22031 వార్తలు

ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు గత ప్రభుత్వంలో నేరేళ్లలో జరిగిన ఘటన బాధితులను పరామర్శించేందుకు టూరిస్టులా తాను రాలేదని ఎస్సీ కమిషన్ రిపోర్ట్ కోసం పోరాడుతానని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నేరేళ్ల గ్రామంలో అనారోగ్యంతో చనిపోయిన గంధం గోపాల్ కుటుంబాన్ని కలిసి ఆమె పరామర్శించారు. పార్టీ పరంగా అండగా నిలుస్తామని హామీనిచ్చారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అందరి బతుకులు బాగుపడతాయని ఆశిస్తే నేరేళ్ల ఘటన సమాజం తలదించుకునేలా చేసిందన్నారు. తొమ్మిదేళ్లు ప్రభుత్వం నుంచి బాధితులకు రూపాయి సాయం కూడా అందలేదన్నారు. నేరేళ్ల బాధితుల కన్నీళ్ల పునాదుల మీద అధికారం అనుభవిస్తున్న నాయకులు వారి కుటుంబాలకు రూ.కోటి పరిహారం అందివ్వాలని డిమాండ్ చేశారు. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని వారి పిల్లల భవిష్యత్తును బాధ్యతగా తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఐదు రోజుల పాటు ఎనిమిది మందిని ఇష్టానుసారంగా పోలీసులు కొట్టారని, జైలర్ కూడా వారిని జైళ్లోకి తీసుకోవడానిక

హైదరాబాద్లో మంగళవారం సాయంత్రం వేళ పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. ఉదయం నుంచి కాస్త ఎండగా ఉన్నప్పటికీ సాయంత్రం 5 గంటల తర్వాత ఒక్కసారిగా ఆకాశం నల్లటి మేఘాలతో ముసురుకుని కుండపోతగా వాన కురిసింది. మియాపూర్, కూకట్ పల్లి, రాయదుర్గం, మణికొండ, మాదాపూర్, యూసుఫ్ గూడ, ఖైరతాబాద్, కోఠి, నాచారం, సికింద్రాబాద్, బేగంపేట, అల్వాల్, కాప్రా, మౌలాలీ, జూబ్లీహిల్స్, బోరబండ తదితర ప్రాంతాల్లో భారీ వర్షంతె రహదారులు జలమయమయ్యాయి . ఆఫీసుల నుంచి ఇళ్లకు తిరిగి వెళ్లే పీక్ అవర్స్ సమయంలో వాన పడటంతో నగరంలోని ప్రధాన కూడళ్లలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

లోక్సభలో మంగళవారంనాడు యాంటీ పేపర్ లీక్ బిల్లుపై చర్చ సందర్భంగా డిఎంకె తరపున ఎంపి దయానిధి మారన్ చర్చలో పాల్గొన్నారు. అసలు నీట్ పరీక్షా విధానాన్నే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం పేపర్ లీకేజీలను అరికట్టడానికి అంటూ చేసిన ప్రతిపాదనలు కూడా ఏ మాత్రం పనిచేయవన్నారు. నీట్ అంశంలో రాష్ట్రాల అభ్యంతరాలను కేంద్రం పెడచెవిన పెడుతోందని, అందుకే ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని మారన్ అన్నారు. దేశవ్యాప్తంగా 22లక్షల మంది విద్యార్థులు నీట్కు హాజరవుతున్నారని, అందులో 12 లక్షల మంది అర్హత సాధిస్తే ఉన్న సీట్లు మాత్రం 1.39లక్షలు మాత్రమేనని అన్నారు. గణాంకాలు ఇలా ఉంటే మెడికల్ సీట్లు ఎలా సరిపోతాయని నిలదీశారు. తాజా బిల్లుతో ప్రభుత్వ ఉద్దేశం నెరవేరబోదని టిఎంసి ఎంపి అభిషేక్ బెనర్జీఅన్నారు. లక్షలాది యువత ఎదుర్కొన్న అవమానాన్ని ఎలా మరిచిపోగలమన్నారు. అయితే బిల్లుకు తమ మద్దతు ఉంటుందని, పరీక్షల్లో పేపర్ లీకేజీలకు అరికట్టేందుకు ఈ ప్రతిపాదనలు మాత్రం సరిపోవన్నారు.





