23815 వార్తలు

టెహ్రాన్ జులై 13న సౌదీ అరేబియాపై, మళ్ళీ జులై 17న ప్రిన్స్సుల్తాన్ ఎయిర్ బేస్పై క్షిపణులను ప్రయోగించగా, తూర్పు సిరియాలోని ఒక అమెరికా కమాండ్ పోస్ట్పై తమ మొదటి దాడి చేసిన ట్లు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కారప్స్ (ఐఆర్జిసి) ప్రకటించింది. యెమెన్లో, తమ నియంత్రణలో ఉన్న విమానాశ్రయం పై రియాద్ బాంబు దాడి చేసిందని ఆరోపి స్తూ హౌతీలు సౌదీ అరేబియాపై తమ ప్రతి క్షిపణి దాడిని ప్రారంభించారు. దీంతో నాలుగేళ్ల కాల్పుల విరమణ ముగిసింది. విస్తరిస్తున్న సౌదీ కూటమి పాకిస్తాన్ను ఈ వివాదంలోకి లాగింది. హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న మూడు ట్యాంకర్లపై టెహ్రాన్ దాడి చేసిన తరువాత, జులై 8న ఇరాన్పై వైమానిక దాడులు తిరిగి ప్రారంభమయ్యాయి. అమెరికా 80కి పైగా ఇరాన్ లక్ష్యాలపై దాడి చేసి, నౌకాదళ దిగ్బంధనాన్ని తిరిగి విధించింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్తో కుదిరిన 60 రోజుల కాల్పుల విరమణ, జూన్ 17 అవగాహన ఒప్పందం ‘ముగిసిపోయినట్లు’ ప్రకటించారు. జులై 21 నాటికి, అమెరికా కనీసం పది విడతల దాడులు నిర్వహించింది. వాటిలో ఇటీవలి దాడులలో, సైనిక స్థావరాలను దాటి ఇరాన్లోని వంతెనలు, ఒక విమానాశ్రయం, విద్యుత్ మౌలిక సదుపాయాలపై

న్యూఢిల్లీ: నీట్ అవకతవకల వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారి స్పందించారు. పేపర్ లీక్ ఘోర పా పమని అన్నారు. ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, తద్వారా యువత భవిష్యత్తుతో ఎవరు చెలగాటమాడకుండా చూస్తామని తెలిపారు. ఇలాంటి లీక్లను నివారించడం జాతీయ బాధ్యత అని పేర్కొన్నారు. ఇది పార్టీ రాజకీయాలకు సంబంధించిన అంశం కాదన్నారు. జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన అంశమైనందున అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంతో కలిసి పనిచేయాలని కోరారు. మంగళ్ మిలన్ పేరిట మంగళవారంనాడిక్కడ జరిగిన ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ మేరకు ప్రధాని మోదీ మాట్లాడారు. ఆ వివరాలను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మీడియా సమావేశంలో తెలిపారు. నీట్ పేపర్ లీక్ అంశం వెలుగులోకి వచ్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించి చర్యలు చేపట్టిందని తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే 13 మందిని జైలుకు పంపామని చెప్పారు. ఇదే సమయంలో విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నీట్ పునఃపరీక్ష నిర్వహణకు ప్రాధాన్యం ఇచ్చామని, ఫలితాలను కూడా ఆలస్యం లేకుండా ప్రకటించనున్నామని పేర్కొన్నారు. భవిష్యత్తులో పేపర్ లీక్లు జరక్కుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవా

మన తెలంగాణ/హైదరాబాద్: దేవాదుల ఎత్తిపోతల పథకం కింద మంగళవారం రాత్రి నుం చే 9 పంపింగ్ యూనిట్లు 24 గంటల పాటు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తాయని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కు మార్రెడ్డి తెలిపారు. సచివాలయంలో మంగళవారం తనను కలిసిన మీడియాతో ప్రతినిధుల తో ఆయన చిట్-చాట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవల దేవాదుల ప్రాజెక్టుపై మంత్రుల బృందం నిర్వహించిన సమీక్షలో ఇచ్చిన హామీలను ప్ర భుత్వం అమలు చేస్తోందన్నారు. గోదావరి నుంచి వీలైనంత ఎక్కువ నీటిని ఎత్తిపోసి, దేవాదుల పరిధిలోని 9 జిల్లాలకు చెందిన 22 రిజర్వాయర్లను నింపడమే ప్రభుత్వ లక్ష్యమని ఆ యన తెలిపారు. వర్షాభావ పరిస్థితులను దృ ష్టిలో పెట్టుకొని అధికారులు పంపులను గరిష్ట సామర్థ్యంతో నడపాలని ఇప్పటికే ఆదేశాలు ఇ చ్చామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలకు తా గునీరు, రైతులకు సాగునీటి భద్రత కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రాజకీయ విమర్శలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వదని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. దేవాదుల ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారాన్ని మానేయాలి దేవాదుల ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం చేయడం మానేసి,

సినిమా కవిత్వాన్నీ, సంప్రదాయ కవిత్వాన్నీ తెలుగు సాహితీ మాగాణంలో జోడెడ్లుగా సమంగా కదం తొక్కించి సాహితీ సేద్యం చేసిన గొప్ప కలం కారుడు.. మహాకవి దాశరథి కృష్ణమాచార్య. సుమారు 80ఏళ్ళ నాడే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి.. ‘నా తెలంగాణ కోటిరతణాల వీణ’ అని ఎలుగెత్తి అక్షర రణనినాదం చేసి వినువీధుల్లో తెలంగాణ సమర పతాకాన్ని పాతి.. తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిమంతుడై బాటలు వేశారు. ఇదే క్రమంలో తెలుగు భారతికి ముద్దుల పుత్రుడిగా... సకలాంధ్ర కవిగా, ప్రపంచాన ప్రథమ శ్రేణినలంకరించిన మహాకవిగా ప్రసిద్ధి కెక్కారు. 1925 జులై 22న మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరులో సంప్రదాయ వైష్ణవ కుటుంబంలో వెంకటమ్మ, వెంకటాచార్య దంపతులకు జ్యేష్ఠ పుత్రుడిగా దాశరథీ కృష్ణమాచార్య జన్మించారు. తండ్రి వెంకటాచార్య గొప్ప కవి, పండితుడు. తల్లి వెంకటమ్మ గొప్ప హరికథ భాగవతారిని. దాశరథి ఉర్దూలో మెట్రిక్యులేషన్ (పదవ తరగతి), భోపాల్ విశ్వవిద్యాలయంలో ఇంటర్మీడియట్, ఉస్మానియా విశ్వద్యాలయంలో బిఎ (ఇంగ్లీషు) చదివాడు. తెలుగు, ఉర్దూల్లో మంచి పండితుడైనా సంస్కృతం, ఆంగ్లంలో కూడా మంచి పట్టును సాధించారు. తండ్రి స్ఫూర్తితో చిన్ననాటనే వ్యాకరణ సహిత చందోబద్ధ పద్య

ప్రజలు లేవనెత్తిన సమస్యలపట్ల ప్రభుత్వాలు వెంటనే స్పందించవు. ప్రభుత్వాల తప్పిదాలను ఎత్తిచూపిన సందర్భాల్లో అణచివేతనే ఆయుధంగా వాడుకుంటాయి. సావధానంగా ఆలోచించవలసిన విషయాలను ప్రతిష్ఠగా తీసుకుని రకరకాల ఆరోపణలతో వాటిపై జాతి వ్యతిరేక రంగుపులిమి దారి మళ్లించే ప్రయత్నం చేస్తాయి. ఓట్లేసి గెలిపించాక తమ పాలనపై ప్రశ్నించే హక్కు ప్రజలకు లేదనే భావన మన ప్రభుత్వాల్లో నాటుకుపోయింది. ప్రజా సంఘాలకు, జనసమూహాలకు మంత్రులు అపాయింట్మెంట్ కూడా ఇవ్వరు. ఉద్యమాలు లేవనెత్తిన తర్వాతే మంత్రి గారి దర్శనభాగ్యం లభిస్తే అది ప్రజాస్వామ్యం అనిపించుకోదు. వేల మంది దూరప్రాంతాల నుంచి నిరసన స్థలానికి చేరుకోవడం అంటే తమ సమయాన్ని, డబ్బును త్యాగం చేయడమే అవుతుంది. తీరా చేరాక ప్రభుత్వ ఆంక్షలు, పోలీసుల దెబ్బలు ఎదుర్కోవలసిందే. 3, మే రోజున జరిగిన జాతీయ వైద్య విద్య ప్రవేశ పరీక్ష (నీట్) పత్రం లీక్ అయిందని రుజువైంది. 22 లక్షల మంది ఎన్నో ఆశలతో రాసిన ఆ పరీక్ష 12, మే నాడు రద్దయింది. తట్టుకోలేని వేదనతో ముగ్గురు పిల్లలు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. 21, జూన్ నాడు నీట్ పరీక్షను మళ్ళీ నిర్వహించారు. ఫేక్ సర్టిఫికెట్లతో లాయర్లు వస్తున్నారంటూ

