
4327 వార్తలు
– హిందూత్వ వ్యూహంలో ‘సర్’ భాగస్వామి– జట్టులో చేరిన రిఫరీలా సీఈసీ– నియోజకవర్గాల పునర్విభజన ఓ రాజకీయ కుతంత్రం– బెంగాల్లో లెఫ్ట్ఫ్రంట్ తన బలాన్ని ప్రదర్శిస్తుంది : సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీకోల్కతా : బీజేపీ ప్రణాళికలలో నియంత హిట్లర్ ముద్రలు కన్పిస్తున్నాయని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ వ్యాఖ్యానించారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌరుల రిజిస్టర్ (ఎన్నార్సీ) యత్నాలను ఆయన నాజీ జర్మనీతో పోల్చారు. ఫాసిస్టు, మెజారిటీవాద హిందూత్వ దేశాన్ని […] The post మోడీ, షా తీరులో హిట్లర్ ముద్రలు appeared first on Navatelangana.

– తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో రికార్డు స్థాయిలో ఓటింగ్– బెంగాల్లో ఘర్షణలు.. పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తం– ఓటేసిన సినీతారలు, ప్రముఖులు న్యూఢిల్లీ: తమిళనాడు, పశ్చిమబెంగాల్(తొలివిడత) అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. గతంతో పోల్చితే పశ్చిమబెంగాల్లో 91.35 శాతం నమోదైనట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. తమిళనాడులో 82.24శాతం పోలింగ్ నమోదైంది. చెన్నైలో 84.29 శాతం పోలింగ్ నమోదు కాగా బెంగాల్లోని దక్షిణ్ దినాజ్పూర్లో అత్యధికంగా 93.12శాతం […] The post పోలింగ్ ప్రశాంతం appeared first on Navatelangana.

మేషంనూతన వస్తు వాహన లాభాలు పొందుతారు. బంధు మిత్రులు నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేస్తారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఆర్థికంగా పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపార ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.వృషభందూర ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. చేపట్టిన పనులలో మరింత ఒత్తిడి పెరుగుతుంది. బంధు మిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. వృత్తి వ్యాపారములలో అలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు విశ్రాంతి లేకుండా చేస్తాయి.మిధునంనూతన వ్యక్తులతో పరిచయాలు విస్తృతమౌతాయి. సోదరుల నుండి ధన సహాయం లబిస్తుంది. చేపట్టిన వ్యవహారాలలో కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. దూరపు బంధువులతో గృహమున ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలలో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు లభిస్తాయి.కర్కాటకంసమాజంలో పెద్దవారి నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఋణగ్రస్తుల నుండి రావలసిన ధనం సకాలంలో అందుతుంది. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారములలో సమస్యలు అధిగమిస్తారు. ఆకస్మి
– సూర్యాపేట జిల్లాలో దారుణం.!నవతెలంగాణ – సూర్యాపేట: మోత మండలం రాఘవాపురం గ్రామ శివారులో గుర్తుతెలియని వ్యక్తులు కర్రలతో దాడి చేయడంతో తీవ్ర గాయాల పాలయ్యారు. గమనించిన స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఫ్లోరైడ్ బాధితుల కోసం, సాగునీటి కోసం, రైతుల హక్కుల కోసం, ఎన్నో ఏళ్లుగా పోరాడిన ప్రజా ఉద్యమకారుడు పై దాడి జరగడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. తన భూమిని అడవిగా మార్చి పర్యావరణ పరిరక్షణకు నాంది పలికిన వ్యక్తిపై ఈ దాడి చేయడం అమానుషమని […] The post జలసాధన సమితి వ్యవస్థాపకుడు దుశ్చర్ల సత్యనారాయణపై దాడి… appeared first on Navatelangana.