ట్రైనీ ఐపిఎస్ అధికారిణిపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపిఎస్ ఉయయ్ కృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ శివారులో అదుపులోకి తీసుకుని అత్తాపూర్ పోలీసుస్టేషన్కు తరలించారు. ఈ కేసు ఐవోగా చార్మినార్ మహిళా పోలిస్టేషన్ సిఐ జ్యోత్స్న, కేసు పర్యవేక్షణ అధికారిగా మహిళా భద్రత విభాగం డిసిపి లావణ్యను నియమించారు. మరోవైపు తనపై అత్తాపూర్ పోలీసు స్టేషన్లో నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ఉదయ్ కృష్ణారెడ్డి జూన్ 21న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశా రు. గతంలో వాదనలు విన్న హైకోర్టు అదనపు పిపి జితేందర్ రావు వివరాలు సమర్పించడానికి సమయం కోరడంతో తదుపరి విచారణ మరో సారి బుధవారానికి వాయిదా వేసింది. సహచర ట్రైనీని లైంగికంగా వేధించారని మహిళా ట్రైనీ ఫిర్యాదు మేరకు అత్తాపూర్ పోలీసుస్టేషఫన్లో కేసు నమోదైంది. కేసు నమోదు తర్వాత ఆస్పత్రిలో ఉదయ్ కృష్ణారెడ్డి చేరారు.ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ తర్వాత కనిపించకుండాపోయాడు. ఫోన్ స్విచాఫ్ చేసుకుని కనిపించకుండా పోయిన ఉదయ్ని మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ట్రైనీ ఐపిఎస్ ఉదయ్ కృష్ణారెడ్డినీ చట్ట పరిధిలో ప్రొసీజర్ ప్రకారంవిచారిస్తామని రా

బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే గ్రూప్-1, పదవ తరగతి పరీక్షా పత్రాలు లీక్ అయ్యాయని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. గ్రూప్-1 పరీక్షను సక్రమంగా నిర్వహించలేకపోయిందని ఆయర మంగళవారం ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ విమర్శించారు. అయితే కాంగ్రెస్ హయాంలో పేపర్ల లీకులయ్యాయని బిఆర్ఎస్, బిజెపి నేతలు చేస్తున్న ఆరోపణల్లో ఏ మాత్రం వాస్తవం లేదన్నారు. బిఆర్ఎస్ హయాంలో పేపర్ లీకులు జరిగితే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్ ఏ రోజైనా మాట్లాడారా? అని ఎంపీ చామల ప్రశ్నించారు. ఈ ఏడాది మే నెల మొదటి వారంలో నీట్ పేపర్ లీక్ జరిగిందని, జెన్ జీ రోడ్ల పైకి రావడంతో ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధానితో రాజీనామా చేయించారని ఆయన తెలిపారు. నీట్ పేపర్ లీకేజీపై పార్లమెంట్ లో చర్చ జరగాలని లోక్సభ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేసినా కేంద్రం చర్చకు అంగీకరించడం లేదన్నారు. వీటన్నింటికీ జవాబుదారీ ఎవరు అని రాహుల్ గాంధీ ప్రశ్నించినా సమాధానం లేదని ఆయన విమర్శించారు.



నర్సంపేట మాజీ ఎంఎల్ఎ పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్ ఆసుపత్రి అడ్వాన్డ్ క్రిటికల్ కేర్ యూనిట్లో వైద్యుల నిరంతర పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి ఛీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ జి. విజయ్ కుమార్ మంగళవారం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ముందుగా వరంగల్లో ఆసుపత్రిలో చేరిన పెద్ది సుదర్శన్ రెడ్డికి ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టడం (పల్మనరీ ఎంబోలిజం) వల్ల బిసి పడిపోయి హార్ట్ ఎటాక్ (హెమోడైనమిక్ కొలాప్స్) వచ్చింది. అక్కడ వైద్యులు దాదాపు 45 నిమిషాల పాటు సిపిఆర్ , ఎసిఎల్ఎస్ పద్ధతుల్లో అత్యవసర వైద్యం అందించి గుండె స్పందనను పునరుద్ధరించారు. అనంతరం అక్కడ ప్రాథమిక చికిత్స (త్రాంబోలైసిస్) పూర్తి చేసి, మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో క్రిటికల్ కేర్, పల్మనాలజీ, కార్డియాలజీ, న్యూరాలజీ విభాగాలకు చెందిన నిపుణుల బృందం ఆయనకు వైద్యం అందిస్తోంది. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్పై స్వల్ప మద్దతుతో శ్వాసక్రియ, బిపి అందుబాటులో ఉన్నప్పటికీ, 45 నిమిషాల పాటు గుండె ఆగిపోవడం వల్ల నాడీ వ్యవస్థ త




జగిత్యాల జిల్లా కేంద్రంలోని యవార్ రోడ్డులో ఆర్టీసీ అద్దె బస్సు, ఓ ప్రైవేట్ స్కూల్ బస్సును ఢీకొట్టడంతో ఇద్దరు విద్యార్థులకు గాయాలవ్వగా రెండు బస్సులకు నష్టం వాటిల్లింది. ఈ ఘటనలో ఆర్టీసీ బస్సు ముందు భాగం దెబ్బతినగా పాఠశాల బస్సు స్వల్పంగా దెబ్బతింది.ప్రమాద సమయంలో పాఠశాల బస్సులో మొత్తం 26 మంది విద్యార్థులు ఉండగా వారిలో ఇద్దరికి మాత్రమే స్వల్ప గాయాలయ్యాయి.మిగిలిన విద్యార్థులు సురక్షితంగా బయటపడటంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఆర్టీసీ బస్సు బ్రేకులు పడకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని తెలిసింది.

పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాలని ఉద్యమిస్తున్న నిరసనకారులపై పాకిస్థాన్ భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో గత 24 గంటల్లో 20 మంది మృతి చెందగా, 50 మందికి పైగా గాయపడ్డారు. రావల్కోట్లోని డ్రేక్ ఎయిత్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎన్నికల బహిష్కరణకు పిలుపునిస్తున్న జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జేఏఏసీ) కార్యకర్తలపై భద్రతా బలగాలు కాల్పులు జరిపినట్లు స్థానిక వర్గాలు తెలిపాయి. ఈ ఘటనలో జేఏఏసీ ప్రధాన కమిటీ సభ్యుడు, అధికార ప్రతినిధి ఉమర్ నజీర్ కశ్మీరీ సోదరుడు ఉస్మాన్ నజీర్ కూడా మృతిచెందినట్లు సమాచారం.జూన్ 5 నుంచి పీవోకేలో ఎన్నికల వ్యతిరేక ఆందోళనలు ప్రారంభమైనప్పటి నుంచి పాకిస్థాన్ భద్రతా బలగాల చర్యల్లో ఇప్పటివరకు సుమారు 80 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక వర్గాలు పేర్కొన్నాయి.సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియోల్లో నిరసనకారుల మృతదేహాలు రహదారులపై కనిపిస్తుండగా, గుంపులపై భద్రతా బలగాలు కాల్పులు జరుపుతున్న దృశ్యాలు ఉన్నట్లు తెలుస్తోంది.పీవోకేకు చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అఖీల్ భాయ్ విడుదల చేసిన వీడియో సందేశంలో, రావల్కోట్ మృతదేహాలు, క్షతగాత్రులతో నిండిప

జపాన్ దక్షిణ ప్రధాన ద్వీపమైన క్యుషూలోని కుమమోటో ప్రిఫెక్చర్లో మంగళవారం 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం సముద్ర మట్టానికి 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు జపాన్ వాతావరణ సంస్థ (జేఎంఏ) వెల్లడించింది. భూకంపం కారణంగా పలువురు గాయపడగా, ఒక భవనం కూలిపోయినట్లు ప్రధానమంత్రి సనాయే తకైచి తెలిపారు.భూకంపం అనంతరం గరిష్ఠంగా ఒక మీటర్ ఎత్తులో సునామీ అలలు వచ్చే అవకాశం ఉందంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంత ప్రజలు వెంటనే సురక్షితమైన ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఒక మీటర్ ఎత్తులో అలలు నమోదైనట్లు జాతీయ ప్రసార సంస్థ ఎన్హెచ్కే వెల్లడించింది. నష్టంపై వెంటనే సమగ్ర సమాచారం సేకరించాలని, ప్రాణ రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ సహాయక చర్యలు చేపట్టాలని ప్రధానమంత్రి కార్యాలయం అధికారులను ఆదేశించింది. భూకంపం ప్రభావంతో అణు విద్యుత్ కేంద్రాల్లో ఎలాంటి అసాధారణ పరిస్థితులు తలెత్తలేదని జపాన్ అణు నియంత్రణ సంస్థ స్పష్టం చేసింది. కుమమోటోతో పాటు నాగసాకి, కగోషిమా, ఫుకుఒకా, సాగ, ఓయిటా, మియాజాకి ప్రిఫెక్చర్లకు అత్యవసర భూకంప హెచ్చరికలు జారీ చేశారు.జపాన్ ప్రపంచంలో అత్యధిక




హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్లో శ్రీ భవానీ క్రియేషన్స్ బ్యానర్పై తెరకెక్కుతున్న భావోద్వేగ ప్రధాన చిత్రం ‘తీరం’ టైటిల్ సాంగ్ను ఘనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొని చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ‘పుష్ప’ ఫేమ్ నటుడు జగదీష్, ఫన్ బకెట్ మహేష్ విట్ట, నటుడు రాజ్కుమార్ కసిరెడ్డి, దర్శకుడు ప్రసాద్, జబర్దస్త్ సద్దాం, నటుడు కుమానన్ తదితరులు హాజరై టైటిల్ సాంగ్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శకుడు వంశీ మునగాల మాట్లాడుతూ తీరం చిత్రం ప్రతి ఒక్కరి హృదయాలను తాకేలా భావోద్వేగభరితమైన కథతో రూపొందుతోందన్నారు. నిర్మాత ఉపేందర్ గంగావెల్లి మాట్లాడుతూ సినిమా నిర్మాణం తుది దశకు చేరుకుందని, విడుదల తేదీతో పాటు ఇతర విశేషాలను త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో హీరో ప్రభు, హీరోయిన్ హరిప్రియా, రమణ, విజయ్ శెట్టి పాల్గొన్నారు.
