🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTTటుడేతెలుగు
Advertisement
Sponsored by simplysouth
Todayతెలంగాణ

తెలంగాణ

4577 వార్తలు

క‌ద‌ల‌ని ఆర్టీసీ చ‌క్రం
పాత వార్త
తెలంగాణ

క‌ద‌ల‌ని ఆర్టీసీ చ‌క్రం

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ప్ర‌స్తుతం ఆర్టీసీ కార్మికుల‌ స‌మ్మెతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో బ‌స్సులు డిపోకే ప‌రిమిత‌మైయ్యాయి.దీంతో రాష్ట్రంలో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీకి 97 డిపోల్లో 10 వేల బస్సులు ఉన్నాయి. వీటిలో దాదాపు 3,500 అద్దె బస్సులు ఉన్నాయి. సంస్థలో 39 వేల మంది కార్మికు లు, ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ బస్సులు రోజుకు 36 లక్షల కిలోమీటర్ల మేర ప్రయాణం చేస్తున్నాయి. ప్ర‌స్తుతం స‌మ్మె కార‌ణంగా బ‌స్సుల‌న్ని డిపోల‌కే ప‌రిమిత‌మైయ్యాయి. ఆయా డిపోల […] The post క‌ద‌ల‌ని ఆర్టీసీ చ‌క్రం appeared first on Navatelangana.

Adminఏప్రిల్ 21, 2026 - మంగళవారం👁 1
చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. గేల్ వరల్డ్ రికార్డు బ్రేక్
పాత
తెలంగాణ

చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. గేల్ వరల్డ్ రికార్డు బ్రేక్

హైదరాబాద్: టీ20 క్రికెట్ లో టీమిండియా బ్యాటర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఈ పొట్టి ఫార్మాట్‌లో అభిషేక్ నాలుగోసారి 130+ స్కోరును నమోదు చేశాడు. దీంతో క్రిస్ గేల్, ఆరోన్ ఫించ్ నెలకొల్పిన ప్రపంచ రికార్డును బద్దలు కొడుతూ.. నయా రికార్డును నెలకొల్పాడు. ఈ ఫార్మాట్ లో గేల్, ఫించ్ లు చెరో మూడుసార్లు 130 పరుగుల మార్కును దాటారు.ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో భాగంగా మంగళవారం రాత్రి ఉప్పల్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో అభిషేక్ కేవలం 68 బంతుల్లో10 ఫోర్లు, 10 సిక్సులతో అజేయంగా 135 పరుగులు చేశాడు. అభిషేక్ తన కెరీర్‌లో కేవలం 188 మ్యాచ్‌లలో మాత్రమే ఈ ఘనతను సాధించాడు.ఇక, మ్యాచ్ విషయానికి వస్తే.. ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి, సన్‌రైజర్స్ హైదరాబాద్ హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్.. 20 ఓవర్లలో 242 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం లక్ష్య చేధనకు దిగిన ఢిల్లీ పూర్తి ఓవర్లు ఆడి 8 వికెట్లు కోల్పోయి 195 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 47 పరుగుల తేడాతో హై

ఆర్టీసీ స‌మ్మె..మెట్రో రైళ్లకు ఫుల్ డిమాండ్
పాత
తెలంగాణ

ఆర్టీసీ స‌మ్మె..మెట్రో రైళ్లకు ఫుల్ డిమాండ్

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ప్ర‌స్తుతం ఆర్టీసీ కార్మికుల‌ స‌మ్మెతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో బ‌స్సులు డిపోకే ప‌రిమిత‌మైయ్యాయి. దీంతో ముఖ్యంగా హైదరాబాద్‌లో విద్యార్థులు, ఉద్యోగులు, సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. రోజూ బస్సుల్లోనే 25 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఒక్కసారిగా బస్సులు నిలిచిపోవడంతో దాదాపు వారంతా మెట్రో రైళ్ల వైపు మళ్లారు. దీంతో మెట్రో రైళ్లకు ఫుల్ డిమాండ్ పెరిగింది. హైదరాబాద్ నగరవ్యాప్తంగా మెట్రోస్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. ఇసుక వేస్తే రాలనంత మందితో అన్ని స్టేషన్లు నిండిపోయాయి. […] The post ఆర్టీసీ స‌మ్మె..మెట్రో రైళ్లకు ఫుల్ డిమాండ్ appeared first on Navatelangana.

ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల ప‌ట్ల ప్ర‌భుత్వం సానుకూలంగా ఉంది: ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్
పాత
తెలంగాణ

ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల ప‌ట్ల ప్ర‌భుత్వం సానుకూలంగా ఉంది: ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉందని, ఉద్యోగులందరూ తక్షణమే విధులకు హాజరుకావాలని ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ (MD) నాగిరెడ్డి పిలుపునిచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కార్మికులు కోరుతున్న డిమాండ్లను ఒకేసారి కాకుండా, ప్రాధాన్యతా క్రమంలో దశలవారీగా పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కార్మికుల ప్రధాన డిమాండ్లను లోతుగా పరిశీలించి, ప్రభుత్వానికి నివేదిక సమర్పించేందుకు ఇప్పటికే ఒక ప్రత్యేక కమిటీని నియమించాం. ఈ కమిటీ ఇచ్చే సూచనల మేరకు తదుపరి నిర్ణయాలు […] The post ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల ప‌ట్ల ప్ర‌భుత్వం సానుకూలంగా ఉంది: ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ appeared first on Navatelangana.

జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌..తీర్పుపై ఉత్కంఠ‌
పాత
తెలంగాణ

జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌..తీర్పుపై ఉత్కంఠ‌

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై విచారణ నిమిత్తం ఏర్పాటు చేసిన జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌పై దాఖలైన పిటిషన్‌లపై ఇప్పటికే వాదనలను విన్న హైకోర్టు బుధవారం తీర్పు వెలువరించనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం, నిర్వహణల్లో అవకతవకలపై విచారణ నిమిత్తం ఏర్పాటు చేసిన జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌పై దాఖలైన పిటిషన్‌లపై ఇప్పటికే వాదనలను విన్న హైకోర్టు బుధవారం తీర్పు వెలువరించనుంది. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో […] The post జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌..తీర్పుపై ఉత్కంఠ‌ appeared first on Navatelangana.

ప్ర‌ముఖ నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు ఇక‌లేరు
పాత
తెలంగాణ

ప్ర‌ముఖ నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు ఇక‌లేరు

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ప్ర‌ముఖ నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు(71) మంగళవారం అర్ధరాత్రి మృతి చెందారు. ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చిట్టిబాబు (ChittiBabu) గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రముఖ రచయిత త్రిపురనేని మహారథి కుమారుడే చిట్టిబాబు. 1955 జూలై 28న కృష్ణాజిల్లా గుడ్లవల్లేరులో జన్మించారు. చెన్నైలో చదువుకున్నారు. ‘సంతానం’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. మొత్తం 12 సినిమాలకు దర్శకత్వం వహించడమే కాకుండా దాదాపు 30 చిత్రాల్లో తెరపై […] The post ప్ర‌ముఖ నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు ఇక‌లేరు appeared first on Navatelangana.

టాలీవుడ్ లో విషాదం.. నిర్మాత చిట్టి బాబు కన్నుమూత
పాత
ప‌శ్చిమాసియా యుద్ధం..సీజ్ ఫైర్ పొడిగింపు
పాత
తెలంగాణ

ప‌శ్చిమాసియా యుద్ధం..సీజ్ ఫైర్ పొడిగింపు

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: కాల్పుల విరమణ ఒప్పందం మరికొన్ని గంటల్లో ముగియబోతున్న నేపథ్యంలో అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. కాల్పుల విర‌మ‌ణ ఒప్పందాన్ని పొడిగిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. పాకిస్థాన్ సైన్యాధిపతి అసిమ్ మునీర్, పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్‌ల అభ్యర్థనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. ఇరాన్ ప్రభుత్వం “తీవ్రంగా చీలిపోయినట్లు” కనిపిస్తోందని, స్పష్టమైన వైఖరిని తెలియజేయడానికి దానికి సమయం అవసరమని ట్రూత్ సోషల్‌లో ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ నాయకత్వానికి చర్చల కోసం ఒక […] The post ప‌శ్చిమాసియా యుద్ధం..సీజ్ ఫైర్ పొడిగింపు appeared first on Navatelangana.

