నాణ్యత పెరగాలని, ప్రపంచంతో మనపిల్లలు పోటీ పడాలని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. విద్య అందింది, ఆకలి తీరింది.. కానీ ప్రపంచంతో పోటీ పడటానికి ఇది సరిపోదని అన్నారు. ఫిన్లాండ్, జర్మనీ టీచర్ ఎక్సైంజ్ కార్యక్రమానికి సిఎం, ఉపాధ్యాయులు సమావేశంలో హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రెసిడెన్సియల్ స్కూల్స్ ఎప్పుడు ప్రారంభమయ్యయో అధ్యయనం చేయండని సూచించారు. ప్రభుత్వాలు సాధారణంగా ఓటుకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటాయని, ఏ ప్రభుత్వంలో నియామకాలు జరిగాయి? అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చాక కూడా రాజకీయాలు చేయద్దని తమ ఆలోచన అని కోరారు. వెనుకబాటు తనానికి ఆస్తికి సంబంధం లేదని, కానీ పిల్లలను చదివించుకోలేక కొంత ఇబ్బందిపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదాయం పెంచాలి, ప్రజలకు పంచాలి.. అదే తమ ఆలోచన అని బడ్జెట్ లో విద్యకు 9 శాతం ఖర్చు చేస్తున్నామని తెలియజేశారు. ఒక్కో విద్యార్థిపై రూ. లక్షా8 వేలు ఖర్చు చేస్తున్నామని, ఆస్తి ఉన్నా, చదువుకోలేక ఇబ్బంది పడుతున్న వాళ్లు ఉన్నారని, యాదవ, కురుమ సోదరులకు ఆస్తి ఉంటుందని రేవంత్ పేర్కొన్నారు. మంచిగా పని చేసినందుకు తాను విద్యాశాఖ మంత్రిగా ర

