
4606 వార్తలు

’ఈ నగరానికి ఏమైంది’ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సక్సెస్ని కొనసాగిస్తూ సినిమా సీక్వెల్ ‘ఈఎన్ఈ రిపీట్’ ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోంది. విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను మళ్లీ కలిసి నటిస్తూ, మొదటి భాగంలో కనిపించిన కెమిస్ట్రీని తిరిగి తెరపైకి తీసుకురానున్నారు. శ్రీనాథ్ మాగంటి కొత్తగా చేరారు. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ఎస్ ఒరిజినల్స్, రూట్నోడ్ సినిమా బ్యానర్పై సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి ఈ ప్రాజెక్ట్ను నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం థాయిలాండ్లో జరుగుతోంది. ఈ షెడ్యూల్ నెల పాటు కొనసాగుతుంది. సెట్ నుంచి వచ్చిన ఫోటో అందరినీ ఆకట్టుకుంది. ‘టీమ్ కన్యారాసి‘ గ్యాంగ్కు చెందిన ఆ నలుగురు అబ్బాయిలు వింటేజ్ కారులో హాయిగా కూర్చుని, ఎంతో ఉత్సాహంతో కనిపిస్తున్నారు.


లండన్: జర్మనీ లోని గురుద్వారాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తి ఆయుధాలు, కత్తుల దాడి వల్ల నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం మధ్యాహ్నం 2.20 గంటలకు జర్మనీ లోని మోయిర్స్ సిటీ గురుద్వారాలో ఈ సంఘటన జరిగింది. సిక్కు సమాజం లోని రెండు వర్గాల మధ్య మొదలైన చిన్నగొడవ చివరకు ఆయుధాలు, కత్తుల దాడికి దారి తీసిందని అధికారులు చెప్పారు. అయితే ఘర్షణకు కారణాలేమిటో ఇంకా తెలియడం లేదని పోలీసులు చెప్పారు.


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ఇరాన్పై కఠిన హెచ్చరికలు జారీ చేశారు. బుధవారం ముగియనున్న రెండు వారాల కాల్పుల విరమణ గడువులోపు ఒప్పందం కుదరకపోతే, ఇరాన్పై బాంబు దాడులు ప్రారంభిస్తామని ట్రంప్ తెలిపారు. నేను అలా చేయాలని అనుకోవడం లేదు అని సీఎన్బీసీ ‘స్క్వాక్ బాక్స్’ కార్యక్రమంలో ట్రంప్ అన్నారు. శాంతి చర్చలు కొనసాగేందుకు కాల్పుల విరమణను పొడిగిస్తారా అన్న ప్రశ్నకు స్పందిస్తూ, వారు చర్చలకు రావాల్సిందే. ఒప్పందం కుదిరితే ఇరాన్ మళ్లీ బలమైన దేశంగా ఎదగగలదు అని పేర్కొన్నారు. అయితే ఒప్పందం లేకుండా కాల్పుల విరమణ ముగిస్తే, దాడులు మళ్లీ ప్రారంభించడానికి తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. అలాంటి దృక్పథంతో ముందుకు వెళ్లడం మంచిదని నేను భావిస్తున్నాను అని ట్రంప్ వ్యాఖ్యానించారు.ఇరాన్తో జరుగుతున్న చర్చలపై ఆశాభావం వ్యక్తం చేసిన ట్రంప్, మంచి ఒప్పందం కుదురుతుందని అనుకుంటున్నాను. వారికి వేరే మార్గం లేదు అని అన్నారు. మేము వారి నౌకాదళాన్ని, వైమానిక దళాన్ని దెబ్బతీశాం. వారి నాయకత్వాన్ని కూడా ప్రభావితం చేశాం అని పేర్కొన్నారు. అయితే, నాయకత్వ మార్పు పరోక్షంగా జరిగిందని ట్రంప్ సూచిస్తూ, ఇది నేరుగా చెప




ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య చారిత్రాత్మక దౌత్య చర్చలు గురువారం వాషింగ్టన్ లో పునఃప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని ఇజ్రాయెల్, లెబనాన్, అమెరికా అధికార వర్గాలు వెల్లడించాయి. అంతర్గత చర్చలకు సంబంధించిన సమాచారం కావడంతో, అధికారులు గోప్యతా నిబంధనల మేరకు పేర్లు వెల్లడించలేదు. దశాబ్దాల తరువాత గత వారం ఇజ్రాయెల్, లెబనాన్ రాయబారులు నేరుగా సమావేశమై చర్చలు జరపడం గమనార్హం. ఈ చర్చల ద్వారా హిజ్బుల్లా మిలిటెంట్లను నిరాయుధీకరించడం, లెబనాన్తో శాంతి ఒప్పందం కుదుర్చుకోవడం లక్ష్యమని ఇజ్రాయెల్ వెల్లడించింది.ఇదే సమయంలో లెబనాన్లో 10 రోజుల కాల్పుల విరమణ శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది. అమెరికాఇజ్రాయెల్ సంయుక్త దాడులు ఇరాన్పై ప్రారంభమైన రెండో రోజునే, ఇజ్రాయెల్, ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా మిలిటెంట్ల మధ్య ఘర్షణలు చెలరేగాయి. లెబనాన్లో జరిగిన పోరాటాల్లో ఇప్పటివరకు 2,290 మందికి పైగా మరణించినట్లు సమాచారం. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్లో కనీసం 3,375 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. అదనంగా ఇజ్రాయెల్లో 23 మంది, గల్ఫ్ అరబ్ దేశాల్లో మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. లెబనాన్లో 15 మంది ఇజ్రాయెల్ సైనికులు, ప్రాం



చెన్నై: వరుస ఓటములతో సతమతమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్కు మరో షాక్ తగిలింది. గాయంతో యువ ఆటగాడు ఆయుష్ మాత్రె ఐపిఎల్కు దూరమయ్యాడు. ఈ సీజన్లో చెన్నై అంతంత మాత్రంగానే రాణిస్తోంది. ఆరు మ్యాచుల్లో కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించింది. ఇలాంటి స్థితిలో ప్రతిభావంతుడైన బ్యాటర్గా పేరున్న ఆయుష్ దూరం కావడం సిఎస్కెకు పెద్ద ఎదురు దెబ్బగానే విశ్లేషకులు అభిప్రాయపడుతున్నాడు. ఉప్పల్ వేదికగా సన్రైజర్స్తో జరిగిన మ్యాచ్ సందర్భంగా ఆయుష్ గాయానికి గురయ్యాడు. తర్వాత నిర్వహించిన వైద్య పరీక్షల్లో గాయం తీవ్రత అధికంగా ఉన్నట్టు తేలింది. అతనికి కనీసం ఆరు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు తేల్చారు. దీంతో ఆయుష్ ఈ సీజన్లోని మిగిలిన మ్యాచ్లకు అందుబాటులో లేకుండా పోయాడు. ఈ విషయాన్ని సిఎస్కె యాజమాన్యం మంగళవారం అధికారికంగా ప్రకటించింది.

గతంలో కాంగ్రెస్ను వీడి బిఆర్ఎస్లో చేరిన మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు పట్టిన గతే మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డికీ పడుతుందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి అన్నారు. బిఆర్ఎస్లో చేరిన జీవన్ రెడ్డికి ఆ పార్టీ అధినేత కెసిఆర్ వెంటనే ప్రధాన కార్యదర్శి పదవి అప్పగించారని, నిజానికి తమ పార్టీ అధినేతగా చేయాలనుకున్నామని ఎంపీ చామల మంగళవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. జీవన్ రెడ్డి ఆలోచన లేని పని చేశారని అన్నారు. బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలది రాహు, కేతు గ్రహం అని ఇటీవల కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ విమర్శించడాన్ని ఎంపీ చామల తీవ్రంగా ఖండించారు. అసలు బండి సంజయ్ ఏ గ్రహం అని ఆయన అన్నారు. నవ గ్రహాల్లో బండి సంజయ్ ఉన్నారా? అని ఆయన ప్రశ్నించారు.కేంద్ర మంత్రి బండి ప్రెస్ మీట్లకే పరిమితం అవుతున్నారని ఆయన విమర్శించారు.రాష్ట్రంలోని పెండింగ్ సమస్యలను పరిష్కారం చేయాలనే ఆలోచన ఏమైనా ఉందా? అని ఆయన ప్రశ్నించారు. మెట్రో పేజ్ 2, ట్రిపుల్ ఆర్, మూసీ ప్రక్షాళన విషయంలో మీ వైఖరి ఏమిటని ఆయన ప్రశ్నించారు. భువనగిరి లోక్సభ పరిధి కోసం నిధులు తీసుకుని వచ్చేందుకు బహిరంగ సభను కేంద్ర మంత్రులు బండి సంజయ్, జి.