మన తెలంగాణ/ వికారాబాద్ బ్యూరో/దౌల్తాబాద్/హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్ పరిధిలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులను మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కొడంగల్ పరిధిలో ఎడ్యుకేషన్ హ బ్ ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో సుమారు రూ.800కోట్లకు పైగా విలువ చేసే కళాశాలల భవనాలు, బాలురు, బాలికలకు వేర్వేరుగా వసతిగృహాలు చేపడుతున్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజవకర్గం పరిధిలోని దుద్యాల మండలం హకీంపేటలో దాదాపు 250 ఎకరాల విస్తీర్ణంలో చేపడుతున్న మహిళా డిగ్రీ కళాశాల, పారా మెడికల్, నర్సింగ్ కళాశాలలు, వాటికి అనుబంధ హాస్టళ్లు, మెడికల్ కళాశాల, బాలుర, బాలిక ల వసతిగృహాలు, వెటర్నరీ, ఇంజినీరింగ్ కళాశాలలు, ఈ కళాశాలకు బాలుర, బాలికల అనుబం ధ హాస్టళ్లు, అకడమిక్ బ్లాక్, యంగ్ ఇండియా ఇం టిగ్రేటెడ్ రెసిడెన్షియల్ హాస్టళ్లు, మెడికల్ కళాశాల, బాలుర, బాలికల వసతిగృహాలు, వెటర్నరీ, ఇంజినీరింగ్ కళాశాలలు, ఈ కళాశాలకు బాలుర, బాలికల అనుబంధ హాస్టళ్లు, అకడమిక్ బ్లాక్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణాలను ఒక్కొక్కటిగా పరిశీలించి వాటి సమగ్ర వివరాలను సీఎం రేవంత్రెడ్డి అధికారులను అడిగ

మన తెలంగాణ/లక్షెట్టిపేట: కాంగ్రెస్కు ఓటేసిన పాపానికి ప్రజలు నరకం చూస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఆవేదన వ్య క్తం చేశారు. మంగళవారం మండలంలోని అంకతిపల్లిలోని ఓ ఫంక్షన్హాల్లో మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు అధ్యక్షతన ఏర్పాటుచేసిన రైతు సదస్సులో ముఖ్య అతిథిగా హా జరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువే కానీ, కాలం తెచ్చిన కరువు కాదన్నారు. రాష్ట్రానికి ఎల్నినో ప్రభావం చేసిన నష్టం కంటే కాంగ్రెస్ చేసిన నష్టమే ఎక్కువన్నారు. కన్నెపల్లిలో ఉన్న వాటర్ను రోజుకు మూడు టీఎంసీల చొప్పున అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి బ్యారేజ్లకు బ్యాక్వాటర్ ఎందుకు పంపడలేదని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు? ఒక్క ఎల్నినో కాదు, ఇంకొక ఎల్నినో వచ్చినా మన రాష్ట్రానికి కరువు రాకుండా బ్యారేజీలు కట్టి బాహుబలి మోటార్లు పెట్టించిన ఘనత మన కేసీఆర్దేనన్నారు. ఎన్నికలకు ముందు రైతుబంధు కేసీఆర్ కంటే ఎక్కువ ఇస్తా అని ప్రజలను మభ్యపెట్టి నాలుగు సార్లు ఎగొట్టిన ఘనుడు రేవంత్రెడ్డి అని ఎద్దేవా చేశారు.అంతేకాకుండా నిరుద్యోగ భృతి, రెండు లక్షల ఉద్యోగాలు, రైతుల

