
4328 వార్తలు


ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా వాంఖడే వేదికగా ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. సంజు శాంసన్ (101:54 బంతుల్లో 10 ఫోర్లు,6 సిక్స్ లు ) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. చివరి బంతికి ఫోర్ కొట్టి సెంచరీ చేశాడు. ఈ సీజన్ లో సంజుకి రెండో సెంచరీ ఇది. ముంబయి బౌలర్లలో అశ్వని కుమార్ 2,అల్లా ఘజన్ఫర్ 2,జస్ప్రీత్ బుమ్రా, మిచెల్ శాంట్నర్ తలో వికెట్ తీశారు.



డిఫరెంట్ ఎంటర్టైనర్స్ చేస్తున్న తరుణ్ భాస్కర్... రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్తో కలిసి ’గాయపడ్డ సింహం’ తో అలరించబోతున్నారు. ఈ చిత్రాన్ని పవన్ సాదినేని సమర్పణలో, కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ సప్తస్వ మీడియా వర్క్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్ల పై నిర్మించారు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలుగా నటించారు. జేడి చక్రవర్తి కీలక పాత్ర పోషించారు. గాయపడ్డ సింహం మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా యాక్టర్ జేడి చక్రవర్తి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “కమల్ హాసన్ చేసిన క్యారెక్టర్లు ప్రపంచంలో ఎవ్వరూ చేయలేదు. అయితే ‘గాయపడ్డ సింహం’లో యాక్టర్గా కాదు, క్యారెక్టర్ పరంగా ఆయనకు రాని అదృష్టం నాకు వచ్చిందని భావిస్తున్నాను. అలాంటి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఇందులో చేశాను. ఒకే క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్లో ఒక షేడ్, సెకండ్ హాఫ్లో మరో షేడ్ ఉండటం మామూలే. కానీ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ రెండింటిలో ఒకే విధంగా కనిపిస్తూ, రెండు షేడ్స్ లో కనిపించడం నాకు చాలా ఆనందాన్నిచ్చింది. అది ఎలా అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. కథ
నవతెలంగాణ హైదరాబాద్: భారతదేశంలో తొలి ఆన్-డిమాండ్ కన్వీనియెన్స్ ప్లాట్ ఫాం స్విగ్గీ (NSE: SWIGGY/BSE: 544285), తమ అతి పెద్ద దేశవ్యాప్త ఎడిషన్ లో భాగంగా స్విగ్గీ రెస్టారెంట్ అవార్డ్స్ 2026 యొక్క హైదరాబాద్ విజేతలను ప్రకటించింది. ఈ అవార్డ్స్ కు 6.43 లక్షల విలక్షమమైన యూజర్లు నుండి అద్భుతమైన 1.3 కోట్లకు పైగా వోట్లు వచ్చాయి, ఇది గత ఏడాది కంటే 2.2 రెట్లు పెరుగుదలను సూచించింది, ఇప్పటి వరకు అతి పెద్ద ఎడిషన్ గా […] The post స్విగ్గీ రెస్టారెంట్ అవార్డ్స్: రికార్డ్ స్థాయిలో 1.3 కోట్లకు పైగా ఓట్లతో వెల్లడైన హైదరాబాద్ లోని అత్యంత ఇష్టమైన రెస్టారెంట్లు appeared first on Navatelangana.
డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నాగపూర్ మధునవతెలంగాణ- అచ్చంపేటకాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా యూత్ డిక్లరేషన్ ప్రకటించి ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే ప్రకటించాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) జిల్లా కార్యదర్శి నాగపూర్ మధు డిమాండ్ చేశారు. గురువారం అచ్చంపేటలో పట్టణ కమిటీ సమావేశం నిర్వహించారు. మధు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన యూత్ డిక్లరేషన్ వెంటనే అమలు చేసి ఉద్యోగ నోటిఫికేషన్ వెయ్యాలని ఆయన […] The post ప్రభుత్వం ఎన్నికల హామీల జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి appeared first on Navatelangana.
నవతెలంగాణ-అచ్చంపేటహై రిస్క్ డెలివరీ కేసును అచ్చంపేట కేర్ హాస్పిటల్ వైద్యులు గురువారం సురక్షితంగా పూర్తి చేశారు. బల్మూర్ మండలం, పోలిశెటిపల్లి గ్రామానికి చెందిన ఓ గర్భిణి బరువు 108 కిలోలు , బీపీ 170/130 వంటి తీవ్రమైన హైపర్ టెన్షన్, బి ఏం ఐ – 48 వంటి ఒబేసిటీ, G5P2L2A2, గతంలో 2 సిజేరియన్ సెక్షన్స్ మరియు 1 హిస్టోటమీ హిస్టరీతో 37 వారాల గర్భధారణ తో గురువారం పట్టణంలోని కేర్ ఆస్పత్రిలో అడ్మిషన్ అయ్యారు. డా. అమ్రీన్ తన నైపుణ్యంతో ఎలెక్టివ్ […] The post హై రిస్క్ డెలివరీ కేస్ను సేఫ్గా చేసిన డా.అమ్రీన్ appeared first on Navatelangana.