వాషింగ్టన్: హర్మూజ్ జలసంధి వద్ద ఇరాన్ పతాకంతో ప్రయాణిస్తున్న తౌస్కా అనే వాణిజ్య నౌకను అమెరికా ఇటీవల సీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ నౌకలో క్షిపణి తయారీకి వినియోగించే రసాయనాలు ఉన్నాయని ఐక్యరాజ్యసమితిలో యూఎస్ మాజీ రాయబారి , రిపబ్లికన్ నేత హేలీ సంచలన ఆరోపణలు చేశారు. ఈమేరకు ఆమె ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. దీనిని బట్టి ఇరాన్కు చైనా సైనిక సాయం అందిస్తోందనే విషయాన్ని కొట్టి పారేయలేమని ఆరోపించారు. ఈ తొస్కా నౌక అనేక సార్లు చైనాకు వెళ్లిందని, ఇరాన్ క్షిపణుల తయారీకి కావలసిన రసాయనాలను తీసుకొచ్చిందని వాల్స్ట్రీట్ జర్నల్ కథనం పేర్కొంది. గత ఆరు వారాల్లో ఈ నౌక చైనాకు రెండు సార్లు వెళ్లిందని పేర్కొంది. మరోవైపు తౌస్కా నౌకను, అందులోని సిబ్బందిని తక్షణమే విడుదల చేయాలని ఇరాన్ విదేశాంగ శాఖ డిమాండ్ చేసింది. ఇది వెంటనే జరగకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని అమెరికాను హెచ్చరించింది.ఇరాన్ నౌకతో మా సంబంధం లేదు: చైనాఅమెరికా సీజ్ చేసిన ఇరాన్ తౌస్కా వాణిజ్య నౌకలో క్షిపణుల తయారీకి కావలసిన చైనా రసాయనాలు ఉన్నాయన్న ఆరోపణలను చైనా కొట్టి పారేసింది. “నాకు తెలిసినంతవరకు , ఇది విదేశీ పతాకం కలిగిన నౌక. దాంతో తమ దే

కళ్లజోడు విక్రయ సంస్థ లెన్స్కార్ట్ షోరూమ్లో హిజాబ్ బిందీ వివాదం ఉద్రిక్తతలకు దారితీసింది. ఉద్యోగులు హిందూత్వాన్ని ప్రతిబింబించే బింది, బొట్టు పెట్టుకోవడం వంటివి చేయకూడదు అని చెబుతూ, హిజాబ్కు అనుమతి ఇస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో బీజేపీ మైనారిటీ మోర్చా నేతల ఆధ్వర్యంలో కొందరు హిందూ సంఘాల కార్యకర్తలు స్టోర్లోకి దూసుకెళ్లి నిరసన వ్యక్తం చేశారు. ఈ చర్యలకు బీజేపీ మైనారిటీ మోర్చా నేత నాజియా ఎలాహీ నాయకత్వం వహించారు. కార్యకర్తలు స్టోర్లోకి ప్రవేశించి సిబ్బందికి బొట్టు పెట్టడంతో పాటు చేతులకు పవిత్ర దారాలను కట్టారు. అలాగే జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాజియా ఎలాహీ స్టోర్ ఫ్లోర్ మేనేజర్ మొహ్సిన్ ఖాన్ను ప్రశ్నిస్తూ, హిందూ మతంలోని కొన్ని సంప్రదాయాల ఆంక్షలపై వస్తున్న ఆరోపణలకు వివరణ కోరారు. మీరు మొహ్సిన్ ఖాన్ కాబట్టే బొట్టు పెట్టుకోవడాన్ని ఆపారా? అని ఆమె వీడియోలో ప్రశ్నించినట్లు వినిపించింది.నాజియా ఎలాహీ మాట్లాడుతూ స్టోర్నిర్వహణపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఒక మతాన్ని ప్రోత్సహిస్తూ మరొక మతాన్ని అణగదొక్కుతున్నారు. ఇది హిందూ దేశం. సంస్థ యజమాని క్షమాపణ చెప్పకపోతే లెన్స్కార్ట్ను

