22084 వార్తలు




డిల్లీ: నీట్ లీక్ పై ఆందోళన చేసిన విద్యార్థులకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. జంతర్ మంతర్ వద్ద పోలీసులు లాఠీచార్జిపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. నేరచరిత్ర లేని అరెస్టైన విద్యార్థులను, నిరసనకారులను అన్ని రాష్ట్రాల్లో వదిలి వదిలి పెట్టాలని, కేంద్రం సహా పలు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. విద్యార్థులపై పెట్టిన కేసులను ఉపహిరించుకోవాలని సూచించింది. ఘటనలపై సిసి ఫుటేజ్ ను కోర్టుకు సమర్పించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.


హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న ఇన్ స్పెక్టర్ పై డిజిపికి ఓ యువతి ఫిర్యాదు చేసింది. మాయమాటలతో సదరు యువతిని ఇన్ స్పెక్టర్ లొంగదీసుకున్నాడు. అనంతరం ఆమె గర్భవతి కావడంతో అబార్షన్ చేయించాడు. ఆమెతో చనువుగా ఉన్న వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసి రెండు కోట్ల రూపాయలు వసూలు చేశాడని సదరు యువతి ఆరోపణలు చేసింది. ఇన్ స్పెక్టర్ వేధింపులు శృతిమించడంతో డిజిపిని యువతి ఆశ్రయించింది. తనకు న్యాయం చేయాలని, ఇనస్పెక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిజిపికి యువతి ఫిర్యాదు చేసింది.


అమరావతి: అనంతపురం జిల్లా డి.హీరేహాల్ మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఓ యువకుడు ఆత్మహత్యకు సిద్ధపడ్డాడు. తిప్పేరుద్ర (35) అనే వ్యక్తి పెళ్లికాలేదని మనస్థాపానికి చెంది వ్యవసాయ పొలంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.






నవతెలంగాణ ఢిల్లీ: తమతో కలిసి పోరాడిన ఏ నిరసనకారుడిని ఒంటరిని చేయబోమని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ తెలిపారు. ప్రభుత్వ ప్రతినిధులతో సోమవారం అర్ధరాత్రి చర్చలు జరిపిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నిరసనకారులపై భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోబోమని వారు తమకు హామీ ఇచ్చారన్నారు. బిహార్, అస్సాంలో ఆందోళనలో పాల్గొన్న వారిపై కేసులను ఆయా ప్రభుత్వాలు ఉపసంహరించుకున్నాయని తెలిపారు. నిర్బంధంలో ఉన్నవారిని విడుదల చేయడంపైనా కేంద్రం సానుకూలంగా స్పందించిందన్నారు. అన్ని […] The post ఎవరిని ఒంటరిని చేయం: సీజేపీ appeared first on Navatelangana.


హైదరాబాద్లోని ఉస్మానియా హాస్పిటల్లో చికిత్స పొందుతూ ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామల తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె భౌతికకాయాన్ని ఆసుపత్రి సిబ్బంది మార్చురీలో భద్రపరిచారు. పావలా శ్యామల కుమార్తె కూడా ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండటంతో, అంత్యక్రియల నిర్వహణకు 'మా' ముందుకు వచ్చింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పూర్తి సొంత ఖర్చులతో ఈ అంత్యక్రియలను నిర్వహించనుండగా, ప్రముఖ నటి కరాటే కళ్యాణి ఈ అంతిమ సంస్కారాల పూర్తి బాధ్యతలను దగ్గరుండి చూసుకోనున్నట్లు తెలిపారు.




