
4355 వార్తలు

సిడిపిఓ కమలాదేవినవతెలంగాణ-నెల్లికుదురు మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామంలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే ను ఘనంగా నిర్వహించినట్లు సిడిపిఓ కమలాదేవి తెలిపారు. గురువారం పోషణ పక్వాడ్ కార్యక్రమంలో భాగంగా గ్రాడ్యుయేషన్ డే శ్రీ జ్యోతి డి కవిత ఎం కవిత ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలచే ఆక్టివిటీ ప్రోగ్రాం చేయించామని వారి చే పదాలు చెప్పించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ సరిత, ఉషారాణి పంచాయతీ కార్యదర్శి రవి, తల్లులు పాల్గొన్నారు. The post బికే పల్లిలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే appeared first on Navatelangana.
సీడీపీఓ కమలాదేవి, ఐసిడిఎస్ సూపర్వైజర్లు సరిత ఉషారాణినవతెలంగాణ-నెల్లికుదురు మండల కేంద్రంలోని అంగన్వాడి సెంటర్ ఆధ్వర్యంలో పిల్లలచే పదాలు పలికించడం అభినందనీయమని సిడిపిఓ కమలాదేవి తెలిపారు. అంగన్వాడి కేంద్రం విజయ సెంటర్లో పోషణ పక్పాడ్ లో భాగంగా గ్రాడ్యుయేషన్ డే ను ఘనంగా సూపర్వైజర్లు ఉషారాణి సరితలు తో కలిసి గురువారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రంలో దొరికి ఆహారాన్ని అంగన్వాడి సెంటర్ కి వచ్చేటువంటి వారికి సక్రమంగా అందించాలని తద్వారా వారు పిల్లలు […] The post అంగన్వాడి పిల్లలచే పదాలు పలికించడం సంతోషం appeared first on Navatelangana.

రోజురోజుకు వేడి తీవ్రత పెరుగుతోంది. కాబట్టి, ఉదయాన్నే వాకింగ్ చేసేవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదయం వాతావరణం వేడిగా లేకపోయినా అజాగ్రత్తగా ఉండకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాగా, వేసవిలో ఉదయాన్నే ఎలాంటి ఆరోగ్య సమస్యలు, డీహైడ్రేషన్కు గురికాకుంటే ఖాళీ కడుపుతో నడవవచ్చని సూచిస్తున్నారు. అయితే, కొంతమంది మాత్రం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. ఎవరు జాగ్రత్తగా ఉండాలి?ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు ఖాళీ కడుపుతో మార్నింగ్ వాకింగ్ మానుకోవాలి. ఎందుకంటే రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోయే అవకాశం ఉంటుంది. దీంతో తల తిరగవచ్చు. అయితే, మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ సీజన్లో నడకకు వెళ్లే ముందు నానబెట్టిన శనగలు వంటి తేలికపాటి, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఉదయాన్నే ఎక్కువగా తినడం లేదా నడకకు ముందు టీ, కాఫీ తాగడం వంటివి చేయకూడదని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇవి శరీరాన్ని డీహైడ్రేట్ చేసే ప్రమాదం ఉంది. వేసవిలో ఈ సమస్య ఎందుకు?వేసవిలో వేడి తీవ్రత కారణంగా శరీరం చెమట ద్వారా నీటిని కోల్పోతుంది. దీంతో కడుపు ఖాళీగా ఉండి, శరీరం డీహైడ్రేట్ అవుతుంది. దీనివలన నీరసం, తలనొప్పి లేదా డీహైడ్రేషన్కు గురి కా


నవతెలంగాణ – మల్హర్ రావుమండల కేంద్రమైన తాడిచర్ల గ్రామ పరిధిలోని రామారావుపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పాఠశాలలోని విద్యార్థులకు ప్రగతి పత్రాలను గురువారం పంపిణీ చేసినట్లుగా పాఠశాల ప్రాధానోపాధ్యాయురాలు బి.పద్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. పాఠశాల పనిదినం చివరి రోజు విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశము నిర్వహించి విద్యార్థులకు ప్రగతి పత్రాలను అందించడం జరిగిందన్నారు.విద్యార్థుల ప్రగతిపై తల్లిదండ్రులకు వివరించి,వేసవికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు,తల్లిదండ్రులకు అవగాహన కల్పించినట్లుగా తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థుల నమోదును […] The post ప్రభుత్వ విద్యార్థులకు ప్రగతి పత్రాలు పంపిణీ appeared first on Navatelangana.




