22021 వార్తలు

మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డినవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్టీవీ రంగంలో రాణిస్తున్న అన్ని కేటగిరీల వారికి,మంచి మెసేజ్ ఇచ్చే సీరియల్స్,ప్రోగ్రామ్స్,చిల్డ్రన్ మూవీలు తీసే వారిని ప్రోత్సహించాలని రాష్ట్ర మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి సూచించారు. మంగళవారం టెలివిజన్ అవార్డు కమిటీ సమావేశంలో ఎఫ్డిసీ ఎండీ ముకుంద రెడ్డి, కమిటి చైర్మెన్, సభ్యులతో కలిసి ఆయన మాట్లాడారు. ఎక్కువ మంది మహిళలు,వృద్ధులు టీవీ కార్యక్రమాల పట్ల మక్కువ చూపుతున్నారని తెలిపారు. కమిటీ సభ్యులు సూచించినట్లు దీనికి పి.వి నరసింహారావు పేరు […] The post టీవీ రంగంలో రాణిస్తున్న అన్ని కేటగిరీలను ప్రోత్సహించాలి appeared first on Navatelangana.

కోచింగ్ సెంటర్లపై దేశవ్యాప్త విధానం ఉండాలియూనివర్సిటీలపై కేంద్రం ఆధిపత్యం వద్దు‘విద్య’ రాష్ట్రాల పరిధిలోనే ఉండాలికేంద్రం దాన్ని గుంజుకునే ప్రయత్నాలు మానాలిగ్లోబరీనా అక్రమాలు సీబీఎస్ఈకీ విస్తరించాయికేసీఆర్ పెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.8 వేల కోట్లుహైడ్రాపై హైకోర్టు ఉత్తర్వులను సమీక్షిస్తాంఅధికారుల నియామకం రాష్ర్ట ప్రభుత్వ విచక్షణాధికారంఢిల్లీలో మీడియాతో సీఎం ఏ రేవంత్ రెడ్డి11.56 లక్షల ఇండ్లు ఇవ్వండివీబీ గ్రామ్జీలో పది కొత్త పనులు చేర్చండి : కేంద్రమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్తో భేటీలో సీఎం రేవంత్రెడ్డి విజ్ఞప్తి నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్ప్రశ్న […] The post లీక్ నిందితుల్ని శిక్షించాలి appeared first on Navatelangana.

పెరిగిన నిరుద్యోగులుప్రతి ముగ్గురు యువకుల్లో ఇద్దరు పట్టభద్రులేఇదీ నేటి భారత యువత నిరుద్యోగ ముఖచిత్రంఅజీమ్ ప్రేమ్జీ యూనివర్సిటీకి చెందిన‘స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా 2026’ నివేదిక దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉన్నదని ప్రతిపక్షాలు, కేంద్ర గణాంకాలు తేటతెల్లం చేస్తున్నా మోడీ సర్కార్ లైట్ తీసుకుంటోంది. దీంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వాస్తవాలను దాచి అంకెలతో గారడీ చేస్తూ కాలాన్ని నెట్టుకువస్తున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా అజీమ్ ప్రేమ్జీ యూనివర్సిటీకి చెందిన ‘స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా […] The post నో జాబ్ appeared first on Navatelangana.

మేషంముఖ్యమైన ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు సంతోషకరమైన వార్తలు అందుతాయి. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. వృషభం దీర్ఘకాలిక ఋణాలు తీర్చడానికి నూతన ఋణాలు చెయ్యవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలలో అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. జీవిత భాగస్వామితో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. మిధునం ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. కర్కాటకం ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు విస్తృతమవుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంద

ములుగు జిల్లా మంగపేట మండలంలోని కోమటిపల్లి పరిసర ప్రాంతాల్లో వీచిన ఈదురు గాలులతో అటవీ ప్రాంతంలోని భారీ వృక్షాలు ఒక్కసారిగా నేల కూలాయి. దీంతో స్థానికంగా ఉన్న రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మండలంలో ఇలాంటి ఈదురుగాలులను ఇప్పటివరకు చూడలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం వీచిన ఈదురుగాలులకు మంగపేట కోమటిపల్లి వెళ్లే దారిలో భారీ చెట్లు నేలకూలాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు జేసీబీలను తీసుకొని వెళ్లి భారీ చెట్లను తొలగించి రహదారిని క్లియర్ చేశారు. ఈ విషయంపై ఫారెస్ట్ రేంజ్ అధికారి మహమ్మద్ లాయిక్ హుస్సేన్ను వివరణ కోరగా.. వర్షం ఎక్కువగా వస్తున్న కారణంగా లోపలికి వెళ్లలేకపోయాం, రోడ్డు వెంట కేవలం 10 నుంచి 15 చెట్ల వరకు కూలిపోయినట్టు తెలిపారు. లోపల శాంతినగర్, గోత్తికోయగూడెంలో వృక్షాలు ఏమైనా కూలిపోయాయో లేదో, బుధవారం పరిశీలించి పూర్తి వివరాలను అందిస్తామని తెలిపారు. అయితే, గతేడాది తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క- సారలమ్మ అటవీ ప్రాంతంలో టోర్నడో తరహాలో వీచిన గాలులను ఈ గాలులు తలపించాయని స్థానికులు చెప్తున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి అయ్యోరి యా

జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ సీఐ శ్రీనివాసులు రెడ్డిని సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఓ మహిళను నమ్మించి, ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అంతర్గత విచారణలో నిర్ధారణ కావడంతో ఈ చర్య తీసుకున్నారు దర్యాప్తులో మహిళ వ్యక్తిగత వీడియోలను అడ్డంగా పెట్టుకుని డబ్బులు వసూలు చేసినట్లు కూడా అధికారులు గుర్తించారు. కొంతకాలం పాటు సీఐ శ్రీనివాసులు రెడ్డి, బాధిత మహిళ ఒకే ఇంట్లో ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. అనంతరం ఆమెను వదిలించుకునేందుకు సీఐ వివిధ ప్రయత్నాలు చేసినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. సీఐ శ్రీనివాసులపై పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో శాఖాపరమైన చర్యల్లో భాగంగా విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోందని, విచారణలో తేలే అంశాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు వెల్లడించారు.


నీట్ యూజీ పేపర్ లీక్ కేసు విచారణలో మరో ముందడుగు పడింది. మంగళవారంనాడు ఇక్కడి స్పెషల్ ఫాస్ట్ట్రాక్ కోర్టులో సిబిఐ చార్జిషీటు దాఖలు చేసింది. బుధవారంనాడు విచారణ జరగనున్నట్లు అధికారులు వెల్లడించారు. సిబిఐ ఇప్పటికే 13 మంది నిందితులను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకుంది. నిందితులపై క్రిమినల్ కుట్ర, మోసం, విశ్వాస ఉల్లంఘన, సాక్ష్యాధారాల ధ్వంసం, అవినీతి, ప్రభుత్వ పరీక్షల్లో అక్రమాలు తదితర నేరాలను సిబిఐ మోపింది. 422 పేజీల చార్జిషీట్లో 360 మంది సాక్ష్యాలను పొందుపరిచింది.




జలమయమైన రోడ్లు, మోకాలి లోతు నీటిలో మునిగిన రద్దీ మార్కెట్లు, అంగుళం కూడా ముందుకు కదలని వాహనాలు, ఇవన్నీ మంగళవారం ఎడతెగని వానలతో తడిసి ముద్దయిన ఢిల్లీలో కనిపిస్తున్నాయి. దీంతో వాతావరణ విభాగం రెడ్ అలర్ట్ జారీ చేసింది. వచ్చే కొన్ని గంటల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో నగరంలో కుంభవృష్టి కురుస్తుందని హెచ్చరించింది. మంగళవారం ఉదయం ఎడతెరిపి లేని వానతో కన్నాట్ ప్లేస్, జనపథ్, లూటెన్స్ ఢిల్లీ,భారత్ మండపం రోడ్, బారఖంబరోడ్, ఐటిఒ సమీపాన మధుర రోడ్, కాళింది కుంజ్, తదితర లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. అనేక ప్రాంతాల్లో జలమయం అయిన దృశ్యాలను పిడబ్లుడి మంత్రి పర్వేష్ సాహిబ్ సింగ్ ఎక్స్ ఖాతాలోని వీడియో ద్వారా చూపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు సౌరభ్ భరద్వాజ్ కూడా ఎక్స్ ఖాతా నుంచి వీడియో పోస్ట్ చేశారు. సదర్ బజార్ హోల్సేల్ మార్కెట్లో ఛాతీ లోతు లోంచి స్కూలు పిల్లలు మునిగి దాటుతుండడం కనిపించింది. గ్రేటర్ కైలాష్ 2 నుంచి సావిత్రి సినిమా , అక్కడ నుంచి చిరాగ్ దిల్లీ, హౌజ్ ఖాస్,ఆర్కె పురం, సంగం విహార్ నుంచి ఖాన్పూర్, ఎంబీ రోడ్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. శంకర్ విహార్, జకీర్ హుస్సేన్ రోడ్డు,


