🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTTటుడేతెలుగు
Advertisement
Sponsored by simplysouth
Todayతెలంగాణ

తెలంగాణ

4664 వార్తలు

అమెరికా సీజ్ చేసిన నౌకలో.. చైనా నుంచి ఇరాన్‌కు క్షిపణి రసాయనాలు
పాత వార్త
తెలంగాణ

అమెరికా సీజ్ చేసిన నౌకలో.. చైనా నుంచి ఇరాన్‌కు క్షిపణి రసాయనాలు

వాషింగ్టన్: హర్మూజ్ జలసంధి వద్ద ఇరాన్ పతాకంతో ప్రయాణిస్తున్న తౌస్కా అనే వాణిజ్య నౌకను అమెరికా ఇటీవల సీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ నౌకలో క్షిపణి తయారీకి వినియోగించే రసాయనాలు ఉన్నాయని ఐక్యరాజ్యసమితిలో యూఎస్ మాజీ రాయబారి , రిపబ్లికన్ నేత హేలీ సంచలన ఆరోపణలు చేశారు. ఈమేరకు ఆమె ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. దీనిని బట్టి ఇరాన్‌కు చైనా సైనిక సాయం అందిస్తోందనే విషయాన్ని కొట్టి పారేయలేమని ఆరోపించారు. ఈ తొస్కా నౌక అనేక సార్లు చైనాకు వెళ్లిందని, ఇరాన్ క్షిపణుల తయారీకి కావలసిన రసాయనాలను తీసుకొచ్చిందని వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం పేర్కొంది. గత ఆరు వారాల్లో ఈ నౌక చైనాకు రెండు సార్లు వెళ్లిందని పేర్కొంది. మరోవైపు తౌస్కా నౌకను, అందులోని సిబ్బందిని తక్షణమే విడుదల చేయాలని ఇరాన్ విదేశాంగ శాఖ డిమాండ్ చేసింది. ఇది వెంటనే జరగకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని అమెరికాను హెచ్చరించింది.ఇరాన్ నౌకతో మా సంబంధం లేదు: చైనాఅమెరికా సీజ్ చేసిన ఇరాన్ తౌస్కా వాణిజ్య నౌకలో క్షిపణుల తయారీకి కావలసిన చైనా రసాయనాలు ఉన్నాయన్న ఆరోపణలను చైనా కొట్టి పారేసింది. “నాకు తెలిసినంతవరకు , ఇది విదేశీ పతాకం కలిగిన నౌక. దాంతో తమ దే

Adminఏప్రిల్ 21, 2026 - మంగళవారం👁 2
ఉద్రిక్తతలకు దారితీసిన హిజాబ్‌ బిందీ వివాదం
పాత
తెలంగాణ

ఉద్రిక్తతలకు దారితీసిన హిజాబ్‌ బిందీ వివాదం

కళ్లజోడు విక్రయ సంస్థ లెన్స్‌కార్ట్ షోరూమ్‌లో హిజాబ్‌ బిందీ వివాదం ఉద్రిక్తతలకు దారితీసింది. ఉద్యోగులు హిందూత్వాన్ని ప్రతిబింబించే బింది, బొట్టు పెట్టుకోవడం వంటివి చేయకూడదు అని చెబుతూ, హిజాబ్‌కు అనుమతి ఇస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో బీజేపీ మైనారిటీ మోర్చా నేతల ఆధ్వర్యంలో కొందరు హిందూ సంఘాల కార్యకర్తలు స్టోర్‌లోకి దూసుకెళ్లి నిరసన వ్యక్తం చేశారు. ఈ చర్యలకు బీజేపీ మైనారిటీ మోర్చా నేత నాజియా ఎలాహీ నాయకత్వం వహించారు. కార్యకర్తలు స్టోర్‌లోకి ప్రవేశించి సిబ్బందికి బొట్టు పెట్టడంతో పాటు చేతులకు పవిత్ర దారాలను కట్టారు. అలాగే జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాజియా ఎలాహీ స్టోర్ ఫ్లోర్ మేనేజర్ మొహ్సిన్ ఖాన్‌ను ప్రశ్నిస్తూ, హిందూ మతంలోని కొన్ని సంప్రదాయాల ఆంక్షలపై వస్తున్న ఆరోపణలకు వివరణ కోరారు. మీరు మొహ్సిన్ ఖాన్ కాబట్టే బొట్టు పెట్టుకోవడాన్ని ఆపారా? అని ఆమె వీడియోలో ప్రశ్నించినట్లు వినిపించింది.నాజియా ఎలాహీ మాట్లాడుతూ స్టోర్‌నిర్వహణపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఒక మతాన్ని ప్రోత్సహిస్తూ మరొక మతాన్ని అణగదొక్కుతున్నారు. ఇది హిందూ దేశం. సంస్థ యజమాని క్షమాపణ చెప్పకపోతే లెన్స్కార్ట్‌ను

