
3307 వార్తలు




5 రాష్ట్రాల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధంపశ్చిమ బెంగాల్ ఫలితంపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ తమిళనాడు, కేరళంపై సరత్రా టెన్షన్ అసోం, పుదుచ్చేరిపైనా ఆసక్తి దీదీకి కమలం చెక్? స్టాలిన్ కుర్చీకి విజయ్ గండం! కేరళంలో ఈసారి యూడీఎఫ్కు సానుకూల పవనాలు అసోం, పుదుచ్చేరిలో కమల వికాసంపై ఆశలుకౌంటింగ్కు ఆయా రాష్ట్రాల్లో భారీ భద్రతా ఏర్పాట్లున్యూఢిల్లీ: నేడు (మే 4) నాలుగు రాష్ట్రాలు , ఒక కేంద్ర పాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లె క్కింపు, ఫలితాలు వెలువడనున్నాయి. రాబోయే రోజుల్లో దేశ రాజకీయ ముఖచిత్రం మారుతుం దా? సరికొత్త దిశా నిర్థేశనం జరుగుతుందా? అనే ది ఈ ఎన్నికల ఫలితాలతో మధ్యాహ్నానికి ఖరారు అవుతుంది. ఈసారి ఎన్నికలలో తమిళనాడు, ప శ్చిమ బెంగాల్, కేరళలో హోరాహోరీ రాజకీయ పోరు జరిగింది. ఈసారి ప్రత్యేకించి బెంగాల్, తమిళనాడులలో ఫలితాలపై అందరి దృష్టి కేంద్రీకృతం అయింది. ఈ రెండు రాష్ట్రాలు చాలాకాలం గా బిజెపి సారధ్యపు ఎన్డిఎ పరిధిలో లేని ప్రభుత్వాలతో ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లోకి బిజెపి చొరబడే అవకాశాలు లేవని ఇంతకాలం భావిస్తూ ఉన్న దశలో ఇందుకు భిన్నమైన జన స్పందన ఈ సారి వెలువడనుందనే విశ్లేషణలతో ఈ ఫలితాల పై సర్

ప్రభుత్వం, ప్రతిపక్షం పోటాపోటీ సభలు 6న వరంగల్లో కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ హామీలపై బిఆర్ఎస్ బహిరంగ సభ5వ తేదీ నుంచి మూడ్రోజుల పాటు హన్మకొండలో ప్రభుత్వం ఆధ్వర్యంలో రైతు వారోత్సవాలు రైతులకు సంకెళ్లు వేసింది బిఆర్ఎస్సే ఇప్పుడు వాళ్లపై కపట ప్రేమ ప్రదర్శిస్తున్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధ్వజంమన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నర ఏండ్ల వ్యవధి ఉన్నప్పటికీ అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు పోటా పోటీగా నిర్వహిస్తోన్న సభలు ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఒకవైపు ప్రభుత్వ యంత్రాంగం స న్నాహాలు చేసుకుంటుండగా, గ్రామ పంచాయ తీ, మున్సిపల్ ఎన్నికలలో వన్సైడ్గా విజయాన్ని సొంతం చేసుకున్న అధికార కాంగ్రెస్ పార్టీ ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలలోనూ అదే జోరు కొనసాగించేందుకు వ్యూహరచన చేస్తోంది. కనీసం ఈ సారి స్థానిక పరిషత్ ఎన్నికలలోనైనా తన సత్తా చాటాలని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా ధీటుగా ముందస్తు వ్యూహాన్ని పన్నుతోంది. ఈ నేపథ్యంలో ఇంతకాలం మౌనంగా ఉన్న బీఆర్ఎ స్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బయటికి వచ్చి గత నెలలో సీనియర

గతేడాదితో పోలిస్తే సులువుగా ప్రశ్నాపత్రందేశవ్యాప్తంగా ప్రశాంతంగా నీట్ యూజీ పరీక్ష రాష్ట్రంలో 199 కేంద్రాల్లో నిర్వహణసుమారు 97 శాతం మంది హాజరు ఈసారి కటాఫ్ మార్కులు పెరిగే అవకాశంమన తెలంగాణ/హైదరాబాద్: వైద్య విద్య కోర్సు ల్లో ప్రవేశాల కోసం ఆదివారం దేశవ్యాప్తంగా జరిగిన నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టె స్ట్) యుజి (నీట్ యుజి 2026) ప్రశ్నాపత్రం మ ధ్యస్థంగా ఉందని విద్యార్థులు,నిపుణులు పేర్కొన్నారు. గత ఏడాదితో ప్రశ్నాపత్రంతో పోల్చితే మాత్రం ఈసారి