నీట్ లీక్ వివాదంలో ధర్మేంద్ర ప్రధాన్ను మంత్రి పదవి నుంచి తొలగించిన ప్రధానమంత్రి పదవిని కాపాడుకున్నారని ఎస్పి నేత, ఎంపి అఖిలేష్ యాదవ్ లోక్సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లుపై చర్చ సందర్భంగా ఆక్షేపించారు. యువత ఆందోళలను తాము ప్రశంసిసున్నామని అన్నారు. విద్యార్థుల నిరసనను అణిచివేయడానికి లాఠీచార్జీ, పెల్లెట్గన్స్, విద్యుత్ బ్యాటన్లను కూడా ప్రయోగించారని మండిపడ్డారు. ఇప్పటికైనా విద్యార్థుల మనోగతాన్ని ఈ ప్రభుత్వం వింటుందని ఆశిస్తున్నామన్నారు. అయోధ్య విరాళాలు కూడా దోపిడీ చేసిన వాళ్లు పేపర్ లీక్లు ఆపగలరా అని ప్రశ్నించారు. ఆందోళనకారులకు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండాలని ప్రభుత్వానికి సూచించారు. ప్రభుత్వం నిరసనకారులకు మోకరిల్లిందని, అందువల్లే డిమాండ్లకు అంగీకరించిందని ప్రధాన్ రాజీనామా ఉదంతాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు గత ప్రభుత్వంలో నేరేళ్లలో జరిగిన ఘటన బాధితులను పరామర్శించేందుకు టూరిస్టులా తాను రాలేదని ఎస్సీ కమిషన్ రిపోర్ట్ కోసం పోరాడుతానని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నేరేళ్ల గ్రామంలో అనారోగ్యంతో చనిపోయిన గంధం గోపాల్ కుటుంబాన్ని కలిసి ఆమె పరామర్శించారు. పార్టీ పరంగా అండగా నిలుస్తామని హామీనిచ్చారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అందరి బతుకులు బాగుపడతాయని ఆశిస్తే నేరేళ్ల ఘటన సమాజం తలదించుకునేలా చేసిందన్నారు. తొమ్మిదేళ్లు ప్రభుత్వం నుంచి బాధితులకు రూపాయి సాయం కూడా అందలేదన్నారు. నేరేళ్ల బాధితుల కన్నీళ్ల పునాదుల మీద అధికారం అనుభవిస్తున్న నాయకులు వారి కుటుంబాలకు రూ.కోటి పరిహారం అందివ్వాలని డిమాండ్ చేశారు. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని వారి పిల్లల భవిష్యత్తును బాధ్యతగా తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఐదు రోజుల పాటు ఎనిమిది మందిని ఇష్టానుసారంగా పోలీసులు కొట్టారని, జైలర్ కూడా వారిని జైళ్లోకి తీసుకోవడానిక

హైదరాబాద్లో మంగళవారం సాయంత్రం వేళ పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. ఉదయం నుంచి కాస్త ఎండగా ఉన్నప్పటికీ సాయంత్రం 5 గంటల తర్వాత ఒక్కసారిగా ఆకాశం నల్లటి మేఘాలతో ముసురుకుని కుండపోతగా వాన కురిసింది. మియాపూర్, కూకట్ పల్లి, రాయదుర్గం, మణికొండ, మాదాపూర్, యూసుఫ్ గూడ, ఖైరతాబాద్, కోఠి, నాచారం, సికింద్రాబాద్, బేగంపేట, అల్వాల్, కాప్రా, మౌలాలీ, జూబ్లీహిల్స్, బోరబండ తదితర ప్రాంతాల్లో భారీ వర్షంతె రహదారులు జలమయమయ్యాయి . ఆఫీసుల నుంచి ఇళ్లకు తిరిగి వెళ్లే పీక్ అవర్స్ సమయంలో వాన పడటంతో నగరంలోని ప్రధాన కూడళ్లలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