భారత్ రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) పార్టీ రజతోత్సవ సంబురాల సందర్భంగా పార్టీ అధినేత కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఈ నెల 27వ తేదీన ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్లో ఈ భేటీ జరగనుంది. పార్టీ సంస్థాగత బలోపేతంపై దృష్టి సారించిన గులాబీ బాస్, ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనునే అవకాశం ఉన్నది. ముఖ్యంగా పార్టీ సంస్థాగత నిర్మాణం సభ్యత్వాల పునరుద్ధరణ వంటి అంశాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించనున్నారు. మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీ క్యాడర్ను ఎలా ముందుకు తీసుకెళ్లాలి, సభ్యత్వ నమోదు ప్రక్రియను ఏ విధంగా వేగవంతం చేయాలి అనే విషయాలపై కెసిఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.వీటితో పాటు ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై కూడా ఈ భేటీలో స్పష్టత రానుంది. ఈ సమావేశానికి పార్టీకి చెందిన ముఖ్య నేతలందరినీ ఆహ్వానించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులతో పాటు ఎంపీలు, ఎంఎల్ఎలు, ఎంఎల్సిలు తప్పనిసరిగా హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. అలాగే మాజీ ఎంఎల్ఎలు, మాజీ ఎంఎల్సిలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు,

మనతెలంగాణ, సిటిబ్యూరోః రీల్స్ పిచ్చి ఓ బాలుడి ప్రాణాలు తీసిన సంఘటన నాచారం, మల్లాపూర్లో వెలుగులోకి వచ్చింది. రీల్స్ కోసం వీడియో తీస్తు బిల్డింగ్పై నుంచి కిందపడడంతో మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బీహార్ రాష్ట్రానికి చెందిన బాలుడు మితున్(14) తల్లిదండ్రులు బతుకు దెరువు కోసం నాచారం, మల్లాపూర్కు వచ్చి పనిచేస్తున్నారు. మల్లాపూర్, గాంధీ బొమ్మ దగ్గర ఉన్న బస్తీలో ఉంటున్నారు. బాలుడు సమీపంలోని పాఠశాలలో చదువుతున్నాడు, బాలుడు తరచూ ఇన్స్ట్రాగ్రాం, యూట్యూబ్లో రీల్స్ చూసేవాడు. తాను కూడా రీల్స్ చేసి ఫేమస్ కావాలని ఆలోచించాడు. ఈ క్రమంలోనే మార్చి 5వ తేదీన తాను ఉంటున్న భవనం బాల్కనీ రేయిలింగ్ పిట్ట గొడపై ఫీట్స్ చేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ రెండు రోజుల క్రితం మృతిచెందాడు.

బెంగళూరు, హర్యానా డిఫెన్స్ మద్యం విక్రయం రూ.10 లక్షల విలువైన మద్యం స్వాధీనం మనతెలంగాణ, సిటిబ్యూరోః నిబంధనలకు విరుద్ధంగా డిఫెన్స్ మద్యం నిల్వ చేసిన ఇంటిపై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది మంగళవారం దాడి చేసి పట్టుకున్నారు. రూ.10లక్షల విలువైన 361 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ సిబ్బంది కథనం ప్రకారం...రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి దొడ్ల సురేష్ రెడ్డి హస్తినాపురంలో ఉంటున్నాడు. గత కొంత కాలం నుంచి సురేష్ బెంగళూరు, హర్యానా రాష్ట్రాల్లోని ఆర్మీ క్యాంటీన్ల నుంచి కొనుగోలు చేసిన ఖరీదైన మద్యం బాటిళ్లను హస్తినాపురానికి తీసుకుని వచ్చి అవసరం ఉన్న వారికి మార్కెట్ ధరకు విక్రయిస్తున్నాడు. ఈ సమాచారం అందుకున్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది శ్రీరమణ కాలనీ, ఫేజ్2లోని ఇంట్లో దాడి చేసి మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ సిబ్బంది దాడి చేస్తున్నట్లు తెలుసుకున్న సురేష్ రెడ్డి ఇంటి నుంచి పారిపోయాడు. కేసు దర్యాప్తు కోసం మద్యం బాటిళ్లను స్థానిక ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు.