చాలామంది ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేసేటప్పుడు రేంజ్కు ప్రాధాన్యత ఇస్తారు. అందుకే అనేక కార్ల తయారీ కంపెనీలు అధిక రేంజ్ ఇచ్చే వాహనాలను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో టాటా నెక్సాన్ ఈవీ, ఎంజి విండ్సర్ ఈవీ, టాటా పంచ్ ఈవీ వంటి మోడళ్లు ఒకే ఛార్జ్పై దాదాపు 400 కి.మీ.లకు పైగా రేంజ్ అందిస్తాయి. దీనివల్ల తరచుగా ఛార్జింగ్ చేయవలసిన అవసరం కూడా తగ్గుతుంది. ఈ నేపథ్యంలో 400 కి.మీ.లకు పైగా రేంజ్ అందిస్తూ, విభిన్న బడ్జెట్ అవసరాలకు సరిపోయే ఐదు ఎలక్ట్రిక్ వాహనాల గురించి ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.టాటా పంచ్ ఈవీటాటా పంచ్ ఈవీ సింగల్ ఛార్జ్ పై దాదాపు 468 కి.మీ.ల వరకు రేంజ్ అందిస్తుంది. ఇది కొత్త ఎలక్ట్రిక్ వాహన కొనుగోలుదారులను ఆకర్షిస్తోంది. ఈ కారు కాంపాక్ట్ సైజు, మంచి రేంజ్ను కలిగి ఉంది. దీని పోటీదారులలో సిట్రోయెన్ EC3 ఒకటి. ఇది రోజువారీ సిటీ డ్రైవింగ్కు చాలా అనువైనది.ఎంజి విండ్సర్ ఈవీ ఈ ఎలక్ట్రిక్ కారు అద్భుతమైన ఫీచర్లు, క్యాబిన్ సౌకర్యానికి ప్రాధాన్యత ఇచ్చే కస్టమర్లను లక్ష్యంగా చేసుకుంది. ఇది పెద్ద టచ్స్క్రీన్, ADAS, విశాలమైన స్థలాన్ని అందిస్తుంది. ఒక ఛార్జ


వరంగల్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టిసి ఉద్యోగుల సమ్మె రెండో రోజు కొనసాగుతోంది. రెండో రోజు తీవ్ర స్థాయిలో నిరసనలు చేపట్టారు. అయితే వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టిసి డిపోలో డ్రైవర్గా పని చేస్తున్న కోలా శంకర్ గౌడ్ ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఆర్టిసిని ప్రభుత్వంలో విలీనం చేయకుండా కాలయాపన చేయడాన్ని నిరసిస్తూ నర్సంపేట బస్టాండ్ ఎదుట ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అక్కడ ఉన్న వాళ్లు మంటలను ఆర్పివేసి శంకర్ గౌడ్ను రక్షించారు. తీవ్రంగా గాయపడిన ఆయన్ను మెరుగైన చికిత్స కోసం వరంగల్కు తరలించారు.

టీవీఎస్ మోటార్ కంపెనీ భారతదేశంలో 2026 టీవీఎస్ రైడర్ 125 రెండు కొత్త వేరియంట్లను విడుదల చేసింది. ఈ కొత్త వేరియంట్లలో అప్డేట్ చేయబడిన ఫీచర్లు, రంగులు ఉన్నాయి. అయితే బైక్ స్పోర్టీ లుక్లో ఎలాంటి మార్పు లేనప్పటికీ ఈ బైక్ అనేక వేరియంట్లలో అందుబాటులో ఉంది. దీని ధర రూ.82,680 (ఎక్స్-షోరూమ్) ఢిల్లీ నుండి ప్రారంభమవుతుంది. కొత్తగా విడుదలైన SXC DD వేరియంట్ ధర రూ.96,725. కాగా, TFT DD వేరియంట్ ధర మాత్రం రూ.98,500గా ఉంది.కొత్త రంగులు, వేరియంట్లుఈ అప్డేట్లో ప్రధాన ఆకర్షణ కొత్త నైట్రో గ్రీన్ కలర్. కంపెనీ ఈ రంగును హెడ్ల్యాంప్ కవర్, ఫ్రంట్ ఫెండర్, ఫ్యూయల్ ట్యాంక్, సైడ్ ప్యానెల్స్తో సహా బైక్ ముందు భాగానికి అప్లై చేసింది. దీనికి అనుబంధంగా లైట్ యాష్ కలర్ గ్రాఫిక్స్ను ఉపయోగించారు. అదనంగా, బైక్కు స్పోర్టీ లుక్ ఇవ్వడానికి ముందు అల్లాయ్ వీల్ ఆకుపచ్చ రంగులో, వెనుకది నలుపు రంగులో ఉంటుంది.టీవీఎస్ రైడర్ 125 ఫీచర్లుటీవీఎస్ రైడర్ 125లో ఎల్ఈడీ హెడ్ల్యాంప్లు, టెయిల్ల్యాంప్లు, గ్లైడ్-త్రూ ట్రాఫిక్ టెక్నాలజీ, సైడ్-స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్, ఫాలో-మీ-హోమ్ హెడ్ల్యాంప్లు ఉన్నాయి. 2026 మోడల్లో అతిపెద్ద అప్డేట్ ఏ

