
4637 వార్తలు

బెంగళూరు, హర్యానా డిఫెన్స్ మద్యం విక్రయం రూ.10 లక్షల విలువైన మద్యం స్వాధీనం మనతెలంగాణ, సిటిబ్యూరోః నిబంధనలకు విరుద్ధంగా డిఫెన్స్ మద్యం నిల్వ చేసిన ఇంటిపై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది మంగళవారం దాడి చేసి పట్టుకున్నారు. రూ.10లక్షల విలువైన 361 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ సిబ్బంది కథనం ప్రకారం...రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి దొడ్ల సురేష్ రెడ్డి హస్తినాపురంలో ఉంటున్నాడు. గత కొంత కాలం నుంచి సురేష్ బెంగళూరు, హర్యానా రాష్ట్రాల్లోని ఆర్మీ క్యాంటీన్ల నుంచి కొనుగోలు చేసిన ఖరీదైన మద్యం బాటిళ్లను హస్తినాపురానికి తీసుకుని వచ్చి అవసరం ఉన్న వారికి మార్కెట్ ధరకు విక్రయిస్తున్నాడు. ఈ సమాచారం అందుకున్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది శ్రీరమణ కాలనీ, ఫేజ్2లోని ఇంట్లో దాడి చేసి మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ సిబ్బంది దాడి చేస్తున్నట్లు తెలుసుకున్న సురేష్ రెడ్డి ఇంటి నుంచి పారిపోయాడు. కేసు దర్యాప్తు కోసం మద్యం బాటిళ్లను స్థానిక ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు.

మనతెలంగాణ,సిటిబ్యూరోః గంజాయి అలవాటుతో సాఫ్ట్వేర్ ఉద్యోగం పోగొట్టుకున్న యువకుడు... ఇంటిపైనే గంజాయి మొక్కలను పెంచుతూ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది చేతికి చిక్కాడు. ఎక్సైజ్ సిబ్బంది కథనం ప్రకారం... నాచారం, ఈస్ట్ గాంధీనగర్కు చెందిన సిహెచ్.శశిధర్ చదువు పూర్తి చేసుకున్న తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరాడు. ఉద్యోగంలో చేరిన తర్వాత యువకుడు గంజాయికి అలవాటు పడ్డాడు. ఈ క్రమంలోనే వచ్చే జీతమంతా గంజాయి కొనుగోలుకే వెచ్చించడంతో చేతిలో చిల్లిగవ్వలేకుండా పోయింది. దీంతో యువకుడు తన ఇంటిపైనే గంజాయి మొక్కలను పెంచుతున్నాడు. దాని నుంచి వచ్చే గంజాయిని తాను వినియోగించుకుంటున్నాడు. ఈ విషయం రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బందికి తెలియడంతో సిఐ బాలరాజు, సిబ్బంది కలిసి దాడి చేశారు. ఇంటిపై పెంచుతున్న 17 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి మొక్కలు మూడు మీటర్లు పెరిగి, పూతకు వచ్చాయి. ఈ మొక్కలు నుంచి 10కిలోల గంజాయి వచ్చే అవకాశం ఉన్నట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి కేసు దర్యాప్తు కోసం ఘట్కేసర్ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు. మరో కేసులో గంజాయి విక్రయ