ఐపిఎల్లో భాగంగా చిరకాల ప్రత్యర్థి ముంబై ఇండియన్స్తో జరిగిన కీలక మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్కె) 103 పరుగుల తేడాతో రికార్డు విజయాన్ని నమోదు చేసింది. గురువారం వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. ఓపెనర్ సంజు శాంసన్ 54 బంతుల్లోనే 10 ఫోర్లు, ఆరు సిక్సర్లతో అజేయంగా 101 పరుగులు చేశాడు. దీంతో సిఎస్కె భారీ లక్ష్యాన్ని ముంబై ముందు ఉంచింది. తర్వాత బ్యాటింగ్కు దిగిన ముంబై 19 ఓవర్లలో 104 పరుగులకే కుప్పకూలింది. అకిల్ హుస్సేన్ నాలుగు వికెట్లు తీసి సిఎస్కెను గెలిపించాడు.
విద్య, ఆరోగ్యం, ఉపాధి లాంటి విషయాలు ఈ ప్రభుత్వ హయాంలో అటకెక్కాయి. ద్వేషం సర్వోన్నతంగా పెంచి పోషించ బడుతూ ఉంది. అజ్మీరు దర్గా కింద శివాలయం ఉందన్న కారణంతో ప్రభుత్వం సర్వేలు చేయిస్తోంది. ప్రభుత్వం చేసే పిచ్చిపనులకు న్యాయస్థానాలు కూడా వంతపాడు తూ ఉండడం వల్ల, దేశం ప్రమాదస్థితికి చేరింది. -ఎస్.ఇర్ఫాన్ హబీబ్, ప్రసిద్ధ చరిత్రకారుడు. దేశంలో విద్వేష ప్రచారం ఎలా ప్రారంభమై ందో, అది ఒక విధానంగా ఎలా స్థిరపడిందో, క్రమక్రమంగా అది ఎలా ప్రకోపిస్తూ […] The post దేశ నాయకుల విద్వేష ప్రసంగాలపై ఒక సర్వే appeared first on Navatelangana.
సింగరేణి సంస్థను పరిరక్షించడానికి బదులు పాలకులే భక్షించి దివాలా తీయించడానికి కంకణం కట్టుకున్నారు. 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ అనుసరించిన బాటనే 2024-2025 సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒకడుగు ముందుకు వేసి అందినకాడికి కాజేస్తున్నది. ఫలితంగా సింగరేణి కార్మికులు, సింగరేణి జిల్లాల ప్రజలు, నిరుద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారింది. ముఖ్యంగా సింగరేణి ఉత్పత్తి చేసి సరఫరా చేసిన బొగ్గు, విద్యుత్ బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకపోవడంతో దినదిన గండంగా తయారైంది. తెలంగాణ పవర్ జనరేషన్ కార్పొరేషన్ […] The post సింగరేణిని దివాళా తీయిస్తున్న సర్కార్ appeared first on Navatelangana.
ఇరాన్పై అమెరికా-ఇజ్రాయిల్ జరుపుతున్న యుద్ధంలో ఇప్పటివరకు చమురు క్షేత్రాలపై దేశాలు పరస్పరం దాడి చేసుకున్నాయి. ఇరాన్ హార్ముజ్ జలసంధి ద్వారా వెళ్లే చమురు సరఫరాలను అడ్డుకోవటం వలన ప్రపంచం ఇప్పుడు తీవ్ర ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దీనికి పూర్తి బాధ్యత అమెరికాదే! అకారణంగా యుద్ధాన్ని ప్రజలపై రుద్దింది ఆ దేశమే కాబట్టి. ఇప్పటికే ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ అయితే జరిగింది. కానీ, ఓడిపోతున్నామనే ఆందోళనలో ట్రంప్ రోజుకో వ్యాఖ్య, పూటకోమాట మాట్లాడుతున్నాడు. నిన్న మొన్న చేసిన […] The post ఇరాన్ టార్గెట్ అదేనా? appeared first on Navatelangana.

