
4674 వార్తలు
26 క్వింటాల పరిమితిని ఎత్తివేయాలి: రైతులుమధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు నవతెలంగాణ – బోనకల్ రైతులు పోరాటంతో సాధించుకున్న మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. దీంతో రైతులలో ఆనందం, ఉత్సాహం పరుగులు పెట్టింది. రైతులు ఆనందం ఆకాశాన్ని అంటింది. మండల పరిధిలోని ముష్టికుంట్ల రావినూతల సొసైటీ పరిధిలో గల రైతులు సోమవారం భారీ ఎత్తున ఆందోళన నిర్వహించిన సంగతి విధితమే. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశాల మేరకు ముష్టికుంట్ల సొసైటీలో కొనుగోలు కేంద్రాన్ని […] The post రైతులు ఆందోళన చెందవద్దు – అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం appeared first on Navatelangana.
నవతెలంగాణ – ఉప్పునుంతలఉప్పునుంతల మండలంలోని లక్ష్మాపూర్ గ్రామంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కూలీల సమస్యలను తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చింతల నాగరాజు, మండల నాయకులు పనుగంటి బాలయ్య, శ్రీరాములు గ్రామాన్ని సందర్శించి కూలీలతో మాట్లాడారు. పనుల అమలు, వేతనాల చెల్లింపులు, పనిస్థలాల్లో సౌకర్యాలపై కూలీల నుంచి వివరాలు సేకరించారు. కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి […] The post ఉపాధి కూలీల సమస్యలపై సీపీఐ(ఎం) నాయకుల ఆరా appeared first on Navatelangana.


ఆర్టిసి కార్మికులంటే లెక్కలేనితనంతో ప్రభుత్వం వ్యవహరిస్తోందని కవిత మండిపడ్డారు. ఆర్టిసిలో కార్మికులు లేకుండా చేసి సంస్థను ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఆర్టిసి కార్మికుల సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని అన్నారు. ఈనెల 25న తెలంగాణ రాజకీయాల్లోకి నూతన రాజకీయ శక్తిగా వస్తున్నామని, ప్రజలందరికీ ఈ వేదిక నుంచి ఆహ్వానం పలుకుతున్నామని చెప్పారు. పార్టీ ఆవిర్భావ సభకు సిరిసిల్ల నుంచి పార్టీ కార్యకర్తలు మంగళవారం పాదయాత్రగా బయలుదేరారని తెలిపారు. తమ పార్టీ ఆవిర్భావ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చే క్యాడర్ వాహనాలకు ఎలాంటి ఎలాంటి ఇబ్బంది కలిగించొద్దని పోలీసులు, అధికార యంత్రాంగాన్ని కోరారు. సమ్మెకు దిగిన ఆర్టిజన్లను బెదిరించి విధుల్లో చేరేలా ఒత్తిడి చేశారని అన్నారు. ప్రజలందరూ సమస్యల్లో ఉంటే అధికార, ప్రతిపక్షాలు రాజకీయాలు చేయడానికే ప్రాధాన్యత ఇస్తున్నాయని మండిపడ్డారు. కార్మికులంటే ఈ ప్రభుత్వానికి లెక్కలేదని అన్నారు. ఆర్టిసిని ప్రైవేటుపరం చేసే కుట్రలను అడ్డుకుంటామని హెచ్చరిచారు. వెంటనే ఆర్టిసిని ప్రభుత్వంలో విలీనం చేయాలని కవిత డిమాండ్ చేశారు.
నవతెలంగాణ-హైదరాబాద్: ఐపీఎల్-2026లో భాగంగా మంగళవారం సన్రైజర్స్ హైదరబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య కీలక పోరు జరగనుంది. ఈక్రమంలో టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ ఎంచుకుంది. వరుస విజయాలతో SRH దూకుడు మీద ఉంది. ఈ మ్యాచ్లో గెలవాలని ఇషాన్ సేన ఊవిళ్లూరుతోంది. ఇప్పటి వరకు 6 మ్యాచ్లాడిన సన్రైజర్స్.. 3 విజయాలతో 6 పాయింట్లు గెలుచుకుని పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఆ మూడు విజయాలు లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో సాధించినవే. 5 మ్యాచ్ల్లో మూడింట గెలిచిన […] The post సన్రైజర్స్ బ్యాటింగ్ appeared first on Navatelangana.
నవతెలంగాణ – మల్హర్ రావుజనగణన 2027 పేస్-1జనాభా లెక్కలకు 27 మంది సభ్యులతో కూడిన బ్యాచ్-1 ఎన్యుమరేటర్స్,సూపర్ వైజర్స్ మూడురోజుల శిక్షణ తరగతులు మండల పరిషత్ తాడిచెర్ల జిల్లా పరిషత్ పాఠశాలలో మంగళవారం ముగిశాయి. ఈ శిక్షణ తరగతులు మండల తహశీల్దార్ రవికుమార్, ఏఎస్ఓ శివ పర్యవేక్షణలో కొనసాగాయి. ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు అందరినీ రెండు బ్యాచ్ లు గా విభజించి మొదటి విడత 27 మందికీ ట్రైనింగ్ ఆఫీసర్లుగా జిల్లా పరిషత్ తాడిచర్ల పాఠశాల నుండి కోడెపాక […] The post జనగణనపై ఎన్యుమరేటర్స్ మొదటి విడత శిక్షణ పూర్తి appeared first on Navatelangana.