27న తెలంగాణ భవన్‌లో బిఆర్‌ఎస్ కీలక సమావేశం
పాత
తెలంగాణ

27న తెలంగాణ భవన్‌లో బిఆర్‌ఎస్ కీలక సమావేశం

భారత్ రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) పార్టీ రజతోత్సవ సంబురాల సందర్భంగా పార్టీ అధినేత కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఈ నెల 27వ తేదీన ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్‌లో ఈ భేటీ జరగనుంది. పార్టీ సంస్థాగత బలోపేతంపై దృష్టి సారించిన గులాబీ బాస్, ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనునే అవకాశం ఉన్నది. ముఖ్యంగా పార్టీ సంస్థాగత నిర్మాణం సభ్యత్వాల పునరుద్ధరణ వంటి అంశాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించనున్నారు. మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీ క్యాడర్‌ను ఎలా ముందుకు తీసుకెళ్లాలి, సభ్యత్వ నమోదు ప్రక్రియను ఏ విధంగా వేగవంతం చేయాలి అనే విషయాలపై కెసిఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.వీటితో పాటు ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై కూడా ఈ భేటీలో స్పష్టత రానుంది. ఈ సమావేశానికి పార్టీకి చెందిన ముఖ్య నేతలందరినీ ఆహ్వానించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులతో పాటు ఎంపీలు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు తప్పనిసరిగా హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. అలాగే మాజీ ఎంఎల్‌ఎలు, మాజీ ఎంఎల్‌సిలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు,

బాలుడి ప్రాణాలు తీసిన రీల్స్ పిచ్చి..
పాత
తెలంగాణ

బాలుడి ప్రాణాలు తీసిన రీల్స్ పిచ్చి..

మనతెలంగాణ, సిటిబ్యూరోః రీల్స్ పిచ్చి ఓ బాలుడి ప్రాణాలు తీసిన సంఘటన నాచారం, మల్లాపూర్‌లో వెలుగులోకి వచ్చింది. రీల్స్ కోసం వీడియో తీస్తు బిల్డింగ్‌పై నుంచి కిందపడడంతో మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బీహార్ రాష్ట్రానికి చెందిన బాలుడు మితున్(14) తల్లిదండ్రులు బతుకు దెరువు కోసం నాచారం, మల్లాపూర్‌కు వచ్చి పనిచేస్తున్నారు. మల్లాపూర్, గాంధీ బొమ్మ దగ్గర ఉన్న బస్తీలో ఉంటున్నారు. బాలుడు సమీపంలోని పాఠశాలలో చదువుతున్నాడు, బాలుడు తరచూ ఇన్‌స్ట్రాగ్రాం, యూట్యూబ్‌లో రీల్స్ చూసేవాడు. తాను కూడా రీల్స్ చేసి ఫేమస్ కావాలని ఆలోచించాడు. ఈ క్రమంలోనే మార్చి 5వ తేదీన తాను ఉంటున్న భవనం బాల్కనీ రేయిలింగ్ పిట్ట గొడపై ఫీట్స్ చేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ రెండు రోజుల క్రితం మృతిచెందాడు.

రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి...లిక్కర్ దందా
పాత
తెలంగాణ

రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి...లిక్కర్ దందా

బెంగళూరు, హర్యానా డిఫెన్స్ మద్యం విక్రయం రూ.10 లక్షల విలువైన మద్యం స్వాధీనం మనతెలంగాణ, సిటిబ్యూరోః నిబంధనలకు విరుద్ధంగా డిఫెన్స్ మద్యం నిల్వ చేసిన ఇంటిపై ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది మంగళవారం దాడి చేసి పట్టుకున్నారు. రూ.10లక్షల విలువైన 361 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ సిబ్బంది కథనం ప్రకారం...రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి దొడ్ల సురేష్ రెడ్డి హస్తినాపురంలో ఉంటున్నాడు. గత కొంత కాలం నుంచి సురేష్ బెంగళూరు, హర్యానా రాష్ట్రాల్లోని ఆర్మీ క్యాంటీన్ల నుంచి కొనుగోలు చేసిన ఖరీదైన మద్యం బాటిళ్లను హస్తినాపురానికి తీసుకుని వచ్చి అవసరం ఉన్న వారికి మార్కెట్ ధరకు విక్రయిస్తున్నాడు. ఈ సమాచారం అందుకున్న ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది శ్రీరమణ కాలనీ, ఫేజ్2లోని ఇంట్లో దాడి చేసి మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ సిబ్బంది దాడి చేస్తున్నట్లు తెలుసుకున్న సురేష్ రెడ్డి ఇంటి నుంచి పారిపోయాడు. కేసు దర్యాప్తు కోసం మద్యం బాటిళ్లను స్థానిక ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించారు.

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఊస్ట్.. ఇంటిపైనే గంజాయి మొక్కలు పెంచుతూ..
పాత
తెలంగాణ

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఊస్ట్.. ఇంటిపైనే గంజాయి మొక్కలు పెంచుతూ..

మనతెలంగాణ,సిటిబ్యూరోః గంజాయి అలవాటుతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం పోగొట్టుకున్న యువకుడు... ఇంటిపైనే గంజాయి మొక్కలను పెంచుతూ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది చేతికి చిక్కాడు. ఎక్సైజ్ సిబ్బంది కథనం ప్రకారం... నాచారం, ఈస్ట్ గాంధీనగర్‌కు చెందిన సిహెచ్.శశిధర్ చదువు పూర్తి చేసుకున్న తర్వాత సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో చేరాడు. ఉద్యోగంలో చేరిన తర్వాత యువకుడు గంజాయికి అలవాటు పడ్డాడు. ఈ క్రమంలోనే వచ్చే జీతమంతా గంజాయి కొనుగోలుకే వెచ్చించడంతో చేతిలో చిల్లిగవ్వలేకుండా పోయింది. దీంతో యువకుడు తన ఇంటిపైనే గంజాయి మొక్కలను పెంచుతున్నాడు. దాని నుంచి వచ్చే గంజాయిని తాను వినియోగించుకుంటున్నాడు. ఈ విషయం రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బందికి తెలియడంతో సిఐ బాలరాజు, సిబ్బంది కలిసి దాడి చేశారు. ఇంటిపై పెంచుతున్న 17 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి మొక్కలు మూడు మీటర్లు పెరిగి, పూతకు వచ్చాయి. ఈ మొక్కలు నుంచి 10కిలోల గంజాయి వచ్చే అవకాశం ఉన్నట్లు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి కేసు దర్యాప్తు కోసం ఘట్‌కేసర్ ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించారు. మరో కేసులో గంజాయి విక్రయ