రాష్ట్రవ్యాప్తంగా బస్సులు బంద్.. డిపోల వద్ద కార్మికుల నిరసన
పాత
తెలంగాణ

రాష్ట్రవ్యాప్తంగా బస్సులు బంద్.. డిపోల వద్ద కార్మికుల నిరసన

తెలంగాణలో అర్దరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె సైరన్ మోగింది. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో ఆర్టీసి సమ్మెకు దిగింది. తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందన్న టీజి ఆర్టీసి జెఎసి స్పష్టం చేసింది. దీంతో అర్ధరాత్రి నుంచే బస్సులు బంద్ అయ్యాయి. సమ్మెతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. పలు జిల్లాల్లో డిపోల వద్ద ఆర్టీసి కార్మికులు నిరసనలు చేపట్టారు. ఉప్పల్ డిపో వద్ద నిరసనకు దిగిన కార్మికులకు మద్దతూ తెలుపుతూ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నిరసనలో పాల్గొన్నారు.మరోవైపు, బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఆర్టీసీ సమ్మెతో రాష్ట్ర ప్రభుత్వం.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టింది. జిల్లాల వారీగా ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లు చేయాలని ఆర్డీవోలకు ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా జిహెచ్‌ఎంసి పరిధిలో వీలైనన్ని ఎక్కువ ప్రైవేట్ వాహనాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించింది.ఇక, ఆర్టీసీ యాజమాన్యం.. యథావిధిగా అద్దె బస్సులు నడుపుతోంది.

ఓటుకు నోటు కేసు: సీఎం రేవంత్‌రెడ్డి పిటిష‌న్‌పై విచార‌ణ‌
పాత
తెలంగాణ

ఓటుకు నోటు కేసు: సీఎం రేవంత్‌రెడ్డి పిటిష‌న్‌పై విచార‌ణ‌

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డి వేసిన పిటిష‌న్ పై నేడు సుప్రీంకోర్టులో విచార‌ణ జ‌ర‌గ‌నుంది. స‌దురు కేసును అవినీతి నిరోధ‌క చ‌ట్టం కాకుండా ఎన్నిక‌ల చ‌ట్టాల నియమావ‌ళి కింద విచారించాల‌ని కోరుతూ ప్ర‌స్తుత సీఎం రేవంత్ రెడ్డి దాఖ‌లు చేసిన పిటిష‌ణ్ పై బుద‌శారం సుప్రీంకోర్టులో విచార‌ణ జ‌ర‌గ‌నుంది. ఈ కేసులో త‌న పేరును తొల‌గించాల‌ని కోరుతూ 13 ఏప్రిల్ 2021న మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట‌న వీర‌య్య సైతం అత్యున్న‌త న్యాయ‌స్థానంలో […] The post ఓటుకు నోటు కేసు: సీఎం రేవంత్‌రెడ్డి పిటిష‌న్‌పై విచార‌ణ‌ appeared first on Navatelangana.

మంత్రి సీత‌క్క మేఘాల‌య‌లో ప‌ర్య‌ట‌న‌
పాత
రక్తమోడుతున్న రహదారులు
పాత
తెలంగాణ

రక్తమోడుతున్న రహదారులు

నిత్యం ప్రమాదాలతో రహదారులు రక్తమోడుతున్నాయి. రోజూ దినపత్రికలను తిరగేసేవారికి రోడ్డు ప్రమాదాలు జరగని రోజంటూ ఉండదేమో అనిపించకమానదు. ఇంట్లోంచి బయటకు వెళ్లిన వ్యక్తి తిరిగి వచ్చేంతవరకూ ప్రాణాలకు హామీ లేదంటే అతిశయోక్తి కాదు. ఏవైపునుంచి ఏ వాహనం మీదకు దూసుకువస్తుందో, ఏ మూలమలుపులో మృత్యుదేవత మాటువేసుకుని కూర్చుందో తెలియదు. తాజాగా జమ్మూకశ్మీర్ లోని ఉధంపూర్ సమీపాన ఓ బస్సు లోయలో పడి, 21 మంది కన్నుమూసిన ఘటన దిగ్భ్రాంతికరం. కొండప్రాంతంలో బస్సు ప్రయాణిస్తుండగా మూలమలుపు వద్ద దారి కనబడకపోవడంతోనే బస్సు లోయలో పడిపోయినట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. కారణాలు ఏవైనా, ప్రమాదం జరిగాక మృతుల బంధువులకు మిగిలేది తీరని శోకమే. ప్రమాదం మిగిల్చిన అవకరాలతో క్షతగాత్రులు జీవితాంతం దీనంగా బతుకు ఈడ్వవలసిందే. ప్రభుత్వాలు అప్పటికప్పుడు లక్షల్లో నష్టపరిహారాలను ప్రకటించవచ్చుగాక, అవేవీ కోల్పోయిన తమ బంధువులను తిరిగి తీసుకురావడానికి ఎంతమాత్రం సహాయపడవు కదా. వాహనాలను నడిపేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలపై చోదకుల నిర్లక్ష్యం, పరిమితికి మించి అతివేగంగా నడపడం వంటివి ప్రమాదాలకు ప్రధాన హేతువులు కాగా, వాహనాలలోని సాంకేతిక లో

