
4577 వార్తలు
– 1.311 కిలోల గంజాయి స్వాధీనంనవతెలంగాణ – ముషీరాబాద్అక్రమంగా హైబ్రిడ్ గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని హైదరాబాద్ ముషీరాబాద్ ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 1.311 కిలోల హైబ్రిడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇన్స్పెక్టర్ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ నామాలగుండు ప్రాంతానికి చెందిన రోషన్సింగ్ ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. మంగళవారం అతను బైక్పై వెళ్తుండగా విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఎక్సైజ్ పోలీసులు అతడిని పట్టుకుని విచారించారు. అతని నుంచి […] The post హైబ్రిడ్ గంజాయిని తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్ appeared first on Navatelangana.
– జనన ధ్రువీకరణ పత్రం జారీకి లంచంనవతెలంగాణ-నారాయణపేటనారాయణపేట ఆర్డీవో రామచంద్ర నాయక్ మంగళవారం రూ.25వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. జనన ధ్రువీకరణ పత్రం కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారికి సుమారు ఐదు నెలల నుంచి ఇవ్వకుండా పెండింగ్లో పెట్టారు. చివరకు ఒక జనన ధ్రువీకరణ పత్రానికి రూ.7,500 ఇవ్వాలని ఆర్డీఓ రామచంద్ర నాయక్ అడిగారు. దాంతో సదరు వ్యక్తి రూ.5వేలు ఇస్తానని, ఐదు జనన ధ్రువీకరణ పత్రాల కోసం రూ.25వేలు […] The post ఏసీబీకి పట్టుబడిన ఆర్డీవో రామచంద్ర నాయక్ appeared first on Navatelangana.
– ఏసీబీకి చిక్కిన వికారాబాద్ మహిళా పీఎస్ సీఐ,ఎస్ఐనవతెలంగాణ-వికారాబాద్వికారాబాద్ పట్టణంలోని మహిళా పోలీస్స్టేషన్లో రూ.20వేలు లంచం తీసుకుంటూ సీఐ సరోజ, ఎస్ఐ రాణి ఏసీబీ అధికారులకు చిక్కారు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు పట్టణానికి చెందిన కౌన్సిలర్ ఇర్షద్పై భార్య వేధింపుల కేసు పెట్టింది. ఈ విషయంలో మహిళా పోలీస్స్టేషన్ల్లో ఇర్షద్ తల్లి, అక్కాచెల్లెళ్లు మొత్తం 6 మందిపై కేసు నమోదైంది. ఈ విషయంపై మాట్లాడటానికి వారిని సీఐ, ఎస్ఐ స్టేషన్కు పిలిపించారు. […] The post స్టేషన్ బెయిల్కు రూ.60వేల లంచం డిమాండ్ appeared first on Navatelangana.
– మహిళా రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ కందాల ప్రమీలనవతెలంగాణ- నకిరేకల్అధికారుల నిర్లక్ష్యం.. మిల్లర్ల దోపిడీతో పంట పండించిన రైతులు ఆగమవుతున్నారని మహిళా రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ కందాల ప్రమీల ఆవేదన వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలంలోని నెల్లిబండ గ్రామంలో మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతు సంఘం ఆధ్వర్యంలో సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆరు శాతం లోపు తాలు ఉన్నా ఎలాంటి ఆటంకమూ కలిగించకుండా ధాన్యాన్ని కొనుగోలు […] The post మిల్లర్ల దోపిడీతో అన్నదాత ఆగం appeared first on Navatelangana.
– ‘పైగా ప్యాలెస్’ మరమ్మతులకే రూ.93 కోట్లు!– ప్రజాధనం వృథా చేస్తున్నారంటూ విమర్శలు– హెచ్ఎండీఏ కార్యాలయ మార్పుపై వింత నిర్ణయాలు– జులై నాటికి బేగంపేటకు మకాం.. కొనసాగుతున్న పనులు– పాత సామాగ్రినే వాడతామంటున్న అధికారులు– భవనానికి మాత్రం భారీ ఖర్చునవతెలంగాణ- సిటీబ్యూరోహైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) తన గూడు మార్చుతోంది. అమీర్పేటలోని స్వర్ణజయంతి కాంప్లెక్స్ నుంచి బేగంపేటలోని చారిత్రక ‘పైగా ప్యాలెస్’కు తరలి వెళ్లేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ తరలింపు ప్రక్రియ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. […] The post ఆదా అంటే ఇదేనా? appeared first on Navatelangana.
