19584 వార్తలు


మహబూబ్నగర్ రూరల్: బండి సంజయ్కి ఆహ్వానం











ఎగువ అసోంలో ఇటీవల సంభవించిన విధ్వంసకర ఆకస్మిక వరదలు అభివృద్ధి పేరుతో జరుగుతున్న పర్యావరణ విధ్వంసానికి మరో నిదర్శనంగా నిలిచాయి. ఈ వరదలతో ఎగువ అసోం, దిగువ అసోం, మేఘాలయ మధ్య కీలక రవాణా మార్గాలు తెగిపోయాయి. ఈ వర్షాకాలంలో బ్రహ్మపుత్ర నది, దాని ఉధృత ఉపనదులు గట్లను దాటి ప్రవహించడంతో ప్రధాన రహదారులు, వంతెనలు నీటమునిగాయి. గువాహటి వంటి ప్రధాన నగరాలు వరద ముప్పులో చిక్కుకున్నాయి. అయితే ఈ విపత్తును ‘క్లౌడ్ బరస్ట్’గా అంటే అనివార్యమైన ప్రకృతి వైపరీత్యంగా చిత్రీకరించే ప్రయత్నం జరిగింది. కానీ ఈ విపత్తును కేవలం ప్రకృతి సృష్టించిన ప్రమాదంగా పేర్కొనడం అసలు కారణాలను కప్పిపుచ్చడమే అవుతోంది. భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులు, కార్పొరేట్ ప్రయోజనాలకు అనుగుణంగా రూపొందిన విధానాలు, పర్యావరణ పరిరక్షణ నిబంధనలను క్రమంగా బలహీనపరచడం వంటి మానవ చర్యలే ఎగువ అసోంలో ఈ భారీ వరదలకు ప్రధాన కారణాలుగా మారాయి. శివసాగర్, చరైదేవో, జోర్హాట్ జిల్లాల్లో సంభవించిన తీవ్ర నష్టం కూడా ఈ విధానాల ఫలితమే. కొండలు, లోయలతో కూడిన అత్యంత సున్నితమైన పర్యావరణ వ్యవస్థను సహజ సంపదగా కాకుండా వాణిజ్య లాభనష్టాల కోణం లో చూడటమే ఈ పరిస్థితికి దారితీసింది. అరుణా



సమాజానికి కళ్ళు, కాళ్ళు అయిన ప్రభుత్వ బడికి పట్టిన గ్రహణం వీడేదెట్లా? ఇప్పుడు ఇదే ప్రశ్న దేశ ప్రజలను తొలిచేస్తున్న అంశం. ప్రభుత్వ బడులు, ప్రైవేటు బడుల్లో కూడా క్రమంగా నమోదు పడిపోతుంది. ప్రభుత్వ బడిలో ఈ పరిణామం మరింత వేగంగా కొనసాగుతుంది. ఇటీవల కేంద్రం విడుదల చేసిన గణాంకాలననుసరించి రోజుకు 25 పాఠశాలల చొప్పున గడిచిన 10ఏళ్ళలో 94వేల పాఠశాలలు మూతపడ్డాయి. మోత్తంమీద 2.26 కోట్ల మంది విద్యార్థుల నమోదు తగ్గింది. మన రాష్ట్రం కూడా బడులమూతలో అగ్రస్థానంలోనే ఉంది. పార్లమెంటులో ప్రకటించిన గణాంకాలు ననుసరించి గత ఏడాది 1920 పాఠశాలలు రాష్ట్రంలో మూతపడ్డాయి. అందులో 1400 ఏకోపాధ్యాయ ప్రాథమిక పాఠశాలలే! అంతేకాదు పాఠశాలల మూత, నమోదు క్షీణతలో మనం దేశంలోనే రెండవ స్థానంలో నిలిచాము. ఇంకా ఒకటి రెండు సంవత్సరాలలో 10వేల ఏకోపాధ్యాయ ప్రాథమిక పాఠశాలలు పాఠశాల క్రమబద్ధీకరణ జిఒ 25, 2021 ప్రకారం పదిమంది కంటే తక్కువ పిల్లల నమోదు ప్రాథమిక పాఠశాలలో ఉంటే సమీప పాఠశాలల్లో విలీనం కానున్నాయి. అంటే చాలామంది బడి ఈడు పిల్లలకు పాఠశాల యాక్సెస్ తగ్గిపోతుంది. ఈ పరిస్థితికి కారణం ఏమిటి? అనేది నేడు సమాజం ముందు ఉన్న ప్రశ్న. నమోదు పడిపోవడానికి ప్రధ

హైదరాబాద్: ఆప్ పార్టీ జాతీయ కన్వీనర్, మాజీ సిఎం కేజ్రీవాల్ వంద మందితో ప్రధాని నరేంద్ర మోడీ నివాసానికి మార్చ్ చేపట్టారు. ఇ20 పెట్రోల్కు వ్యతిరేకంగా సేకరించిన రెండు లక్షలకు పైగా సంతకాలను సమర్పించేందుకు కేజ్రీవాల్ బయలుదేరారు. ఇథనాల్ పెట్రోల్ను కేంద్రమంత్రి గడ్కారీ కుమారులకు మేలు చేసేందుకు తీసుకొచ్చారని ఆరవింద్ కేజ్రీవాల్ ఆరోపణలు చేశారు. ఇథనాల్ పెట్రోల్ వాడడంతో వాహనాల మైలేజ్ తగ్గడంతో పాటు ఇంజన్ దెబ్బతింటుందని ఆరోపణలు చేశారు. కేంద్ర ప్రభుత్వం స్టడీ చేసిన రిపోర్టును విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి పెట్రోల్ బంకులో వినియోగదారుడి ఆప్షన్ ఉండాలని కోరారు. ప్యూర్ పెట్రోల్ కంటే ఇథనాల్ పెట్రోల్ ధర తక్కువగా ఉండాలని డిమాండ్ చేశారు. పెట్రోల్ ధరను రూ.84లకు చేర్చాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. అమెరికా నుండి ఇథనాల్ కొనుగోలు చేయడానికి ఆ దేశపు అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్కు తలొగ్గారని మండిపడ్డారు.