స్టేట్ బ్యాం క్ ఆఫ్ ఇండియాలో శాలరీ అకౌంట్ ఉన్న సింగరేణి ఉద్యోగులకు ఇకపై సహజ మర ణానికీ పది లక్షల ఉచిత బీమా సదుపా యం కలుగనుంది. ఈ మేరకు సింగరేణి కా లరీస్ కంపెనీ లిమిటెడ్ గురువారం హైద రాబాద్ సింగరేణి భవన్లో ఎస్బిఐతో గ్రూ ప్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఒప్పందం కుదు ర్చుకుంది. ఇప్పటివరకు కేవలం ప్రమాదా ల్లో మృతి చెందిన వారికి మాత్రమే ఎస్బిఐ కోటి బీమా అందిస్తుంది. సిఎండి బుద్దప్రకా ష్ జ్యోతి ఆదేశాలు, డైరెక్టర్ పర్సనల్, ఫైనా న్స్ గౌతమ్ పోట్రు ప్రత్యేక చొరవతో సహజ మరణ బీమాను కూడా అమలు చేసేందుకు ఎస్బిఐ అంగీకరించింది. ఈ పథకంతో సం స్థలోని 40 వేల మంది ఉద్యోగులకు ప్రయో జనం చేకూరనుంది. డైరెక్టర్ ఆపరేషన్స్ ఎల్.వి. సూర్యనారాయణ, డైరెక్టర్ ప్లానిం గ్, ప్రాజెక్ట్ కె. వెంకటేశ్వర్లు సమక్షంలో జీ ఎం పర్సనల్ కిరణ్ కుమార్, ఎస్బీఐ డిజి ఎం సిఎస్పి నీలాక్షి సింగ్ ఒప్పందంపై సం తకాలు చేశారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ టి. శ్రీనివాస్, జనరల్ మేనేజర్ (ప ర్సనల్) కిరణ్ కుమార్, డిజిఎం (పర్సనల్) సత్యనారాయణ, ఎస్బిఐ అసిస్టెంట్ జనర ల్ మేనేజర్ మురళీకృష్ణ, సీనియర్ అధికారి సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మన తెలంగాణ/హైదరాబాద్ : గత వారం రోజులుగా ఉదయం ఎండ, సాయంత్రం చల్ల ని వాతావరణ వరణంతో గడిపిన ప్రజలకు తె లంగాణ వెధర్మ్యాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ నెల 24 నుంచి 29 వరకు ఉత్తర తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. శుక్రవారం నుంచి ఆరు రోజుల పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, హైదరాబాద్ నగరంలో సైతం 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపారు. రాష్ట్రంలో శుక్రవారం నుంచి మరోసారి తీవ్ర వడగాలులు విరుచుకుపడనున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్తో హెచ్చరించారు. వేడి ప్రభావంతో అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు పడినా ఉపశమనం ఉండదని, తేమ పె రిగి ఉక్కపోత మరింత ఎక్కువవుతుందని తె లిపారు. దీంతో పాటు హైదరాబాద్ వాతావర ణ కేంద్రం సైతం రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు అత్యధిక జిల్లాల్లో 41 డిగ్రీలపై గా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, పలు జిల్లా ల్లో రెండు రోజుల పాటు 43 డిగ్రీలపైగా చేరే అవకాశం ఉందని, 30 జిల్లాలకు ఆరెంజ్ అల ర్ట్ జారీ చేసింది. వడగాల్పుల నేపథ్యంలో ప్రజ లు అప్రమత్తంగా ఉండాలని, మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయట కు రాకుండా జాగ్రత్

పశ్చిమాసియాలో తనకు కొరకరాని కొయ్యగా ఉన్న ఇరాన్ను మింగివేయాలని చూసిన అమెరికాకు ఎదురు దెబ్బతగిలింది. నాలుగైదు వారాల్లో ఇరాన్ పని అయిపోతుందని, దాడులు నిలిచిపోతాయని తొలిరోజుల్లో చెప్పిన ట్రంప్ యాభై ఐదు రోజుల తరువాత మాట మార్చాడు. కాల్పుల విరమణ పొడిగింపునకు ఎలాంటి కాలవ్యవధి లేదని తాజాగా చెప్పాడు. మధ్యంతర ఎన్నికల కోసం పోరు ముగించాలని తాను అనుకుంటున్నట్లు చెబుతున్నారని, తనమీద ఎలాంటి ఒత్తిడి లేదని చెప్పుకున్నాడు. తాజా దాడులతో అమెరికా ఇప్పటికే అరవై బిలియన్ డాలర్ల […] The post ట్రంప్ దిగొస్తున్నాడా! appeared first on Navatelangana.