నాసిక్ : టిసిఎస్ నాసిక్ కేసులో టిసిఎస్ ఉద్యోగిని నిదాఖాన్ అరెస్ట్ నుంచి తాత్కాలిక రక్షణ పొందడంలో విఫలమైన తరువాత ఆమె గురించి సీనియర్ పోలీస్ అధికారి ఒకరు మంగళవారం వివరించారు. నాసిక్ కంపెనీలో బలవంతపు మత మార్పిడిలో ఆమె కీలక పాత్ర వహించారని, ప్రస్తుతం ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. నాసిక్ లోని ఐటీ మేజర్ యూనిట్లో లైంగిక వేధింపుల కేసులపై చర్చించారు. ఇంతవరకు ఎనిమిది మందిని ఈ కేసులో అరెస్టు చేశారు. పోష్ (ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హెరాస్మెంట్ )కమిటీ వీడియో కాన్షరెన్సులపై ఆధారపడకుండా తరచుగా వ్యక్తిగతంగా స్థానిక సభ్యులను కలుసుకుని వివరాలు సేకరించాలన్నారు. ఈ కేసులో తొమ్మిది ఎఫ్ఐఆర్లు నమోదు కాగా, అందులో ఒకదానిలో నిదాఖాన్, మరో నలుగురు నిందితులుగా ఆరోపించబడింది. లైంగిక వేధింపులే కాదు, బలవంతంగా మతం మార్పిడి చేయించడం లోనూ ఆమె పాత్ర ఉన్నట్టు తేలింది. ఈ కేసు వెలుగు లోకి వచ్చిన దగ్గరి నుంచి ఆమె పరారీలో ఉంది. సోమవారం సెషన్స్ కోర్టు ఆమెకు అరెస్టు నుంచి తాత్కాలిక రక్షణ ఇవ్వడానికి నిరాకరించింది. ఈమేరకు ఆమె యాంటిసిపేటరీ బెయిల్పై విచారణ ఏప్రిల్ 27కు వాయిదా పడింది. నాసిక్ పోలీస


నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన ‘దివ్య భారత్’ పర్యాటక నివేదికలో తెలంగాణ రాష్ట్రానికి విశిష్ట గుర్తింపు లభించడంపై రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని వైవిధ్యభరితమైన పర్యాటక సామర్థ్యానికి ఈ నివేదిక అద్దం పడుతోందని, ఇది తెలంగాణకు గర్వకారణమని ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ పర్యాటక రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి ఈ గుర్తింపు నిదర్శనమని మంత్రి మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాజధాని హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్, చారిత్రక గోల్కొండ కోట, భువనగిరి కోట వంటి కట్టడాలతో పాటు ఆధ్యాత్మికత ఉట్టిపడే యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం వంటి ప్రసిద్ధ క్షేత్రాలు నిత్యం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయని వివరించారు. కేవలం చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాంతాలే కాకుండా ప్రకృతి ఒడిలో విరాజిల్లే కుంటాల, బొగత జలపాతాలు, ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా పేరొందిన సమ్మక్క-సారలమ్మ మేడారం జాతర వంటి సాంస్కృతిక వేడుకలు రాష్ట్ర పర్యాటక రంగానికి ప్రత్యేక

నవతెలంగాణ – మద్నూర్డోంగ్లి మండలంలోని తడి ఇప్పర్గా కుర్లా యనబోరా ఈలేగావ్ తదితర గ్రామాల్లో వరి ధాన్యం కోతకు వచ్చి తేమశాతం కోసం వరి ధాన్యం ఆరబెట్టారు. అకస్మాత్తుగా వాతావరణంలో మార్పు రావడం అకాల వర్షంతో ఎండ బోసిన వరి ధాన్యం రాశులు తడిసిపోయాయి. దీంతో గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వరి ధాన్యం కోతకు వచ్చిన సమయంలో వాతావరణంలో మార్పు అకాల వర్షాలు పడటం పంటకు నష్టం కలిగిస్తుందని వారు వాపోయారు. The post అకాల వర్షంతో తడిచిన వరి ధాన్యం appeared first on Navatelangana.

కేరళలో మరో విషాదం నెలకొంది. త్రిస్సూర్లోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో మంగళవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 13మంది మృతి చెందారు. మరో 25 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వీరిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. త్రిస్సూర్ తిరువంబడిలోని ఓ బాణసంచా తయారీ యూనిట్లో ఈ సంఘటన జరిగింది. బాణసంచా కోసం ఆ కేంద్రంలో సామగ్రిని ఉత్పత్తి చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో ఆ శబ్దం సుమారు కొన్ని కిలోమీటర్ల మేర వినిపించినట్టు స్థానికులు తెలిపారు. తొలుత దీన్ని భూప్రకంపనలుగా భావించినట్టు వారు తెలిపారు. పేలుడు అనంతరం ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఘటనపై ప్రధానమంత్రి మోడీ, కేరళ సిఎం విజయన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు అండగా నిలుస్తామని ప్రకటించారు.