టిసిఎస్ కేసు.. బలవంతపు మత మార్పిడిలో నిదాఖాన్ పాత్ర
పాత
తెలంగాణ

టిసిఎస్ కేసు.. బలవంతపు మత మార్పిడిలో నిదాఖాన్ పాత్ర

నాసిక్ : టిసిఎస్ నాసిక్ కేసులో టిసిఎస్ ఉద్యోగిని నిదాఖాన్ అరెస్ట్ నుంచి తాత్కాలిక రక్షణ పొందడంలో విఫలమైన తరువాత ఆమె గురించి సీనియర్ పోలీస్ అధికారి ఒకరు మంగళవారం వివరించారు. నాసిక్ కంపెనీలో బలవంతపు మత మార్పిడిలో ఆమె కీలక పాత్ర వహించారని, ప్రస్తుతం ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. నాసిక్ లోని ఐటీ మేజర్ యూనిట్‌లో లైంగిక వేధింపుల కేసులపై చర్చించారు. ఇంతవరకు ఎనిమిది మందిని ఈ కేసులో అరెస్టు చేశారు. పోష్ (ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హెరాస్‌మెంట్ )కమిటీ వీడియో కాన్షరెన్సులపై ఆధారపడకుండా తరచుగా వ్యక్తిగతంగా స్థానిక సభ్యులను కలుసుకుని వివరాలు సేకరించాలన్నారు. ఈ కేసులో తొమ్మిది ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కాగా, అందులో ఒకదానిలో నిదాఖాన్, మరో నలుగురు నిందితులుగా ఆరోపించబడింది. లైంగిక వేధింపులే కాదు, బలవంతంగా మతం మార్పిడి చేయించడం లోనూ ఆమె పాత్ర ఉన్నట్టు తేలింది. ఈ కేసు వెలుగు లోకి వచ్చిన దగ్గరి నుంచి ఆమె పరారీలో ఉంది. సోమవారం సెషన్స్ కోర్టు ఆమెకు అరెస్టు నుంచి తాత్కాలిక రక్షణ ఇవ్వడానికి నిరాకరించింది. ఈమేరకు ఆమె యాంటిసిపేటరీ బెయిల్‌పై విచారణ ఏప్రిల్ 27కు వాయిదా పడింది. నాసిక్ పోలీస

సాఫ్ట్వేర్ కొలువు పోతే టెర్రాస్ మీద గంజాయి పెంచుడు ఏందన్నా.. హైదరాబాద్ నాచారంలో ఘటన
పాత
తెలంగాణ పర్యాటక రంగానికి జాతీయ గుర్తింపు: మంత్రి జూపల్లి
పాత
తెలంగాణ

తెలంగాణ పర్యాటక రంగానికి జాతీయ గుర్తింపు: మంత్రి జూపల్లి

నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన ‘దివ్య భారత్’ పర్యాటక నివేదికలో తెలంగాణ రాష్ట్రానికి విశిష్ట గుర్తింపు లభించడంపై రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని వైవిధ్యభరితమైన పర్యాటక సామర్థ్యానికి ఈ నివేదిక అద్దం పడుతోందని, ఇది తెలంగాణకు గర్వకారణమని ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ పర్యాటక రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి ఈ గుర్తింపు నిదర్శనమని మంత్రి మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాజధాని హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్, చారిత్రక గోల్కొండ కోట, భువనగిరి కోట వంటి కట్టడాలతో పాటు ఆధ్యాత్మికత ఉట్టిపడే యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం వంటి ప్రసిద్ధ క్షేత్రాలు నిత్యం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయని వివరించారు. కేవలం చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాంతాలే కాకుండా ప్రకృతి ఒడిలో విరాజిల్లే కుంటాల, బొగత జలపాతాలు, ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా పేరొందిన సమ్మక్క-సారలమ్మ మేడారం జాతర వంటి సాంస్కృతిక వేడుకలు రాష్ట్ర పర్యాటక రంగానికి ప్రత్యేక

Ramcharan: మిగిలింది 6 రోజులే.. రామ్ చరణ్‌తో బుచ్చిబాబు సెల్ఫీ.. 'పెద్ది' రిలీజ్ ఎప్పుడంటే?
పాత
అకాల వర్షంతో తడిచిన వరి ధాన్యం
పాత
బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..13మంది మృతి
పాత
తెలంగాణ

బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..13మంది మృతి

కేరళలో మరో విషాదం నెలకొంది. త్రిస్సూర్‌లోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో మంగళవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 13మంది మృతి చెందారు. మరో 25 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వీరిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. త్రిస్సూర్ తిరువంబడిలోని ఓ బాణసంచా తయారీ యూనిట్లో ఈ సంఘటన జరిగింది. బాణసంచా కోసం ఆ కేంద్రంలో సామగ్రిని ఉత్పత్తి చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో ఆ శబ్దం సుమారు కొన్ని కిలోమీటర్ల మేర వినిపించినట్టు స్థానికులు తెలిపారు. తొలుత దీన్ని భూప్రకంపనలుగా భావించినట్టు వారు తెలిపారు. పేలుడు అనంతరం ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఘటనపై ప్రధానమంత్రి మోడీ, కేరళ సిఎం విజయన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు అండగా నిలుస్తామని ప్రకటించారు.