మన తెలంగాణ/హైదరాబాద్: ఐపిఎల్లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య రసవత్తర పోరు జరగనుంది. మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ బౌలింగ్ ఎంచుకుని.. హైదరాబాద్ ను ముందుగా బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారింది. హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచి జోరుమీదుంది. ఢిల్లీని కూడా ఓడించి హ్యాట్రిక్ విజయాన్నిఅందుకోవాలనే పట్టుదలతో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇరు జట్లు సమతూకంగా కనిపిస్తున్నాయి. దీంతో పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయమని చెప్పాలి. మరోవైపు, హైదరాబాద్ ను ఓడించి తమ సత్తా చాటాలని ఢిల్లీ భావిస్తోంది.
నవతెలంగాణ-మల్హర్ రావుమండలం వళ్లెంకుంట గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్లు ఆధ్వర్యంలో మంగళవారం పోషన్ పక్వాడ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యద్థిగా సూపర్ వైజర్ భాగ్యలక్ష్మి హాజరై మాట్లాడారు. గర్భధారణ దశ నుంచే తల్లులు సరైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రక్తహీనత లేకుండా పోషకాహారం తీసుకోవడం ద్వారా హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుకోవచ్చన్నారు. డెలివరీ తరువాత వెంటనే శిశువుకు ముర్రుపాలు ఇవ్వడం ఎంతో ముఖ్యమని, దాని ద్వారా శిశువుకు రోగనిరోధక శక్తి పెరుగుతుందన్నారు. పుట్టిన మొదటి నెల నుంచి రెండు సంవత్సరాల […] The post అంగన్వాడిల్లో పోషన్ పక్వాడ్ కార్యక్రమం appeared first on Navatelangana.