హైదరాబాద్: ఆర్టిసి కార్మికుల సమ్మెకు బిజెపి పూర్తి మద్దతు ఇస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్లోని సీతాఫల్మండీలో అంగన్వాడీ కేంద్రాన్ని మంత్రి పరిశీలించారు. అక్కడ చిన్నారులతో కాసేపు సరదాగా గడిపారు పిల్లలకు కావాల్సిన సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఆర్టిసి కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ‘‘ఆర్టిసి కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పటివరకు ఈ అంశంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. మహిళలకు ఉచిత బస్సు పథకం విషయంలో ప్రభుత్వానికి ఆర్టిసి కార్మికులు అన్ని విధాల సహకరిస్తున్నప్పటికీ.. వారి సమస్యలు పరిష్కరించకపోవడం దారుణం. ఎన్నికల మానిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఆర్టిసి కార్మికులకు పిఆర్సితో పాటు వారి డిమాండ్లను పరిష్కరించాలి’’ అని కిషన్ రెడ్డి అన్నారు.

ఆసుస్ తన కొత్త బిజినెస్ ల్యాప్టాప్లైన ఎక్స్పర్ట్బుక్ అల్ట్రాతో పాటు P3, P5 సిరీస్లను భారతదేశ టెక్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త శ్రేణిలో ఏఐ (AI) ఫీచర్లు, తేలికపాటి డిజైన్ ను అందించారు. కంపెనీ ఈ ల్యాప్టాప్లలో ఇంటెల్ కోర్ అల్ట్రా ప్రాసెసర్లు, మెరుగైన బ్యాటరీ లైఫ్, అధిక-నాణ్యత డిస్ప్లేలపై దృష్టి సారించింది. ముఖ్యంగా, ఈ పరికరాలు ప్రొఫెషనల్ వినియోగదారుల కోసం రూపొందించిన కోపైలట్ ప్లస్ పీసీ కేటగిరీలోకి వస్తాయి. ఈ క్రమంలో ఆసుస్ కొత్త ల్యాప్టాప్ సిరీస్ ధర, లభ్యత ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ మోడల్ ఎంత ఖరీదైనదిఇంటెల్ కోర్ అల్ట్రా ఎక్స్7 సిరీస్ 3 ప్రాసెసర్తో పనిచేసే ఆసుస్ ఎక్స్పర్ట్బుక్ అల్ట్రా భారత టెక్ మార్కెట్లో రూ.2,39,990 ప్రారంభ ధరతో లభిస్తుంది. అలాగే మార్న్ గ్రే, జెట్ ఫాగ్ రంగులలో లభించే ఎక్స్పర్ట్బుక్ పి3 సిరీస్ రూ.94,990 నుండి ప్రారంభంఅవుతుంది. కాగా, పి5 సిరీస్ మాత్రం రూ.214,990 నుండి లభిస్తుంది. అయితే, ఈ అన్ని మోడల్స్ ఫ్లిప్కార్ట్ ద్వారా కొనుగోలుకు వస్తాయి. ఎక్స్పర్ట్బుక్ అల్ట్రా ఏప్రిల్ 29వ తేదీ వరకు ప్రీ-ఆర్డర్ కోసం కూడా అందుబాటులో ఉంది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్లో సన్రైజర్స్ హైదరాబాద్కు ఎన్నో మరపురాని విజయాలు అందించాడు ప్యాట్ కమ్మిన్స్. తన కెప్టెన్సీలో ఎస్ఆర్హెచ్ 2024 ఫైనల్స్కి కూడా చేరింది. అయితే గాయం కారణంగా ఈ సీజన్లో ఇప్పటివరకూ ప్యాట్ కమ్మిన్స్ ఆడలేదు. అతడి స్థానంతో ఇషాన్ కిషన్ సారథ్య బాధ్యతలు తీసుకున్నాడు. ఇషాన్ కెప్టెన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఏడు మ్యాచుల్లో మూడు మ్యాచులు ఓడినప్పటికీ.. హోం గ్రౌండ్లో వరుసగా జరిగిన మూడు మ్యాచుల్లో జట్టును గెలిపించి తన కెప్టెన్సీ సత్తాను చాటి చెప్పాడు. ఇప్పుడు కమ్మిన్స్ గాయం నుంచి కోలుకొని.. తిరిగి జట్టుతో జత కట్టాడు. అయితే కమ్మిన్స్ వచ్చినా.. ఇషాన్నే కెప్టెన్గా కొనసాగించాలని పలువురు మాజీలు అభిప్రాయపడుతున్నారు. టీం ఇండియా మాజీ కోచ్ సంజయ్ బంగర్ ఇషాన్నే సారథిగా కొనసాగించాలని అభిప్రాయపడ్డాడు. టీం ఇండియ స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ కూడా ఇషాన్కే ఓటు వేశాడు. కమ్మిన్స్ ఎస్ఆర్హెచ్ను 2024 ఫైనల్స్ వరకూ తీసుకుపోయిన మాట వాస్తవమే కానీ.. ఈ సీజన్లో ఇషాన్తో ఆటగాళ్లకి మంచి సమన్వయం కుదిరిందని భజ్జీ అన్నాడు. అందుకే కమ్మిన్స్కి కెప్టెన్సీ వద్దని ఇషాన్నే కెప్టెన్గా కొనసాగ

