
4565 వార్తలు



నవతెలంగాణ-హైదరాబాద్: ప్రస్తుతం ఆర్టీసీ కార్మికుల సమ్మెతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో బస్సులు డిపోకే పరిమితమైయ్యాయి. అయితే కిరాయి డ్రైవర్లతో ఆర్టీసీ బస్సులను నడపాలని ప్రభుత్వం నీచ ఆలోచనకు శ్రీకారం చుట్టింది. ఓ అనుభవం లేని డ్రైవర్ ఆర్టీసీ బస్సు నడపడంతో కరీంనగర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సులో ఉన్నా ప్రయాణికులకు తీవ్ర గాయాలైయ్యాయి. బాధితులను వైద్యం కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కార్మికులు మండిపడుతున్నారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకుండా ప్రభుత్వం అనవసర […] The post కిరాయి డ్రైవర్లతో బస్సుల డ్రైవింగ్..కరీంనగర్లో రోడ్డు ప్రమాదం appeared first on Navatelangana.







నవతెలంగాణ-హైదరాబాద్: ప్రస్తుతం ఆర్టీసీ కార్మికుల సమ్మెతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో బస్సులు డిపోకే పరిమితమైయ్యాయి.దీంతో రాష్ట్రంలో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీకి 97 డిపోల్లో 10 వేల బస్సులు ఉన్నాయి. వీటిలో దాదాపు 3,500 అద్దె బస్సులు ఉన్నాయి. సంస్థలో 39 వేల మంది కార్మికు లు, ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ బస్సులు రోజుకు 36 లక్షల కిలోమీటర్ల మేర ప్రయాణం చేస్తున్నాయి. ప్రస్తుతం సమ్మె కారణంగా బస్సులన్ని డిపోలకే పరిమితమైయ్యాయి. ఆయా డిపోల […] The post కదలని ఆర్టీసీ చక్రం appeared first on Navatelangana.