భారత విమానాలపై గగనతల దిగ్బంధనం మే 24 వరకు పొడిగిస్తూ పాకిస్థాన్ మంగళవారం నిర్ణయం తీసుకుంది. గత ఏడాది ఏప్రిల్ 22న కశ్మీర్ లోని పహల్గాంపై ఉగ్రదాడి జరిగి 26 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఏప్రిల్ 24 నుంచి రెండు దేశాల మధ్య గగనతల దిగ్బంధనం కొనసాగుతోంది. గత ఏడాది ఏప్రిల్ 30 నుంచి పాకిస్థాన్ విమానాలకు భారత గగనతలాన్ని వినియోగించడానికి అనుమతి లేదు. పాకిస్థాన్ ఎయిర్పోర్ట్ అథారిటీ నోటమ్ ప్రకారం ఈ ఏడాది మే 24 ఉదయం 5 గంటల వరకు ఆంక్షలు కొనసాగుతాయి. దీనివల్ల పశ్చిమదేశాలకు , ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు, యూరప్ దేశాలకు ఢిల్లీ, అమృత్సర్, జైపూర్ నుండి వెళ్లే సుమారు 800 వారపు విమాన సర్వీసులపై ప్రభావం పడుతుంది.
నవతెలంగాణ- రాజన్న సిరిసిల్లఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు తెలంగాణ రెండో పీఆర్సీ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారని, ప్రభుత్వం పీఆర్సీ గడువు పొడిగించకుండా, వెంటనే నివేదిక తెప్పించుకుని సంఘాలతో చర్చించి అమలు చేయాలని టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టిఎస్ యుటిఎఫ్) కార్యకర్తల సమావేశం మంగళవారం మధ్యాహ్నం సిరిసిల్లలో గుండమనేని మహేందర్ రావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చావ రవి మాట్లాడుతూ ఉపాధ్యాయులు, […] The post సమస్యలను వెంటనే పరిష్కరించాలి: టిఎస్ యుటిఎఫ్ appeared first on Navatelangana.

– రూ. 2400 మద్దతు ధర పూర్తిగా రైతులకు అందేలా చర్యలు – దేవదారికుంట తండా కొనుగోలు కేంద్రంపై ఆకస్మిక తనిఖీనవతెలంగాణ – ఉప్పునుంతలమండల పరిధిలోని దేవదారికుంట తండాలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బడావత్ సంతోష్ మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ క్రమంలో కొనుగోలు ప్రక్రియను సమగ్రంగా పరిశీలించి, రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. కొనుగోళ్లలో ఎటువంటి ఆలస్యం లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. ప్రభుత్వం నిర్ణయించిన […] The post మొక్కజొన్న కొనుగోళ్లను పారదర్శకంగా నిర్వహించాలి: కలెక్టర్ appeared first on Navatelangana.

మేఘాలయ ప్రభుత్వ ఆహ్వానం మేరకు రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క బుధవారం ఆ రాష్ట్ర పర్యటనకు వెళ్లనున్నారు. స్టేట్- టు- స్టేట్ భాగస్వామ్య కార్యక్రమంలో భాగంగా రెండు రోజుల పాటు మంత్రి అక్కడి కార్యక్రమాలను పరిశీలించనున్నారు. ఈ పర్యటనలో మహిళా శిశు అభివృద్ధి రంగంలో మేఘాలయ అమలు చేస్తున్న పలు కీలక కార్యక్రమాలను మంత్రి అధ్యయనం చేయనున్నారు. ముఖ్యంగా మిషన్ 1000 డేస్, ఎర్లీ చైల్డ్హుడ్ డెవలెప్మెంట్ కార్యక్రమాలు, అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధి వంటి అంశాలను పరిశీలించనున్నారు. అలాగే మహిళా శిశు సంక్షేమంపై ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఇతర సాంకేతిక భాగస్వామ్య సంస్థలు నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు. ఈ పర్యటనలో తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ శృతి ఓజా కూడా మంత్రితో పాటు ఉంటారు. మేఘాలయలో అమలవుతున్న కార్యక్రమాల ద్వారా అంగన్వాడి కేంద్రాలను కేవలం పోషకాహార పంపిణీ కేంద్రాలుగా కాకుండా, పిల్లల సమగ్ర అభివృద్ధికి వేదికలుగా మార్చుతున్నారు. మాతా శిశు ఆరోగ్యం, పోషణ, ప్రాథమిక విద్యను కలగలిపిన సమగ్ర విధానంతో ఆ రాష్ట్రం ప్రత్యేక గుర్తింపు పొందింది. తల్లిదండ్రులకు శిశు సంరక్షణ, పోషణపై అవగాహన పెంపు, రియ

