23813 వార్తలు



జగిత్యాల: కోరుట్ల బస్టాండ్లో నిలిపిన ఆర్టిసి బస్సును ఓ వ్యక్తి ఆపహరించిన సంఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోరుట్ల డిపోకు చెందిన టిఎస్ 08 జడ్ 0103 అనే నంబరు గల బస్సుకు ప్రవీణ్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. కోరుట్ల బస్టాండ్లోని 8వ నంబరు ప్లాట్ ఫాంపై బస్సును నిలిపి డ్రైవర్ వాష్ రూమ్ కు వెళ్లాడు. ఓ దుండగుడు బస్సు అపహరించి నిజామాబాద్ వైపు వెళ్లాడు. డ్రైవర్ వెంటనే గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వెంటనే జీపులో బస్సును పట్టుకునేందుకు వెళ్లారు. ఆగంతకుడు రోడ్డుపై బైక్లను ఢీకొట్టుకుంటూ ముందుకు వెళ్లాడు. పలువరు ద్విచక్రవాహనదారులు స్వల్పంగా గాయపడ్డారు. పోలీసుల వాహనాన్ని ఢీకొట్టి ముందుకు వెళ్లిపోయాడు. వెంటనే పోలీసులు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వడంతో గండి హనుమాన్ సమీపంలో రోడ్డుకు లారీని నిలిపి ఉంచారు. దీంతో బస్సు ముందుకు వెళ్లే దారి లేకి ఓ చెట్టును ఢీకొట్టి అనంతరం బస్సు ఆగిపోయింది. 18 కిలో మీటర్లు ప్రయాణించిన తరువాత బస్సును పోలీసులు పట్టుకున్నారు. ఆగంతకుడు పారిపోతుండగా పోలీసులు అతడిని పట్టుకొని విచారిస్తున్నారు.

ఇంటి ముందు చిన్నారి పాపతో కలిసి బైఠాయింపు..! రెండో పెళ్లి చేసుకుని అన్యాయం చేశాడంటూ కన్నీరు.. న్యాయం చేయాలని డిమాండ్ మన తెలంగాణ/సైదాపూర్: మాయమాటలతో తనను నమ్మించి,జీవితాంతం తోడుంటానని ప్రమాణం చేసిన భర్త.. మరో మహిళ మోజులో పడి తనను,తన కన్న బిడ్డను రోడ్డున పడేశాడంటూ కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్కేపల్లి గ్రామానికి చెందిన ఈరాల మేఘన రోదిస్తూ తన భర్త ఇంటి ఎదుట బైఠాయించి మంగళవారం ధర్నాకు దిగిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది.వివరాల్లోకి వెళ్తే సిద్దిపేట జిల్లా కోహెడ మండలం నాగసముద్రాల గ్రామానికి చెందిన మేఘనను సైదాపూర్ మండలం వెన్కేపల్లికి చెందిన ఈరాల రాజు అనే వ్యక్తితో 2022లో ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో కట్న కానుకలతో వివాహం జరిపించారు.వీరికి ఒక చిన్నారి కూతురు క్రిత్యశ్రీ(3) జన్మించింది.పెళ్లికి ముందే రాజు మరో యువతీతో ప్రేమాయణం నడిపించాడని,ఇదంతా తెలిసి తనతో పెళ్లి చేయించి తనను,తన కుటుంబాన్ని నానా ఇబ్బందులు పెడుతున్నారని మేఘన రోధించారు.భర్త ప్రవర్తనలో మార్పును గమనించి భర్తను నిలదీయాగ భార్యాపిల్లలను నిర్లక్ష్యం చేస్తూ, మానసికంగా, శారీరకంగా వేధించడం ప్రారంభించారని తెలిపారు.ఈ క్రమంలోన

బెంగళూరు: భార్య, ఇద్దరు పిల్లలను చంపి అనంతరం తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కర్నాటక రాష్ట్రం మైసూరు జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... హుణసూరు పట్టణం న్యూ మారుతి లే అవుట్లో హరీష్(19), నిశ్చిత అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. హరష్ తన తల్లిని అమ్మమ్మ ఇంటికి పంపించాడు. అనంతరం ఇద్దరు పిల్లలు, భార్య నోటికి ప్లాస్టర్ అంటించి అనంతరం గొంతు నులిమి చంపేశాడు. తరువాత భర్త ఉరేసుకొని చనిపోయాడు. ఇంట్లో ఉలుకుపలుకు లేకపోవడంతో ఇంటి పక్కన వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.










నవతెలంగాణ – హైదరాబాద్ : సోనమ్ వాంగ్చుక్ ఆరోగ్యం క్షీణించడంతో, ఆయనను ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆసుపత్రి నుంచి గురుగ్రామ్లోని మేదాంత ఆసుపత్రికి తరలించారు. గత 24 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ఆయన ఆరోగ్య పరిస్థితిని సమీక్షించిన ఢిల్లీ హైకోర్టు, ఆయన కోరుకున్న ఆసుపత్రికి తరలించాలని మంగళవారం సాయంత్రం ఆదేశాలు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. వాంగ్చుక్కు నిరంతర వైద్య పర్యవేక్షణ అవసరమని ఎయిమ్స్, […] The post సోనమ్ వాంగ్చుక్ కు తీవ్ర అస్వస్థత… appeared first on Navatelangana.


నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్తో పాటు తెలంగాణవ్యాప్తంగా ఉబెర్, ఓలా, రాపిడో, జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్, జెప్టో డ్రైవర్లు జులై 22న సమ్మెకు పిలుపునిచ్చారు. చార్జీల పెంపు, గిగ్ వర్కర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు, కనీస చార్జీల నోటిఫికేషన్ వంటి డిమాండ్లతో ఈ బంద్ చేపట్టనున్నారు. దీనివల్ల క్యాబ్లు, బైక్ టాక్సీలు, ఫుడ్ డెలివరీ సేవలకు తీవ్ర అంతరాయం కలగనుంది. The post రాపిడో, ఓలా, ఉబెర్ డ్రైవర్లు బంద్కు పిలుపు appeared first on Navatelangana.

నవతెలంగాణ – హైదరాబాద్ : జగిత్యాల జిల్లా కోరుట్లలో మంగళవారం తీవ్ర కలకలం చోటుచేసుకుంది. స్థానిక బస్టాండ్లో నిలిపి ఉంచిన ఆర్టీసీ బస్సును ఓ ఆగంతకుడు దొంగిలించి పోలీసులను పరుగులు పెట్టించాడు. సుమారు 18 కిలోమీటర్ల మేర సినిమాను తలపించేలా సాగిన ఛేజింగ్ అనంతరం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కోరుట్ల బస్టాండ్లోని 8వ నంబర్ ప్లాట్ఫామ్పై నిలిపి ఉంచిన ఆర్టీసీ బస్సును ఒక వ్యక్తి అకస్మాత్తుగా స్టార్ట్ చేసి నిజామాబాద్ వైపు వేగంగా […] The post ఆర్టీసీ బస్సు చోరీ.. appeared first on Navatelangana.

నవతెలంగాణ – హైదరాబాద్ : అమెరికాలో జరిగిన ఒక ఘోర ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద వార్త తెలియడంతో వారి బంధువర్గం, తెలుగు ఎన్నారై సమాజం తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం, అమెరికాలోని కాలిఫోర్నియాలో చోటుచేసుకున్న ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక అధికారులు, భారత రాయబార కార్యాలయం అధికారులు సమన్వయం చేసుకుంటూ సహాయక […] The post అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ వాసులు మృతి appeared first on Navatelangana.



న్యూఢిల్లీ: నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై ని రసన తెలిపిన విద్యార్థులపై పోలీసులు వ్యవహరించిన తీరును ఖండిస్తూ, ప్రధాని నరేంద్ర మోదీ రా జీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మంగళవారం ప్రధాని నివాసం ఎదుట ధర్నా కు దిగారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ నేతృత్వంలో ఆ పార్టీ ఎంపీలు, నేతల నిరసనకు దిగా రు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, పార్లమెంట్లో చ ర్చించాలనే డిమాండ్లతో కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. ఇది సుమారు మూడు గంటలపాటు కొనసాగింది. చేతులు, కాళ్లను తాళ్లతో కట్టేసుకుని నిరసనలో పాల్గొన్నారు. అనంతరం రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంకా గాంధీ సహా ముఖ్య నేతలను దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుం డి తరలించారు. ఈ క్రమంలో రాహుల్గాంధీ స్వ ల్పంగా గాయపడినట్లు సమాచారం. పోలీసులు ఆయనను తరలించే క్రమంలో ముక్కు నుంచి ర క్తం వచ్చినట్లు తెలుస్తోంది. లోక్ కళ్యాణ్ మార్గ్లో సుమారు 20 నిమిషాల పాటు కొనసాగిన ఈ ధ ర్నా సందర్భంగా ప్రధానమంత్రి కార్యాలయ స హాయ మంత్రి జితేంద్ర సింగ్, హోంశాఖ కార్యదర్శి అక్కడికి చేరు

టెహ్రాన్ జులై 13న సౌదీ అరేబియాపై, మళ్ళీ జులై 17న ప్రిన్స్సుల్తాన్ ఎయిర్ బేస్పై క్షిపణులను ప్రయోగించగా, తూర్పు సిరియాలోని ఒక అమెరికా కమాండ్ పోస్ట్పై తమ మొదటి దాడి చేసిన ట్లు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కారప్స్ (ఐఆర్జిసి) ప్రకటించింది. యెమెన్లో, తమ నియంత్రణలో ఉన్న విమానాశ్రయం పై రియాద్ బాంబు దాడి చేసిందని ఆరోపి స్తూ హౌతీలు సౌదీ అరేబియాపై తమ ప్రతి క్షిపణి దాడిని ప్రారంభించారు. దీంతో నాలుగేళ్ల కాల్పుల విరమణ ముగిసింది. విస్తరిస్తున్న సౌదీ కూటమి పాకిస్తాన్ను ఈ వివాదంలోకి లాగింది. హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న మూడు ట్యాంకర్లపై టెహ్రాన్ దాడి చేసిన తరువాత, జులై 8న ఇరాన్పై వైమానిక దాడులు తిరిగి ప్రారంభమయ్యాయి. అమెరికా 80కి పైగా ఇరాన్ లక్ష్యాలపై దాడి చేసి, నౌకాదళ దిగ్బంధనాన్ని తిరిగి విధించింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్తో కుదిరిన 60 రోజుల కాల్పుల విరమణ, జూన్ 17 అవగాహన ఒప్పందం ‘ముగిసిపోయినట్లు’ ప్రకటించారు. జులై 21 నాటికి, అమెరికా కనీసం పది విడతల దాడులు నిర్వహించింది. వాటిలో ఇటీవలి దాడులలో, సైనిక స్థావరాలను దాటి ఇరాన్లోని వంతెనలు, ఒక విమానాశ్రయం, విద్యుత్ మౌలిక సదుపాయాలపై