రూ. 25 వేలు లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన నారాయణపేట రెవెన్యూ ఆఫీసర్...
పాత
తమిళనాడులో డిఎంకే కూటమిదే విజయం: భట్టి విక్రమార్క
పాత
తెలంగాణ

తమిళనాడులో డిఎంకే కూటమిదే విజయం: భట్టి విక్రమార్క

తమిళనాడులో డిఎంకే, కాంగ్రెస్ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడు శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏఐసిసి పరిశీలకుడు, మాజీ ఎంపీ మధు యాష్కీ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిసి రాణిపేట జిల్లా షోలింగర్ నియోజకవర్గంలో నీకారిక్కల్ , వీరనట్టుర్, అరియూర్, అయిపేడు ప్రాంతాల్లో మంగళవారం విస్తృతంగా పర్యటించి, కూటమి అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు. తమిళ ప్రజలు అభివృద్ధి, లోకికవాదానికే పట్టం కడతారని చెప్పారు. ఆత్మగౌరవానికి తమిళ ప్రజల మద్దతు చెబుతారని ఆకాంక్షించారు. ఎం.కె. స్టాలిన్ నాయకత్వంలోని ప్రభుత్వం భారీ మెజారిటీతో తిరిగి అధికారాన్ని కైవసం చేసుకోబోతోందని భట్టి విక్రమార్క చెప్పారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహ జ్యోతిలో భాగంగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ నాయకత్వంలోనీ ప్రజా ప్రభుత్వం ఎన్నికలవేళ ఇచ్చిన హామీలే కాకుండా, ఇవ్వని హామీలు కూడా అమలు చేస్తున్నామని తెలిపారు. అనుమానం ఉంటే ఎవరైనా వచ్చి పరిశీలించవచ్చని తెలిపారు. రైతు భరోసా కింద రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసిన

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే
పాత
తెలంగాణ

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే

నవతెలంగాణ – మద్నూర్జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్ మండలంలో పలు వివాహ వేడుకలలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. వధూవరుల కుటుంబ సభ్యులతో కలిసి వారి ఆనందాన్ని పంచుకున్నారు. వధూవరుల దాంపత్య జీవితం సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో నిండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ మద్నూర్ మండల అధ్యక్షులు ధరాస్ సాయిలు, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు అనుమంత్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి సంతోష్ పటేల్, సంఘయప్ప […] The post నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే appeared first on Navatelangana.

రైతులు ఆందోళన చెందవద్దు – అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం
పాత
తెలంగాణ

రైతులు ఆందోళన చెందవద్దు – అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం

26 క్వింటాల పరిమితిని ఎత్తివేయాలి: రైతులుమధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు నవతెలంగాణ – బోనకల్ రైతులు పోరాటంతో సాధించుకున్న మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. దీంతో రైతులలో ఆనందం, ఉత్సాహం పరుగులు పెట్టింది. రైతులు ఆనందం ఆకాశాన్ని అంటింది. మండల పరిధిలోని ముష్టికుంట్ల రావినూతల సొసైటీ పరిధిలో గల రైతులు సోమవారం భారీ ఎత్తున ఆందోళన నిర్వహించిన సంగతి విధితమే. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశాల మేరకు ముష్టికుంట్ల సొసైటీలో కొనుగోలు కేంద్రాన్ని […] The post రైతులు ఆందోళన చెందవద్దు – అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం appeared first on Navatelangana.