నీట్ యుజి ప్రశ్నాపత్రం కొంత సులభంగా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యా యి. ఫిజిక్స్, కెమిస్ట్రీ విభాగాల నుంచి వచ్చిన ప్ర శ్నలు మధ్యస్థంగా ఉన్నప్పటికీ సరైన సమాధానం గుర్తించడానికి ఎక్కువ సమయం కేటాయించవలసి వచ్చిందని చెబుతున్నారు. కెమిస్ట్రీ, బయాలజీ విభాగాలలో ఎక్కువగా ఎన్సిఇఆర్టి పుస్తకాల నుంచి ప్రశ్నలు రాగా, ఫిజిక్స్లో క్యాలులేషన్స్ ప్ర శ్నలు ఎక్కువగా వచ్చాయని పేర్కొంటున్నారు. ఫి జిక్స్లో కరెంట్ ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్, కె నమాటిక్స్, ఎలక్ట్రోస్టాటిక్స్, వేవ్ ఆప్టిక్స్, రొటేషన్, మెకానిక్స్, ఎలక్ట్రోమ్యాగ్నెటిజం టాపిక్స్ ప్రశ్నలు రాగా, క




ఇప్పటికే ముగిసిన నిందితుడు మధు పోలీస్ కస్టడీతదుపరి విచారణలో మంగ్లీ, సోదరుడు శివ పాత్రపై ఆరా తీయనున్న పోలీసులుమన తెలంగాణ/సిటీబ్యూరో: మైక్రో ఫైనాన్స్ కేసులో నిందితుడిగా ఉన్న హేమకాంత రెడ్డిని సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. మైక్రో ఫైనాన్స్ కేసులో ఇదివరకే రమావత్ మధును సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన విషయం తెలిసిందే. కస్టడీకి తీసుకొని పోలీసులు మూడు రోజులు విచారించారు, కస్టడీ ముగియడంతో శనివారం మధును జైలుకు పంపించారు. ఈ క్రమంలోనే హేమకాంతరెడ్డిని అరెస్టు చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపర్చి, కస్టడీకి తీసుకోనున్నట్లు తెలిసింది. మధు, హేమకాంతరెడ్డి ఇద్దరిని విచారిస్తే మైక్రో ఫైనాన్స్ కేసులోని అసలు విషయాలు బయటికి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఇద్దరికి మంగ్లీ, ఆమె సోదరుడు శివ స్నేహితుడు కావడంతో ఆ కోణంలో విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. రమావత్ మధు శుభక్షేత్ర ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కార్యాలయం ప్రారంభించి పలువురి వద్ద లక్షలాది రూపాయలు వసూలు చేశాడు. ఐదు లక్షలు కడితే నెలకు రూ.25,000, 102 గజాల ప్లాట్ ఇస్త

మరో ఇద్దరికి గాయాలు మృతుల్లో ఏడాదిన్నర చిన్నారిఎయిర్ కండీషనర్ పేలడంతో ఎగిసిపడిన మంటలు, క్షణాల్లో వ్యాప్తిఢిల్లీలోని వివేక్ విహార్లో తెల్లవారుజామున ఘటనన్యూఢిల్లీ: ఢిల్లీలోని వివేక్ విహార్ ప్రాంతంలో ఉన్న నాలుగు అంతస్తుల నివాస భవనంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో ఒకటిన్నరేళ్ల చిన్నారితో సహా తొమ్మిది మంది మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. అయితే ఎయిర్ కండీషనర్ (ఏసీ) పేలుడు కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని స్థానిక నివాసి ఒకరు తెలిపారు. ఉదయం సుమారు 4 గంటల సమయంలో భవనం రెండో అంతస్తులో మంటలు ప్రారంభమైనట్లు సమాచారం. వెంటనే 14 అగ్నిమాపక వాహనాలను ఘటనాస్థలికి పంపించి సహాయక చర్యలు చేపట్టారు. అధికారులు అక్కడికి చేరుకునే సమయానికి మంటలు మూడో, నాలుగో అంతస్తులకు కూడా వ్యాపించినట్లు గుర్తించారు. తూర్పు ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన వివేక్ విహార్లో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. భవనం నుంచి పన్నెండు మందికి పైగా రక్షించినట్లు అధికారులు వెల్లడించారు. గాయపడిన వారిని గురు తేగ్ బహదూర్ ఆస్పత్రికి తరలించి

