19586 వార్తలు







మహబూబ్ నగర్ కలెక్టరేట్: ఆయిల్పామ్ రైతుల సమస్యలు పరిష్కరిస్తాం : కలెక్టర్ ఖుష్బూ గుప్తా


గాంధీనగర్: గుజరాత్లో చండీపురా వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఈ వైరస్ బారిన పడి 22 మంది చిన్నారులు మృతి చెందారు. ఏడుగురు ప్రస్తుతం ఐసియులో చికిత్స పొందుతున్నారు. మరో 35 మందికి వైరస్ నిర్ధారణ కావడంతో చికిత్స అందిస్తున్నారు. గాంధీనగర్, హిమ్మత్నగర్, పటాన్, రాజ్కోట్, భావ్నగర్ లలోని ప్రభుత్వాస్పత్రులలో చికిత్స అందిస్తున్నారు. 184 అనుమానిత కేసులు నమోదు కావడంతో చికిత్స అందిస్తున్నారు. శాండ్ ఫ్లై అనే ఈగ ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తున్నట్టు వైద్యాధికారులు గుర్తించారు. గ్రామాల్లో క్రిమిసంహారక మందులు పిచికారి చేస్తున్నారు. ఈ వ్యాధి లక్షణాలు ప్రారంభంలో ఆకస్మికంగా జ్వరం రావడంతో పాటు తీవ్రమైన తలనొప్పి, వాంతులు ఉంటాయి. వ్యాధి తీవ్రత ముదిరితే వణుకు, మూర్ఛ, మానసిక స్థితిలో మార్పులతో పాటు కోమాలోకి వెళ్లిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 24 గంటల దాటితే తీవ్రమైన నాడీ సంబంధిత నష్టం జరగడంతో పాటు మరణానికి దారితీయవచ్చు.











నందిగామ సిఐ వీరబాబు మన తెలంగాణ/నందిగామ: యువతి ప్రేమను నిరాకరించిందనే తీవ్ర మనస్థాపంతో యువకుడు సిలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం మధ్యాహ్నం నందిగామ మండల పరిధిలోని మేకగూడ గ్రామంలో చోటు చేసుకుంది. నందిగామ సిఐ వీరబాబు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. బిహార్ రాష్ట్రానికి చెందిన సూరజ్ కుమార్ (19) అనే యువకుడు గత మూడు నెలల క్రితం నందిగామ సమీపంలో ఉన్న ఎంఎస్ఎన్ పరిశ్రమలో రోజువారి కూలీ పనికోసం వచ్చినట్లు తెలిపారు. మేకగూడ గ్రామంలో ఒక ఇల్లు అద్దెకు తీసుకొని పనిచేసుకుంటూ ఉన్నట్లు సిఐ వివరించారు. బిహార్ రాష్ట్రంలో సూరజ్ కుమార్ నివసిస్తున్న గ్రామంలోనే ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు, ఆ యువతి ప్రేమను నిరాకరించడంతోనే తీవ్ర మనస్థాపం చెంది ఫ్యాన్కు తువాలతో ఉరి వేసుకొని ఆత్మ హత్య చేసుకున్నట్లు సిఐ వీరబాబు తెలిపారు. లేబర్ కాంట్రాక్టర్ రాంరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం షాద్నగర్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు వివరించారు.

తింసాన్పల్లిలో ‘దళితుల అంత్యక్రియలకు’ అవస్థలుస్మశానానికి వెళ్ళేందుకు ఇబ్బందులు పడుతున్న దళితులుప్రాణాలకు తెగించి వరదనీరులో శవాన్ని తీసుకెళ్తున్న వైనంపల్లెచెల్మ వాగుపై నూతన బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్తుల విజ్ఞప్తిమన తెలంగాణ/పెద్దేముల్: స్వాతంత్య్ర భారతదేశంలో దళితుల అంత్యక్రియలకు కూడా ఇబ్బందులు తప్పడం లేదు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి సుమారుగా 78 సంవత్సరాలు గడుస్తున్నప్పటికి దళితులకు కష్టాలు వీడటం లేదు. వాగుపారితే దళితులు అంత్యక్రియలకు నోచుకోలేని దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఇలాంటి దుస్థితి వికారాబాద్ జిల్లా, పెద్దేముల్ మండల పరిధిలోని తింసాన్పల్లి గ్రామంలో సోమవారం వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన జి.బాలమ్మ అనే మహిళ మృతిచెందింది. ఆమె అంత్యక్రియలను నిర్వహించేందుకు శ్మశానానికి భయల్దేరారు. అయితే, గతకొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో పల్లెచెల్మ వాగు ఉధృతంగా పారింది. దీంతో బాలమ్మ అంత్యక్రియలను పూర్తిచేయడానికి సహచర దళిత కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడ్డాయి. అంత్యక్రియలు చేయాలంటే పల్లెచెల్మ వాగు దాటి వెళ్ళాల్సి ఉంది. అయితే, ప్రతియేటా వర్షకాలంలో దళిత కుటుంబాల్లో ఎవరైనా మృతి చె

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ’కొరియన్ కనకరాజు’తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హారర్ కామెడీ సూపర్ నేచురల్ ఎలిమెంట్స్, నవ్వులు పంచే వినోదంతో గొప్ప థియేట్రికల్ అనుభూతిని అందించనుంది. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ’కొరియన్ కనకరాజు’ ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 7న థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మేర్లపాక గాంధీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “-వరుణ్ తేజ్ ఎప్పుడూ కొత్త ప్రయోగాలకు సిద్ధంగా ఉంటారు. ఈ కథలో కనకరాజు పాత్రతో పాటు కొరియన్ పాత్ర కూడా ఉంటుంది. ఈ రెండు షేడ్స్కు సరిపోయే నటుడు వరుణ్ తేజ్ అనిపించింది. ఈ సినిమాలో రితిక కొరియన్ ఫ్యాక్టరీలో పనిచేస్తుంది. నిజానికి తనకి కొరియన్ భాష కూడా తెలుసు. సినిమాలో ఆమెకు చాలా కొరియన్ డైలాగు లు ఉన్నాయి. అందుకోసం కొరియా నుంచి ఒక ట్యూటర్ను తీసుకొ చ్చి హీరో, హీరోయిన్ ఇద్దరికీ కొరియన్లో శిక్షణ ఇచ్చాం. అలాగే అనంతపురం యాస కోసం అక్కడి నుంచి కూడా ఒక ట్యూటర్ను తీసుకొచ్చాం. -ఇది పూర్తిగా ఫన్ ఎంటర్టైనర్. సత్య, మురళీధర్ గౌడ్, సునీల్ ... ఇలా ప

మహబూబ్ నగర్: ఎగువన భారీ వర్షాలు కురవడంతో జూరాల ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. కర్నాటకలో భారీ వర్షాలు కురవడంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. జూరాలకు ఇన్ ప్లో.. 1,92,146 క్యూసెక్కులుండగా అవుట్ ఫ్లో 2,24,968 క్యూసెక్కులుగా ఉంది. 27 గేట్లు ఎత్తి దిగున శ్రీశైలానికి నీటిని విడుదల చేశారు. ప్రస్తుత నీటి నిల్వ 8.196 టిఎంసిలుండగా పూర్తిస్థాయి ప్రాజెక్టు నీటి నిల్వ 9.657 టిఎంసిలుగా ఉంటుంది. విద్యుత్ ఉత్పాదన కొనసాగుతుంది.