భారత్‌కు చావోరేవో.. నేడు సఫారీ మహిళలతో కీలక పోరు
పాత
తెలంగాణ

భారత్‌కు చావోరేవో.. నేడు సఫారీ మహిళలతో కీలక పోరు

జోహెన్నస్‌బర్గ్: వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిన భారత మహిళా క్రికెట్ జట్టుకు బుధవారం సౌతాఫ్రికాతో జరిగే మూడో టి20 మ్యాచ్ చావోరేవోగా మారింది. సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి జట్టుకు నెలకొంది. ఇక ఇప్పటికే రెండు విజయాలు సాధించిన సౌతాఫ్రికా ఇందులోనూ గెలిచి సిరీస్‌ను దక్కించుకోవాలనే పట్టుదలతో ఉంది. రెండు మ్యాచుల్లోనూ టీమిండియా తన స్థాయికి తగ్గ ఆటను కనబరచలేక పోయింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో విఫలం కావడంతో భారత్‌కు వరుస ఓటములు తప్పలేదు. ఇలాంటి స్థితిలో మూడో టి20 సవాల్‌గా మారింది. సిరీస్‌లో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో గెలవడం తప్పించి మరో మార్గం భారత్‌కు లేకుండా పోయింది. ఆతిథ్య సౌతాఫ్రికా మాత్రం విజయమే లక్షంగా పోరుకు సిద్ధమైంది. రెండు విభాగాల్లో బలంగా ఉన్న సఫారీ టీమ్ సిరీస్‌పై కన్నేసింది.

ప్రియుడి కళ్లకు గంతలు కట్టి... కూర్చీలో కట్టేసి... సజీవదహనం చేసిన ప్రియురాలు
పాత
తెలంగాణ

ప్రియుడి కళ్లకు గంతలు కట్టి... కూర్చీలో కట్టేసి... సజీవదహనం చేసిన ప్రియురాలు

బెంగళూరు: ప్రియుడు మోసం చేస్తాడనే అనుమానంతో ప్రేమ పేరుతో అతడిని కూర్చికి కట్టేసి పెట్రోల్ పోసి దహనం చేసింది. ఈ సంఘటన కర్నాటక రాష్ట్రం బెంగళూరులోని బైదరహళ్లి ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అంజనానగర్ లో ఓ యువతి తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటుంది. తుమకూరుకు చెందిన కిరణ్ పరిచయం కావడంతో అతడితో ప్రేమలో పడింది. ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నారు. గత కొంతకాలంగా యువతిని యువకుడు పట్టించుకోకపోవడంతో అనుమానం పెంచుకుంది. కిరణ్ తనని పెళ్లి చేసుకోడేమోనని అనుమానం కలిగింది. ఇంట్లో ఎవరు లేని సమయంలో ప్రియుడిని ఇంటికి రప్పించింది. ప్రియుడితో సరసాలు జరిపిన తరువాత వినూత్నంగా ప్రేమను తెలియజేస్తానని అతడిని కళ్లకు గంతలు కట్టి కూర్చీకి కట్టేసింది. అనంతరం అతడిపై పెట్రోల్ పోసి తగలబెట్టింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకునేసరికి కూర్చీలో కిరణ్ సజీవదహనమయ్యాడు. తాను బాత్రూమ్ లో ఉన్నప్పుడు కిరణ్ కూర్చీలో కాలిపోయాడని నాటకం మాడింది. పోలీసులు యువతిని అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించడంతో నిజాలు ఒప్పుకుంది. వెంటనే ఆమెను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