హైదరాబాద్: టీ20 క్రికెట్ లో టీమిండియా బ్యాటర్, సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఈ పొట్టి ఫార్మాట్లో అభిషేక్ నాలుగోసారి 130+ స్కోరును నమోదు చేశాడు. దీంతో క్రిస్ గేల్, ఆరోన్ ఫించ్ నెలకొల్పిన ప్రపంచ రికార్డును బద్దలు కొడుతూ.. నయా రికార్డును నెలకొల్పాడు. ఈ ఫార్మాట్ లో గేల్, ఫించ్ లు చెరో మూడుసార్లు 130 పరుగుల మార్కును దాటారు.ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో భాగంగా మంగళవారం రాత్రి ఉప్పల్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో అభిషేక్ కేవలం 68 బంతుల్లో10 ఫోర్లు, 10 సిక్సులతో అజేయంగా 135 పరుగులు చేశాడు. అభిషేక్ తన కెరీర్లో కేవలం 188 మ్యాచ్లలో మాత్రమే ఈ ఘనతను సాధించాడు.ఇక, మ్యాచ్ విషయానికి వస్తే.. ఢిల్లీ క్యాపిటల్స్ను ఓడించి, సన్రైజర్స్ హైదరాబాద్ హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్.. 20 ఓవర్లలో 242 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం లక్ష్య చేధనకు దిగిన ఢిల్లీ పూర్తి ఓవర్లు ఆడి 8 వికెట్లు కోల్పోయి 195 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్పై 47 పరుగుల తేడాతో హై
నవతెలంగాణ-హైదరాబాద్: ప్రస్తుతం ఆర్టీసీ కార్మికుల సమ్మెతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో బస్సులు డిపోకే పరిమితమైయ్యాయి. దీంతో ముఖ్యంగా హైదరాబాద్లో విద్యార్థులు, ఉద్యోగులు, సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. రోజూ బస్సుల్లోనే 25 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఒక్కసారిగా బస్సులు నిలిచిపోవడంతో దాదాపు వారంతా మెట్రో రైళ్ల వైపు మళ్లారు. దీంతో మెట్రో రైళ్లకు ఫుల్ డిమాండ్ పెరిగింది. హైదరాబాద్ నగరవ్యాప్తంగా మెట్రోస్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. ఇసుక వేస్తే రాలనంత మందితో అన్ని స్టేషన్లు నిండిపోయాయి. […] The post ఆర్టీసీ సమ్మె..మెట్రో రైళ్లకు ఫుల్ డిమాండ్ appeared first on Navatelangana.
నవతెలంగాణ-హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉందని, ఉద్యోగులందరూ తక్షణమే విధులకు హాజరుకావాలని ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ (MD) నాగిరెడ్డి పిలుపునిచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కార్మికులు కోరుతున్న డిమాండ్లను ఒకేసారి కాకుండా, ప్రాధాన్యతా క్రమంలో దశలవారీగా పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కార్మికుల ప్రధాన డిమాండ్లను లోతుగా పరిశీలించి, ప్రభుత్వానికి నివేదిక సమర్పించేందుకు ఇప్పటికే ఒక ప్రత్యేక కమిటీని నియమించాం. ఈ కమిటీ ఇచ్చే సూచనల మేరకు తదుపరి నిర్ణయాలు […] The post ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉంది: ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ appeared first on Navatelangana.
నవతెలంగాణ-హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై విచారణ నిమిత్తం ఏర్పాటు చేసిన జస్టిస్ ఘోష్ కమిషన్పై దాఖలైన పిటిషన్లపై ఇప్పటికే వాదనలను విన్న హైకోర్టు బుధవారం తీర్పు వెలువరించనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం, నిర్వహణల్లో అవకతవకలపై విచారణ నిమిత్తం ఏర్పాటు చేసిన జస్టిస్ ఘోష్ కమిషన్పై దాఖలైన పిటిషన్లపై ఇప్పటికే వాదనలను విన్న హైకోర్టు బుధవారం తీర్పు వెలువరించనుంది. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో […] The post జస్టిస్ ఘోష్ కమిషన్..తీర్పుపై ఉత్కంఠ appeared first on Navatelangana.
నవతెలంగాణ-హైదరాబాద్: ప్రముఖ నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు(71) మంగళవారం అర్ధరాత్రి మృతి చెందారు. ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చిట్టిబాబు (ChittiBabu) గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రముఖ రచయిత త్రిపురనేని మహారథి కుమారుడే చిట్టిబాబు. 1955 జూలై 28న కృష్ణాజిల్లా గుడ్లవల్లేరులో జన్మించారు. చెన్నైలో చదువుకున్నారు. ‘సంతానం’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. మొత్తం 12 సినిమాలకు దర్శకత్వం వహించడమే కాకుండా దాదాపు 30 చిత్రాల్లో తెరపై […] The post ప్రముఖ నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు ఇకలేరు appeared first on Navatelangana.

టాలీవుడ్ లో విషాదం చోటుచేసుకుంది. నిర్మాత, విశ్లేషకులు త్రిపురనేని వరప్రసాద్(చిట్టి బాబు) కన్నుమూశారు. మంగళవారం రాత్రి ఆయనకు చాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటినా ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మరణించినట్లు వెైద్యులు తెలిపారు. గుండెపోటు కారణంగా ఆయన చనిపోయారని డాక్టర్లు తెలిపారు. దీంతో ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
నవతెలంగాణ-హైదరాబాద్: కాల్పుల విరమణ ఒప్పందం మరికొన్ని గంటల్లో ముగియబోతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. పాకిస్థాన్ సైన్యాధిపతి అసిమ్ మునీర్, పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ల అభ్యర్థనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. ఇరాన్ ప్రభుత్వం “తీవ్రంగా చీలిపోయినట్లు” కనిపిస్తోందని, స్పష్టమైన వైఖరిని తెలియజేయడానికి దానికి సమయం అవసరమని ట్రూత్ సోషల్లో ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ నాయకత్వానికి చర్చల కోసం ఒక […] The post పశ్చిమాసియా యుద్ధం..సీజ్ ఫైర్ పొడిగింపు appeared first on Navatelangana.