హైదరాబాద్: హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను తొలగించాలనే హైకోర్టు తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు అని ఎంఎల్ఎ కెపి వివేకానంద తెలిపారు. పేదల ఇళ్లను కూల్చి పెద్దల చేతిలో పెడుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పేదల ఉసురు తగులుతోందని విమర్శించారు. హైడ్రా పేరుతో ప్రభుత్వ భూములను ఆక్రమించడంతో పాటు బడా లీడర్స్ లబ్ధి పొందుతున్నారని ఆరోపణలు చేశారు. కుత్బుల్లపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద మీడియాతో మాట్లాడారు. హైడ్రా అనేదే పెద్ద డ్రామా అని, చెరువులను, ప్రభుత్వ భూములను రక్షిస్తున్నామని చెప్పుకుంటూ, పేద ప్రజలను మోసం చేస్తున్నారని వివేకానంద ధ్వజమెత్తారు. హైకోర్టులో ఎంతమంది హైడ్రాను వ్యతిరేకిస్తే, ఈ రోజు అంత ఆగ్రహం వ్యక్తం చేస్తుంది ఉన్నత న్యాయస్థానం అని చురకలంటించారు. మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ముందే చెప్పారని, హైడ్రా అనేది పేదలకు పెద్ద శాపం అని, బి ఆర్ ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే హైడ్రా ను బొంద పెడతామన్నారు.కనీసం నోటీసులు ఇవ్వకుండా ఎఫ్ టిఎల్, ప్రభుత్వ భూమి అని ఇష్టం వచ్చినట్లు పేదల ఇల్లు కూల్చివేశారని ధ్వజమెత్తారు. రేవంత్ ప్రభుత్వం హైడ్రా పేరుతో బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తుందని, అసెంబ్లీ సాక్షిగా క

హైదరాబాద్: దేశంలోనే ఎంతో ఆదరణ పొందిన నాయకుడు దివంగత కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. లోక్సభ, రాజ్యసభల్లో ప్రజా సమస్యలపై స్పష్టమైన అవగాహనతో, పదునైన ప్రసంగాలతో గళమెత్తిన మేధావి అత్యుత్తమ పార్లమెంటేరియన్ అని గుర్తు చేశారు. జైపాల్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పొన్నం మీడియాతో మాట్లాడారు. 15 వ లోక్ సభ లో తో పార్లమెంట్ సభ్యుడిగా తాము కొత్తగా పార్లమెంట్ లో అడుగుపెట్టినపుడు ఆయన మాకు ఎంతో స్ఫూర్తి కలిగించారని ప్రశంసించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ప్రక్రియలో, పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడంలో జైపాల్ రెడ్డి ఎంతో కృషి చేశారని కొనియాడారు. జైపాల్ రెడ్డి తమ సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎల్లప్పుడూ సిద్ధాంతాలు, నైతిక విలువలు, మచ్చలేని నిబద్ధతతో పనిచేశారని, ఆయన రాజకీయ ప్రస్థానం నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు.

కారణాలేమైనా సరే దేశాన్ని నడిపించాల్సిన యువతేజం ఎక్కడ ఏ ఆకాశం కొసన అస్తమించినా అది దేశానికి నష్టం, అరిష్టం అని విజ్ఞులు చెబుతుంటారు. అలాగే విద్యార్థులు నవ సమాజ నిర్మాతలని కవులు కీర్తిస్తుంటారు. ఈ నేపథ్యంలో చదువుల్లో ఉత్తీర్ణులు కాలేక ఓడిపోయామని కుంగుబాటుతో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే ఆయా కుటుంబాల్లో రగులుకున్న క్షోభ ఎవరూ ఆర్పలేనిది, తీర్చలేనిది. ప్రవేశ పరీక్షలు (ఎంట్రన్స్ ఎగ్జామ్స్) ఒక ద్వారపాలకుడిలా పనిచేస్తాయి. భారతీయ యువతలో ఎవరికి భద్రమైన, అధికారిక ఉద్యోగాన్ని పొందే అవకాశం దక్కుతుందో నిర్ణయిస్తాయి. అయితే అనేక పరీక్షల్లో ప్రశ్నపత్రాలు వరుసగా లీక్ కావడం వల్ల ప్రతిభను పరీక్షించే వ్యవస్థ విస్తృతమైన అవినీతికూపంగా మారిపోవడం మొత్తం విద్యార్థి లోకాన్ని దారి తెన్నూ లేని చీకటి ప్రపంచం లోకి నెట్టుతోంది. నీట్ పరీక్ష ప్రశ్నావళి లీక్ కావడం, రద్దు చేసి మళ్లీ నిర్వహించడం ఈలోగా దాదాపు 20 మంది విద్యార్థులు మానసికంగా కుంగిపోయి బలవన్మరణాలకు పాల్పడడం దేశాన్ని ప్రస్తుతం తీరని విషాదంలో ముంచెత్తుతోంది. నీట్ పరీక్షలో ప్రశ్నపత్రాల లీకేజీ వంటి విద్యావ్యవస్థలో అస్తవ్యస్త పరిస్థితులపై కదంతొక్కిన కాక్రోచ్ జ
