
3318 వార్తలు
డాలరు చుట్టూ రూపాయిప్రదక్షణలు చేస్తోందితను చూడని అగాథాలను చూడాలనిపురాణ కథల పాతాళలోకాన్నితొవ్వుకుంటూ పోతోందికట్టప్ప మందహాసాల నడుమఎంతకీ తొక్కడం ఆగడం లేదురూపాయి నెత్తి మీది డాలరు కాళ్ళుమేకిన్ ఇండియా మేకపోతు గాంభీర్యంతోలు ఒలిచిదిగుమతుల సునామీవంటగది పొయ్యి మీద కుతకుతలాడ్తోందిరూపాయి ముఖం మీదతెల్లగుడ్డ కప్పినఐఎస్ ఐ ముద్రలేని పాలనలోతక్కువ వడ్డీ రేట్లకేదేశ కార్పోరేట్ రంగం విదేశీ కండలు పెంచుకుంటుంటేస్విస్ బ్యాంకు కులుకుల నల్లనమ్మభారత పాలకముఖానికి నల్లగుడ్డ కప్పిందిఉత్పాదక పెట్టుబడి భార్య నొదిలేసిరాజ్యం డాలరు భక్తిఎర్ర తివాచీ పరిచినస్టాక్ మార్కెట్ వ్యభిచారి […] The post రూపాయి పాపాయి appeared first on Navatelangana.
ఇంత దొరికింది కదా అని మురువకుఅంతా పారేసుకునేదే అని మరువకుచుట్టూ జనం ఉన్నారని మురువకునిజం మాట్లాడితే అంతా సర్దుకుంటారని మరువకుఎలా నోరు మూపించానో చూడు అని మురువకుఅలాగే జవాబొస్తుందని మరువకునాకే జబ్బూ లేదని మురువకునీకూ టైం వొస్తుందని మరువకునువ్వు జీవిస్తున్నప్పుడు ఎన్నో మరణిస్తుంటయని మురువకునువ్వు మారణిస్తున్నా ఎన్నో జీవిస్తుంటయని మరువకుఇక్కడ ఎంతున్నా చూడని మూర్ఖతఎక్కడో ఏదో ఉందని ఉరికే దీర్ఘతఅనుకున్నాం కానీ… ఆశ్చర్యం ఏమిటంటేఈ లోకం మిథ్య అనేవాడు క్లెవర్అలా అని తద్భిన్నంగా సుఖిస్తున్నడుఇదే లోకమనేవాడు కమిటెడ్బాధ్యతగా […] The post ఇక ఇలా appeared first on Navatelangana.

కోట్ల కవిత్వం ఇంటి దగ్గర నుండి మొదలై దేశవిదేశాలను చుట్టి వస్తుంది. మట్టి నుండి మొదలై ఆకాశం దాకా విస్తరిస్తుంది. వేరు నుండి మొదలై చిటారు కొమ్మదాకా వ్యాపిస్తుంది. వారు నిరంతరం కవిత్వమై ప్రవహిస్తారు. కాలాన్ని కవిత్వం చేసే కవి కోట్ల. ఇప్పుడు ‘ఆ తర్వాత…’ సంపుటితో మన మనసును, మెదడును కదిలించడానికి వచ్చారు. వారి కవిత్వంలో ప్రవహించే చల్లని నీరు, పరిమళించే పచ్చని చెట్టు కనబడకుండా ఉండదు. అలాగే ఇంటింటి రామాయణం ఉంటుంది, రంగురంగుల రాజకీయం […] The post ఇప్పుడైనా ‘ఆ తర్వాత..’ కూడా మనిషే మూలం appeared first on Navatelangana.
టూరి వెంకయ్య నాయుడు శకుంతల స్మారక పురస్కార ఫలితాల వివరాలు : 1.లోపలేదో కదులుతున్నట్టు..- పలమనేరు బాలాజి, 2. ఒక కప్పు చారు ..నాలుగు మెసెజ్లు – జూకంటి జగన్నాధం, 3. ఏడుకోలల బాయి..- ఏనుగు నర్సింహారెడ్డి, 4. తడిఆరని వాక్యమొకటి – సుధా మురళి, 5.బతుకొక ఉత్సవం – చిన్ని నారాయణరావు, 6. స్పెషల్ కన్సొలేషన్ – స్పర్శ లేని శిల – ఎన్.లహరి, The post టూరి వెంకయ్య నాయుడు- శకుంతల స్మారక పురస్కార ఫలితాలు appeared first on Navatelangana.