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో చోటుచేసుకుంటున్న ’ఎల్ నినో’ ప్రభావం రాష్ట్ర ప్రజలపై, ముఖ్యంగా వ్యవసాయం, తాగునీరు, విద్యుత్ రంగాలపై చూపకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం దూరదృష్టితో పక్కా ప్రణాళికలు రూపొందిస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. హై దరాబాద్లోని రవీంద్రభారతిలో ప్లానింగ్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ‘పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతల పెరుగుదల నుంచి రాష్ట్ర సం సిద్ధత వరకు’ అనే అంశంపై జరిగిన రాష్ట్ర స్థాయి అవగాహన సదస్సులో రాష్ట్ర మంత్రి మహమ్మద్ అజహరుద్దీన్తో కలిసి భట్టి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఎల్ నినో వల్ల పెరిగిన విద్యుత్ డిమాండ్ను తట్టుకునేందుకు ప్రభుత్వం అత్యంత సమర్థవంతమైన ‘స్మార్ట్ ఎనర్జీ మేనేజ్మెంట్’ అమలు చేస్తోందని డిప్యూటీ సిఎం వివరించారు. పగటి పూట విరివిగా, తక్కువ ధరకు లభించే సౌర వి ద్యుత్ను గరిష్టంగా వినియోగించుకోవడం ద్వారా ప్రజలపై, ప్రభుత్వంపై పడే ఆర్థిక భారం తగ్గుతుందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న సీజన్లకు అనుగుణంగా విద్యుత్ వినియోగంలో మార్పులు వస్తున్నాయని, పెరిగిన అవసరాలకు తగ్గట్టుగా ఎనర్జీ ప్లానింగ్ రూపొందించుకోవడంలో రాష్ట్

మన తెలంగాణ/హైదరాబాద్: అమెరికాలోని కా లిఫోర్నియాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు హైదరాబాదీ లు దుర్మరణం చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. చనిపోయిన వాళ్లు ముగ్గురూ హైదరాబాద్lలోని యాకుత్పురా ఐఎస్ సదన్ డివిజన్ లోని వాణినగర్కు చెందిన వారని పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో కుటుంబంలోని ఐ దుగురు సభ్యులు కారులో ప్రయాణి స్తున్నారు. చ నిపోయిన వారిని సల్మా (45), కుమార్తె హఫీజా షేక్(19) కుమారుడు హఫీజ్ ఒమర్(14)లుగా పోలీసులు గుర్తించారు. 47 ఏళ్ల షేక్ అబ్దుల్ నవీద్ తో పాటు ఐదేళ్ల చిన్నారి ఖదీజా తీవ్ర గాయాల తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. అమెరికాలోని సెయింట్ ఫ్రాన్సిస్ ప్రాం తంలో ఈ ఘోరం సంభవించింది. నజియా భర్త షేక్ అబ్దుల్ నవీద్ హైదరాబాద్లోని డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్లో దాదాపు పదేళ్ల పాటు శాస్త్రవేత్తగా పనిచేశారు. ఈ కుటుంబంఅమెరికాలో స్థిరపడినట్లు తెలిసింది. చనిపోయిన ముగ్గురి అంత్యక్రియలు జూలై 24న అమెరికాలోనే జరగనున్నాయని బంధువులు వెల్లడించారు. కాగా, ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై పూర్తి వివరాలు తెల

పోరాట స్ఫూర్తితో ఆందోళన ప్రదేశం తిరిగి స్వాధీనంకేంద్ర మంత్రి రాజీనామాపై సీజేపీ స్పష్టం నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరోకేంద్రమంత్రి రాజీనామా చేసేవరకు పోరాటానికి వెనుకడుగు వేసేదేలేదని సీజేపీ స్పష్టం చేసింది. మోడీ ప్రభుత్వ అణచివేత చర్యలను పోరాట స్ఫూర్తితో అధిగమించి, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపిన ప్రదేశాన్ని నేతలు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. పార్లమెంట్ మార్చ్ అనంతరం పోలీసులు, కేంద్ర బలగాలు కూల్చివేసి, సీల్ చేసిన ఎస్ఎఫ్ఐ క్రాంతి కార్నర్తో సహా నిరసన టెంట్లను […] The post వెనక్కి తగ్గం appeared first on Navatelangana.