– బ్యాంకింగ్ వ్యవస్థలో సమూల ప్రక్షాళన అవసరం– సైబర్ ముఠాలకు వరంగా మారుతున్న మ్యూల్ ఖాతాలు– ఆర్బీఐ గవర్నర్కు హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ కీలక లేఖనవతెలంగాణ- సిటీబ్యూరోదేశంలో ముఠాలుగా ఏర్పడి దోచుకుంటున్న సైబర్ నేరగాళ్లను అరికట్టాలంటే బ్యాంకింగ్ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడం అత్యవసరమని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. అమాయకుల పేర్లతో సృష్టిస్తున్న ‘మ్యూల్ అకౌంట్స్’ ప్రస్తుతం సైబర్ మోసాలకు కేంద్ర బిందువుగా మారాయని ఆయన ఆందోళన వ్యక్తం […] The post ‘బ్లాక్ లిస్ట్’తోనే అడ్డుకట్ట appeared first on Navatelangana.

మన తెలంగాణ/హైదరాబాద్: వెయ్యేండ్లు అయినా బిఆర్ఎస్ పార్టీ మారదు అని తెలంగాణ జాగృతి అధ్యక్షురా లు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు.ఓటమిపై బిఆర్ఎస్ ఇప్పటికీ ఆత్మవిమర్శ చేసుకోవడం లేదని.. ప్రజలే తప్పు చేశారని ప్రజలను చులకన చేసి మాట్లాడుతున్నారని ఆగ్ర హం వ్యక్తం చేశారు. 75 సంవత్సరాల కురువృద్ధుడిని చే ర్చుకుని ఆయనకే 25 ఏండ్లు తగ్గిపోయాయి, నవ యువకుడు అంటే తెలంగాణలో ఉన్న యువత పరిస్థితి ఏమిట ని ప్రశ్నించారు. తాము ఏర్పాటు చేసే పార్టీలో యువ నా యకత్వాన్ని ప్రోత్సహిస్తామని.. యువత పెద్ద ఎత్తున చేరాలని పిలుపునిచ్చారు. జగిత్యాల సభలో 75 ఏళ్ల కురువృద్ధుడిని చేర్చుకొని రాజకీయ పునరేకీకరణ అంటున్నారని విమర్శించారు. రాజకీయ పునరేకీకరణ పేరుతో తెలంగా ణ వ్యతిరేక శక్తులను తీసుకువచ్చి తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం చేస్తామని చెప్తున్నారంటే వెయ్యేండ్లు అయినా బిఆర్ఎస్ పార్టీ మారదు అని తేల్చిచెప్పారు. మేధావులు, విద్యావేత్తలు బిఆర్ఎస్ ఆలోచన విధానం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలని కోరారు. జీవన్ రెడ్డి పచ్చి తెలంగాణ వ్యతిరేకి అని గుర్తు చేశారు. తెలంగాణ కోసం ఉద్యమ నాయకత్వం రెండు సార్లు పదవులకు రాజీనామా చేసినప్పుడు తనకు వైఎస్ నాయక
– ఆక్రమణలతోపాటు పూడిక తొలగింపు– 22 ఏండ్ల పోరాటం ఫలించిందన్న పూజారి నరహరినవతెలంగాణ-సిటీబ్యూరోఅనేక ఆలయాలకు కొలువై ఉన్న జగద్గిరిగుట్టలోని కోనేరు(గుండం) కబ్జాకు గురవుతోందని.. కాపాడాలని అక్కడి గోవిందరాజుల స్వామి ఆలయ పూజారి నరహరి రోధిస్తూ వేడుకున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలైన సంగతి తెలిసిందే. ఈ వీడియోను చూసి క్షేత్రస్థాయిలో పరిశీలించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కోనేరు పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ మేరకు మంగళవారం కోనేరు ఆక్రమణలను హైడ్రా తొలగించింది. అందులో […] The post జగద్గిరిగుట్ట కోనేరుకు కొత్త కళ తెచ్చిన హైడ్రా appeared first on Navatelangana.