ఆర్ టిసి బస్సు బోల్తా: పది మంది ప్రయాణికులకు  గాయాలు
పాత
తెలంగాణ

ఆర్ టిసి బస్సు బోల్తా: పది మంది ప్రయాణికులకు గాయాలు

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం మార్కపురం జిల్లాలో శ్రీశైలం ఘాట్ రోడ్డులో బస్సు బోల్తాపడింది. తుమ్మలబైలు గ్రామశివారులో ఆర్టిసి బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తాపడింది. పది మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. ౩౦ మంది ప్రయాణికులతో శ్రీశైలం నుంచి మార్కపురం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు డ్రైవర్ తప్పిదంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్రేన్ సహాయంతో బస్సును బయటకు తీశారు.

నేడు ఖాతాల్లోకి రైతు భరోసా
పాత
తెలంగాణ

నేడు ఖాతాల్లోకి రైతు భరోసా

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్ర భుత్వం రైతులకు అండగా నిలుస్తూ రై తు భరోసా పథకం కింద రెండోవిడత ని ధులను విడుదల చేసిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తె లిపారు. దీంతో 45,11,947 మంది రైతులు లబ్ధి పొందనున్నారని, ఈ క్ర మంలో రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ. 2,206.06 కోట్లు నేడు (బుధవారం) జ మ కానున్నాయని మంత్రి తెలిపారు. ఇ ప్పటికే నర్మెట్టలో ఏర్పాటు చేసిన ఆయి ల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ సందర్భంగా మొదటి విడతలో భాగంగా రూ. 3,446.94 కోట్లు ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేశామని, ఈ రెండు విడతలు కలిపి ఇప్పటివరకు రైతు భరోసా పథకం కింద మొత్తం రూ. 5,653 కోట్లు విడుదల చేసినట్టు ఆయన తెలిపారు. దీని ద్వారా మొత్తం 71.06 లక్షల మంది రైతులు లబ్ధి పొందారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివరించారు. రైతుల సంక్షేమానికే ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇస్తుందని , వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేస్తామని మంత్రి తుమ్మల తెలిపారు. మొత్తం సోమవారం నాటికి 71,05,572 మంది రైతుల ఖాతాల్లో రూ.5,653,00,36,827 కోట్లు జమ అయ్యాయని మంత్రి తుమ్మల తెలిపారు.

హడావుడి ‘బిల్లు’తో సాధించిందేమిటి?
పాత
తెలంగాణ

హడావుడి ‘బిల్లు’తో సాధించిందేమిటి?

సెప్టెంబర్ 2023లో ఆమోదించిన మహిళా రిజర్వేషన్ల చట్టం అమలును వేగవంతం చేయడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బడ్జెట్ సమావేశాల ప్రత్యేక భేటీలో నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి నోచుకోకపోవడంతో గత 12 ఏళ్లలో మొదటిసారిగా పార్లమెంట్‌లో ఈ ప్రభుత్వం అనూహ్యమైన పరాజయాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది. బహుశా గత మూడున్నర దశాబ్దాలలో మొదటిసారిగా ఓ రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంట్‌లో ఓటమికి గురయింది. అయితే ఈ బిల్లు ఓటమితో ప్రతిపక్షాలను ‘మహిళా వ్యతిరేకులు’ అంటూ వెంటనే ఎన్నికల ప్రచారంలోకి ప్రధాని మోడీ, ఇతర నాయకులు దిగడం మినహా అందుకు దారితీసిన కారణాల గురించి ఆత్మపరిశీలన చేసుకొనే ప్రయత్నం చేయడం లేదు. తమకు మూడింట రెండు వంతుల మెజారిటీ లేదని తెలిసి కూడా, ముందుగా ఎటువంటి సంప్రదింపులు, ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకొనే ప్రయత్నం చేయకుండా కీలకమైన రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో అర్ధాంతరంగా ఈ బిల్లులను ఎందుకు తీసుకు వచ్చారో ఇప్పటికీ సమాధానం చెప్పలేకపోతున్నారు. అందుకనే ఈ ప్రభుత్వం ఎవ్వరి విశ్వాసాన్ని పొందలేకపోతున్నది. చివరకు బిజెపి నేతలు సైతం ప్రభుత్వ ధోరణిని అర్ధం చేస

మహిళా బిల్లుకు మోక్షమెన్నడు?
పాత
తెలంగాణ

మహిళా బిల్లుకు మోక్షమెన్నడు?

