22461 వార్తలు






2027 ప్రపంచకప్నకు మరికొన్ని నెలల్లో ప్రారంభం కానుంది. ఈసారి మెగా ట్రోఫీని అందుకోవాలని అన్ని జట్లు సన్నాహాలు చేస్తున్నాయి. అయితే టీం ఇండియాలో మాత్రం ఒక కొరత ఉందని మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు. కీలక ఆటగాళ్లను జట్టును నుంచి దూరం పెట్టారని అన్నారు. ‘‘దూబే, హర్షిత్ రాణా వంటి ఆలటగాళ్లు ఆల్రౌండర్లు కాదు. వీరిని ఆల్రౌండర్లు అంటే.. నాకు నేను గొప్ప ఆల్రౌండర్ను అని చెప్పొచ్చు. జట్టులో హార్థిక్ ఒక్కడే నిజమైన ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి హాఫ్ ఆల్ రౌండర్. అతడు 7వ స్థానంలో బ్యాటింగ్ చేయడంతో పాటు.. కొన్ని ఓవర్లు వేయగలడు. మరోవైపు రవీంద్ర జడేజా వన్డేల నుంచి పూర్తిగా వైదొలగాడని నేను అనుకోవడం లేదు. 2023 ప్రపంచకప్లో అద్భుతంగా రాణించాడు. అతడు ఓ సైలెంట్ కిల్లర్. వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటిచలేదు. టెస్టుల్లో అద్భుతంగా రాణించినా అతడికి వన్డే జట్టులో మాత్రం చోటు దక్కడం లేదు. రాణిస్తే జట్టులోకి కూడా తీసుకవావాలి’’ అని శ్రీకాంత్ అన్నారు.








అమరావతి: నిత్యం కులమతాలను అడ్డం పెట్టుకుని విధ్వేషాలు రగిలించడమే గొడ్డలి పార్టీ పనిగా పెట్టుకుందని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. గొడ్డలి పార్టీ విష వృక్షమనే ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించారు. టిడిపి ముఖ్యనేతలతో సిఎం టెలికాన్ఫరెన్స్ జరిపారు. వైసిపి నేతలతో వేదికలు పంచుకోవడంపై పరోక్షంగా ప్రస్తావించారు. వైసిపి నేతలతో ఎట్టి పరిస్థితుల్లో వేదికలు పంచుకోవాల్సి వద్దని ఆదేశించారు. గొడ్డలి పార్టీ ట్రాప్ లో నేతలెవరూ పడొద్దు అని సూచించారు. రెండేళ్ల పాలనపై చేపట్టాల్సిన ఇంటింటి ప్రచారం..ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలపై చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. రెండెళ్ల కూటమి పాలనపై రేపటి నుంచి 45 రోజులు పాటు..టిడిపి టు డోర్ కార్యక్రమం చేపట్టనుందని, ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నామని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పాలని, ప్రజలకు అనుమానాలుంటే నివృత్తి చేయాలని అన్నారు. మంత్రులు, ఎంపిలు పార్టీ యంత్రాంగం మొత్తం అవుట్ రీచ్ కార్యక్రమంలో పాల్గొనాలని, స్థానిక ఎన్నికల్లో అన్ని స్థానాలు గెలవాలని చెప్పారు. కూటమి పార్టీల అభ్యర్థుల గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, కష్టంతో కాకుండా ఇష్టంతో పనిచేయాలని ప్రజలు, కార్య