దేవాదుల పది మోటార్లను నడపాలిప్రభుత్వం వినకుంటే ప్రజాపోరుకుసిద్ధమవుతాం : మాజీమంత్రి హరీశ్రావు హెచ్చరిక నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్ప్రాజెక్టుల్లో నీరున్నప్పటికీ రైతులకు ఎందుకివ్వడం లేదని బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత, మాజీమంత్రి టి హరీశ్రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మంగళవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేవాదులకు మంత్రులు వెళ్లి మొత్తం 22 రిజర్వాయర్లు నింపుతామనీ, 38 టీఎంసీల నీళ్లు ఎత్తుతామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆ మాటలు నమ్మి రైతులు […] The post నీళ్లున్నా రైతులకు ఎందుకివ్వడం లేదు? appeared first on Navatelangana.

అసెంబ్లీ, మండలి సమావేశాలకు సమాయత్తం కావాలి :అధికారులకు సీఎస్ సంజయ్జాజు ఆదేశంనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన కేంద్ర నిధుల సమీకరణకు తగు కార్యాచరణను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్లోని సచివాలయంలో ఇదే అంశంపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వనరుల సమీకరణపై దృష్టి సారించాలని కోరారు. యుటిలైజేషన్ సర్టిఫికెట్లు, నివేదికలు, ప్రతిపాదనలను సకాలంలో కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాలని సూచించారు. […] The post కేంద్ర నిధుల సమీకరణకు కార్యాచరణ appeared first on Navatelangana.

ఉద్యోగాల గురించి కేటీఆర్ మాట్లాడటం విడ్డూరంమేడిగడ్డను కుంగకొట్టి కరువంటున్న హరీశ్రావుపదేండ్ల అరాచకం, రెండున్నరేండ్ల ప్రజాపాలనపై చర్చకు సిద్ధంవిద్యార్థులపై లాఠీచార్జి మోడీ నియంతపాలనకు నిదర్శనం : టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్కుమార్గౌడ్ నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి‘నీళ్లు, నిధులు, నియామకాల పేరిట అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్.. పదేండ్ల పాటు అరాచక పాలన సాగించారు. కాళేశ్వరం పేరిట ప్రజలకు ఎన్నో కలలు చూపించి లక్ష కోట్ల నిధులు గోదావరి పాలు చేశారు. తాపీ, ఇంజినీర్, మేస్త్రీ.. నేనే అని కేసీఆర్ […] The post కలలు చూపించి కొల్లగొట్టారు appeared first on Navatelangana.

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్మాజీ మంత్రి హరీశ్రావు రైతులను తప్పుదోవ పట్టించే రాజకీయాలు మానుకోవాలని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి హితవు పలికారు. మంగళవారం హైదరాబాద్లోని సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దేవాదుల ప్రాజెక్టుపై దుష్ర్పచారం మాని, కాళేశ్వరం ప్రాజెక్టుపై గతంలో తీసుకున్న నిర్ణయాలపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో మొదట రూపొందించిన షీట్ పైల్ ఫౌండేషన్ డిజైన్ను మార్చి సెకెంట్ పైల్ ఫౌండేషన్ను ఎందుకు చేర్చారో చెప్పాలంటూ నిలదీశారు. కాళేశ్వరం కాంట్రాక్టర్లు […] The post రైతులను తప్పుదోవ పట్టించొద్దు appeared first on Navatelangana.