నవతెలంగాణ-హైదరాబాద్: తమిళనాడు (Tamil Nadu) లో అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) పోరు క్లైమాక్స్కు చేరుకుంది. హోరాహోరీగా సాగిన ప్రచార పర్వం మంగళవారం సాయంత్రం 6 గంటలకు ముగిసింది. ఏప్రిల్ 23న (బుధవారం) అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. రాష్ట్రంలోని మొత్తం 234 నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనున్నారు. ప్రచారానికి ఆఖరి రోజున ప్రధాన పార్టీలన్నీ రోడ్ షోలు, బహిరంగ సభలతో హోరెత్తించాయి. ప్రచారంలో భాగంగా ఒకరిపై ఒకరు చేసుకున్న వ్యక్తిగత విమర్శలు, సవాళ్లతో తమిళనాడులో […] The post తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం appeared first on Navatelangana.

నవతెలంగాణ-రాయికల్పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ఆధ్వర్యంలో “తరంగిణి-2026”వార్షికోత్సవ వేడుకలను మంగళవారం ఆర్ఆర్ కన్వెన్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. పాఠశాల డైరెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ జూపల్లి వేణుగోపాల్ రావు మాట్లాడుతూ… విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీయడంలో వార్షికోత్సవాలు కీలకమని అన్నారు. విద్యార్థులు చదువుతోపాటు ఆటపాటల్లోనూ రాణించాలని సూచించారు. సోషల్ మీడియాకు బానిసలు కాకుండా చదువుపై దృష్టి పెట్టి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, తల్లిదండ్రులు కూడా పిల్లలపై శ్రద్ధ వహించాలని తెలిపారు. […] The post ఘనంగా కృష్ణవేణి టాలెంట్ స్కూల్ వార్షికోత్సవం appeared first on Navatelangana.

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని తీవ్రంగా విమర్శించారు. ఆయన ప్రభుత్వ యంత్రాంగం, కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తూ రాజకీయ పార్టీలను, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. చెన్నైలో జరిగిన పత్రికా సమావేశంలో ఏఐసీసీ సాధారణ కార్యదర్శి (సంస్థ) కె.సి. వేణుగోపాల్తో కలిసి మాట్లాడిన ఖర్గే, ఏఐఏడీఎంకేబీజేపీ కూటమిపై విమర్శలు చేస్తూ తొలుత ప్రధాన మంత్రిని టెర్రరిస్ట్గా పేర్కొన్నారు. అయితే, తన వ్యాఖ్యలపై పాత్రికేయులు వివరణ కోరడంతో, దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను భయపెడుతున్నారనే ఉద్దేశ్యంతో ఆ వ్యాఖ్య చేశానని స్పష్టం చేశారు.ఆయన ప్రజలను, రాజకీయ పార్టీలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. నేను ఆయనను నిజంగా టెర్రరిస్ట్ అన్నానా? లేదా? ఎందుకు అన్నాను? అన్నది కాదు ముఖ్యం. ఆయన తన అధికారాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్ష పార్టీలపై దాడి చేస్తున్నారు అని ఖర్గే అన్నారు.ఇక భారత ఎన్నికల సంఘం బీజేపీ కార్యాలయ విస్తరణగా మారిపోయిందని ఆరోపించిన ఆయన, ఎన్నికల ప్రచారం చివరి దశలో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తున్నారని ప్రధాన మంత్రిపై విమర్శలు గుప
నవతెలంగాణ-రాయికల్మండలంలోని ఒడ్డేలింగాపూర్ గ్రామంలోని ఒకటవ అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం ఆరు నెలలు నిండిన చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ పాలకుర్తి గంగజల చిన్నారులకు అన్నప్రాసన చేసి తల్లిదండ్రులకు సూచనలు అందించారు. The post అంగన్వాడీ కేంద్రంలో అన్నప్రాసన appeared first on Navatelangana.
నవతెలంగాణ-రాయికల్మండలంలోని ఆలూరు, వీరాపూర్, ధర్మాజీపేట, ఒడ్డెలింగాపూర్ గ్రామాల్లో జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి కె.లత క్షేత్ర స్థాయి పర్యటన నిర్వహించారు. ఉద్యాన పంటలు, మల్బరీ సాగు, మష్రూమ్ పెంపకాన్ని పరిశీలించి రైతులకు పలు సూచనలు చేశారు. టమాటలో ఎండు తెగులు నివారణకు ట్రైకోడర్మా వంటి జీవ ఎరువులు వినియోగించాలని సూచించారు. కోతుల బెడద నివారణకు సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసిన రైతును అభినందించారు. ఆయిల్ పామ్ తోటల్లో డ్రిప్ ద్వారా సమయానికి నీరు అందిస్తే దిగుబడి […] The post ఉద్యాన, పల్బారీ పంటలను పరిశీలించిన అధికారి appeared first on Navatelangana.