అమెరికా 9 పాయింట్లకు స్పందనగా 14 పాయింట్లతో ఇరాన్ ప్రతిపాదనలుతాత్కాలిక సంధికి నిరాకరణ హర్మూజ్ దిగ్బంధనం ఎత్తివేత, వివిధ దేశాల్లో స్తంభింపజేసిన ఆస్తుల విడుదలలెబనాన్పైనా యుద్ధం నిలిపివేత సహా పలు షరతులు విధింపు బంతి అమెరికా కోర్టులో ఉందని ప్రకటన ఇరాన్ ప్రతిపాదనలపై అధ్యక్షుడు ట్రంప్ పెదవి విరుపు అణ్వాయుధాలపై స్పష్టమైన హామీ లేదని అసంతృప్తి లాహోర్: పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల నేపథ్యంలో నిలిచిపోయిన శాంతి చర్చలను తిరిగి ముందుకు తీసుకెళ్లేందుకు ఇరాన్ అమెరికాకు 14 పాయింట్లతో కొత్త ప్రతిపాదనలను తెరపైకి తెచ్చింది. ఘర్షణను ముగించేందుకు అమెరికా నుంచి వచ్చిన 9 పాయింట్లకు స్పందనగా ఇరాన్ ఈ 14 పాయింట్లతో తాజా ప్రతిపాదనలు చేసింది. ఇందులో లెబనాన్తో సహా అన్ని విధాలుగా యుద్ధాన్ని ముగించాలని టెహ్రాన్ పిలుపునిచ్చింది. అమెరికా ప్రతిపాదించిన కాల్పుల విరమణ పొడిగింపునను ఇరాన్ తిరస్కరించింది. తాత్కాలిక సంధికి బదులుగా.. 30 రోజుల్లోగా యుద్ధం శాశ్వతంగా ముగించేలా సమగ్ర పరిష్కారాన్ని కోరింది. దీనితో పాటు తమపై మళ్లీ దాడులు చేయకుండా భద్రతా హామీలు ఇవ్వాలని, సరిహద్దు ప్రాంతాల్లో అమెరికా తన బలగాలను ఉపసంహరించుకోవాలని డిమ

ఫీజు రీయింబర్స్మెంట్ రద్దుకు ముఖ్యమంత్రి కుట్రజీఓ నెంబర్ 7 పేరిట చీకటి ఉత్తర్వులు వెంటనే వెనక్కి తీసుకునివిద్యార్థులకు క్షమాపణ చెప్పాలి లేకపోతే మీరు, మంత్రులు రోడ్లపై తిరగలేరు సిఎం రేవంత్రెడ్డికి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ లేఖమనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో 14 లక్షల మం ది విద్యార్థులకు సిఎం రేవంత్ రెడ్డి వెన్నుపోటు పొడిచాడని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్ను రద్దు చేసేందుకే చీకటి జిఒ 7 ను తీసుకొచ్చారని మండిపడ్డారు. విద్యాశాఖను విధ్వం సం చేసేందుకే నీ దగ్గర పెట్టుకున్నావా అని నిలదీశారు. దుర్మార్గమైన జిఒ 7ను వెంటనే వెనక్కి తీసుకుని క్షమాప ణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విద్యార్థుల తో కలిసి రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. సిఎం, మంత్రులు రోడ్లపై తిరగలేరని హెచ్చరిస్తూ ఆదివారం సిఎం రేవంత్ రెడ్డికి కెటిఆర్ ఘాటు లేఖ రాశా రు. రాష్ట్రంలోని 14 లక్షల మంది బిసి, ఎస్సి,ఎస్టి, మై నారిటీ విద్యార్థులకు కొండంత అండగా నిలిచే ఫీజు రీ యింబర్స్మెంట్ పథకాన్ని రద్దుచేసేలా చేస్తున్న కుట్ర భ యంకరమైనదని పేర్కొన్నారు. ఈ జిఒ వచ్
సీఎం, డిప్యూటీ సీఎంలకు కృతజ్ఞతలు5న రాష్ట్రవ్యాప్త నిరసనలు వాయిదా : ఉద్యోగ జేఏసీ చైర్మెన్ జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్ శ్రీనివాసరావునవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్రాష్ట్రంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందన్న నమ్మకం, విశ్వాసముందని తెలంగాణ ఉద్యోగ జేఏసీ చైర్మెన్ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు చెప్పారు. ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ప్రత్యేక కృతజ్ఞతలు ప్రకటించారు. సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం […] The post ప్రభుత్వం సమస్యలు పరిష్కరిస్తుందన్న నమ్మకముంది appeared first on Navatelangana.