మన తెలంగాణ/హైదరాబాద్: బిఆర్ఎస్ పా ర్టీ అధినేత కెసిఆర్ సూచన మేరకే ఢిల్లీ వెళ్లి లాయర్లను కలిసినట్లు మాజీ మంత్రి, బిఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్రావు తెలిపారు. కానీ, తన ఢిల్లీ పర్యటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిఎంఒ నుంచి లీకులు ఇచ్చారని, మీడియా వాళ్లతో అర్థం లేని బ్రేకింగ్లు పెట్టించారని ఆరోపించారు. విషయం ఉన్న వారు ఎవరైనా ఇలాంటి పనులు చేయరని, విషయం లేనివారే ఇలా చేస్తారని విమర్శించారు. సిఎం పెట్టే అక్రమ కేసులను ఎదుర్కొనేందుకే అక్కడి లాయర్లతో మాట్లాడినట్లు చె ప్పారు. కాళేశ్వరం కేసులపై సీనియర్ లాయర్లతో చర్చించేందుకు వెళ్లినట్లు పేర్కొన్నారు. అలాగే మే 6వ తేదీన హైకోర్టులో రాబోతున్న ఎంఎల్ఎల ఫిరాయింపుల కేసుల విచార ణపై సీనియర్ లాయర్లతో చర్చించామని అ న్నారు. కాంగ్రెస్ బి.ఫామ్పై గెలిచి తాను ఇం కా బిఆర్ఎస్లోనే ఉన్నానని ఒక ఎంఎల్ఎ అనడం, దానిని స్పీకర్ ధృవీకరించడం అ త్యంత దుర్మార్గం అని పేర్కొన్నారు.ఓటుకు నోటు కేసు కూడా గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు సుప్రీంకోర్టులో విచారణకు రానుందని, ఆ కేసు గురించి కూడా న్యాయవాదులతో చర్చించామని తెలిపారు. పట్టపగ లు బ్యాగులతో దొరికిపోయిన దొంగ రేవంత్ రెడ్డి
– ‘ఆఫీస్ స్కాండల్’ ఆరోపణల నడుమ తప్పుకున్న లోరీ చావెజ్-డీరీమర్– ట్రంప్ ప్రభుత్వానికి మరో దెబ్బవాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో లేబర్ సెక్రెటరీ లోరీ చావెజ్-డీరీమర్ తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత, వృత్తి సంబంధిత వివాదాల నేపథ్యంలో ఆమె తప్పుకున్నారు. ప్రయివేటు రంగంలో చేరుతున్నట్టు ఆమె అధికారి కంగా ప్రకటించినప్పటికీ.. ఆమెపై కొనసాగుతున్న విచారణ ఈ నిర్ణయానికి కారణ మని తెలుస్తోంది. ఈమె రాజీనామా ట్రంప్ పాలనకు మరో దెబ్బగా పరిశీలకులు […] The post అమెరికా లేబర్ సెక్రెటరీ రాజీనామా appeared first on Navatelangana.
– మూగబోయిన మైకులు– తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో పోలింగ్కు ఈసీ ఏర్పాట్లు– రేపు పోలింగ్..మే 4న ఓట్ల లెక్కింపున్యూఢిల్లీ : తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల ప్రచార గడువు ముగిసింది. రాజకీయ నేతల ప్రసంగాలు, భారీ బహిరంగ సభలు, రోడ్ షోలతో మారుమోగిన మైకులు మంగళవారం సాయంత్రం మూగ బోయాయి. చివరి రోజు అన్ని పార్టీలు ముమ్మర ప్రచారం నిర్వహించాయి. తమిళనాడులోని మొత్తం 234 స్థానాలకు, పశ్చిమ బెంగాల్లో తొలి విడతలో 152 […] The post ఎన్నికల ప్రచారానికి తెర appeared first on Navatelangana.

