22471 వార్తలు


ఉప్పల్ రింగ్రోడ్డుపై ట్రాఫిక్ నిలిపివేతమాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండెపోటు.. వరంగల్ నుంచి హైదరాబాద్కు తరలింపులో పోలీసుల సమయోచిత స్పందన మన తెలంగాణ/ఉప్పల్: వరంగల్ జిల్లా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర గుండెపోటుకు గురికావడంతో ఆయనను అత్యవసర చికిత్స కోసం వరంగల్ నుంచి హైదరాబాద్కు తరలించారు. వరంగల్లోని స్థానిక ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం హైదరాబాద్ నగరంలోని కార్పొరేట్ ఆస్పత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. రోగి ప్రాణాలను కాపాడటమే పరమావధిగా భావించిన పోలీసులు తక్షణమే స్పందించి ఉప్పల్ రింగ్రోడ్డు పరిసర ప్రాంతాల్లో గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు. అంబులెన్స్ ప్రయాణించే మార్గంలో ఇతర వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేసి, ఎక్కడా ట్రాఫిక్ నిరోధం లేకుండా నిరంతర క్లియర్ మార్గాన్ని (క్లియర్ రూట్ ) సుగమం చేశారు. మల్కాజ్ గిరి కమిషనరేట్ ఉప్పల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నాగరాజు ఆధ్వర్యంలో పోలీసులు, స్థానిక పోలీసుల అద్భుత సమన్వయం వల్ల అంబులెన్స్ అత్యంత వేగంగా ఆస్పత్రికి చేరుకోగలిగింది. అత్యవసర సమయాల్లో 'గ్రీన్ కారిడార్' ఎంతటి కీల

సూపర్స్టార్ రజనీకాంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన తన జీవిత ప్రయాణాన్ని ఆత్మకథ రూపంలో అభిమానులతో పంచుకోనున్నారని.. నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే దీనపై రజనీ టీమ్ నుంచి ఎలాంట అధికారిక ప్రకటన రాలేదు. కానీ, చాలాకాలంగా రజనీకాంత్ ఈ పుస్తకం రాసే పనిలో ఉన్నట్లు సమాచారం.ఆయన వ్యక్తిగత అనుభవాలు, వృత్తిపరమైన విజయాలు, అగ్రస్థానికి చేరుకునేందుకు ఎదుర్కొన్న సవాళ్లు తదితర వివరాలన్నీ ఇందులో ఉండనున్నట్లు తెలుస్తోంది. కేవలం పుస్తకమే కాకుండా, ఈ ఆత్మకథను బయోపిక్గా తీసుకురావాలని భావిస్తున్నారట. ఈ ఆలోచనపై తనకు అత్యంత సన్నిహితులైన వారితో చర్చలు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, పుస్తకం లేదా సినిమాపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.


హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని చూసి ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం భయపడే ప్రసక్తే లేదని బిజెపి ఎంపి డికె అరుణ తెలిపారు. జాతి వ్యతిరేకత శక్తులు ఉద్యమంలో ఉన్నాయని అన్నారు. మోడీని, దేశాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు కుట్ర చేశారని అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అప్ కోసం పనిచేసే వ్యక్తి యువతను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని విమర్శించారు. బిఆర్ఎస్ హయాంలో గ్రూప్1 పేపర్ లీక్ అయితే..అప్పుడెందుకు రాజీనామా చేయలేదు? అని డికె అరుణ ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో టెన్త్ పేపర్ లీక్ అయితే ..ఇక్కడెవరూ రాజీనామా చేయలేదని, ప్రధాని మోడీని అపహాస్యం చేసేందుకు యువతను ఉసిగొల్పారని మండిపడ్డారు. ఇవి మీడియాను తన వైపు తిప్పుకోవడానికి సిఎం రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి డ్రామాలని, సిఎం పదవి కాపాడుకోవాలి..రాహుల్ గాంధీ దగ్గర మార్కులు కొట్టాలని డికె అరుణ ఎద్దేవా చేశారు. ప్రధానిని రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన వారి డౌన్ ఫాల్ స్టార్ట్ అయిందని..మోడీది కాదని డికె అరుణ చురకలంటించారు.