ఉపాధి కూలీల సమస్యలపై సీపీఐ(ఎం) నాయకుల ఆరా
పాత
తెలంగాణ

ఉపాధి కూలీల సమస్యలపై సీపీఐ(ఎం) నాయకుల ఆరా

నవతెలంగాణ – ఉప్పునుంతలఉప్పునుంతల మండలంలోని లక్ష్మాపూర్ గ్రామంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కూలీల సమస్యలను తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చింతల నాగరాజు, మండల నాయకులు పనుగంటి బాలయ్య, శ్రీరాములు గ్రామాన్ని సందర్శించి కూలీలతో మాట్లాడారు. పనుల అమలు, వేతనాల చెల్లింపులు, పనిస్థలాల్లో సౌకర్యాలపై కూలీల నుంచి వివరాలు సేకరించారు. కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి […] The post ఉపాధి కూలీల సమస్యలపై సీపీఐ(ఎం) నాయకుల ఆరా appeared first on Navatelangana.

టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న ఢిల్లీ.. SRH తుది జట్టు ఇదే!
పాత
ఆర్‌టిసి కార్మికుల సమ్మెకు సంపూర్ణ మద్దతు: కల్వకుంట్ల కవిత
పాత
తెలంగాణ

ఆర్‌టిసి కార్మికుల సమ్మెకు సంపూర్ణ మద్దతు: కల్వకుంట్ల కవిత

ఆర్‌టిసి కార్మికులంటే లెక్కలేనితనంతో ప్రభుత్వం వ్యవహరిస్తోందని కవిత మండిపడ్డారు. ఆర్‌టిసిలో కార్మికులు లేకుండా చేసి సంస్థను ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఆర్‌టిసి కార్మికుల సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని అన్నారు. ఈనెల 25న తెలంగాణ రాజకీయాల్లోకి నూతన రాజకీయ శక్తిగా వస్తున్నామని, ప్రజలందరికీ ఈ వేదిక నుంచి ఆహ్వానం పలుకుతున్నామని చెప్పారు. పార్టీ ఆవిర్భావ సభకు సిరిసిల్ల నుంచి పార్టీ కార్యకర్తలు మంగళవారం పాదయాత్రగా బయలుదేరారని తెలిపారు. తమ పార్టీ ఆవిర్భావ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చే క్యాడర్ వాహనాలకు ఎలాంటి ఎలాంటి ఇబ్బంది కలిగించొద్దని పోలీసులు, అధికార యంత్రాంగాన్ని కోరారు. సమ్మెకు దిగిన ఆర్టిజన్లను బెదిరించి విధుల్లో చేరేలా ఒత్తిడి చేశారని అన్నారు. ప్రజలందరూ సమస్యల్లో ఉంటే అధికార, ప్రతిపక్షాలు రాజకీయాలు చేయడానికే ప్రాధాన్యత ఇస్తున్నాయని మండిపడ్డారు. కార్మికులంటే ఈ ప్రభుత్వానికి లెక్కలేదని అన్నారు. ఆర్‌టిసిని ప్రైవేటుపరం చేసే కుట్రలను అడ్డుకుంటామని హెచ్చరిచారు. వెంటనే ఆర్‌టిసిని ప్రభుత్వంలో విలీనం చేయాలని కవిత డిమాండ్ చేశారు.

సన్‌రైజర్స్ బ్యాటింగ్
పాత
జనగణనపై ఎన్యుమరేటర్స్ మొదటి విడత శిక్షణ పూర్తి
పాత
తెలంగాణ

జనగణనపై ఎన్యుమరేటర్స్ మొదటి విడత శిక్షణ పూర్తి

నవతెలంగాణ – మల్హర్ రావుజనగణన 2027 పేస్-1జనాభా లెక్కలకు 27 మంది సభ్యులతో కూడిన బ్యాచ్-1 ఎన్యుమరేటర్స్,సూపర్ వైజర్స్ మూడురోజుల శిక్షణ తరగతులు మండల పరిషత్ తాడిచెర్ల జిల్లా పరిషత్ పాఠశాలలో మంగళవారం ముగిశాయి. ఈ శిక్షణ తరగతులు మండల తహశీల్దార్ రవికుమార్, ఏఎస్ఓ శివ పర్యవేక్షణలో కొనసాగాయి. ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు అందరినీ రెండు బ్యాచ్ లు గా విభజించి మొదటి విడత 27 మందికీ ట్రైనింగ్ ఆఫీసర్లుగా జిల్లా పరిషత్ తాడిచర్ల పాఠశాల నుండి కోడెపాక […] The post జనగణనపై ఎన్యుమరేటర్స్ మొదటి విడత శిక్షణ పూర్తి appeared first on Navatelangana.