చలో ఢిల్లీ యాత్రనుఅడ్డుకున్న పోలీసులుప్రభుత్వ హామీతో యాత్ర విరమణ న్యూఢిల్లీ : అటు కాక్రోచ్ పార్టీ ధర్నా గురించి కేంద్రం తంటాలు పడుతుంటే..మరో వైపు అన్నదాతలు చలో ఢిల్లీ అంటూ కదిలారు. మోడీ ప్రభుత్వం ప్రతిపాదిత భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా జరగనున్న కిసాన్ మహాపంచాయత్లో పాల్గొనేందుకు మంగళవారం ఢిల్లీ వైపు పాదయాత్ర ప్రారంభించారు. పంజాబ్కు చెందిన వందలాది మంది రైతులను, హర్యానా ప్రవేశ ద్వారమైన శంభు సరిహద్దు వద్ద హర్యానా పోలీసులు అడ్డుకున్నారు. 2024 ఫిబ్రవరిలో […] The post యూఎస్ తో డీల్ వద్దు appeared first on Navatelangana.

మేషంఆర్థిక వ్యవహారాలలో ఒక ఖచ్చితమైన ప్రణాళికకు వస్తారు. అయితే మీ మాట తీరు కాస్త పదునుగా ఉండే అవకాశం ఉంది, కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు ఓపిక అవసరం. పాత పెట్టుబడుల నుండి అనుకూల ఫలితాలు అందుతాయి. వృషభం మీలో ఉత్సాహం, ఏదైనా సాధించాలనే పట్టుదల పెరుగుతాయి. ప్రభుత్వ లేదా ఉన్నతాధికారుల నుండి ఆశించిన మద్దతు లభిస్తుంది. నిర్ణయాలు వేగంగా తీసుకుంటారు, కానీ తొందరపాటు శారీరక అలసటకు దారితీయకుండా చూసుకోండి. మిధునం ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా విలాసాలు లేదా ప్రయాణాల కొరకు ధనవ్యయం కావచ్చు. పనులలో కొంత ఆలస్యం జరిగినా, పట్టుదలతో పూర్తి చేస్తారు. నిద్రలేమి లేదా మానసిక ఒత్తిడికి లోను కాకుండా ధ్యానానికి సమయం కేటాయించండి. కర్కాటకం మీకు అన్ని విధాలా అనుకూల ఫలితాలు ఉంటాయి. అన్నదమ్ములు లేదా పాత మిత్రుల సహాయంతో నిలిచిపోయిన పనులు సాఫీగా సాగుతాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడానికి లేదా కొత్త ఆదాయ మార్గాలను అన్వేషించడానికి ఇది అత్యంత అనుకూలమైన రోజు. సింహం వృత్తి, వ్యాపార రంగాలలో సానుకూల మార్పులు వస్తాయి. మీ పని తీరుకు కార్యాలయంలో ప్రత్యేక గుర్తింపు, గౌరవం లభిస్తాయి. కొత్త బా

వైభవ్ సూర్యవంశీ, రింకు సింగ్పై ఫోకస్శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీకి అగ్ని పరీక్షరేపటి నుంచి భారత్, జింబాబ్వే టీ20 సిరీస్ ఐర్లాండ్, ఇంగ్లాండ్ చేతిలో వరుస సిరీస్ ఓటములు చవిచూసిన శ్రేయస్ అయ్యర్కు జింబాబ్వే పర్యటన ఓ మంచి అవకాశం. కెప్టెన్గా తొలి విజయం కోసం ఎదురుచూస్తున్న శ్రేయస్ అయ్యర్కు జింబాబ్వేలో తొలి ప్రాధాన్య జట్టు అందుబాటులో ఉంది. ఇక్కడైనా భారత్ గెలుపు బాట పట్టకుంటే కెప్టెన్కు కష్టాలు తప్పవేమో!. భారత్, జింబాబ్వే 3 మ్యాచ్ల టీ20 సిరీస్ […] The post ఇక్కడేం చేస్తారో? appeared first on Navatelangana.