ఉరుములు, పిడుగులతో వర్షాలు.. పంటలకు తీవ్రనష్టంకొనుగోలు కేంద్రాల్లో తడిసిన పంటలునేలకొరిగిన చెట్లు, వంగిన విద్యుత్ స్తంభాలుచీకట్లు కమ్ముకున్న పలు గ్రామాలునవతెలంగాణ- విలేకరుల బృందంరాష్ట్రంలోని పలు జిల్లాలో ఆదివారం ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. ఎండ వేడిమితో ఇబ్బంది పడుతున్న జనానికి ఈ వర్షాలు ఉపశమనం కలిగించినా కొనుగోలు కేంద్రాల్లో పంటలు తడిసిపోయాయి. నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలంలో భారీ ఈదురుగాలుల వల్ల తీవ్ర నష్టం వాటిల్లింది. రోడ్డు వెంట ఉన్న చెట్లు, కరెంటు స్తంభాలు కూలిపోయాయి. […] The post గాలిదుమారం.. ఈదురుగాలులు appeared first on Navatelangana.
మనస్తాపంతో యువతి ఆత్మహత్యజగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో ఘటననవతెలంగాణ – మల్లాపూర్పెండ్లి నిశ్చయమైన వ్యక్తి గల్ఫ్ దేశంలో ఆత్మహత్య చేసుకున్నాడు.. దీంతో మనస్తాపం చెందిన యువతి కూడా ఆత్మహత్యకు పాల్పడిన హృదయ విదారకర ఘటన ఇది.. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని సిరిపూర్ గ్రామంలో జరిగిన ఈ ఘటనతో రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. పోలీసుల వివరాల ప్రకారం.. సిరిపూర్ గ్రామానికి చెందిన ఒల్లెపు రంగయ్య, లక్ష్మి దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె ఒల్లెపు […] The post పెండ్లి చేసుకుంటాననుకున్న వ్యక్తి బహ్రెయిన్లో మృతి.. appeared first on Navatelangana.
త్వరలోనే రెండో విడత ‘ఇందిరమ్మ’ ఇండ్ల మంజూరు :ప్రజాదర్బార్లో మంత్రి పొంగులేటి భరోసానవతెలంగాణ-కూసుమంచిప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా, అధికారులే నేరుగా ప్రజల వద్దకు వచ్చి అర్జీలు స్వీకరించి పరిష్కరించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం కూసుమంచిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన ‘ప్రజా దర్బార్’లో ఆయన పాల్గొన్నారు. జిల్లా […] The post అర్హతే కొలమానం.. రాజకీయాలకు తావులేదు appeared first on Navatelangana.
అత్యధికంగా డొమెస్టిక్ వినియోగదారులే..గ్రేటర్లోనే విద్యుత్ వినియోగం అధికంవిస్తృతంగా పెరిగిన డిస్కం నెట్వర్క్తప్పని అప్రకటిత విద్యుత్ కోతలుమౌలిక సదుపాయాల కల్పనలో వెనుకబాటునవతెలంగాణ-సిటీబ్యూరోగల్లీ నుంచి పారిశ్రామిక వాడల వరకు, పల్లె ముంగిట నుంచి ఐటీ కారిడార్ల వరకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్) వెలుగులు విరజిమ్ముతోంది. రాష్ట్ర పురోగతిలో కీలకంగా మారిన ఈ సంస్థ ప్రస్తుతం 1.17 కోట్ల వినియోగదారులతో అత్యుత్తమ నెట్వర్క్ను కలిగిన డిస్కంలలో ఒకటిగా నిలిచింది. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా విద్యుత్ను సరఫరా చేస్తూ […] The post ఎస్పీడీసీఎల్ కస్టమర్లు 1.17 కోట్లు appeared first on Navatelangana.