IPL 2026: ఢిల్లీపై టాస్ ఓడిన సన్ రైజర్స్ హైదరాబాద్..
పాత
తెలంగాణ

IPL 2026: ఢిల్లీపై టాస్ ఓడిన సన్ రైజర్స్ హైదరాబాద్..

మన తెలంగాణ/హైదరాబాద్: ఐపిఎల్‌లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య రసవత్తర పోరు జరగనుంది. మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ బౌలింగ్ ఎంచుకుని.. హైదరాబాద్ ను ముందుగా బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారింది. హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచి జోరుమీదుంది. ఢిల్లీని కూడా ఓడించి హ్యాట్రిక్ విజయాన్నిఅందుకోవాలనే పట్టుదలతో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇరు జట్లు సమతూకంగా కనిపిస్తున్నాయి. దీంతో పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయమని చెప్పాలి. మరోవైపు, హైదరాబాద్ ను ఓడించి తమ సత్తా చాటాలని ఢిల్లీ భావిస్తోంది.

అంగన్వాడిల్లో పోషన్ పక్వాడ్ కార్యక్రమం
పాత
తెలంగాణ

అంగన్వాడిల్లో పోషన్ పక్వాడ్ కార్యక్రమం

నవతెలంగాణ-మల్హర్ రావుమండలం వళ్లెంకుంట గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్లు ఆధ్వర్యంలో మంగళవారం పోషన్ పక్వాడ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యద్థిగా సూపర్ వైజర్ భాగ్యలక్ష్మి హాజరై మాట్లాడారు. గర్భధారణ దశ నుంచే తల్లులు సరైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రక్తహీనత లేకుండా పోషకాహారం తీసుకోవడం ద్వారా హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుకోవచ్చన్నారు. డెలివరీ తరువాత వెంటనే శిశువుకు ముర్రుపాలు ఇవ్వడం ఎంతో ముఖ్యమని, దాని ద్వారా శిశువుకు రోగనిరోధక శక్తి పెరుగుతుందన్నారు. పుట్టిన మొదటి నెల నుంచి రెండు సంవత్సరాల […] The post అంగన్వాడిల్లో పోషన్ పక్వాడ్ కార్యక్రమం appeared first on Navatelangana.

భారత విమానాలపై పాక్ గగనతల దిగ్బంధనం మే 24 వరకు పొడిగింపు
పాత
తెలంగాణ

భారత విమానాలపై పాక్ గగనతల దిగ్బంధనం మే 24 వరకు పొడిగింపు

భారత విమానాలపై గగనతల దిగ్బంధనం మే 24 వరకు పొడిగిస్తూ పాకిస్థాన్ మంగళవారం నిర్ణయం తీసుకుంది. గత ఏడాది ఏప్రిల్ 22న కశ్మీర్ లోని పహల్గాంపై ఉగ్రదాడి జరిగి 26 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఏప్రిల్ 24 నుంచి రెండు దేశాల మధ్య గగనతల దిగ్బంధనం కొనసాగుతోంది. గత ఏడాది ఏప్రిల్ 30 నుంచి పాకిస్థాన్ విమానాలకు భారత గగనతలాన్ని వినియోగించడానికి అనుమతి లేదు. పాకిస్థాన్ ఎయిర్‌పోర్ట్ అథారిటీ నోటమ్ ప్రకారం ఈ ఏడాది మే 24 ఉదయం 5 గంటల వరకు ఆంక్షలు కొనసాగుతాయి. దీనివల్ల పశ్చిమదేశాలకు , ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు, యూరప్ దేశాలకు ఢిల్లీ, అమృత్‌సర్, జైపూర్ నుండి వెళ్లే సుమారు 800 వారపు విమాన సర్వీసులపై ప్రభావం పడుతుంది.

Advertisement
Sponsored by ATA – American Telugu Association