తమిళనాడులో డిఎంకే, కాంగ్రెస్ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడు శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏఐసిసి పరిశీలకుడు, మాజీ ఎంపీ మధు యాష్కీ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిసి రాణిపేట జిల్లా షోలింగర్ నియోజకవర్గంలో నీకారిక్కల్ , వీరనట్టుర్, అరియూర్, అయిపేడు ప్రాంతాల్లో మంగళవారం విస్తృతంగా పర్యటించి, కూటమి అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు. తమిళ ప్రజలు అభివృద్ధి, లోకికవాదానికే పట్టం కడతారని చెప్పారు. ఆత్మగౌరవానికి తమిళ ప్రజల మద్దతు చెబుతారని ఆకాంక్షించారు. ఎం.కె. స్టాలిన్ నాయకత్వంలోని ప్రభుత్వం భారీ మెజారిటీతో తిరిగి అధికారాన్ని కైవసం చేసుకోబోతోందని భట్టి విక్రమార్క చెప్పారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహ జ్యోతిలో భాగంగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ నాయకత్వంలోనీ ప్రజా ప్రభుత్వం ఎన్నికలవేళ ఇచ్చిన హామీలే కాకుండా, ఇవ్వని హామీలు కూడా అమలు చేస్తున్నామని తెలిపారు. అనుమానం ఉంటే ఎవరైనా వచ్చి పరిశీలించవచ్చని తెలిపారు. రైతు భరోసా కింద రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసిన
నవతెలంగాణ – మద్నూర్జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్ మండలంలో పలు వివాహ వేడుకలలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. వధూవరుల కుటుంబ సభ్యులతో కలిసి వారి ఆనందాన్ని పంచుకున్నారు. వధూవరుల దాంపత్య జీవితం సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో నిండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ మద్నూర్ మండల అధ్యక్షులు ధరాస్ సాయిలు, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు అనుమంత్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి సంతోష్ పటేల్, సంఘయప్ప […] The post నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే appeared first on Navatelangana.
26 క్వింటాల పరిమితిని ఎత్తివేయాలి: రైతులుమధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు నవతెలంగాణ – బోనకల్ రైతులు పోరాటంతో సాధించుకున్న మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. దీంతో రైతులలో ఆనందం, ఉత్సాహం పరుగులు పెట్టింది. రైతులు ఆనందం ఆకాశాన్ని అంటింది. మండల పరిధిలోని ముష్టికుంట్ల రావినూతల సొసైటీ పరిధిలో గల రైతులు సోమవారం భారీ ఎత్తున ఆందోళన నిర్వహించిన సంగతి విధితమే. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశాల మేరకు ముష్టికుంట్ల సొసైటీలో కొనుగోలు కేంద్రాన్ని […] The post రైతులు ఆందోళన చెందవద్దు – అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం appeared first on Navatelangana.
నవతెలంగాణ – ఉప్పునుంతలఉప్పునుంతల మండలంలోని లక్ష్మాపూర్ గ్రామంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కూలీల సమస్యలను తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చింతల నాగరాజు, మండల నాయకులు పనుగంటి బాలయ్య, శ్రీరాములు గ్రామాన్ని సందర్శించి కూలీలతో మాట్లాడారు. పనుల అమలు, వేతనాల చెల్లింపులు, పనిస్థలాల్లో సౌకర్యాలపై కూలీల నుంచి వివరాలు సేకరించారు. కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి […] The post ఉపాధి కూలీల సమస్యలపై సీపీఐ(ఎం) నాయకుల ఆరా appeared first on Navatelangana.