ఉప్పల్ రింగ్రోడ్డుపై ట్రాఫిక్ నిలిపివేతమాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండెపోటు.. వరంగల్ నుంచి హైదరాబాద్కు తరలింపులో పోలీసుల సమయోచిత స్పందన మన తెలంగాణ/ఉప్పల్: వరంగల్ జిల్లా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర గుండెపోటుకు గురికావడంతో ఆయనను అత్యవసర చికిత్స కోసం వరంగల్ నుంచి హైదరాబాద్కు తరలించారు. వరంగల్లోని స్థానిక ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం హైదరాబాద్ నగరంలోని కార్పొరేట్ ఆస్పత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. రోగి ప్రాణాలను కాపాడటమే పరమావధిగా భావించిన పోలీసులు తక్షణమే స్పందించి ఉప్పల్ రింగ్రోడ్డు పరిసర ప్రాంతాల్లో గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు. అంబులెన్స్ ప్రయాణించే మార్గంలో ఇతర వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేసి, ఎక్కడా ట్రాఫిక్ నిరోధం లేకుండా నిరంతర క్లియర్ మార్గాన్ని (క్లియర్ రూట్ ) సుగమం చేశారు. మల్కాజ్ గిరి కమిషనరేట్ ఉప్పల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నాగరాజు ఆధ్వర్యంలో పోలీసులు, స్థానిక పోలీసుల అద్భుత సమన్వయం వల్ల అంబులెన్స్ అత్యంత వేగంగా ఆస్పత్రికి చేరుకోగలిగింది. అత్యవసర సమయాల్లో 'గ్రీన్ కారిడార్' ఎంతటి కీల

సూపర్స్టార్ రజనీకాంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన తన జీవిత ప్రయాణాన్ని ఆత్మకథ రూపంలో అభిమానులతో పంచుకోనున్నారని.. నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే దీనపై రజనీ టీమ్ నుంచి ఎలాంట అధికారిక ప్రకటన రాలేదు. కానీ, చాలాకాలంగా రజనీకాంత్ ఈ పుస్తకం రాసే పనిలో ఉన్నట్లు సమాచారం.ఆయన వ్యక్తిగత అనుభవాలు, వృత్తిపరమైన విజయాలు, అగ్రస్థానికి చేరుకునేందుకు ఎదుర్కొన్న సవాళ్లు తదితర వివరాలన్నీ ఇందులో ఉండనున్నట్లు తెలుస్తోంది. కేవలం పుస్తకమే కాకుండా, ఈ ఆత్మకథను బయోపిక్గా తీసుకురావాలని భావిస్తున్నారట. ఈ ఆలోచనపై తనకు అత్యంత సన్నిహితులైన వారితో చర్చలు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, పుస్తకం లేదా సినిమాపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.


హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని చూసి ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం భయపడే ప్రసక్తే లేదని బిజెపి ఎంపి డికె అరుణ తెలిపారు. జాతి వ్యతిరేకత శక్తులు ఉద్యమంలో ఉన్నాయని అన్నారు. మోడీని, దేశాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు కుట్ర చేశారని అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అప్ కోసం పనిచేసే వ్యక్తి యువతను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని విమర్శించారు. బిఆర్ఎస్ హయాంలో గ్రూప్1 పేపర్ లీక్ అయితే..అప్పుడెందుకు రాజీనామా చేయలేదు? అని డికె అరుణ ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో టెన్త్ పేపర్ లీక్ అయితే ..ఇక్కడెవరూ రాజీనామా చేయలేదని, ప్రధాని మోడీని అపహాస్యం చేసేందుకు యువతను ఉసిగొల్పారని మండిపడ్డారు. ఇవి మీడియాను తన వైపు తిప్పుకోవడానికి సిఎం రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి డ్రామాలని, సిఎం పదవి కాపాడుకోవాలి..రాహుల్ గాంధీ దగ్గర మార్కులు కొట్టాలని డికె అరుణ ఎద్దేవా చేశారు. ప్రధానిని రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన వారి డౌన్ ఫాల్ స్టార్ట్ అయిందని..మోడీది కాదని డికె అరుణ చురకలంటించారు.


తిరువనంతపురం: బస్సు అదుపుతప్పి కారుపై బోల్తాపడడంతో ఒకరు మృతి చెందిన సంఘటన కేరళ రాష్ట్రం మలప్పురం ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... కుట్టిప్పురం జాతీయ రహదారిపై ప్రైవేటు బస్సు అదుపుతప్పి కారుపై పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతులు పెరూవయాల్ ప్రాంతానికి చెందిన వైశాగా గుర్తించారు. బస్సు అదుపుతప్పి డివైడర్ ఢీకొట్టిన అనంతరం కారు పడినట్టు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించారు.