వర్తమాన కాలంలో ఇంధనమే అన్నిటికీ మూలం. పశ్చిమాసియాలో చెలరేగుతున్న యుద్ధజ్వాలల కారణంగా ప్రత్యామ్నాయ ఇంధన వనరుల ఉత్పత్తి ఎంత ముఖ్యమో ప్రపంచ దేశాలకు తెలిసివచ్చింది. ఈ విషయంలో భారత్ కొన్నేళ్ల క్రితమే కళ్లు తెరిచింది. ప్రత్యామ్నాయ ఇంధన వనరుల అన్వేషణకూ, ఉత్పత్తికీ నడుం బిగించింది. ఆ దిశగా సాధించిన మరో విజయమే హైడ్రోజన్ రైలుకు రూపకల్పన. హర్యానాలోని జింద్ సోనిపట్ రైల్వేస్టేషన్ల మధ్య నాలుగు రోజుల క్రితం పరుగు ప్రారంభించిన హైడ్రోజన్ రైలు ప్రజారవాణాలో ప్రత్యామ్నాయ ఇంధన వినియోగంపై ఆశలు మోసులెత్తిస్తోంది. డీజిల్ తో పనిలేని, విద్యుత్ అవసరం అసలే లేని ఈ కాలుష్యరహిత, పర్యావరణహిత రైలు భారత్ లాంటి జనాభాతో కిటకిటలాడే దేశాలకు ఎంతో అవసరం. హైడ్రోజన్ రైలును పట్టాలకు ఎక్కించడంతో ఇప్పటికే ఇలాంటి రైళ్లు వినియోగంలో ఉన్న జర్మనీ, అమెరికా, జపాన్, దక్షిణకొరియా, చైనా దేశాల సరసన భారత్ చేరింది. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో నడిచే ఈ రైలు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకోవడం ఒక విశేషం కాగా, ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న హైడ్రోజన్ రైళ్లన్నింటిలోకీ శక్తిమంతమైనదీ, సుదూరం ప్రయాణించగలిగేదీ కావడం గమనార్హం. మరొక విశేషమ

“వీరు సోషల్ డెమోక్రాట్లు (సామాజిక ప్రజాస్వామిక వాదులు) కాదు, కరుడు గట్టిన దేవుడులేని కమ్యూ నిస్టులు, వారు అన్ని మతాల మీద దాడులు చేస్తారు, ప్రత్యేకించి క్రైస్తవం మీద, వారెప్పుడూ అదే చేస్తారు,అదొక పిచ్చి వంటిది, ఈ దేశంలో మీ చర్చీలన్నింటినీ మూసివేస్తారు. మీ వారిని చంపివేస్తారు, ఏదనుకుంటే అది చేస్తారు. వారు మతాన్ని అంతం చేయాలనుకుంటున్నారు. మీకు బలమైన మతం ఉంటే వారి సిద్ధాంతం పనిచేయదు గనుక వారు మతాన్ని అంతం చేయాలనుకుంటారు. 250 ఏండ్ల […] The post అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యమా! ట్రంప్ ఆరోపణల వెనుక అసలు కథేమిటి? appeared first on Navatelangana.

హైదరాబాద్లోని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (CAT)లో తీవ్ర అస్తవ్యస్త పరిస్థితులు నెలకొన్నాయి. తీర్పులు వెలువడి నెలలు గడుస్తున్నా, ఆర్డర్ కాపీల విడుదలలో జరుగుతున్న విపరీతమైన జాప్యంపై పిటిషనర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కోర్టు హాల్లో కొందరు జడ్జీలు, అడ్మినిస్ట్రేటివ్ సభ్యులు తమ పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తున్నారంటూ న్యాయవాదులు సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి పరిస్థితులు ఎంతలా దిగజారాయంటే.. కోర్టు హాల్లో ప్రస్తుత న్యాయవాదులు, అడ్మినిస్ట్రేటివ్ సభ్యుల ప్రవర్తనకు నిరసనగా ‘క్యాట్’ న్యాయమూర్తులు […] The post తీర్పులు సరే… మరి ఆర్డర్లేవీ? appeared first on Navatelangana.