తెలంగాణలో అర్దరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె సైరన్ మోగింది. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో ఆర్టీసి సమ్మెకు దిగింది. తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందన్న టీజి ఆర్టీసి జెఎసి స్పష్టం చేసింది. దీంతో అర్ధరాత్రి నుంచే బస్సులు బంద్ అయ్యాయి. సమ్మెతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. పలు జిల్లాల్లో డిపోల వద్ద ఆర్టీసి కార్మికులు నిరసనలు చేపట్టారు. ఉప్పల్ డిపో వద్ద నిరసనకు దిగిన కార్మికులకు మద్దతూ తెలుపుతూ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నిరసనలో పాల్గొన్నారు.మరోవైపు, బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఆర్టీసీ సమ్మెతో రాష్ట్ర ప్రభుత్వం.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టింది. జిల్లాల వారీగా ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లు చేయాలని ఆర్డీవోలకు ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా జిహెచ్ఎంసి పరిధిలో వీలైనన్ని ఎక్కువ ప్రైవేట్ వాహనాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించింది.ఇక, ఆర్టీసీ యాజమాన్యం.. యథావిధిగా అద్దె బస్సులు నడుపుతోంది.
నవతెలంగాణ-హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డి వేసిన పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. సదురు కేసును అవినీతి నిరోధక చట్టం కాకుండా ఎన్నికల చట్టాల నియమావళి కింద విచారించాలని కోరుతూ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషణ్ పై బుదశారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో తన పేరును తొలగించాలని కోరుతూ 13 ఏప్రిల్ 2021న మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటన వీరయ్య సైతం అత్యున్నత న్యాయస్థానంలో […] The post ఓటుకు నోటు కేసు: సీఎం రేవంత్రెడ్డి పిటిషన్పై విచారణ appeared first on Navatelangana.
నవతెలంగాణ-హైదరాబాద్: నేటి నుంచి మంత్రి సీతక్క మేఘాలయాలో పర్యటించనున్నారు. ఆ రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకు స్టేట్ టు స్టేట్ భాగస్వామ్య కార్యక్రమంలో భాగంగా ఈ పర్యటన చేపట్టాన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ సేవలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా మంత్రి సీతక్క రెండు రోజులు ఆ రాష్ట్రానికి వెళ్లనున్నారు. The post మంత్రి సీతక్క మేఘాలయలో పర్యటన appeared first on Navatelangana.

నిత్యం ప్రమాదాలతో రహదారులు రక్తమోడుతున్నాయి. రోజూ దినపత్రికలను తిరగేసేవారికి రోడ్డు ప్రమాదాలు జరగని రోజంటూ ఉండదేమో అనిపించకమానదు. ఇంట్లోంచి బయటకు వెళ్లిన వ్యక్తి తిరిగి వచ్చేంతవరకూ ప్రాణాలకు హామీ లేదంటే అతిశయోక్తి కాదు. ఏవైపునుంచి ఏ వాహనం మీదకు దూసుకువస్తుందో, ఏ మూలమలుపులో మృత్యుదేవత మాటువేసుకుని కూర్చుందో తెలియదు. తాజాగా జమ్మూకశ్మీర్ లోని ఉధంపూర్ సమీపాన ఓ బస్సు లోయలో పడి, 21 మంది కన్నుమూసిన ఘటన దిగ్భ్రాంతికరం. కొండప్రాంతంలో బస్సు ప్రయాణిస్తుండగా మూలమలుపు వద్ద దారి కనబడకపోవడంతోనే బస్సు లోయలో పడిపోయినట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. కారణాలు ఏవైనా, ప్రమాదం జరిగాక మృతుల బంధువులకు మిగిలేది తీరని శోకమే. ప్రమాదం మిగిల్చిన అవకరాలతో క్షతగాత్రులు జీవితాంతం దీనంగా బతుకు ఈడ్వవలసిందే. ప్రభుత్వాలు అప్పటికప్పుడు లక్షల్లో నష్టపరిహారాలను ప్రకటించవచ్చుగాక, అవేవీ కోల్పోయిన తమ బంధువులను తిరిగి తీసుకురావడానికి ఎంతమాత్రం సహాయపడవు కదా. వాహనాలను నడిపేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలపై చోదకుల నిర్లక్ష్యం, పరిమితికి మించి అతివేగంగా నడపడం వంటివి ప్రమాదాలకు ప్రధాన హేతువులు కాగా, వాహనాలలోని సాంకేతిక లో