తిరువనంతపురం: బస్సు అదుపుతప్పి కారుపై బోల్తాపడడంతో ఒకరు మృతి చెందిన సంఘటన కేరళ రాష్ట్రం మలప్పురం ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... కుట్టిప్పురం జాతీయ రహదారిపై ప్రైవేటు బస్సు అదుపుతప్పి కారుపై పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతులు పెరూవయాల్ ప్రాంతానికి చెందిన వైశాగా గుర్తించారు. బస్సు అదుపుతప్పి డివైడర్ ఢీకొట్టిన అనంతరం కారు పడినట్టు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించారు.







ప్రముఖ నటుడు సుమంత్ నటించిన చిత్రం ‘న్యూటన్స్ థర్డ్ లా’. రాజేశ్ కార్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని కె.హరీశ్ నిర్మించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా జులై 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శనివారం చిత్ర ట్రైలర్ని ప్రముఖ హీరో అడవి శేష్ విడుద చేశారు. ఓ విభిన్నమైన మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్గా ఈ సినిమాను రూపొందించారని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ముఖ్యంగా ట్రైలర్ చూపించిన కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. Good luck to you and the team on this one brother @iSumanth #Newtons3rdLaw releases on July 31st ❤️💥Check out the trailer 👇🏼https://t.co/lOSVp06B0u pic.twitter.com/qNNwoUjEhR— Adivi Sesh (@AdiviSesh) July 26, 2026

మెదక్: గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో చిరుత మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా రామాయంపేట్ మండలం తొనిగండ్ల గ్రామ శివారులో జరిగింది. రోడ్డు దాటుతుండగా చిరుతను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. వాహనదారుల సమాచారం మేరకు అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకొని చిరుతను రామాంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వెంటర్నరీ వైద్యుడు పోస్టుమార్టం చేసిన అనంతరం చిరుత కళేబరానికి దహన సంస్కారాలు నిర్వహిస్తామని అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు.

ఢిల్లీ: జీవితంలో కొన్ని తేదీలను గుర్తించుకోవడానికి క్యాలెండర్ అవసరం లేదని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. కార్గిల్ విజయ్ దివస్..ఈ రోజు మనల్ని గర్వంతో నింపుతుందని అన్నారు. కార్గిల్ అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. మోడీ 136వ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రసంగించారు. వీర సైనికుల అసాధారణ ధైర్యాన్ని మనకు గుర్తు చేస్తోందని, మాతృభూమిని రక్షించడానికి సైనికులు సర్వస్వం త్యాగం చేశారని కొనియాడారు. ఈ ఏడాది ఒక ప్రత్యేక ‘శౌర్య విజయ్ యాత్ర’ ను, ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ నుంచి బైక్ యాత్ర నిర్వహించారని అన్నారు. బైక్ యాత్ర కార్గిల్ యుద్ధ స్మారక చిహ్నానికి చేరుకుంటుందని, బైకు యాత్ర సందేశం ‘ఒక ప్రమాణం, ఒక దేశం, ఒక సెట్యూట్ చేశారు. దేశం కోసం చేసిన త్యాగాలను ఎప్పటికీ మరువలేమని యాత్ర గుర్తుచేస్తుందని మోడీ పేర్కొన్నారు.కొద్ది రోజుల క్రితం ‘ఐఎన్ఎస్ మహేంద్రగిరి’ నావికాదళంలో చేరిందని, ఆధునిక యుద్ధ నౌకను దేశంలోనే రూపకల్పన చేసి నిర్మించారని మోడీ ప్రశంసించారు. యుద్ధ నౌకలో 75 శాతానికి పైగా స్వదేశీ పరిజ్ఞానాన్ని ఉపయోగించారని, ‘ఆత్మ నిర్భర్ భారత్’ శక్తికి ప్రతీక అని డిఆర్ వో ‘పినాక లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్’ ను