చూపులో తేడాలునడకలో భేదాలునలుగురం నాలుగు విధాలుగానెత్తురు మాత్రం ఒక్కటేఎవరు ఎక్కడ మొదలయ్యారోఎందుకు విధి వంచితులయ్యారోఅజాగ్రత్తతో అపాయాన్నిమూటగట్టుకొనిరక్తం కోసం వెతుకులాటలోప్రాణం కోసం పెనుగులాటలోవిషాదాన్ని మోస్తున్న దుఃఖ సమయంఎవరిదైనా దుఃఖం ఒక్కటేమనలోని మానవత్వం వారికన్నీటిని దాటి రక్తాన్ని పంచగలదుఅపరిచితుడైతే నేమి !?ఆయుష్షు పెంచగలదురక్తంలో గ్రూపులు వేరైనాప్రాణం ఒక్కటే, శ్వాస ఒక్కటేమనం చేసే రక్తదానం మాత్రంశత సహస్ర జీవితాల ఆనంద కెరటం. The post ఆనంద కెరటం appeared first on Navatelangana.
భూమి తిరగడమేమోగానీకాలం పరిగెడుతున్నట్లైతే,కళ్ళారా కనిపిస్తూనే ఉందిఎవరో తరుముతున్నట్లుగాపడిపోయిందేదీ పట్టుకోనంతగాకాలం పరిగెడుతూనేఉందినిన్నటి జ్ఞాపకాలే గుర్తులేనంతగాపొద్దుటి ముఖాన్నే పోల్చలేనంతగాతీయని జ్ఞాపకాలకు తీరిక లేనంతగాపడుతూ లేస్తూ, పడుతూ లేస్తూకాలం పరిగెడుతూనే ఉందిబతుకు ఇరుసుపైదురాశ కందెన పూసికాల కొరడా ఝుళిపిస్తున్న మనిషితిరిగీ తిరిగి, మొదలెట్టిన చోటుకే వచ్చిపరిగెడుతూ కరిగినది కాలం కాదని,తన ప్రయాణం అని తెలిసే సరికేమనిషి లేకపోవడం యాదచ్ఛికమే! The post బతుకు ఇరుసుపై దురాశ కందెన! appeared first on Navatelangana.
సంపూర్ణ ఆరోగ్యం సొంతమవ్వాలంటే ఆహారంతోపాటు వ్యాయామం చాలా ముఖ్యం. అయితే దీని కోసం గంటల కొద్ది శ్రమించాల్సిన అవసరం కూడా లేదు. రోజుకు కనీసం పది నిమిషాలు పరుగెత్తినా శారీరక, మానసిక ఆరోగ్యం పుంజుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. దీన్ని ఎప్పుడైనా, ఎక్కడైనా చేయొచ్చని అంటున్నారు. వేగంగా పరుగెత్తినా, నెమ్మదిగా పరుగెత్తినా బోలెడన్ని లాభాలు ఉంటాయి. మరి ఆ ప్రయోజనాలు ఏంటో ఈరోజు తెలుసుకుందాం… ఎలాంటి ఎక్సర్సైజ్ చేసినా ముందుగా కోరుకునేది బలంగా తయారవటం. ఇందుకు పరుగు ఎంతగానో […] The post రోజుకు పది నిమిషాలు appeared first on Navatelangana.
ఎండలు దంచికొడుతున్నాయి. ఎండా వేడిమి నుంచి తట్టుకునేందుకు చాలా మంది ఏసీలకు పనిచెప్పేస్తున్నారు. అయితే ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు ఎక్కువగా ఏసీల్లో ఉంటే కచ్చితంగా కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా ఒబేసిటీ వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని అంటున్నారు. వాతావరణంలో మార్పులు, అధికంగా ఏసీ వినియోగం వంటివి తీవ్రమైన ఆరోగ్య దుష్ప్రయోజనాలుగా మారుతాయని పేర్కొంటున్నారు. శారీరక చురుకుదనం తగ్గిపోతుంది:గదుల్లో గడిపే వ్యక్తులు ఎక్కువగా ఒకే చోట […] The post వేడిగా ఉందని….. appeared first on Navatelangana.