ఇస్లామాబాద్: కాల్పుల విరమణ ఒప్పంద గడువు ముగియనున్న నేపథ్యంలో, అమెరికా ఇరాన్ మధ్య మలివిడత చర్చలు జరగనున్నాయన్న సంకేతాలు వెలువడ్డాయి. అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఇరాన్ ప్రతినిధులు ఇస్లామాబాద్లో సమావేశమయ్యే అవకాశముందని ఆ యా వర్గాలు మంగళవారం వెల్లడించాయి. అ యితే, చర్చల సమయంపై అమెరికా లేదా ఇ రాన్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ ప్రకారం, ఇ ప్పటివరకు తమ అధికార ప్రతినిధులు ఎవరూ పాకిస్తాన్ రాజధానికి చేరుకోలేదని పేర్కొంది. పాకిస్తాన్ మధ్యవర్తుల సమాచారం మేరకు, అ మెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘర్ ఖాలిబాఫ్ బుధవారం ఉదయం ఇస్లామాబాద్కు చేరుకు ని చర్చలకు నేతృత్వం వహించే అవకాశం ఉం దని అధికార వర్గాలు తెలిపాయి. అయితే, గో ప్యతా నిబంధనల నేపథ్యంలో పేర్లు వెల్లడించకుండా ఉంచినట్లు సమాచారం. ఏప్రిల్ 8న ప్రారంభమైన కాల్పుల విరమణ ఒప్పందం బు ధవారం ముగియనుంది. ఇరు దేశాలు మాటల యుద్ధంలో మాత్రం వెనక్కి తగ్గని పరిస్థితి కనిపిస్తోంది. ఒప్పందం కుదరకపోతే భారీ బాంబు ల దాడులు మొదలవుతాయి అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించగా, ఇరాన్ చర్చల ప్రధాన ప
డిలిమిటేషన్, మహిళా బిల్లు కలిపేశారు : కేంద్రంపై ఎన్ రామ్ విమర్శలుచెన్నై : నియోజకవర్గాల పునర్విభజన (డిలిమిటేషన్)కు, మహిళా రిజర్వేషన్కు ఎలాంటి సంబంధం లేకపోయినా.. గందరగోళం సృష్టించేందుకు, ప్రతిపక్షాలపై నిందలు మోపేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ రెండు బిల్లులను కలిపివేసిందని ది హిందూ గ్రూప్ మాజీ డైరెక్టర్ ఎన్ రామ్ విమర్శించారు. ‘తమిళనాడుకు భారీ విజయం! కేంద్ర ప్రభుత్వానికి ఓటమి!! ఎందుకు.. ఎలా’ అనే అంశంపై చెన్నై థింకర్స్ ఫోరం నిర్వహించిన ఒక సమావేశంలో ఎన్ రామ్ […] The post గందరగోళం సృష్టించేందుకే.. appeared first on Navatelangana.
రాయల్స్, సూపర్జెయింట్స్ ఢీ నేడులక్నో : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్లే ఆఫ్స్ రేసు ఆసక్తికరంగా మారుతున్న తరుణంలో లక్నో సూపర్జెయింట్స్, రాజస్తాన్ రాయల్స్ ముఖాముఖికి పోరుకు సిద్ధమవుతున్నాయి. తొలి 4 మ్యాచ్ల్లో గెలుపొందిన రాజస్తాన్ రాయల్స్ ఆ తర్వాత వరుస మ్యాచ్ల్లో ఓటమి పాలైంది. లక్నో సూపర్జెయింట్స్ సైతం చివరి మూడు మ్యాచ్ల్లో ఓటమి పాలైంది. లీగ్ దశ ద్వితీయార్థం ఆరంభం కానున్న తరుణంలో గెలుపు బాట పట్టేందుకు ఇరు జట్లు సిద్ధమవుతున్నాయి. రాజస్తాన్ […] The post గెలుపు బాట పట్టేదెవరో? appeared first on Navatelangana.
యమల్, క్రూస్లకు కూడా ప్రదానంన్యూయార్క్: బెలారస్ స్టార్ అర్యానా సబలెంక, స్పెయిన్ యువ సంచలనం కార్లోస్ అల్కరాజ్లకు 2025 ఏడాదిలో టెన్నిస్ విభాగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినందుకు అవార్డులు దక్కాయి. వీరిద్దరూ పురుషుల, మహిళల విభాగాల్లో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల వేడుకలో అల్కరాజ్, సబలెంక 2025 ఏడాది ఉత్తమ ఆటగాళ్లుగా కిరీటాన్ని అందుకున్నారు. టెన్నిస్ జగత్తుపై గత ఏడాది వీరిద్దరి హవా చెలాయించారు. 22ఏళ్ల స్పెయిన్కు చెందిన అల్కరాజ్.. ఎటిపి ర్యాంకింగ్స్లో అగ్రస్థానంతో […] The post అల్కరాజ్, సబలెంకలకు లారెస్ అవార్డులు appeared first on Navatelangana.