రైతు కన్నుమూతవడడెబ్బతో రైతు మృతిఇబ్రహీంపట్నంలో ఘటననవతెలంగాణ-ఇబ్రహీంపట్నంవరి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద వడడెబ్బతో రైతు మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని రాయపోల్ గ్రామంలో రాపోలు మంగలి గౌరయ్య (63) రాయపోల్ వరి కొనుగోలు కేంద్రం వద్ద నాలుగు రోజులుగా ఎర్రటి ఎండలో వడ్లు ఆరబోస్తూ అక్కడే ఉంటున్నారు. మాయిశ్చర్ పేరిట రైతులను కొనుగోలు కేంద్రాల ముందు ప్రభుత్వం […] The post కొనుగోలు కేంద్రంలోనే appeared first on Navatelangana.
అగ్నిప్రమాదంలో 9 మంది మృతిఏసీ పేలడంతో ఘటనన్యూఢిల్లీ : ఢిల్లీలోని వివేక్ విహార్ ఏరియా, షహదారాలోని నాలుగంతస్తుల బిల్డింగులో ఆదివారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది.వేకువ ఝామున 3.30 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో 9 మంది మరణించారు. ఘటనపై సమాచారం అందుకున్న సహాయక బృందాలు దాదాపు 15 మందిని రక్షించాయి. అయితే, సహాయక చర్యలకు చాలా ఆటంకం ఏర్పడింది. ప్రమాదానికి గల కారణాల్ని అధికారులు ఆరా తీస్తున్నారు. మొదట రెండో ఫ్లోర్లో మొదలైన మంటలు తర్వాత […] The post ఢిల్లీలో ఘోరం appeared first on Navatelangana.
జీవో 7 అందుకోసమే..14 లక్షల మంది విద్యార్థులకు వెన్నుపోటువైఎస్ పథకాలకూ పాతరేస్తున్న సర్కారువిద్యార్థిలోకం గర్జిస్తే మంత్రులు రోడ్లపై తిరగరురూ.10 వేల కోట్ల ఫీజు బకాయిలను విడుదల చేయాలి : సీఎం రేవంత్రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్రేండున్నరేండ్ల కాంగ్రెస్ అసమర్థ పాలనలో ఇప్పటికే విద్యావ్యవస్థను కుప్పకూలిందని బీఆర్ఎస్ వర్కింగ్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) విమర్శించారు. ఇప్పుడు ఏకంగా ఉన్నత చదువులకు నిరుపేదలను పూర్తిగా దూరం చేసేలా విద్యార్థులకు వెన్నుపోటు పొడుస్తారా?అని […] The post ఫీజు రీయింబర్స్మెంట్ రద్దుకు కుట్ర appeared first on Navatelangana.
జూన్ మొదటి వారంలో ఫలితాలు?దేశవ్యాప్తంగా 22.7 లక్షల మంది హాజరునవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్దేశంలోని ప్రభుత్వ, ప్రయివేటు మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్తోపాటు ఇతర మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) యూజీ-2026 ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. జూన్ మొదటి వారంలో ఫలితాలు విడుదలయ్యే అవకాశముందని తెలిసింది. దేశవ్యాప్తంగా 552 నగరాల్లో ఈ పరీక్షను నిర్వహించారు. దేశవ్యాప్తంగా 22,79,743 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. వారిలో 13,32,928 మంది అమ్మాయిలు, […] The post ప్రశాంతంగా నీట్ appeared first on Navatelangana.
జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా రైతులకు ప్రయోజనం శూన్యంవ్యవసాయంపై చిత్తశుద్ధి లేని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పోరాటంతోనే కొనుగోలు కేంద్రాల ప్రారంభం : తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్రావు ొ కొనుగోలు కేంద్రాల పరిశీలన నవతెలంగాణ – బోనకల్రైతులు పండించిన పంటను సమయా నికి కొనుగోలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్రావు మండిపడ్డారు. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా రైతులకు ప్రయోజనం […] The post పంటల కొనుగోలుపై ప్రభుత్వ నిర్లక్ష్యం appeared first on Navatelangana.