దాదాపు మూడు దశాబ్దాల కల కలగానే మిగిలిపోనుందా అనే సందేహం మహిళలకే కాదు స్త్రీల ఉన్నతికి పాటుపడే వారందరి మదిలోమెదులుతున్న ప్రశ్న. 131 రాజ్యాంగ సవరణ మహిళా బిల్లు ఆమోదం పొందకపోవడంపై రకరకాల అనుమానాలు ఉత్పన్నం అవుతున్నాయి. మహిళా బిల్లు వీగిపోవడం ఇప్పుడు కొత్తేంకాదు. సుమారు ఆరు ఏడు సార్లు అయింది. ఎన్‌డిఎ కూటమి ఏమో మహిళా బిల్లుకు డీలిమిటేషన్ కలుపడంద్వారా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని విపక్ష నేతలు వ్యతిరేకించి ఓటు వేశారని అర్థమైంది. పార్లమెంట్ ఈ బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు రావడంతో ఆమోదానికి అవసరమైన మూడింట రెండు వంతు 352 మెజారిటీ దక్కలేదు. 2/3 మెజారిటీకి 54 ఓట్లు తక్కువపడ్డాయి. మహిళా బిల్లు ఎన్‌డిఎ కుట్రలో భాగమని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎందుకంటే ఈ బిల్లు 2011 జనాభా లెక్కల ప్రకారం డీమిలిటేషన్‌తో ముడిపెట్టి ఓటింగ్ పెట్టడమే తప్పిదమని, బిజెపి చాణక్య నీతికి మించి అత్యుత్సాహం చూపుతున్నదని బలంగా వాదిస్తున్నారు ఇండియాకూటమి నేతలు. ఒబిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీ రిజర్వేషన్‌పై కూడా స్పష్టతలేదు. అందుకే విపక్షాలు మద్దతు తెలుపలేదు. మహిళా బిల్లు వ్యతిరేకించిన వారిని దేశప్

వామపక్షాలన్నీ కలిస్తేనే గెలుపు
పాత
తెలంగాణ

వామపక్షాలన్నీ కలిస్తేనే గెలుపు

భారతదేశ సామాజిక, రాజకీయ ముఖచిత్రంపై ఎర్రజెండా ఒక చెరగని సంతకం. దానికో ఒక ప్రత్యేక చరిత్ర ఉంది. అయితే, వందేళ్ల ప్రస్థానం తర్వాత కూడా ‘అధికారం’ అనే గమ్యం ఎందుకు అగమ్యగోచరంగా మారింది? సిద్ధాంతం పటిష్టంగా ఉన్నా, ఆచరణలో ఎక్కడ అడుగులు తడబడ్డాయి? ప్రజల నాడిని పట్టుకోవడంలో జరిగిన పొరపాట్లను సమీక్షించుకోవాలి. ‘ప్రజల నుండి... ప్రజల వైపుగా’ ఒక నూతన ప్రయాణాన్ని ప్రారంభించాల్సిన అవసరం ఉంది. కేవలం సిద్ధాంతాల చట్రంలో కాకుండా, భారతీయ మట్టి వాసనను, ఇక్కడి మనుషుల మనస్తత్వాన్ని పుణికిపుచ్చుకోవాలి. ‘పుస్తకంలో ఉన్న సిద్ధాంతం కేవలం అక్షరం.. ప్రజల ఆకలిని తీర్చినప్పుడే అది అధికారం!’ ‘పుస్తకాల్లో ఉన్న మార్క్సిజం విజ్ఞానాన్ని ఇస్తుంది.. కానీ ప్రజల కళ్లలో ఉన్న కన్నీటిని తుడిచే మార్క్సిజం అధికారాన్ని ఇస్తుంది.’ కమ్యూనిజం అంటే కేవలం రష్యా, చైనా విప్లవాల చరిత్రకాదు. భారతదేశంలో ఎర్రజెండా గెలవాలంటే, అది ఇక్కడి సామాజిక రుగ్మతలపై ఎక్కుపెట్టిన అస్త్రం కావాలి. అణచివేత ఎక్కడ ఉన్నా అక్కడ ఎర్రజెండా ఉండాలి. అది ఆర్థిక దోపిడీ కావచ్చు లేదా వేలఏళ్లుగా పేరుకుపోయిన కులవివక్ష కావచ్చు. మనువాద భావజాలం సృష్టించిన అగ్ర-నీచ భేదాలను తు