ఐపీఎల్19కు దూరంచెన్నై : ఐపీఎల్19లో తడబడుతున్న చెన్నై సూపర్కింగ్స్కు మరో ఎదురుదెబ్బ. ఎం.ఎస్ ధోనికి పిక్క గాయంతో ప్రథమార్థం మ్యాచ్ల్లో మానసిక స్థైర్యం కోల్పోయిన సూపర్కింగ్స్.. ద్వితీయార్థంలో యువ బ్యాటర్ ఆయుశ్ మాత్రె సేవలను కోల్పోనుంది. ఈ నెల 18న ఉప్పల్ స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో బ్యాటింగ్ చేస్తూ ఆయుశ్ మాత్రె తొడ కండరాల గాయానికి గురయ్యాడు. ఆన్ఫీల్డ్లో ఫిజియో ప్రథమ చికిత్సతో ఆయుశ్ మాత్రె బ్యాటింగ్ కొనసాగించినా.. గాయం బాధ ఎంతో సేపు క్రీజులో […] The post ఆయుశ్కు గాయం appeared first on Navatelangana.
– ప్రభుత్వంతో కార్మిక సంఘాల చర్చలు విఫలం– సమ్మెలోకి 39 వేల మంది ఆర్టీసీ కార్మికులు– హడావిడిగా ఐఏఎస్ల కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం– జేఏసీని నాలుగు వారాల గడువు కోరిన కమిటీ– తిరస్కరించిన ఆర్టీసీ కార్మిక సంఘాలు– మా డిమాండ్లన్నీ పాతవేనని స్పష్టీకరణ– నిలిచిపోనున్న 10వేల ఆర్టీసీ సర్వీసులునవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ)లో సమ్మె సైరన్ మోగింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 53 రోజుల చారిత్రాత్మక సమ్మె తర్వాత సంస్థలోని […] The post బస్సులు బంద్ appeared first on Navatelangana.
ఒప్పందం కుదరకపోతే బాంబు దాడులే : ట్రంప్ బెదిరింపుఎలాంటి చర్యలకైనా సిద్ధం : ఇరాన్నేటితో ముగియనున్న కాల్పుల విరమణ ఒప్పందంనేడు ఇస్లామాబాద్కు అమెరికా, ఇరాన్ బృందాలు : పాకిస్తాన్(నవ తెలంగాణ – సెంట్రల్ డెస్క్)కాల్పుల విరమణ ఒప్పందం మరికొన్ని గంటల్లో ముగియబోతున్న నేపథ్యంలో ఇరాన్, అమెరికా మధ్య పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో జరగాల్సిన శాంతి చర్చలపై అనిశ్చితి కొనసాగుతోంది. అమెరికాతో రెండో విడత చర్చలు జరిపే ప్రశ్నే లేదని ఇరాన్ తేల్చి చెప్పింది. అమెరికా డిమాండ్ల చిట్టా […] The post చర్చలకు నో : ఇరాన్ appeared first on Navatelangana.
– రైతాంగాన్ని వంచిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు– ఈ చర్యలను తిప్పికొట్టేందుకు సభలో కార్యాచరణ– మూడేండ్లలో ఎన్నో విజయాలు సాధించిన తెలంగాణ రైతుసంఘం– ‘నవతెలంగాణ’తో ఆ సంఘం అధ్యక్షులు పోతినేని సుదర్శన్రావు– కొత్తగూడెంలో 23 నుంచి 25 వరకు తెలంగాణ రైతుసంఘం 3వ మహాసభతెలంగాణ రైతుసంఘం (ఏఐకేఎస్) రాష్ట్ర 3వ మహాసభలు కొత్తగూడెంలో ఈ నెల 23 నుంచి 25 వరకు నిర్వహిస్తున్నట్టు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్రావు తెలిపారు. ఈ మహాసభలకు 600 […] The post మేలుకో రైతన్న.. appeared first on Navatelangana.