లోక్సభలో మంగళవారంనాడు యాంటీ పేపర్ లీక్ బిల్లుపై చర్చ సందర్భంగా డిఎంకె తరపున ఎంపి దయానిధి మారన్ చర్చలో పాల్గొన్నారు. అసలు నీట్ పరీక్షా విధానాన్నే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం పేపర్ లీకేజీలను అరికట్టడానికి అంటూ చేసిన ప్రతిపాదనలు కూడా ఏ మాత్రం పనిచేయవన్నారు. నీట్ అంశంలో రాష్ట్రాల అభ్యంతరాలను కేంద్రం పెడచెవిన పెడుతోందని, అందుకే ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని మారన్ అన్నారు. దేశవ్యాప్తంగా 22లక్షల మంది విద్యార్థులు నీట్కు హాజరవుతున్నారని, అందులో 12 లక్షల మంది అర్హత సాధిస్తే ఉన్న సీట్లు మాత్రం 1.39లక్షలు మాత్రమేనని అన్నారు. గణాంకాలు ఇలా ఉంటే మెడికల్ సీట్లు ఎలా సరిపోతాయని నిలదీశారు. తాజా బిల్లుతో ప్రభుత్వ ఉద్దేశం నెరవేరబోదని టిఎంసి ఎంపి అభిషేక్ బెనర్జీఅన్నారు. లక్షలాది యువత ఎదుర్కొన్న అవమానాన్ని ఎలా మరిచిపోగలమన్నారు. అయితే బిల్లుకు తమ మద్దతు ఉంటుందని, పరీక్షల్లో పేపర్ లీకేజీలకు అరికట్టేందుకు ఈ ప్రతిపాదనలు మాత్రం సరిపోవన్నారు.





ట్రైనీ ఐపిఎస్ అధికారిణిపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపిఎస్ ఉయయ్ కృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ శివారులో అదుపులోకి తీసుకుని అత్తాపూర్ పోలీసుస్టేషన్కు తరలించారు. ఈ కేసు ఐవోగా చార్మినార్ మహిళా పోలిస్టేషన్ సిఐ జ్యోత్స్న, కేసు పర్యవేక్షణ అధికారిగా మహిళా భద్రత విభాగం డిసిపి లావణ్యను నియమించారు. మరోవైపు తనపై అత్తాపూర్ పోలీసు స్టేషన్లో నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ఉదయ్ కృష్ణారెడ్డి జూన్ 21న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశా రు. గతంలో వాదనలు విన్న హైకోర్టు అదనపు పిపి జితేందర్ రావు వివరాలు సమర్పించడానికి సమయం కోరడంతో తదుపరి విచారణ మరో సారి బుధవారానికి వాయిదా వేసింది. సహచర ట్రైనీని లైంగికంగా వేధించారని మహిళా ట్రైనీ ఫిర్యాదు మేరకు అత్తాపూర్ పోలీసుస్టేషఫన్లో కేసు నమోదైంది. కేసు నమోదు తర్వాత ఆస్పత్రిలో ఉదయ్ కృష్ణారెడ్డి చేరారు.ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ తర్వాత కనిపించకుండాపోయాడు. ఫోన్ స్విచాఫ్ చేసుకుని కనిపించకుండా పోయిన ఉదయ్ని మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ట్రైనీ ఐపిఎస్ ఉదయ్ కృష్ణారెడ్డినీ చట్ట పరిధిలో ప్రొసీజర్ ప్రకారంవిచారిస్తామని రా

బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే గ్రూప్-1, పదవ తరగతి పరీక్షా పత్రాలు లీక్ అయ్యాయని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. గ్రూప్-1 పరీక్షను సక్రమంగా నిర్వహించలేకపోయిందని ఆయర మంగళవారం ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ విమర్శించారు. అయితే కాంగ్రెస్ హయాంలో పేపర్ల లీకులయ్యాయని బిఆర్ఎస్, బిజెపి నేతలు చేస్తున్న ఆరోపణల్లో ఏ మాత్రం వాస్తవం లేదన్నారు. బిఆర్ఎస్ హయాంలో పేపర్ లీకులు జరిగితే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్ ఏ రోజైనా మాట్లాడారా? అని ఎంపీ చామల ప్రశ్నించారు. ఈ ఏడాది మే నెల మొదటి వారంలో నీట్ పేపర్ లీక్ జరిగిందని, జెన్ జీ రోడ్ల పైకి రావడంతో ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధానితో రాజీనామా చేయించారని ఆయన తెలిపారు. నీట్ పేపర్ లీకేజీపై పార్లమెంట్ లో చర్చ జరగాలని లోక్సభ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేసినా కేంద్రం చర్చకు అంగీకరించడం లేదన్నారు. వీటన్నింటికీ జవాబుదారీ ఎవరు అని రాహుల్ గాంధీ ప్రశ్నించినా సమాధానం లేదని ఆయన విమర్శించారు.