చాలారోజుల నుంచి తక్కువ ధరలో ఎక్కువ బ్యాటరీ లైఫ్ అందించి, రోజువారీ పనులను సులభంగా నిర్వహించగల స్మార్ట్ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, మీకో గుడ్ న్యూస్! తాజాగా పోకో తన కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసింది. వీటిని భారత టెక్ మార్కెట్లో పోకో C81, పోకో C81X పేరిట విడుదల చేసింది. పోకో C81లో 6300mAh పెద్ద బ్యాటరీ ఉండగా, C81Xలో 5200mAh బ్యాటరీ ఉంది. అయితే, ఈ రెండు ఫోన్లు 15W ఛార్జింగ్, రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ను కూడా అందిస్తాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు ఫోన్ల ధర, మొదటి సేల్, ఫీచర్లను వివరంగా చూద్దాంపోకో C81 ధర, లభ్యత, ఫీచర్లుపోకో C81 ఒకే వేరియంట్లో అందుబాటులో ఉంది. అది 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్. దీని ధర రూ.10,999. ఈ స్మార్ట్ ఫోన్ ఇండియాలో ఏప్రిల్ 27 మధ్యాహ్నం 12 గంటల నుండి ఫ్లిప్కార్ట్లో విక్రయానికి రానుంది.ఈ పరికరం ఎలైట్ బ్లాక్, ఐస్ బ్లూ, సన్సెట్ గోల్డ్ రంగులలో లభిస్తుంది. ఫీచర్ల విషయానికి వస్తే..పోకో C81 పరికరం 120Hz రిఫ్రెష్ రేట్తో కూడిన పెద్ద 6.9-అంగుళాల HD+ డిస్ప్లేను కలిగి ఉంది. దీనివల్ల స్క్రీన్ చాలా సున్నితంగా పనిచేస్తుంది. ఈ ఫోన్ యూనిసోక్ T7250 ప్రాసెసర్తో పనిచేస్తుంద


కర్ణాటకలో దేవనహళ్లిలోని దారుణం చోటు చేసుకుంది. ఓ 19 ఏళ్ల యువతి టాయ్లెట్లో బిడ్డకు జన్మనిచ్చి.. ఆ బిడ్డ పీక కోసి చంపేసి ఓ సంచిలో పడేసింది. ఫాక్స్కాన్ సంస్థకు చెందిన తయారీ ప్లాంటులో ఈ దారుణం జరిగింది. ఆ యువతికి వివాహం కాలేదని.. ఈ విషయం తెలిస్తే ఎక్కడ పరువుపోతుందనే భయంతోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ రోజు డెలివరీ అవుతుందని ఆమె ఊహించకపోయి ఉండొచ్చని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. తరువాత మరొకరు వాష్రూంలోకి వెళ్లడంతో అసలు విషయం బయటపడింది. బిడ్డ పుట్టిన వెంటనే చంపేసినట్లు గుర్తించారు. బుధవారం ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం ఆ యువతికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.