మాకోసం కన్నీళ్ళు కార్చొద్దుఇన్నేళ్ళ కాలంలో మీరు చేసిందేమిటి? : మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రధానికి సీపీఐ(ఎం) అగ్ర నాయకురాలు బృందాకరత్ లేఖప్రధాని జీ.. మహిళా రిజర్వేషన్ అంశంతోనే మీరు జాతినుద్దేశించి ప్రసంగించడం ఆరంభించారు. ”అధికారంలో మహిళలకు భాగస్వామ్యాన్ని కల్పించడంపై పోరాటం అనేక దశాబ్దాలుగా సాగుతోంది….కాబట్టి అనేకమంది మహిళలు ఈ అంశాన్ని నా ముందు ప్రస్తావించారు కూడా. అందువల్ల అనేకమంది సోదరీమణులు ప్రతీ అంశాన్ని వివరిస్తూ నాకు లేఖలు కూడా రాశారు.”మోడీజీ, మీరు ప్రస్తావించినట్లుగా, ‘దశాబ్దాలు తరబడి సుదీర్ఘంగా […] The post మోడీజీ… మీ ద్రోహాలను కప్పిపుచ్చుకోవద్దు appeared first on Navatelangana.
– ముంపు, విస్తరణ సమస్యలకు పరిష్కారం చూపేవారెవరు?– జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు సిద్ధం– పరిష్కారం చూపే వారికే పట్టం కడతామంటున్న ఓటర్లునవతెలంగాణ-భద్రాచలంవర్షాకాలంలో గోదావరి ఉప్పొంగడం, భారీవర్షాలతో భద్రాచలం అతలాకుతలం అవడం పరిపాటిగా మారింది. భద్రాద్రి ప్రజల్లో తమ భద్రతపై ఆందోళన నెలకొంటోంది. వరద ప్రవాహం చుట్టుముట్టడంతో పట్టణ ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతుంటారు. భద్రాచలం ఆలయం చుట్టూ నీరు చేరుతోంది. ప్రమాదకర స్థాయి నీటితో ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఉంటారు. ఇంత జరుగుతున్నా […] The post భద్రాద్రి భద్రతే ఎజెండా ! appeared first on Navatelangana.

మేషంకుటుంబమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. సంఘంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. అన్ని రంగాల వారికి పరిస్థితులు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ విలువ మరింత పెరుగుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారమున అంచనాలు అందుకుంటారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. వృషభం ఆర్థిక పరంగా ఇబ్బందులు తప్పవు. దూరప్రయాణ సూచనలున్నవి. బంధు మిత్రులతో మాట పట్టింపులుంటాయి. కొన్ని వ్యవహారాలలో ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగమున ఇతరులతో వాదనకు వెళ్ళకపోవడం మంచిది. మిధునం వ్యాపార విషయమై కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆప్తుల నుండి విలువైన సమాచారం అందుతుంది. వృత్తి, ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి ఆర్ధిక పరంగా అనుకూలత పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో వివాదాలు సర్దుమణుగుతాయి .చాలా కాలంగా పూర్తికాని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కర్కాటకం చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత అధికమౌతుంది. సన్నిహితులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. సోదరులతో కొన్ని వ్యవహారాలలో సఖ్యత లోపిస్తుంది.కుటుంబ విషయమై స్థిరమైన నిర్ణయా
ఇండియన్ సినిమాను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లేందుకు తనదైన ముందడుగు వేశారు హీరో విజరు దేవరకొండ. ‘హాయ్ నాన్న’ ఫేమ్ డైరెక్టర్ శౌర్యువ్తో విజరు దేవరకొండ హ్యూజ్ గ్లోబల్ ప్రాజెక్ట్ చేస్తున్నారు. వైరా బ్యానర్ ఈ ప్రెస్టీజియస్ మూవీని నిర్మిస్తోంది. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి హీరో నాని క్లాప్ ఇచ్చారు.రీసెంట్గా రిలీజ్ చేసిన ఈ సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్ హై ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసింది. విజరు దేవరకొండ, డైరెక్టర్ శౌర్యువ్ […] The post గ్లోబల్ హంగులతో కొత్త సినిమా appeared first on Navatelangana.