మనతెలంగాణ,సిటిబ్యూరోః గంజాయి అలవాటుతో సాఫ్ట్వేర్ ఉద్యోగం పోగొట్టుకున్న యువకుడు... ఇంటిపైనే గంజాయి మొక్కలను పెంచుతూ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది చేతికి చిక్కాడు. ఎక్సైజ్ సిబ్బంది కథనం ప్రకారం... నాచారం, ఈస్ట్ గాంధీనగర్కు చెందిన సిహెచ్.శశిధర్ చదువు పూర్తి చేసుకున్న తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరాడు. ఉద్యోగంలో చేరిన తర్వాత యువకుడు గంజాయికి అలవాటు పడ్డాడు. ఈ క్రమంలోనే వచ్చే జీతమంతా గంజాయి కొనుగోలుకే వెచ్చించడంతో చేతిలో చిల్లిగవ్వలేకుండా పోయింది. దీంతో యువకుడు తన ఇంటిపైనే గంజాయి మొక్కలను పెంచుతున్నాడు. దాని నుంచి వచ్చే గంజాయిని తాను వినియోగించుకుంటున్నాడు. ఈ విషయం రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బందికి తెలియడంతో సిఐ బాలరాజు, సిబ్బంది కలిసి దాడి చేశారు. ఇంటిపై పెంచుతున్న 17 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి మొక్కలు మూడు మీటర్లు పెరిగి, పూతకు వచ్చాయి. ఈ మొక్కలు నుంచి 10కిలోల గంజాయి వచ్చే అవకాశం ఉన్నట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి కేసు దర్యాప్తు కోసం ఘట్కేసర్ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు. మరో కేసులో గంజాయి విక్రయ

నాసిక్ : టిసిఎస్ నాసిక్ కేసులో టిసిఎస్ ఉద్యోగిని నిదాఖాన్ అరెస్ట్ నుంచి తాత్కాలిక రక్షణ పొందడంలో విఫలమైన తరువాత ఆమె గురించి సీనియర్ పోలీస్ అధికారి ఒకరు మంగళవారం వివరించారు. నాసిక్ కంపెనీలో బలవంతపు మత మార్పిడిలో ఆమె కీలక పాత్ర వహించారని, ప్రస్తుతం ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. నాసిక్ లోని ఐటీ మేజర్ యూనిట్లో లైంగిక వేధింపుల కేసులపై చర్చించారు. ఇంతవరకు ఎనిమిది మందిని ఈ కేసులో అరెస్టు చేశారు. పోష్ (ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హెరాస్మెంట్ )కమిటీ వీడియో కాన్షరెన్సులపై ఆధారపడకుండా తరచుగా వ్యక్తిగతంగా స్థానిక సభ్యులను కలుసుకుని వివరాలు సేకరించాలన్నారు. ఈ కేసులో తొమ్మిది ఎఫ్ఐఆర్లు నమోదు కాగా, అందులో ఒకదానిలో నిదాఖాన్, మరో నలుగురు నిందితులుగా ఆరోపించబడింది. లైంగిక వేధింపులే కాదు, బలవంతంగా మతం మార్పిడి చేయించడం లోనూ ఆమె పాత్ర ఉన్నట్టు తేలింది. ఈ కేసు వెలుగు లోకి వచ్చిన దగ్గరి నుంచి ఆమె పరారీలో ఉంది. సోమవారం సెషన్స్ కోర్టు ఆమెకు అరెస్టు నుంచి తాత్కాలిక రక్షణ ఇవ్వడానికి నిరాకరించింది. ఈమేరకు ఆమె యాంటిసిపేటరీ బెయిల్పై విచారణ ఏప్రిల్ 27కు వాయిదా పడింది. నాసిక్ పోలీస


నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన ‘దివ్య భారత్’ పర్యాటక నివేదికలో తెలంగాణ రాష్ట్రానికి విశిష్ట గుర్తింపు లభించడంపై రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని వైవిధ్యభరితమైన పర్యాటక సామర్థ్యానికి ఈ నివేదిక అద్దం పడుతోందని, ఇది తెలంగాణకు గర్వకారణమని ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ పర్యాటక రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి ఈ గుర్తింపు నిదర్శనమని మంత్రి మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాజధాని హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్, చారిత్రక గోల్కొండ కోట, భువనగిరి కోట వంటి కట్టడాలతో పాటు ఆధ్యాత్మికత ఉట్టిపడే యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం వంటి ప్రసిద్ధ క్షేత్రాలు నిత్యం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయని వివరించారు. కేవలం చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాంతాలే కాకుండా ప్రకృతి ఒడిలో విరాజిల్లే కుంటాల, బొగత జలపాతాలు, ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా పేరొందిన సమ్మక్క-సారలమ్మ మేడారం జాతర వంటి సాంస్కృతిక వేడుకలు రాష్ట్ర పర్యాటక రంగానికి ప్రత్యేక
