19589 వార్తలు

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ’కొరియన్ కనకరాజు’తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హారర్ కామెడీ సూపర్ నేచురల్ ఎలిమెంట్స్, నవ్వులు పంచే వినోదంతో గొప్ప థియేట్రికల్ అనుభూతిని అందించనుంది. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ’కొరియన్ కనకరాజు’ ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 7న థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మేర్లపాక గాంధీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “-వరుణ్ తేజ్ ఎప్పుడూ కొత్త ప్రయోగాలకు సిద్ధంగా ఉంటారు. ఈ కథలో కనకరాజు పాత్రతో పాటు కొరియన్ పాత్ర కూడా ఉంటుంది. ఈ రెండు షేడ్స్కు సరిపోయే నటుడు వరుణ్ తేజ్ అనిపించింది. ఈ సినిమాలో రితిక కొరియన్ ఫ్యాక్టరీలో పనిచేస్తుంది. నిజానికి తనకి కొరియన్ భాష కూడా తెలుసు. సినిమాలో ఆమెకు చాలా కొరియన్ డైలాగు లు ఉన్నాయి. అందుకోసం కొరియా నుంచి ఒక ట్యూటర్ను తీసుకొ చ్చి హీరో, హీరోయిన్ ఇద్దరికీ కొరియన్లో శిక్షణ ఇచ్చాం. అలాగే అనంతపురం యాస కోసం అక్కడి నుంచి కూడా ఒక ట్యూటర్ను తీసుకొచ్చాం. -ఇది పూర్తిగా ఫన్ ఎంటర్టైనర్. సత్య, మురళీధర్ గౌడ్, సునీల్ ... ఇలా ప

మహబూబ్ నగర్: ఎగువన భారీ వర్షాలు కురవడంతో జూరాల ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. కర్నాటకలో భారీ వర్షాలు కురవడంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. జూరాలకు ఇన్ ప్లో.. 1,92,146 క్యూసెక్కులుండగా అవుట్ ఫ్లో 2,24,968 క్యూసెక్కులుగా ఉంది. 27 గేట్లు ఎత్తి దిగున శ్రీశైలానికి నీటిని విడుదల చేశారు. ప్రస్తుత నీటి నిల్వ 8.196 టిఎంసిలుండగా పూర్తిస్థాయి ప్రాజెక్టు నీటి నిల్వ 9.657 టిఎంసిలుగా ఉంటుంది. విద్యుత్ ఉత్పాదన కొనసాగుతుంది.











గ్లాస్గో: ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను అలరించిన కామన్వెల్త్ గేమ్స్కు ఆదివారం అర్ధరాత్రి తెరపడింది. స్కాట్లాండ్లోని గ్లాస్గో వేదికగా ఈ పోటీలు జరిగాయి. ఇందులో 74 దేశాలు పాల్గొన్నాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, కెనడా, భారత్, స్కాట్లాండ్లు పతకాల పట్టికలో టాప్5లో నిలిచాయి. ఇక తర్వాతి కామన్వెల్త్ గేమ్స్కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. 2030లో గుజరాత్లోని అహ్మదాబాద్ వేదికగా ఈ క్రీడలు జరుగనున్నాయి. క్రీడలకు సంబంధించిన బాటన్ను భారత దిగ్గజ అథ్లెట్ నీరజ్ చోప్రా అందుకున్నాడు. నీరజ్తో పాటు భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పిటి ఉష, గుజరాత్ ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘ్విలకు స్కాట్లాండ్ క్రీడల నిర్వాహక కమిటీ సభ్యులు బాటన్ను అందజేశారు. క్రీడల ముగింపు వేడుకలు కనుల పండవగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు కనువిందు చేశాయి. ప్రముఖ సంగీత దర్శకుడు శంకర్ మహదేవన్ బృందం అలపించన పాటలు ఆకట్టుకున్నాయి. ముగింపు వేడుకలకు మానూషి ఛిల్లార్, మహదేవన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

మన తెలంగాణ/క్రీడా విభాగం: శ్రీలంక గడ్డపై జరిగే రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ టీమిండియాకు సవాల్గా మారింది. లంకను వారి సొంత గడ్డపై ఎదుర్కొవడం భారత్కు తేలిక కాదనే చెప్పాలి. ఇటీవల కాలంలో టెస్టుల్లో టీమిండియా వరుస ఓటములతో సతమతమవుతోంది. విదేశీ గడ్డపైనే కాకుండా స్వదేశంలోనూ భారత్కు పరాజయాలు తప్పడం లేదు. భారత టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా సొంత గడ్డపై న్యూజిలాండ్, సౌతాఫ్రికాల చేతుల్లో వైట్వాష్కు గురైంది. ఇలాంటి స్థితిలో లంకలో జరిగే సిరీస్లో గెలవడం అనుకున్నంత తేలిక కాదనే చెప్పాలి. స్వదేశంలో లంక ఎప్పుడైనా ప్రమాదకర జట్టే. సొంత పిచ్లపై అసాధారణ రీతిలో చెలరేగి పోవడం లంకకు పరిపాటి. ఇటీవల కాలంలో లంక గాడిలో పడింది. పలు సిరీస్లలో నిలకడైన ప్రదర్శనతో అలరిస్తోంది. బంగ్లాదేశ్, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఇంగ్లండ్, జింబాబ్వేలతో జరిగిన సిరీస్లలో మెరుగైన ప్రదర్శన చేసింది. భారత్పై కూడా అదే జోరును కొనసాగించాలనే లక్షంతో ఉంది. మరోవైపు టీమిండియా ఇటీవల కాలంలో పేలవమైన ఆటతో నిరాశ పరుస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో తన స్థాయికి తగ్గ ఆటను కనబరచలేక పోతోంది. బలమైన లంకను ఎలా ఎదుర్కోంటుందనేది సందే