ఆర్టిసి కార్మికులంటే లెక్కలేనితనంతో ప్రభుత్వం వ్యవహరిస్తోందని కవిత మండిపడ్డారు. ఆర్టిసిలో కార్మికులు లేకుండా చేసి సంస్థను ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఆర్టిసి కార్మికుల సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని అన్నారు. ఈనెల 25న తెలంగాణ రాజకీయాల్లోకి నూతన రాజకీయ శక్తిగా వస్తున్నామని, ప్రజలందరికీ ఈ వేదిక నుంచి ఆహ్వానం పలుకుతున్నామని చెప్పారు. పార్టీ ఆవిర్భావ సభకు సిరిసిల్ల నుంచి పార్టీ కార్యకర్తలు మంగళవారం పాదయాత్రగా బయలుదేరారని తెలిపారు. తమ పార్టీ ఆవిర్భావ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చే క్యాడర్ వాహనాలకు ఎలాంటి ఎలాంటి ఇబ్బంది కలిగించొద్దని పోలీసులు, అధికార యంత్రాంగాన్ని కోరారు. సమ్మెకు దిగిన ఆర్టిజన్లను బెదిరించి విధుల్లో చేరేలా ఒత్తిడి చేశారని అన్నారు. ప్రజలందరూ సమస్యల్లో ఉంటే అధికార, ప్రతిపక్షాలు రాజకీయాలు చేయడానికే ప్రాధాన్యత ఇస్తున్నాయని మండిపడ్డారు. కార్మికులంటే ఈ ప్రభుత్వానికి లెక్కలేదని అన్నారు. ఆర్టిసిని ప్రైవేటుపరం చేసే కుట్రలను అడ్డుకుంటామని హెచ్చరిచారు. వెంటనే ఆర్టిసిని ప్రభుత్వంలో విలీనం చేయాలని కవిత డిమాండ్ చేశారు.
నవతెలంగాణ-హైదరాబాద్: ఐపీఎల్-2026లో భాగంగా మంగళవారం సన్రైజర్స్ హైదరబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య కీలక పోరు జరగనుంది. ఈక్రమంలో టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ ఎంచుకుంది. వరుస విజయాలతో SRH దూకుడు మీద ఉంది. ఈ మ్యాచ్లో గెలవాలని ఇషాన్ సేన ఊవిళ్లూరుతోంది. ఇప్పటి వరకు 6 మ్యాచ్లాడిన సన్రైజర్స్.. 3 విజయాలతో 6 పాయింట్లు గెలుచుకుని పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఆ మూడు విజయాలు లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో సాధించినవే. 5 మ్యాచ్ల్లో మూడింట గెలిచిన […] The post సన్రైజర్స్ బ్యాటింగ్ appeared first on Navatelangana.
నవతెలంగాణ – మల్హర్ రావుజనగణన 2027 పేస్-1జనాభా లెక్కలకు 27 మంది సభ్యులతో కూడిన బ్యాచ్-1 ఎన్యుమరేటర్స్,సూపర్ వైజర్స్ మూడురోజుల శిక్షణ తరగతులు మండల పరిషత్ తాడిచెర్ల జిల్లా పరిషత్ పాఠశాలలో మంగళవారం ముగిశాయి. ఈ శిక్షణ తరగతులు మండల తహశీల్దార్ రవికుమార్, ఏఎస్ఓ శివ పర్యవేక్షణలో కొనసాగాయి. ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు అందరినీ రెండు బ్యాచ్ లు గా విభజించి మొదటి విడత 27 మందికీ ట్రైనింగ్ ఆఫీసర్లుగా జిల్లా పరిషత్ తాడిచర్ల పాఠశాల నుండి కోడెపాక […] The post జనగణనపై ఎన్యుమరేటర్స్ మొదటి విడత శిక్షణ పూర్తి appeared first on Navatelangana.