భంగపడినట్లు ఇప్పుడు బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ చేతిలో మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డికీ తప్పదని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు. సోమవారం కాంగ్రెస్పై కెసిఆర్, టి. జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని ఎంపీ మల్లు రవి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కెసిఆర్కు నమ్మించి మోసం చేయడం వెన్నతో పెట్టిన విద్య అని ఆయన తెలిపారు. కెసిఆర్తో ఏమి ఉపయోగం లేదని ఎన్నికల్లో రుజువైందని అన్నారు. కెసిఆర్ ఎన్ని మాటలు చెప్పినా ప్రజా ప్రభుత్వానికి ఏమి కాదని, ప్రజలకు తమ వైపు ఉన్నారని ఆయన తెలిపారు. త్రేతాయుగంలో రావణుడి చేతిలో విభీషణుడు భంగపడినట్లు కలియుగంలో కెసిఆర్ చేతిలో జీవన్ రెడ్డికి భంగపాటు తప్పదని ఆయన అన్నారు. 42 ఏళ్ళు జీవన్ రెడ్డి కాంగ్రెస్లో అనేక పదవులు అనుభవించి ఇప్పుడు కాంగ్రెస్ను విమర్శించడం భావ్యం కాదని ఆయన విమర్శించారు. తాను చెప్పినట్లు కాంగ్రెస్ వినలేదని జీవన్ రెడ్డి కాంగ్రెస్ను వీడి పోవడంతో 42 ఏండ్ల వ్యక్తి గత ప్రతిష్టను దిగజార్చుకున్నారని ఆయన తెలిపారు. ఏఐసిసి అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆలోచనల మేరకు రేవంత్ రెడ్డి కులగణన నిర్వహించారని మల్లు రవి చెప్పారు.
ఉపాధి కూలీలకు రూ 307 లు పకడ్బందీగా అమలు చేయాలివ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జగన్ నవతెలంగాణ – మిడ్జిల్ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఉపాధి కూలీలందరికీ వెంటనే డబ్బులు చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు పోలే జగన్ డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట కూలీలకు డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. మండలంలోని వేముల, వల్లభరావుపల్లి, రాణిపేట్, […] The post క్యాప్చర్ విధానాన్ని రద్దు చేయాలి appeared first on Navatelangana.

త్రిస్సూర్: కేరళలో భారీ పేలుడు జరిగింది. త్రిస్సూర్లో బాణసంచా నిల్వ, తయారీ కేంద్రంలో జరిగిన పేలుడు ఘటనలో ముగ్గురు మరణించారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. త్రిస్సూర్ పూరం ఉత్సవాల్లో భాగంగా జరిగే తిరువంబడి కోసం బాణసంచా సామగ్రిని సిద్ధం చేస్తున్న కేంద్రంలో మంగళవారం ఈ పేలుడు సంభవించింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక, సహాయక బృందాలు, అంబులెన్స్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని త్రిస్సూర్లోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు.భారీ పేలుడుతో..దాని శబ్దం చాలా కిలోమీటర్ల దూరం వరకు వినిపించింది. దీంతో సమీపంలోని నివాసితులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. భూకంపం సంభవించినట్లు అనుకుని భయపడినట్లు స్థానికులు తెలిపారు. దట్టమైన పొగ, మంటలు ఆ ప్రాంతాన్ని కమ్మేయడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడిందని అధికారులు తెలిపారు.