త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ, అనీష్ కురు విల్లా ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’. మధుదీప్ చెలికాని రచన, దర్శకత్వం వహిం చిన ఈ చిత్రాన్ని అరవింద్ మండ్యం లోటస్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్పై నిర్మించారు. సిహెచ్విఎస్ఎన్ బాబ్జీ సమర్పిస్తున్నారు. ఈ చిత్ర టీజర్, ట్రైలర్, పాటలకు ఇప్పటికే ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభించింది. తాజాగా మేకర్స్ విడుదల తేదీని ప్రకటిం చారు. ఈనెల 15న ఈ సినిమా శ్రీ వెంకట […] The post వినోదాత్మకంగా ‘వర్క్ ఫ్రమ్ హోం’ appeared first on Navatelangana.
మలయాళ ఫిల్మ్ మేకర్స్ తెలుగు స్టార్లతో కలిసి పని చేయటం విశేషం. మమ్ముట్టి నటించిన ‘స్ట్రీట్ లైట్స్’కి దర్శకత్వం వహించిన సినిమాటో గ్రాఫర్ షామ్దత్, ‘చౌర్య పాఠం’లో ఆకట్టుకున్న ఇంద్ర రామ్ హీరోగా సైకలాజికల్ థ్రిల్లర్ ‘డోంట్ స్లీప్’ సినిమా చేస్తున్నారు. వి.చూడామణి ఈ చిత్రాన్ని వి డ్రీమ్ ఫిల్మ్స్ బ్యానర్పై ప్రొడక్షన్ నెం 2గా నిర్మిస్తున్నారు. ఇప్పటికే రివీల్ చేసిన టైటిల్, ఫస్ట్లుక్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో రవీంద్ర విజరు ఓ కీలక […] The post భిన్న సైకలాజికల్ థ్రిల్లర్ appeared first on Navatelangana.
హీరో గోపీచంద్ నటించనున్న తన 34వ సినిమా ఆదివారం ప్రారంభమైంది. ఈ సినిమా ద్వారా ఫైట్ మాస్టర్ వి వెంకట్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. 70 ఎఎ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై విజరు చిల్లా, శశి దేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా మలయాళ నటి అనార్కలి నజర్ను ఎంపిక చేసినట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ చిత్రం ద్వారా ఆమె తెలుగు చిత్రసీమలో అడుగుపెడుతున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవం ఆదివారం పూజా కార్యక్రమాలతో ఘనంగా […] The post గోపీచంద్ నయా సినిమా షురూ appeared first on Navatelangana.
ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో ‘వేద వ్యాస్’ చిత్రాన్ని నిర్మిస్తున్న సంస్థ సాయి ప్రగతి ఫిలిమ్స్ బ్యానర్ విజువల్ లోగో ఆవిష్కరణ ఘట్కేసర్లోని కేపీఆర్ఐటీ విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకలో ఘనంగా జరిగింది. షిర్డీ సాయిబాబా విగ్రహానికి నిర్మాత కొమూరి ప్రతాప్ రెడ్డి, ఎస్వీ కృష్ణారెడ్డి, కె. అచ్చిరెడ్డి కలసి పూజ చేస్తున్న దశ్యాన్ని బ్యానర్ లోగోలో చిత్రీకరించారు. కేపీఆర్ఐటీ సంస్థల చైర్మన్గా వ్యవహరిస్తున్న కొమూరి ప్రతాప్ రెడిహీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ లోగో ఆవిష్కరణ వేడుకకు 4 […] The post ‘వేద వ్యాస్’ బ్యానర్ లోగో ఆవిష్కరణ appeared first on Navatelangana.