మన తెలంగాణ/హైదరాబాద్: ఐపిఎల్లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య రసవత్తర పోరు జరగనుంది. మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ బౌలింగ్ ఎంచుకుని.. హైదరాబాద్ ను ముందుగా బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారింది. హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచి జోరుమీదుంది. ఢిల్లీని కూడా ఓడించి హ్యాట్రిక్ విజయాన్నిఅందుకోవాలనే పట్టుదలతో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇరు జట్లు సమతూకంగా కనిపిస్తున్నాయి. దీంతో పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయమని చెప్పాలి. మరోవైపు, హైదరాబాద్ ను ఓడించి తమ సత్తా చాటాలని ఢిల్లీ భావిస్తోంది.
నవతెలంగాణ-మల్హర్ రావుమండలం వళ్లెంకుంట గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్లు ఆధ్వర్యంలో మంగళవారం పోషన్ పక్వాడ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యద్థిగా సూపర్ వైజర్ భాగ్యలక్ష్మి హాజరై మాట్లాడారు. గర్భధారణ దశ నుంచే తల్లులు సరైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రక్తహీనత లేకుండా పోషకాహారం తీసుకోవడం ద్వారా హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుకోవచ్చన్నారు. డెలివరీ తరువాత వెంటనే శిశువుకు ముర్రుపాలు ఇవ్వడం ఎంతో ముఖ్యమని, దాని ద్వారా శిశువుకు రోగనిరోధక శక్తి పెరుగుతుందన్నారు. పుట్టిన మొదటి నెల నుంచి రెండు సంవత్సరాల […] The post అంగన్వాడిల్లో పోషన్ పక్వాడ్ కార్యక్రమం appeared first on Navatelangana.

భారత విమానాలపై గగనతల దిగ్బంధనం మే 24 వరకు పొడిగిస్తూ పాకిస్థాన్ మంగళవారం నిర్ణయం తీసుకుంది. గత ఏడాది ఏప్రిల్ 22న కశ్మీర్ లోని పహల్గాంపై ఉగ్రదాడి జరిగి 26 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఏప్రిల్ 24 నుంచి రెండు దేశాల మధ్య గగనతల దిగ్బంధనం కొనసాగుతోంది. గత ఏడాది ఏప్రిల్ 30 నుంచి పాకిస్థాన్ విమానాలకు భారత గగనతలాన్ని వినియోగించడానికి అనుమతి లేదు. పాకిస్థాన్ ఎయిర్పోర్ట్ అథారిటీ నోటమ్ ప్రకారం ఈ ఏడాది మే 24 ఉదయం 5 గంటల వరకు ఆంక్షలు కొనసాగుతాయి. దీనివల్ల పశ్చిమదేశాలకు , ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు, యూరప్ దేశాలకు ఢిల్లీ, అమృత్సర్, జైపూర్ నుండి వెళ్లే సుమారు 800 వారపు విమాన సర్వీసులపై ప్రభావం పడుతుంది.
నవతెలంగాణ- రాజన్న సిరిసిల్లఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు తెలంగాణ రెండో పీఆర్సీ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారని, ప్రభుత్వం పీఆర్సీ గడువు పొడిగించకుండా, వెంటనే నివేదిక తెప్పించుకుని సంఘాలతో చర్చించి అమలు చేయాలని టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టిఎస్ యుటిఎఫ్) కార్యకర్తల సమావేశం మంగళవారం మధ్యాహ్నం సిరిసిల్లలో గుండమనేని మహేందర్ రావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చావ రవి మాట్లాడుతూ ఉపాధ్యాయులు, […] The post సమస్యలను వెంటనే పరిష్కరించాలి: టిఎస్ యుటిఎఫ్ appeared first on Navatelangana.

– రూ. 2400 మద్దతు ధర పూర్తిగా రైతులకు అందేలా చర్యలు – దేవదారికుంట తండా కొనుగోలు కేంద్రంపై ఆకస్మిక తనిఖీనవతెలంగాణ – ఉప్పునుంతలమండల పరిధిలోని దేవదారికుంట తండాలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బడావత్ సంతోష్ మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ క్రమంలో కొనుగోలు ప్రక్రియను సమగ్రంగా పరిశీలించి, రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. కొనుగోళ్లలో ఎటువంటి ఆలస్యం లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. ప్రభుత్వం నిర్ణయించిన […] The post మొక్కజొన్న కొనుగోళ్లను పారదర్శకంగా నిర్వహించాలి: కలెక్టర్ appeared first on Navatelangana.