22107 వార్తలు

గుడిహత్నూర్: అట్రాసిటీ కేసు పేరుతో బెదిరింపులు...హాస్టల్ వార్డెన్ నుంచి వసూళ్లకు పాల్పడ్డ తండ్రీకొడుకుల అరెస్ట్



నవతెలంగాణ – నిజాంసాగర్ : మండల కేంద్రంలోని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి కామారెడ్డి జిల్లాతో పాటు ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి మంగళవారం ఉదయం 6 గంటల వరకు ప్రాజెక్టులోకి 1207 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని ప్రాజెక్ట్ ఏఈఈ సాకేత్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 17.802 టీఎంసీలకు గాను ప్రస్తుతం 6.582 టీఎంసీల నీరు నిలువ ఉంది అని ఆయన పేర్కొన్నారు. The post నిజాంసాగర్ ప్రాజెక్టులోకి స్వల్ప ఇన్ ఫ్లో appeared first on Navatelangana.

నవతెలంగాణ – హైదరాబాద్: ఐపీఎల్ ధమాకా, అనంతరం వరుసగా వైట్బాల్ ఫార్మాట్ సిరీస్లు ఆడిన టీమ్ ఇండియా.. ఎట్టకేలకు రెడ్బాల్ ఫార్మాట్లో మెరిసేందుకు సిద్ధమవుతోంది. శ్రీలంక, భారత్ మధ్య ఆగస్టు 15 నుంచి రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్ మొదలుకానుంది. ఈ సిరీస్ కోసం భారత సెలక్షన్ కమిటీ జట్టును ప్రకటించింది. జస్ప్రీత్ బుమ్రా, సాయి సుదర్శన్లకు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్ వస్తే.. మ్యాచ్లకు అందుబాటులో ఉంటారు. ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ రెండో […] The post శ్రీలంకతో టెస్టు సిరీస్ కు భారత జట్టు ఎంపిక.. appeared first on Navatelangana.

మెట్పల్లి: జగిత్యాల జిల్లా మెట్పల్లిలో బస్సు ప్రమాదం జరిగింది. ఆర్టిసి ఎలక్ట్రిక్ బస్సు మెట్పల్లి శివారులోకి రాగానే అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 12 మంది ప్రయాణికులు ఉన్నారు. స్వల్పంగా గాయపడిన 12 మందిని ఆస్పత్రికి తరలించారు. బస్సు నిజామాబాద్ నుంచి వరంగల్కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు ముందు భాగం నుజ్జు నుజ్జుగా మారింది.



తిరువనంతపురం: వరుస వైఫల్యాలతో టీమిండియాలో చోటు కోల్పోయిన స్టార్ ఆటగాడు సంజు శాంసన్ ఇటీవల కాలంలో ఇంటాబయటా విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఎన్నో అవకాశాలు లభించినా శాంసన్ సద్వినియోగం చేసుకోలేదని, ఇలాంటి స్థితిలో అతన్ని జట్టు నుంచి తప్పించడం ఏమాత్రం తప్పుకాదని పలువురు మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై శాంసన్ స్పందించాడు. కెరీర్లో ఎత్తుపల్లాలు సహాజమన్నాడు.





నవతెలంగాణ – హైదరాబాద్ : పీవోకేలో హింసాత్మక ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. ఆందోళనకారులపై పాకిస్థాన్ ఆర్మీ కాల్పులు జరపడంతో ఏడుగురు మహిళలు సహా మొత్తం 19 మంది మృతిచెందినట్లు సమాచారం. స్థానిక చట్టసభ ఎన్నికలు మూడు విడతల్లో జరుగుతున్న వేళ ఈ ఘటన చోటుచేసుకోవడం ఉద్రిక్తతను మరింత పెంచింది. పీవోకేలో ఉత్పత్తి అయ్యే జలవిద్యుత్ను పాకిస్థాన్కు తరలిస్తూ, స్థానిక ప్రజలపై అధిక విద్యుత్ బిల్లులు మోపుతున్నారనే ఆరోపణలతో ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. పరిస్థితిని అదుపులోకి […] The post పీవోకేలో హింసాత్మక ఆందోళనలు.. 19 మంది మృతి appeared first on Navatelangana.

నవతెలంగాణ – హైదరాబాద్ : జమ్మూ-కశ్మీర్లోని గందర్బాల్ జిల్లా కంగన్ ప్రాంతంలో మంగళవారం వేగంగా వెళ్తున్న అమర్నాథ్ యాత్రికుల బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లడంతో 39 మంది యాత్రికులు గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఒక మలుపు వద్ద డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో బస్సు హరిగాన్వాన్ వద్ద ఓ ఇంటిపై పడింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆ ఇంట్లో ఎవరూ లేరని అధికారులు పేర్కొన్నారు. అమర్నాథ్ ఆలయంలో పూజలు ముగించుకుని తిరిగివస్తుండగా ప్రమాదం జరిగింది. The post అమర్నాథ్ యాత్రికుల బస్సు బోల్తా..39 మందికి గాయాలు appeared first on Navatelangana.

మన తెలంగాణ/క్రీడా విభాగం: జింబాబ్వేతో జరిగిన మూడు మ్యాచ్ల టి20 సిరీస్ను టీమిండియా క్లీన్స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. ఐర్లాండ్, ఇంగ్లండ్లతో జరిగిన సిరీస్లలో ఘోర పరాజయాలు చవిచూసిన భారత్కు ఈ గెలుపు కొత్త ఊపు ఇచ్చిందని చెప్పాలి. బ్యాటింగ్, విభాగాల్లో నిలకడగా రాణించిన టీమిండియా 30తో సిరీస్ను వైట్వాష్ చేసింది. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కు ఈ గెలుపు అతి పెద్ద ఊరటగా చెప్పక తప్పదు. రానున్న సిరీస్లలో మరింత మెరుగైన ప్రదర్శన చేసేందుకు ఈ గెలుపు దోహదం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ నిలకడైన బ్యాటింగ్తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మూడు మ్యాచుల్లోనూ వైభవ్ అద్భుత బ్యాటింగ్తో అలరించాడు. జట్టు విజయంలో అతని పాత్ర చాలా కీలకమని చెప్పాలి. విధ్వంసక బ్యాటింగ్తో చెలరేగిన వైభవ్ భారత్కు మెరుపు ఆరంభాన్ని అందించడంలో ముఖ్యభూమిక పోషించాడు. జింబాబ్వేపై రాణించడం ద్వారా వైభవ్ టీమిండియాలో తన స్థానాన్ని మరింత మెరుగు పరుచుకున్నాడు. అయితే అభిషేక్ శర్మ వైఫల్యం జట్టును కలవరానికి గురిచేస్తోంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జట్టును ముందుండి నడిపించడంలో సఫలమయ్యాడు. ఇక వికెట్ కీపర్