తాంత్రిక థ్రిల్లర్ ‘అగధ’ అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాలలో ఒకటిగా నిలుస్తోంది. ఎందుకంటే, ఈ చిత్ర దర్శక నిర్మాతలు విడుదల చేసిన తొలి పోస్టర్తోనే భారీ ఉత్సుకతను రేకెత్తించగలిగారు. ఒక భారీ విగ్రహం ముందు ఒక మహిళ నిలబడి ఉన్న చిత్రం యొక్క మొట్టమొదటి పోస్టర్, ట్రేడ్, ప్రేక్షకులు, వ్యాపార వర్గాలలో సినిమాపై ఆసక్తిని పెంచింది. ఇప్పుడు దర్శక, నిర్మాతలు ఒక కొత్త పోస్టర్ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో ఒక చీకటి గుహ లాంటి […] The post ఆ రహస్యం ఏమిటి? appeared first on Navatelangana.

‘తిమ్మరాజుపల్లి టీవీ’ చిత్రానికి మంచి విజయం దక్కిన సంగతి తెలిసిందే. ఈ మూవీతో హీరో కిరణ్ అబ్బవరం దాదాపుగా 50 మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లను తెరకు పరిచయం చేశారు. వారిలో విలన్ పాత్రలో సిద్ధయ్యగా నటించిన లతీష్ మంచి పేరు సంపాదించుకున్నారు. తనకు దక్కిన ఈ మొదటి విజయం గురించి మీడియాతో షేర్ చేసుకున్నారు. నగరిలో మాది వ్యవసాయ ఆధారిత నిరుపేద కుటుంబం. నేను సినిమాల్లోకి వచ్చానని మా అన్నయ్య నాతో మాట్లాడటం మానేశాడు. కానీ ఈ […] The post ఆ సిద్ధయ్య నువ్వేనా..? అని అడుగుతున్నారు appeared first on Navatelangana.



మన తెలంగాణ/హైదరాబాద్ః బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్, మాజీ మంత్రి టి. హరీష్ రావు అధికారం కోల్పోయిన అక్కసుతో, తమ రాజకీయ స్వలాభం కోసం అనవసరంగా రైతులను రెచ్చగొడుతున్నారని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య మండిపడ్డారు. తమ ప్రభుత్వం రైతులకు పెద్ద పీట వేసిందని ఆయన ఆదివారం విలేకరుల సమావేశంలో చెప్పారు. రాష్ట్రంలో 8 వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. రైతులను రెచ్చగొట్టే చర్యలు మానుకోవాలని ఆయన హరీష్ రావుకు హితవు చెప్పారు. రైతులను రెచ్చగొట్టేందుకు ధర్నాలు చేయిస్తున్నారని ఆయన విమర్శించారు. కెసిఆర్ ఫాం హౌస్లో కూర్చొని రైతులను రెచ్చగొడుతున్నారని ఆయన విమర్శించారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు రైతులను ఆదుకున్నారా ? అని ఆయన ప్రశ్నించారు. రైతుల రెండు లక్షల రూపాయల రుణ మాఫీ చేశామని ఆయన చెప్పారు. రైతు భరోసా ఇచ్చామని, సన్న బియ్యం పండిస్తే ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తున్నామని ఆయన వివరించారు. రైతుల సంక్షేమం చూసి జీర్ణించుకోలేక విమర్శలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య అన్నారు. రైతుల వద్ద ఆఖరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని ఆయన వివరించారు.
నవతెలంగాణ – బల్మూరు మండల పరిధిలోని రామాజీ పల్లి గ్రామంలో ఆదివారం మేక రెండు తలలున్న జీవానికి జన్మనిచ్చింది. గ్రామానికి చెందిన బక్కమ్మ అనే మేకల కాపరి మేకల మందలో ఈ వింత ఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న ఆయా చుట్టుపక్కల గ్రామస్తులు రెండు తలల మేక పిల్లను చూసేందుకు ఆసక్తిగా అక్కడికి చేరారు. అప్పటికే రెండు తల వింత జీవి మృతి చెందినట్లు మేకల కాపరి వెల్లడించారు. The post రెండు తలలతో వింత జననం appeared first on Navatelangana.


