23679 వార్తలు


మాస్ మహారాజా రవితేజ సోదరుడి తనయుడు, నటుడు రఘు కుమారుడు మాధవ్ విలేజ్ యాక్షన్ -డ్రామా ’మారెమ్మ’తో హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్ర నిర్మాతలు సినిమా థియేట్రికల్ రిలీజ్ డేట్ ని ఖరారు చేశారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 10న థియేటర్లలో విడుదల కానుందని ప్రకటించారు. కొత్తగా విడుదలైన పోస్టర్లో మాధవ్ యుద్ధంలో పోరాడి వచ్చినట్టుగా ఇంటెన్స్ అవతార్లో ఆకట్టుకుంటున్నారు. హీరోకు, పవిత్రమైన ఆవుకు మధ్య కనిపించే పేస్ ఆఫ్, ఈ సినిమా కథా నేపథ్యాన్ని ఆసక్తికరంగా చూపిస్తోంది. మారెమ్మ చిత్రంతో మంచాల నాగరాజ్ దర్శకుడిగా పరిచయం అవుతుండగా, మోక్ష ఆర్ట్ సంస్థ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తోంది. మయూర్ రెడ్డి బండారు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, పా టలతో గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెం చడంలో మేకర్స్ విజయవంతమయ్యారు.’మారెమ్మ’ సినిమా స్థానిక సంస్కృతి, సంప్రదాయాలు, బలమైన భావోద్వేగాలతో మేళవించిన యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. మాధవ్ నటనకు అవకాశం ఉన్న పాత్రలో యాక్షన్తో పాటు హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలను ఆవిష్కరించనున్నారు. ఈ చిత్రంలో దీప





ఇవాళ్టి ( జులై 23 ) నుంచి కామన్ వెల్త్ గేమ్స్.. బాక్సింగ్, అథ్లెటిక్స్, వెయిట్ లిఫ్టింగ్ పైనే ఆశలు..


తిరుపతి: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భారీగా భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలు పడుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి శిలాతోరణం వరకు క్యూలైన్ లో భక్కులు వేచి ఉన్నారు. గురువారం శ్రీవారిని 77,874 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.92 కోట్లు, శ్రీవారికి తలనీలాలు 35,302 మంది భక్తులు సమర్పించినట్లుగా టిటిడి అధికారులు వెల్లడించారు.





కథా బలమున్న చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా, డిస్ట్రిబ్యూటర్గా పేరు తెచ్చుకున్నారు ధీరజ్ మొగిలినేని. ఆయన తన ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ‘సమ్మర్ హాలిడేస్‘ అనే చిల్డ్రన్ మూవీని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాను మన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే ఒక అందమైన కథతో దర్శకుడు శ్రీకర్ రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబి ఖుషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలోనే ‘సమ్మర్ హాలిడేస్‘ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. బుధవారం ఈ చిత్రం నుంచి సహజ నటి జయసుధ క్యారెక్టర్ పోస్టర్ రిలీజ్ చేశారు. ‘సమ్మర్ హాలిడేస్‘ సినిమాలో అమ్మమ్మ సుశీలమ్మ పాత్రలో జయసుధ ఆకట్టుకోనున్నారు. ప్రేమానురాగాలు పంచే అమ్మమ్మ సుశీలమ్మ పాత్ర ప్రేక్షకుల మనసుకి హత్తుకోనుంది.






మన తెలంగాణ/వికారాబాద్ బ్యూరో, దౌల్తాబాద్: లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నా రు. బుధవారం వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం కేంద్రం అంబేద్కర్ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేసి.. కార్యకర్తలు, నాయకులతో కలిసి ధర్నా చేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ నీట్ ప్రశ్నపత్రాలను పల్లీబ, బఠానీల్లా రూ.కోట్లకు అమ్ముకున్నారని అన్నారు. దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రజా ఆందోళనలు పరిగణనలోకి తీసుకుని ధర్మేంద్ర ప్రధాన్ను కేంద్ర మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. నీట్ ప్రశ్నపత్రాలు అమ్ముకున్న వారిని అరెస్టు చేసి జైల్లో పెట్టాలని డిమాడ్ చేశారు. ప్రధానమంత్రి ఇంటి ముందు ప్రతిపక్ష నాయకుడు, రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీపై పాశవికంగా పోలీసులతో కేంద్ర ప్రభుత్వం జరిపిన దాడికి నిరసనగా ఆందోళన, ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సిఎం స్పష్టం చేశారు. విద్యార్థుల జీవితాలను చీకటిమయం చేసినందుకు ్ల జంతర్మంతర్ నుంచి చలో పా ర్లమెంట్ కార్యక్రమాన్ని ఏ రాజకీయ పార్టీనో, పార్టీల కా ర్యకరలు తీసుకోలేదని అన్నారు. లక్షలాది మంది విద్యార్థుల జీవితా