‘శబరిమల ఆలయం సహా ప్రార్థనా ప్రదేశాల్లో మహిళల పట్ల వివక్ష’ కేసులో గురువారం మరోసారి విచారణ జరిగింది. ఈ సందర్భంగా దేశంలోని ప్రముఖ రచయితలు, మేధావుల అభిప్రాయాలను గౌరవిస్తామని, ‘వాట్సాప్ యూనివర్సిటీ’ నుంచి వచ్చే సమాచారాన్ని మాత్రం అంగీకరించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కేరళలోని శబరిమల శ్రీ అయ్యప్ప ఆలయంలో మహిళల ప్రవేశం సహా పలు మతాలకు సంబంధించిన మత స్వేచ్ఛ, మహిళలపై వివక్ష అంశాలపై దాఖలైన పిటిషన్లను తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తున్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు వచ్చాయి. ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనంలో న్యాయమూర్తులు బి.వి. నాగరత్న, ఎం.ఎం. సుందరేశ్, అహ్సనుద్దీన్ అమానుల్లా, అరవింద్ కుమార్, ఆగస్టిన్ జార్జ్ మసీహ్, ప్రసన్న బి. వరాలే, ఆర్. మహాదేవన్, జోయ్మాల్య బాగ్చి సభ్యులుగా ఉన్నారు.దావూదీ బొహ్రా సమాజాధిపతి తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది నీరజ్ కిశన్ కౌల్, మతపరమైన అంశాల్లో న్యాయస్థానాల పరిమిత జోక్యంపై కాంగ్రెస్ నాయకుడు శశిథరూర్ రాసిన వ్యాసాన్ని ప్రస్తావించారు.ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ స్పందిస్తూ, ప్రముఖులు, న్యాయవేత్తలు తదితరుల అ

మనిషి జీవితంలో విజయాన్ని సాధించడానికి అత్యంత ముఖ్యమైనది సంకల్పం. సంకల్పం అంటే కేవలం కలలు కనడం కాదు. ఆ కలలను సాకారం చేసుకోవడానికి మనసులో దృఢమైన లక్ష్యం పెట్టుకుని, దాన్ని సాధించేందుకు నిరంతరం కృషి చేయడం. ఎన్ని అడ్డంకులు వచ్చినా వెనక్కి తగ్గకుండా ముందుకు సాగడమే నిజమైన సంకల్పం. ఇది నిండుగా ఉన్న వ్యక్తులు తాము పయనించే మార్గంలో ఎదురయ్యే కష్టాలు, సమస్యలు చూసి భయపడరు. వాటిని ఓటమిగా భావించకుండా, తమను మరింత బలంగా మార్చే అవకాశాలుగా […] The post ఓపికతో సాగితేనే విజయ తీరాలకు appeared first on Navatelangana.
పెరుగులో మంచి ప్రోబయోటిక్స్ ఉంటాయనేది నిజమే. కానీ గట్ ఆరోగ్యం కేవలం పెరుగుతోనే సాధ్యమవుతుందని అనుకోవడం పొరపాటు. మన భారతీయ ఆహార సంప్రదాయంలోనే గట్కు మేలు చేసే ఎన్నో వంటకాలు, పదార్ధాలు ఉన్నాయి. జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచే వాటిపై నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం..మనం రోజూ తినే ఇడ్లీ, దోస వంటి వంటకాలు కేవలం రుచి కోసమే కాదు, గట్ ఆరోగ్యానికి కూడా అనుకూలంగా ఉంటాయి. ఎందుకంటే అవి సహజంగా పులియబెట్టిన పిండితో తయారవుతాయి. ఫెర్మెంటేషన్ వల్ల […] The post గట్ హెల్త్ కోసం… appeared first on Navatelangana.

అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఒకే మాట మీద నిలబడాలని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్కొన్నారు. రాజకీయ నాయకులకు ఉండాల్సిన ప్రాథమిక లక్షణం విశ్వసనీయత అని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల పక్షాన పోరాడి అనేక డిమాండ్లు చేయడం ఒక ఎత్తయితే అధికారంలోకి వచ్చాక వాటిని గాలికొదిలేయడం సరైన పద్ధతి కాదని ఆయన హితవు పలికారు. కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి ఇలా ఏ పార్టీ అయినా సరే కేంద్రంలో లేదా రాష్ట్రంలో అధికారం అనుభవిస్తున్నప్పుడు గతంలో ఇచ్చిన హామీలను విస్మరించకూడదని ఆయన సూచించారు. ప్రజలకు ఇచ్చిన హామీల పట్ల అధికార పక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహారించాలని జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గొంతు చించుకొని ప్రశ్నించిన వారే అధికారంలోకి రాగానే మౌనం వహించడం లేదా మాట మార్చడం ప్రజలను మోసం చేయడమే అవుతుందని ఆయన అన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో ద్వంద్వ వైఖరి ప్రదర్శించకూడదని ఆయన సూచించారు. ముఖ్యంగా ఆర్టీసి సమ్మె తీవ్రంగా కొనసాగుతున్న వేళ జగ్గారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు కార్మిక వర్గాల్లో ఉత్సాహాన్ని నింపాయి. ప్రభుత్వంలో ఉన్నప్పటి