టిజిఎస్ఆర్టీసి కార్మికుల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించి సమ్మె విరమింప చేయాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు తాము పూర్తి మద్దతును ఇస్తున్నామని ప్రకటించారు. సమస్యలు పరిష్కరించే వరకు, సమ్మె జరిగినన్ని రోజులు తమ పార్టీ అండగా ఉంటుందని వెల్లడించారు. సికింద్రాబాద్ పరిధిలోని సీతాఫల్ మండిలో గురువారం పర్యటించిన కిషన్రెడ్డి ఆయా ప్రాంతంలోని అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి పలు అభివృద్ధి పనులపై సమీక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,000కు పైగా అంగన్వాడీలను అప్గ్రేడ్ చేస్తున్నామని, వీటిలో ఎల్ఈడీ స్క్రీన్లు, వాటర్ ఫిల్టర్లు వంటి ఆధునిక వసతులు కల్పిస్తున్నామని కిషన్రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని ఎన్నికల హామీల్లో చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎందుకు చర్యలు చేపట్టలేదని ప్రశ్నించారు. ఈ విషయంలో ఇంతవరకూ ఒక్క అడుగు కూడా పడలేదని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే


నవతెలంగాణ -ఆత్మకూరుఆత్మకూరు మండలం జయశంకర్ గ్రామం అక్కంపేటలోని అంగన్వాడీ సెంటర్లో పోషణ పక్వాడ్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సమాజ మద్దతు పెంపొందించడం, ఆత్మవిశ్వాసంతో పాఠశాలకు సిద్ధం కావడం, పిల్లల విద్య, వైద్యం, పోషణపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డాక్టర్ కె. నరసింగరావు, స్కూల్ టీచర్లు, అంగన్వాడీ హైమావతి, ఏఎన్ఎం సరిత, ఆశలు, వసంత, మాధవి, పిల్లలు పాల్గొన్నారు. మండల పెద్దాపూర్ లోని ఎంజేపీ రెసిడెన్షియల్ స్కూల్లో మండల వైద్యాధికారి డాక్టర్ స్పందన ఆదేశాల మేరకు తల్లిదండ్రుల అంగీకారంతో […] The post అక్కంపేటలో పోషన్ పక్వాడా appeared first on Navatelangana.
నవతెలంగాణ-హైదరాబాద్/ నాచారంమల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కాప్రా సర్కిల్ పరిధిలోని అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యూనియన్కు నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శి టి. కృష్ణ, కార్యనిర్వాహక అధ్యక్షుడు బి. శ్రీధర్, ఉపాధ్యక్షుడు భిక్షపతి, సలహాదారు ఎ. నరేష్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొని కొత్త నాయకత్వాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా బీఎంఎస్ నూతన అధ్యక్షుడిగా బి. రాజ్కుమార్ను ఏకగ్రీవంగా ఎన్నుకోగా, ప్రధాన కార్యదర్శిగా ఎస్. అబ్బులు కొనసాగనున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎ. యాదగిరి, […] The post కాప్రా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యూనియన్కు నూతన కమిటీ appeared first on Navatelangana.
నవతెలంగాణ – మల్హర్ రావుమండలంలోని కొయ్యుర్ గ్రామ ఉప సర్పంచ్ లకావత్ సవేందర్ పుట్టినరోజు వేడుకలు గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యదితిగా సర్పంచ్ కొండ రాజమ్మ హాజరై కేక్ కట్ చేసి స్వీట్స్ పంచిపెట్టి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని, మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజు, జీపీ సిబ్బంది పాల్గొన్నారు. The post కొయ్యుర్ ఉప సర్పంచ్ సవేందర్ పుట్టినరోజు వేడుకలు appeared first on Navatelangana.
నవతెలంగాణ-మిడ్జిల్ మిడ్జిల్ తహశీల్దార్ గా రాఘవేందర్ రెడ్డి గురువారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఇంతకు ముందు మిడ్జిల్ తహశీల్దార్ గా పనిచేసిన పులి రాజు పదోన్నతపై బదిలీ కావడంతో ఆయన స్థానంలో రాఘవెందర్ రెడ్డి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు అందుబాటులో ఉంటూ భూ సమస్యల కోసం కృషి చేస్తానని చెప్పారు. అనంతరం కార్యాలయ సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. The post మిడ్జిల్ తహశీల్దార్ గా రాఘవేందర్ రెడ్డి appeared first on Navatelangana.

ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా వాంఖడే వేదికగా ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. రెండు జట్లు ఐపిఎల్ లో విజయవంతమైనవి. చెరో ఐదు సార్లు టైటిల్ గెలుచుకున్నాయి. కానీ ఐపిఎల్ లో ఈ రెండు జట్లూ తలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ మధ్య ఆసక్తికర సమరం జరగనుంది. చెన్నై జట్టులో బౌలర్ల కొరత తీవ్రంగా వెంటాడుతోంది.


మే నెల 4వ తేదీ టిఎంసి కాలం చెల్లే తేదీ (ఎక్ప్పైరీ డేట్) అవుతుందని ప్రధాని నరేంద్ర మోడీ తేల్చిచెప్పారు. బెంగాల్లో గురువారం ముగిసిన మొదటి రౌండ్ భారీ పోలింగ్ బెంగాల్లో అధికార మార్పిడికి సంకేతాలు ఇస్తోందని మోడీ స్పష్టం చేశారు. మే 4తో ఎన్నికలు అయిపోతాయి. ఓట్ల లెక్కింపుతో టిఎంసి సాగించిన 15 సంవత్సరాల సిండికేట్ వ్యవస్థ, చలాయించిన మహా జంగిల్ రాజ్ కథ ముగుస్తుందని ప్రధాని తెలిపారు. గురువారం ఆయన సౌత్ పరగణా జిల్లాలోని కక్ద్వీప్ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ ప్రాంతం రెండో దఫా పోలింగ్ జరిగే కీలకమైన మథురాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. టిఎంసి సాగించిన భయోత్పాతాల పాలన ఖచ్చితంగా మట్టికరుస్తుంది. ఇకపై బిజెపి వాగ్దానం చేసిన భరోసా హామీతో టిఎంసి చిత్తు కానుందని స్పష్టం చేశారు. ఇప్పుడు జనం పెద్ద ఎత్తున అవినీతి అరాచక పాలనకు వ్యతిరేకంగా ఓటేశారని , త్వరలోనే ఈ విషయం నిర్థారితం అవుతుందని తెలిపారు. ఇన్ని సంవత్సరాల బెంగాల్ పాలనలో టిఎంసి అవినీతి బారిన పడని ఏ ఒక్క రంగం లేదని చురకలు పెట్టారు. అంతటా టిఎంసి సిండికేట్లు , దళారులు దోచుకుతినని రోజు లేదన్నారు. మమత బెనర్జీ పాలనలో తప్పుడు వ