న్యూఢిల్లీ: దేశంలో విద్యా వ్యవస్థ నిర్వీర్యమయిందని, విద్యార్థుల గోడు పట్టించుకోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ ప్రభుత్వంలో విద్యావ్యవస్థ మొత్తం రిగ్గింగ్ బారిన పడిందన్నారు. గత పదేళ్లలో 152 పేపర్ లీక్ ఉదంతాలు వెలుగు చూశాయని చెప్పారు. ఒక్క కేసులోనూ దోషులు ఎవరో తేలలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నీట్ పేపర్ లీక్ ఉదంతంపై ఉద్యమిస్తున్న యువతకు మద్దతుగా రాహుల్ గాంధీ బుధవారంనాడిక్కడ మీడియా సమావేశంలో మా ట్లాడారు. చేతికి నల్లబ్యాడ్జి ధరించి ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. విద్యార్థులపై దాడి దృశ్యాలను కూడా ఈ సందర్భంగా ఆయన ప్రదర్శించారు. దేశంలో విద్యావ్యవస్థ రిగ్గింగ్ కావడంతో లక్షలాది మంది విద్యార్థులు, కుటుంబాలు భారీ మూల్యం చెల్లించుకున్నాయని రాహుల్ గాంధీ అన్నారు. ప్రపంచంలోనే అత్యున్నతమైన మన విద్యా వ్యవస్థ ఈరోజు రిగ్గింగ్ సిస్టమ్గా మారిందని విమర్శించారు. చివరి నిమిషంలో ప్రశ్నపత్రాల లీకేజీ వంటి ఘటనలతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని, విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. మధ్యతరగతికి వారికి చదువు ఆర్థిక భార

నీట్ యూజీ పేపర్ లీకేజీ వ్యవహారంపై కాక్రోచ్ (బొద్దింకల) జనతా పార్టీ చేపట్టిన ఆందోళనలు ఢిల్లీలోనే కాదు, దేశం మొత్తం మీద ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. విపక్షాలకు తలవంచని ప్రధాని మోడీ ఈ ఆందోళనలతో తలవంచుకోవలసి వచ్చింది. మరోవైపు తమ డిమాండ్లు నెరవేరే వరకు తగ్గేదే లేదని కాక్రోచ్ జనతా పార్టీ స్పష్టం చేసింది. ఇక ఎన్డిఎ మంత్రులంతా ఈ ఆందోళనలను ఎలా నివారించాలో దిక్కుతోచక సతమతమవుతున్నారు. ఈ సమస్యపై కాంగ్రెస్తోసహా ఇతర విపక్షాలు పార్లమెంట్ సమావేశాల్లో గట్టిగా నిలదీస్తున్నాయి. సోమవారం పార్లమెంట్ ముట్టడి, మంగళవారం ఆందోళనకారులకు పోలీసులకు మధ్య ఘర్షణల తరువాత జంతర్మంతర్ వద్ద నిరసనకారుల శిబిరాలను, వేదికను పోలీసులు తొలగించినప్పటికీ బుధవారం ఉదయం నుంచి మళ్లీ తండోపతండాలుగా నిరసనకారులు జంతర్మంతర్ వద్దకు చేరుకుని నిరసన కొనసాగిస్తున్నారు. భద్రత దృష్టా ఢిల్లీలోని 16 మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేశారు. రెండో విడత చర్చలకు ప్రభుత్వం సిద్ధమై కాక్రోచ్ జనతా పార్టీ నాయకులను ఆహ్వానించినా, కేంద్ర మంత్రి జెపి నడ్డా నివాసానికి వెళ్లి చర్చలు సాగించడానికి కాక్రోచ్ నాయకులు ఒప్పుకోలేదు. తమ డిమాండ్లపై చర్చించాలంటే మంత్రు

‘మునిమాపు తొవ్వదప్పి తెల్లందాక దేవులాడింద’న్న తెలంగాణ సామెత మన ప్రభుత్వాల పనితీరు కు అద్దం పడుతోంది. దేశ యువతరం అంశాన్ని డీల్ చేయడంలో కేంద్ర ప్రభుత్వమైనా, ‘ఎల్నినో వాతావరణ’ ప్రభావాన్ని ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వమైనా చేస్తున్నదదే! మసక వెలుతురైనా మాయం కాకముందే (మునిమాపు) దారితప్పి ఉండకపోతే తెల్లవార్లూ వెతుకులాట తిప్పలు తప్పుతాయి కదా! సమస్య వేళ్లూనుతున్నపుడో, జటిలం కాకముందో... సకాలంలో సర్కార్లు స్పందించి వుంటే పరిస్థితి ఇంతదాకా వచ్చేది కాదు. ‘చేతులు కాలాక ఆకులు పట్టుకున్న’ చందంగా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఎల్-నినో వాతావరణ ప్రతికూల ప్రభావం మీద ఉన్న ట్టుండి హడావుడి చేస్తోంది. సరైన కసరత్తు, హేతుబద్ధమైన విధివిధానాలు లేకుండానే ‘నిపుణుల కమిటీ’ ఏర్పాటు చేసి, అంతా దాంతోనే అయిపోతుందన్నట్టు వ్యవహరిస్తోంది. ‘గోరుచుట్టుపై రోకటి పోట’న్నట్టు ఇప్పటికే సవాలక్ష సమస్యలతో సతమతమవుతున్న రైతన్నకు ఎల్-నినోతో వచ్చిన వర్షాభావ పరిస్థితులు కంటతడి పెట్టిస్తున్నాయి. సీజన్ దాటిపోతున్నా ఇంకా అధిక శాతం భూముల్లో సాగు మొదలు కాలేదు. సాగు మొదలైన చోట వర్షాలు లేక విత్తిన విత్తనాలు, నారు ఎండవేడికి మాడిపోతున్నాయి. ఎప్పట్నుం