22040 వార్తలు

జగిత్యాల జిల్లా కేంద్రంలోని యవార్ రోడ్డులో ఆర్టీసీ అద్దె బస్సు, ఓ ప్రైవేట్ స్కూల్ బస్సును ఢీకొట్టడంతో ఇద్దరు విద్యార్థులకు గాయాలవ్వగా రెండు బస్సులకు నష్టం వాటిల్లింది. ఈ ఘటనలో ఆర్టీసీ బస్సు ముందు భాగం దెబ్బతినగా పాఠశాల బస్సు స్వల్పంగా దెబ్బతింది.ప్రమాద సమయంలో పాఠశాల బస్సులో మొత్తం 26 మంది విద్యార్థులు ఉండగా వారిలో ఇద్దరికి మాత్రమే స్వల్ప గాయాలయ్యాయి.మిగిలిన విద్యార్థులు సురక్షితంగా బయటపడటంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఆర్టీసీ బస్సు బ్రేకులు పడకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని తెలిసింది.

పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాలని ఉద్యమిస్తున్న నిరసనకారులపై పాకిస్థాన్ భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో గత 24 గంటల్లో 20 మంది మృతి చెందగా, 50 మందికి పైగా గాయపడ్డారు. రావల్కోట్లోని డ్రేక్ ఎయిత్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎన్నికల బహిష్కరణకు పిలుపునిస్తున్న జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జేఏఏసీ) కార్యకర్తలపై భద్రతా బలగాలు కాల్పులు జరిపినట్లు స్థానిక వర్గాలు తెలిపాయి. ఈ ఘటనలో జేఏఏసీ ప్రధాన కమిటీ సభ్యుడు, అధికార ప్రతినిధి ఉమర్ నజీర్ కశ్మీరీ సోదరుడు ఉస్మాన్ నజీర్ కూడా మృతిచెందినట్లు సమాచారం.జూన్ 5 నుంచి పీవోకేలో ఎన్నికల వ్యతిరేక ఆందోళనలు ప్రారంభమైనప్పటి నుంచి పాకిస్థాన్ భద్రతా బలగాల చర్యల్లో ఇప్పటివరకు సుమారు 80 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక వర్గాలు పేర్కొన్నాయి.సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియోల్లో నిరసనకారుల మృతదేహాలు రహదారులపై కనిపిస్తుండగా, గుంపులపై భద్రతా బలగాలు కాల్పులు జరుపుతున్న దృశ్యాలు ఉన్నట్లు తెలుస్తోంది.పీవోకేకు చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అఖీల్ భాయ్ విడుదల చేసిన వీడియో సందేశంలో, రావల్కోట్ మృతదేహాలు, క్షతగాత్రులతో నిండిప

జపాన్ దక్షిణ ప్రధాన ద్వీపమైన క్యుషూలోని కుమమోటో ప్రిఫెక్చర్లో మంగళవారం 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం సముద్ర మట్టానికి 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు జపాన్ వాతావరణ సంస్థ (జేఎంఏ) వెల్లడించింది. భూకంపం కారణంగా పలువురు గాయపడగా, ఒక భవనం కూలిపోయినట్లు ప్రధానమంత్రి సనాయే తకైచి తెలిపారు.భూకంపం అనంతరం గరిష్ఠంగా ఒక మీటర్ ఎత్తులో సునామీ అలలు వచ్చే అవకాశం ఉందంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంత ప్రజలు వెంటనే సురక్షితమైన ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఒక మీటర్ ఎత్తులో అలలు నమోదైనట్లు జాతీయ ప్రసార సంస్థ ఎన్హెచ్కే వెల్లడించింది. నష్టంపై వెంటనే సమగ్ర సమాచారం సేకరించాలని, ప్రాణ రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ సహాయక చర్యలు చేపట్టాలని ప్రధానమంత్రి కార్యాలయం అధికారులను ఆదేశించింది. భూకంపం ప్రభావంతో అణు విద్యుత్ కేంద్రాల్లో ఎలాంటి అసాధారణ పరిస్థితులు తలెత్తలేదని జపాన్ అణు నియంత్రణ సంస్థ స్పష్టం చేసింది. కుమమోటోతో పాటు నాగసాకి, కగోషిమా, ఫుకుఒకా, సాగ, ఓయిటా, మియాజాకి ప్రిఫెక్చర్లకు అత్యవసర భూకంప హెచ్చరికలు జారీ చేశారు.జపాన్ ప్రపంచంలో అత్యధిక




హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్లో శ్రీ భవానీ క్రియేషన్స్ బ్యానర్పై తెరకెక్కుతున్న భావోద్వేగ ప్రధాన చిత్రం ‘తీరం’ టైటిల్ సాంగ్ను ఘనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొని చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ‘పుష్ప’ ఫేమ్ నటుడు జగదీష్, ఫన్ బకెట్ మహేష్ విట్ట, నటుడు రాజ్కుమార్ కసిరెడ్డి, దర్శకుడు ప్రసాద్, జబర్దస్త్ సద్దాం, నటుడు కుమానన్ తదితరులు హాజరై టైటిల్ సాంగ్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శకుడు వంశీ మునగాల మాట్లాడుతూ తీరం చిత్రం ప్రతి ఒక్కరి హృదయాలను తాకేలా భావోద్వేగభరితమైన కథతో రూపొందుతోందన్నారు. నిర్మాత ఉపేందర్ గంగావెల్లి మాట్లాడుతూ సినిమా నిర్మాణం తుది దశకు చేరుకుందని, విడుదల తేదీతో పాటు ఇతర విశేషాలను త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో హీరో ప్రభు, హీరోయిన్ హరిప్రియా, రమణ, విజయ్ శెట్టి పాల్గొన్నారు.





హైదరాబాద్: తప్పుడు కేసులపై న్యాయస్థానాల్లో ఎదుర్కొంటామని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఒక అధికారిని ఎక్కడ నియమించాలనేది ప్రభుత్వ విచక్షణ అధికారమని, ప్రభుత్వ విచక్షణ అధికారాన్ని ఎవరూ లాక్కోలేరని అన్నారు. హైడ్రా కమిషనర్ అంశంలో హైకోర్టు తీర్పుపై సిఎం స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో జిహెచ్ఎంసీ కమిషనర్ ఐఎఎస్ అధికారి సోమేశ్ కుమార్ పై 400 కోర్టు ధిక్కరణ కేసులున్నాయని విమర్శించారు. హైడ్రా..ప్రభుత్వం తీసుకువచ్చిన అతిపెద్ద సంస్కరణ అని హైడ్రా బాగుందంటూ దేశవ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయని, హైడ్రాను మరింత బలోపేతం చేస్తామని రేవంత్ తెలియజేశారు. పార్కులు, చెరువుల్లో కబ్జాలు పెడితే కూలగొడతారని, చెరువులు, కుంటలు నాలాలనే కాపాడడమే హైడ్రా విధి అని సూచించారు. కబ్జాకోరులు తప్పుడు పత్రాలతో కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారని, బతుకమ్మ కుంటను కబ్జా పెడితే పునరుద్ధరించారని..దానిపై కోర్టుకు ఎక్కారని మండిపడ్డారు. బతుకమ్మకుంటలో బిఆర్ఎస్ నేత 10 ఎకరాలు కబ్జా పెట్టారని, మాజీ సిఎం కెసిఆర్ పర్యటన సందర్భంగా ఆ నేత పూలవర్షం కురిపించాడని, పదెకరాలు కబ్జా పెడితే కనకవర్షం కూడా కురిపించవచ్చునని రేవంత్ ఎద్దే

ఢిల్లీ: అనేక లీకేజీ కేసుల్లో నిందితులను ఈ ప్రభుత్వం బెయిలిచ్చిందని పార్లమెంట్ సభ్యుడు గౌరవ్ గొగోయ్ ఆరోపించారు. లీకేజీ కేసుల విచారణలో ప్రభుత్వం ఉదాసీన వైఖరి ప్రదర్శించిందని అన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరిగాయి. నీట్ పేపర్ లీకేజీ విషయంపై లోక్ సభలో ఆయన మాట్లాడారు. 2024 నీట్ లీకేజీ నిందితుల్లో 44 మందికి బెయిల్ ఇచ్చారని, నీట్ లీకేజీతో 21 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నా ప్రధాని నరేంద్ర మోడీ కనీసం స్పందించలేదని, ఇప్పుడు టాస్క్ ఫోర్స్ వేశామని ప్రధాని ఇన్ స్టా రీల్ ద్వారా చెప్పారని విమర్శించారు. రెండేళ్ల క్రితం కూడా నిపుణుల కమిటీ వేశారు కదా! దానిపై ఏం చేశారు? అని గౌరవ్ గంగోయ్ ప్రశ్నించారు. పదేపదే లీకేజీలు జరుగుతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తూ ఉండిపోయిందని, పదే పదే లీకేజీలు జరుగుతున్నా ఎన్డిఎ ఛైర్మన్ ను ఎందుకు తొలగించలేదు? అని ప్రశ్నించారు. ఎన్డిఎ ఛైర్మన్ గతంలో మధ్యప్రదేశ్ పిఎస్సి ఛైర్మన్ గా కూడా ఉన్నారని, ఎన్డిఎ ఛైర్మన్ గా ఉన్నప్పుడూ ఆరోపణలు వచ్చాయని అన్నారు. ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నవారినే ఔట్ సోర్సింగ్ పోస్టుల్లో నియమిస్తున్నారని, లీకేజీలకు బాధ్యుడైన ధర్మేంద్ర ప్రధాన్ ను లోక్ స









