19748 వార్తలు

నవతెలంగాణ – జుక్కల్ ఇటీవలే లొంగన్ రైతులు జుక్కల్ కో ఆపరేటివ్ సొసైటీ ద్వారా హైబ్రిడ్ జొన్నలు కొనుగోలు నిర్వహించారు. అయితే విక్రయించిన జొన్నల డబ్బులు రైతుల ఖాతాలలో జమ కాకపోవడంతో సోమవారం రైతులందరూ సొసైటీకి తరలివచ్చారు. ఈ విషయమై సొసైటీ కార్యదర్శి రాకేష్ గౌడ్ ను నిలదీశారు. వెంటనే కార్యదర్శి సందిస్తూ.. అమ్మిన హైబ్రిడ్ జొన్నలు నాణ్యతగా లేవని, తరుగు పేరుతో కోతలు విధిస్తున్నారని చెప్పారు. దీంతో ఆగ్రహించిన రైతులు ఆ విషయం మాకు అప్పుడే చేప్పాల్సిందని, […] The post సహకార సొసైటీ కార్యదర్శిని నిలదీసీన జొన్న రైతులు appeared first on Navatelangana.




టామ్ హాలెండ్, జెండయా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’. జులై 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకి వసూళ్లు సునామీలా వస్తున్నాయి. మొదటి వారంలోనే 900 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు చేసినట్లు చిత్ర బృందం తెలిపింది. ఇప్పటివరకూ బాక్సాఫీస్ వద్ద 927 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.8,830 కోట్లు) వసూళ్లు చేసింది. దీంతో ప్రపంచ సినిమా చరిత్రలోనే రెండో అతి పెద్ద గ్లోబల్ ఓపెనింగ్ సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. సుమారు 225 మిలియన్ డాలర్లతో (సుమారు రూ.2,100 కోట్లు) రూపొందిన ఈ సినిమా, విడుదలైన మొదటి వీకెండ్లోనే బడ్జెట్ను అధిగమించింది. 2019లో వచ్చిన ‘అవెంజర్స్ : ది ంఎండ్ గేమ్’ చిత్రం 1.2 బిలియన్ డాలర్లు (రూ.11 వేల కోట్లు) వసూళ్లు చేసి ఈ సినిమా కంటే ఎక్కువ ఓపెనింగగ్ సాధించిన చిత్రంగా మొదటిస్థానంలో ఉంది.

ఢిల్లీ: విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలన్న తమ డిమాండ్ నెరవేరిందని కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న నీట్ అభ్యర్థుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ప్రభుత్వం నుంచి ఇంకా అందలేదని అన్నారు. ఈ సందర్భంగా అభిజీత్ దీప్కే మీడియాతో మాట్లాడారు. కేంద్రం అంగీకరించిన అన్ని డిమాండ్లను నెరవేర్చకపోతే తాము మళ్లీ నిరసన చేపట్టాల్సి వస్తుందని సూచించారు. ధర్మేంద్ర ప్రధాన్ స్థానంలో విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి అత్యాచారం చేసిన వారికి పూలమాలలు వేస్తూ కనిపించారని, అందుకే విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషిని తాము సమర్థించమని అభిజీత్ దీప్కే పేర్కొన్నారు.










హీరో నితిన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘అలియాస్ రుక్మిఱీ’. మురళీకాంత్ దర్శకత్వంలో మరొ కొ్త్త కాన్సెప్ట్తో ఈ సినిమా రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా గ్లింప్స్ని విడుదల చేశారు. హీరో నాని సమర్పణలో దీప్తి గంట ఈ సినిమాను నిర్మిస్తుండగా.. ఈ వీడియోకి నాని వాయిస్ ఓవర్ ఇఛ్చారు. ఇక ఈ సినిమాలో నితిన్ రచయితగా కనిపిస్తారని గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమాలో ఇతర నటీనటుల వివరాలను త్వరలో వెలువరించే అవకాశం ఉంది.


ఛండీగఢ్: ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరు మధ్య మనస్పర్థలు రావడంతో భార్య విడాకులు కోరడంతో భర్త మనస్థాపంతో ఉరేసుకున్నాడు. ఈ సంఘటన హర్యానా రాష్ట్రం గురుగ్రామ్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సూరత్ నగర్లో సంజీవ్ యాదవ్, మనప్రీత్ కౌర్ అనే దంపతులు నివసిస్తున్నారు. కొంతకాలం ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు కుమారుడు కూడా ఉన్నాడు. ఇద్దరు మధ్య మనస్పర్థలు రావడంతో గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. దీంతో భర్తకు విడాకులు ఇస్తానని భార్య తెగేసి చెప్పడంతో అతడు ఇంట్లోనే ఉరేసుకుంటుండగా కుమారుడు వీడియో తీశాడు. అదే సమయంలో తన భర్తను కాపాడాలని కేకలు వేసింది. అప్పటికే భర్త ఉరేసుకొని చనిపోయాడు. సంజీవ్ తండ్రి ఫిర్యాదు మేరకు మన్ప్రీత్ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.