ఘోష్ కమిషన్‌పై నేడే తీర్పు
పాత
తెలంగాణ

ఘోష్ కమిషన్‌పై నేడే తీర్పు

మన తెలంగాణ/హైదరాబాద్: కాళేశ్వ రం ప్రాజెక్టు నిర్మాణ పనుల లోపాలపై ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌కు విచారణ అర్హతను సవాల్ చేస్తూ హైకోర్టు దాఖలు అయిన పిటిషన్‌పై బు ధవారం కీలక తీర్పు వెలువడనున్నది. ఈ కమిషన్‌కున్న అర్హతలను సవాల్ చే స్తూ ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పని చేసిన హరీశ్‌రావు హైకోర్టును ఆశ్రయించిన విషయంతెలిసిందే. జస్టిస్ పీసీ ఘోష్ నేతృ త్వంలోని కమిషన్‌ను ఇచ్చిన నివేదికను రద్దు చేయాలని వారు హైకోర్టును కోరారు. కాగా కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోకూడదని ఇదివరకే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం వెలువడే తీర్పు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా అధికార, ప్రతిపక్ష రాజకీయ వర్గాలలో ప్రాధా న్యం సంతరించుకుంది.ఈ కేసులో కోర్టు వెలువరించే తీర్పు కాళేశ్వరం ప్రాజెక్టుపై తదుపరి పరిణామాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కుంగిన బ్యారేజీలు, ప్రాజెక్టు నిర్మాణం జరిగిన అవకతవకలపై జస్టిస్ పి.సి.ఘోష్ కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం మార్చి 14, 2024న నియమించింది. కమిషన్ నియామకం, దానికున్

బస్సులు బంద్
పాత
తెలంగాణ

బస్సులు బంద్

మన తెలంగాణ/హైదరాబాద్: మంగళవారం అర్థరాత్రి నుండి ఆర్‌టిసి కార్మికులు సమ్మెకు దిగారు. సమ్మె నివారణకోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారుల కమిటీతో కార్మిక సంఘాల నాయకులు నాలుగు గంటలకు పై గా జరిపిన చర్చలు ఫలించకపోవడంతో సమ్మె కు వెళుతున్నట్లు జెఎసి నేతలు ప్రకటించారు. దీంతో మంగళవారుం అర్థరాత్రి నుంచి బస్సు లు డిపోలకే పరిమితం కానున్నాయి. సమ్మె ని వారణకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఐఎఎస్ అధికారుల కమిటీ (వికాస్ రాజ్, సందీఫ్ కుమార్ సుల్తానియా, ఆర్‌టిసి ఎండి నాగిరె డ్డి,) సచివాలయంలో కార్మిక సంఘాల జెఎసి నేతలతో చర్చలు జరిపింది. కాగా జెఎసి తరఫున ఈదురు వెంకన్న, థామస్ రెడ్డి, హనుమంతు ముదిరాజ్ ఈ చర్చల్లో పాల్గొన్నారు. సమ్మెనోటీసు ఇచ్చి 41 రోజులు గడిచినప్పటికీ ఇంతకాలం నిర్లక్షం చేసి గడువు ముగిసే చి వరి రోజు అధికారుల కమిటీ ఏర్పాటు చేశార ని జెఎసి నేతలు విమర్శించారు. ప్రభుత్వంలో ఆర్‌టిసి విలీనం, కార్మిక సంఘాల గుర్తింపు తమ ప్రధాన డిమాండ్ అని వారు పేర్కొన్నా రు. కార్మిక సంఘాలు, ప్రభుత్వం వద్ద 32 డి మాండ్లు పెట్టినప్పటికీ ప్రధాన మైన డిమాండ్ల పై సయోధ్య కుదురకపోవడంతో సమ్మెను కొ నసాగించి తీరుతామని ఆర్‌ట