మేధో వైకల్యాలున్న (ఇంటెలెక్చువల్ డిసెబిలిటీస్) వ్యక్తుల సాధికారత కోసం మూడు దశాబ్దాలకు పైగా విశిష్ట సేవలందిస్తున్న స్వచ్ఛంద సంస్థ ‘స్వయంకృషి’ ఈ ఏడాది తన 35 ఏళ్ల సేవా ప్రస్థానాన్ని జరుపుకుంటోంది. వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా విద్యా కార్యక్రమాలు, వృత్తి నైపుణ్యాల శిక్షణ, స్వతంత్ర జీవన నైపుణ్యాల అభివృద్ధి వంటి సమగ్ర కార్యక్రమాల ద్వారా మేధో వైకల్యాలున్న వారికి అండగా నిలుస్తూ దేశంలోనే ఆదర్శ సంస్థగా గుర్తింపు పొందింది. ఈ రంగంలో ప్రముఖ నిపుణురాలిగా పేరొందిన మంజుల కల్యాణ్ 1991లో ఈ సంస్థను స్థాపించారు. ప్రత్యేక అవసరాలున్న ప్రతి ఒక్కరికీ సమాన విద్యా అవకాశాలు, వ్యక్తిగత అభివృద్ధికి అవసరమైన వాతావరణం కల్పించాలనే లక్ష్యంతో ‘స్వయంకృషి’ తన ప్రయాణాన్ని ప్రారంభించింది. మేధో వైకల్యాలున్న వారి సంక్షేమంతోపాటు మహిళల సాధికారతకు కూడా మంజుల కల్యాణ్ విశేషంగా కృషి చేస్తున్నారు. సంస్థలోనే కాకుండా ఇతర రంగాల్లోనూ అనేక మంది మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. మేధో వైకల్యాలున్న వయోజనుల పునరావాసం, సమాజంలో వారిని భాగస్వాములుగా తీర్చిదిద్దడం వంటి అంశాల్లో ‘స్వయంకృషి’ దేశం లో ముందంజలో నిలిచింది

సక్సెస్ఫుల్ నిర్మాత సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై నిర్మించిన పీరియడ్ క్రైమ్ డ్రామా ‘కెజెక్యూ’ (కింగ్ - జాకీ - క్వీన్). 1990ల నాటి నేపథ్యం లో సాగే ఈ చిత్రంలో ’దసరా’, ’ది గర్ల్ఫ్రెండ్’ చిత్రాలతో గుర్తింపు పొందిన దీక్షిత్ శెట్టి హీరోగా నటిస్తున్నా రు. వీరితో పాటు నూతన నటుడు శశి ఓదెల, యుక్తి తరేజా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గత ఏడాది కన్నుమూసిన దర్శకుడు కెకె(కిరణ్ )కి ఇది చివరి చిత్రం. ఈ చిత్రం ఆగస్టు 7న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ లో హీరో దీక్షిత్ శెట్టి మాట్లాడుతూ “సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు కింగ్, జాకీ, క్వీన్ పాత్రలు మీకు గుర్తుండిపోతాయి. ఈ సినిమా అందరినీ ఖచ్చితంగా సర్ప్రైజ్ చేస్తుంది”అని అన్నారు. ప్రొడక్షన్ డిజైనర్ శ్రీకాంత్ మాట్లాడు తూ “ఈ సినిమా స్క్రిప్ట్ స్టేజ్ నుంచే నేను ఈ ప్రాజెక్ట్తో ఉన్నాను. కిరణ్ మనందరినీ విడిచి వెళ్లిపోవడం చాలా బాధాకరం. ఆయన కలను నిజం చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఫ్రేమ్ను ఎంతో శ్రద్ధగా రూపొందించాం. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మ కం ఉంది”అని తెలిపారు.

నేచురల్ స్టార్ నాని సమర్పణలో తెరకెక్కిన ’కోర్ట్ - స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’ ఘన విజయానంతరం ఆయన యూనానిమస్ ప్రొడక్షన్స్ రెండో చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. నితిన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ’దండోరా’ ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తున్నారు. దీప్తి గంటా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘అలియాస్ రుక్మిణి’ అనే ఆసక్తికరమైన టైటిల్ను ఖరారు చేస్తూ విడుదల చేసిన అనౌన్స్మెంట్ వీడియో సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. ఈ చిత్రాన్ని తాజాగా సాంప్రదాయ పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి నాని క్లాప్ కొట్టగా, నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నాని తండ్రి గంటా రాంబాబు, నిర్మాత వెంకట్ బోయనపల్లి స్క్రిప్ట్ను చిత్ర బృందానికి అందజేశారు. ’కోర్ట్’ దర్శకుడు రామ్ జగదీష్, శైలేష్ కొలను కలిసి తొలి షాట్కు దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ “జయం, ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే వంటి సినిమాల్లో నితిన్ను ప్రేక్షకులు ఎంతగా ప్రేమించారో మనందరికీ తెలుసు. ఇప్పుడు ’అలియాస్ రుక్మిణి’తో మరోసారి ఆయనను ప్రేమించేలా చేసే సినిమా చేస్తున్నామనే నమ్మకం ఉంది. ఇది చాలా అం