ఆర్టీసీ సమ్మెపై నేడు కార్మికులతో మాట్లాడాలని సిఎం రేవంత్రెడ్డి మంత్రులకు సూచించారు. ఈ మేరకు చర్చలు జరపాలని సిఎం రేవంత్ రెడ్డి మంత్రులను ఆదేశించారు. నేడు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలోని మంత్రుల బృందం కార్మిక సంఘాలతో చర్చలు జరుపుతుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం సచివాలయంలో జరుగుతున్న కేబినెట్ సమావేశంలో సమ్మెపై ప్రధానంగా చర్చ జరిగింది. నర్సంపేట, నల్గొండ ఘటనల నేపథ్యంలో ఆర్టీసి కార్మికులు ఎలాంటి తొందర పాటు నిర్ణయాలు తీసుకోవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రాణాలు తీసుకోవడం వల్ల సమస్య పరిష్కారం కాదని కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో దృష్టి పెట్టిందని సిఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. అందులో భాగంగా నేడు డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మంత్రులు ఆర్టీసి కార్మిక సంఘాలను పిలిచి మాట్లాడాలని ఆదేశించినట్టు సిఎం రేవంత్రెడ్డి తెలిపారు. కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.


నగరంలో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యకు ప్రయత్నించారు. జి.లింగారెడ్డి అనే వ్యక్తి భద్రాచలం డిపోలో ఆర్టీసి డ్రైవర్ (స్టాప్ నెం: 825862) గా పనిచేస్తూ ఖమ్మం రూరల్ మండలం నాయుడుపేట ఆర్టీసీ కాలనీలో నివాసం ఉంటున్నారు. రెండు రోజులుగా ఆర్టీసీ సమ్మె కావడంతో ఇంట్లోనే ఉంటున్నారు. అయితే గతేడాది నుంచి కుటుంబానికి సంబంధించిన విషయాలపై భార్యాభర్తల మధ్య వివాదం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే గురువారం గడ్డిమందు సేవించడంతో హుటాహుటిన రేవతి సెంటర్ సమీపంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్తున్నారు. కుటుంబ విషయాలపైనే ఆత్మహత్యకు పాల్పడ్డారని డ్రైవర్ భార్య, పోలీసులు చెప్తున్నారు. టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

భారత్తో జరిగిన మూడో టి20 మ్యాచ్లో సౌతాఫ్రికా మహిళా టీమ్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో సఫారీ టీమ్ మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే 30తో సిరీస్ను సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన ఆతిథ్య సౌతాఫ్రికా జట్టు 16.3 ఓవర్లలోనే కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు లౌరా వాల్వర్డ్, సునే లూస్లు జట్టుకు శుభారంభం అందించారు. ఇద్దరు ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ స్కోరును పరిగెత్తించారు. కెప్టెన్సీ ఇన్నింగ్స్తో అలరించిన లౌరా 53 బంతుల్లోనే 14 ఫోర్లు, ఐదు సిక్సర్లతో 115 పరుగులు చేసింది. ఈ క్రమంలో తొలి వికెట్కు 183 పరుగులు నమోదు చేసింది. మరోవైపు కీలక ఇన్నింగ్స్ ఆడిన లూస్ 6 ఫోర్లు, రెండు సిక్స్లతో 64 పరుగులు చేసి నాటౌట్గా నిలిచింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్కు ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మలు మెరుగైన ఆరంభాన్ని అందించారు. ధాటిగా ఆడిన మంధాన 25 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్తో 37 పరుగులు చేసింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన షఫాలీ 8 బౌండరీలు, రెండు సిక్స్లతో 64 పరు