ఉద్యోగుల బదిలీలకు పచ్చజెండా
పాత
తెలంగాణ

ఉద్యోగుల బదిలీలకు పచ్చజెండా

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభు త్వ ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివే స్తూ జీఓ 31లో కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం బదిలీల ప్రక్రియ మే 1వ తేదీ నుంచి మే 31, 2026 వరకు ఈ బదిలీల ప్రక్రియ కొనసాగనుంది. జూన్ 1, 2026 నుంచి తిరిగి బదిలీలపై నిషేధం అమల్లోకి వస్తుందని ఆర్థికశాఖ ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. 1 జనవరి 2026 నాటికి ఒకే చోట మూడేళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగులు బదిలీకి అర్హులుగా పేర్కొంది. అయితే, నా లుగేళ్లు పూర్తి చేసుకున్న వారు తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉంటుంది. బదిలీ ఉత్తర్వులు వెలువడిన మూడు రోజుల్లోపు ఉద్యోగులు విధుల నుంచి రిలీ వ్ కావాలి. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హె చ్చరించింది. సెన్సస్ (జనగణన) విధుల్లో ఉన్న ఉ ద్యోగులకు బదిలీల మార్గదర్శకాలు వర్తించవని ఆ ర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా ఈ జీఓలో పేర్కొన్నారు. అదేవిధంగా 31-.12-.2025 నాటికి ఒకే చోట నాలుగు సంవత్సరాలు విధులు నిర్వహించిన ఉద్యోగులను అక్కడ కొనసాగించరాదు. అంటే నాలుగు సంవత్సరాలకుపైగా ఒకే చోట పనిచేసిన వారిని తప్పనిసరిగా బదిలీ చేయాల్సి ఉంటుంది. అ

ధరల మోత..సబ్సిడీ మేత
పాత
తెలంగాణ

ధరల మోత..సబ్సిడీ మేత

– వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో అక్రమాలు– కాంట్రాక్టర్లకు లబ్ది చేకూర్చేందుకు సాగు పరికరాల ధరల పెంపు– బహిరంగ మార్కెట్‌తో పోల్చితే సబ్సిడీ పథకంలోనే అధిక ధరలు– అధికారులకు కాసుల వర్షం.. అవినీతి జరిగినట్టు ఆరోపణలు– రైతులు ఫిర్యాదు చేస్తే చర్యలు : వ్యవసాయ అధికారినవతెలంగాణ-నల్లగొండిపాంతీయ ప్రతినిధి‘ధరల మోత…సబ్సిడీల మేత’ అన్నట్టుగా మారింది వ్యవసాయ యాంత్రీకరణ పథకం. రైతులకు లాభదాయకంగా ఉండాల్సిన సబ్సిడీ పథకం అందుకు విరుద్ధంగా కొనసాగుతుంది. సబ్సిడీ యంత్రాల ధరలు బహిరంగ మార్కెట్‌తో పోల్చితే రైతులకు […] The post ధరల మోత..సబ్సిడీ మేత appeared first on Navatelangana.

పంట కొనుగోళ్ల ఆలస్యంపై రైతుల ఆగ్రహం
పాత
తెలంగాణ

పంట కొనుగోళ్ల ఆలస్యంపై రైతుల ఆగ్రహం

– ఖమ్మం జిల్లాలో మూడు చోట్ల రాస్తారోకోలు– మొక్కజొన్న, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని డిమాండ్‌– రోడ్డుపై మక్కలు పోసి నిరసన– కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అధికారుల హామీనవతెలంగాణ-చింతకాని/బోనకల్‌/ వైరాటౌన్‌పంట చేతికొచ్చి 20 రోజులు దాటుతున్నా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం.. రోజుల తరబడి రాసులు పోసి ఉంచడంతో తీవ్రమైన ఎండలకు పంట మరింత తూకం తగ్గుతుండటంతో రైతులు ఆందోళనకు గురవుతున్నాయి. ఈ క్రమంలో మొక్కజొన్న, ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించి పంట కాంటాలు వేయాలని […] The post పంట కొనుగోళ్ల ఆలస్యంపై రైతుల ఆగ్రహం appeared first on Navatelangana.

Advertisement
Sponsored by ATA – American Telugu Association