దేశంలో విద్యావ్యవస్థ అక్రమాలకూ, నీట్ 2026 పేపర్ లీక్కూ నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖా మంత్రి ధరేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టిఎ)ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ – ఢిల్లీలోని జంతర్ మంతర్లో కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) ఇటీవల భారీ ధర్నా చేపట్టింది. దానికి మద్దతు తెలుపుతూ ప్రముఖ విద్యావేత్త, పర్యావరణవేత్త సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. శుక్రవారం 17 జులై […] The post వాంగ్ చుక్ వంటి మేధావుల్ని కాపాడుకోవాలి! appeared first on Navatelangana.

ప్రధాని మోడీ ఇంటి ముందు నిరసనఒక్కసారిగా చుట్టుముట్టిన పోలీసులురాహుల్, ప్రియాంక బలవంతంగా తరలింపున్యూఢిల్లీ: ప్రధాని నివాసం ముందు మూడు గంటలకుపైగా రాహుల్ సాగుతున్న ఆందోళనను ఒక్కసారిగా పోలీసులు చుట్టుముట్టారు. కాసేపటికి రాహుల్, ప్రియాంక గాంధీ, ఉత్తరప్రదేశ్ మాజీ సిఎం, అఖిలేష్ యాదవ్, కర్నాటక, కేరళ ముఖ్యమంత్రులు సహా పలువురు ఎంపిలు, నేతలను పోలీసులు బలవంతంగా తరలించారు. పోలీసులు తరలిస్తున్న క్రమంగా రాహుల్ తీవ్రంగా ప్రతిఘటించారు. నేలపై పడుకున్న ఆయనను పైకి లేపేందుకు పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. ఈ క్రమంలో కొంత ఉద్రిక్తత నెలకొంది. తోపులాట క్రమంలో రాహుల్ కంటి కింద స్వల్పగాయం కావడంతో పాటు ముక్కు రక్తం బయటికి వచ్చిందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఆయన కాళ్లు, చేతులకు కూడా గాయాలయ్యాయని వెల్లడించారు. ‘భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రస్తుత పరిస్థితి ఇదీ’ అని రాహుల్ ఈ సందర్భంగా మండిపడ్డారు. ఇక ప్రియాంక గాంధీని వాళ్లను తరలించే బస్సు కదులుతుండగానే బలవంతంగా ఎక్కించారు. ఆమె మెట్ల వద్ద వేలాడుతూనే పయనించారు. అనంతరం రాహుల్ గాంధీని ఛత్రసాల్ స్టేడియం స్టేషన్కు, ప్రియాంకను మందిర్మార్గ్ పోలీస్ స్టేషన్కు, ఎంపిలను క

న్యూఢిల్లీ: నీట్ లీక్పై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన నిరసనను బహిరంగంగా సమర్ధించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఇదే అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసం వద్ద కాంగ్రెస్ పార్టీ మంగళవారంనాడు చేపట్టిన ధర్నాను విమర్శించింది. బీజేపీ ప్రభుత్వంతో జుగల్ బందీగా దీనిని అభివర్ణించింది. సీజేపీ ఆందోళనను రాహుల్ గాంధీ బలహీనపరుస్తున్నారని ఆరోపించింది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ నేత అతిషి బుధవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ, నెలరోజులుగా సీజేపీ, సోనమ్ వాంగ్చుక్ నిరసనలు తెలుపుతున్నా మాట్లాడేందుకు నిరాకరించిన ప్రధాని మోదీ రాహుల్ను మాత్రం తన నివాసం వద్ద ధర్మాకు ఎలా అనుమతించారని ప్రశ్నించారు. ఇది జరిగిన గంటలోనే మోదీ ప్రభుత్వం చర్చలకు సిద్ధపడటం తమకు ఆశ్చర్యకరంగా ఉందన్నారు. సీజేపీ నిరసనను బలహీనపరచేందుకే తన ఇంటి ముందు ధర్నాకు రాహుల్ను మోదీ అనుమతించారని ఆప్ మరో నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు. ఢిల్లీ ఆప్ అధ్యక్షుడు సౌరభ్ భరద్వాజ్ సైతం కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు. నీట్ లీక్పై జరుగుతున్న ఉద్యమంపై కాంగ్రెస్ నేతలు మౌనంగా ఉన్నారని, ఆ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్, ఇన్ఫ్లుయెన్సర్లు సీజేప