22070 వార్తలు






హైదరాబాద్: హైడ్రా పేద ప్రజలతో ఆటలాడుకుందని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజ్ శ్రవణ్ కుమార్ ఆరోపించారు. సిఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న బుల్డోజర్ పాలనపై హైకోర్టు చేసిన స్ట్రైక్ ఇది అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశ చరిత్రలోనే అతితక్కువ సార్లు ఇలాంటి తీర్పులు వచ్చాయని, హైకోర్టు తీర్పు చెంప చెల్లమనేలా ఉందని చురకలంటించారు. మూడున్నర లక్షల నిరుపేద కుటుంబాలకు మాజీ సిఎం కెసిఆర్ ప్రభుత్వం పట్టాలిచ్చిందని, అధికారంలోకి వచ్చాక బంగాళాఖాతంలో పడేస్తామని కెసిఆర్ చెప్పారని అన్నారు. హైకోర్టు కూడా హైడ్రాను బంగాళాఖాతంలో వేసినట్లు తీర్పు ఇచ్చిందని, జగిత్యాలలో కెసిఆర్ చెప్పిందే నిజమైందని తెలియజేశారు. రేవంత్ రెడ్డి ఇల్లు, సోదరుల ఇండ్లు హైడ్రాకు కనబడడం లేదా? అని కెటిఆర్ ప్రశ్నించారని దాసోజ్ అన్నారు. హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా రంగనాథ్ కు బుద్ధి రావడం లేదని, రంగనాథ్ మళ్లీ కోర్టుధిక్కరణకు పాల్పడుతున్నారని విమర్శించారు. రంగనాథ్ ను పలికిస్తున్నది రేవంత్ రెడ్డేనని భావిస్తున్నామని, రంగనాథ్ తోలు బొమ్మ అని ఎద్దేవా చేశారు. రంగనాథ్ ను ఆడిస్తున్నది అసలు నిందితుడు రేవంత్ రెడ్డ

న్యూయార్క్: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ వాసి దుర్మరణం చెందారు. న్యూజెర్సీలో సిగ్నల్ వద్ద కారును మరో కారు ఢీకొట్టడంతో ఓ మహిళా చనిపోయింది. మృతురాలు రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం ఆకుతోటపలోలి గ్రామానికి చెందిన శ్రీపాతి దీపారెడ్డిగా గుర్తించారు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.... మాడుగుల మండల కేంద్రానికి చెందిన పట్టాభి శేఖర్ రెడ్డి, శశిరేఖ దంపతులకు దీపారెడ్డి కూతురు. 20 సంవత్సరాల క్రితం ఆకుతోటపల్లి గ్రామానికి చెందిన రామకృష్ణారెడ్డితో దాపారెడ్డి పెళ్లి జరిగింది. ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు కావడంతో అమెరికాలోని న్యూజెర్సీలో నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. న్యూజెర్సీలో దీపారెడ్డి కారులో ప్రయాణిస్తుండగా ఆమె కారును మరో కారు ఢీకొట్టడంతో ఆమె ఘటనా స్థలంలోనే మరణించింది.







డిల్లీ: నీట్ లీక్ పై ఆందోళన చేసిన విద్యార్థులకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. జంతర్ మంతర్ వద్ద పోలీసులు లాఠీచార్జిపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. నేరచరిత్ర లేని అరెస్టైన విద్యార్థులను, నిరసనకారులను అన్ని రాష్ట్రాల్లో వదిలి వదిలి పెట్టాలని, కేంద్రం సహా పలు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. విద్యార్థులపై పెట్టిన కేసులను ఉపహిరించుకోవాలని సూచించింది. ఘటనలపై సిసి ఫుటేజ్ ను కోర్టుకు సమర్పించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.


హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న ఇన్ స్పెక్టర్ పై డిజిపికి ఓ యువతి ఫిర్యాదు చేసింది. మాయమాటలతో సదరు యువతిని ఇన్ స్పెక్టర్ లొంగదీసుకున్నాడు. అనంతరం ఆమె గర్భవతి కావడంతో అబార్షన్ చేయించాడు. ఆమెతో చనువుగా ఉన్న వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసి రెండు కోట్ల రూపాయలు వసూలు చేశాడని సదరు యువతి ఆరోపణలు చేసింది. ఇన్ స్పెక్టర్ వేధింపులు శృతిమించడంతో డిజిపిని యువతి ఆశ్రయించింది. తనకు న్యాయం చేయాలని, ఇనస్పెక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిజిపికి యువతి ఫిర్యాదు చేసింది.


అమరావతి: అనంతపురం జిల్లా డి.హీరేహాల్ మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఓ యువకుడు ఆత్మహత్యకు సిద్ధపడ్డాడు. తిప్పేరుద్ర (35) అనే వ్యక్తి పెళ్లికాలేదని మనస్థాపానికి చెంది వ్యవసాయ పొలంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.




