
3427 వార్తలు
ఎవరెస్ట్ లక్ష్యంగా అడుగులు… యువతకు స్ఫూర్తిగా సిమ్ లయన్ ఫిట్నెస్ వ్యవస్థాపకుడునవతెలంగాణ-నాచారం సిమ్ లయన్ ఫిట్నెస్ వ్యవస్థాపకుడు, ఐరన్మ్యాన్, ఎండ్యూరెన్స్ అథ్లెట్ మరియు మౌంటెనీర్ అయిన కలాలి జయసింహ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎత్తైన పర్వతాలను అధిరోహిస్తూ భారతదేశానికి గౌరవాన్ని తీసుకువస్తున్నారు. కఠినమైన పరిస్థితుల్లో సాహస యాత్రలు చేపడుతూ ఆయన క్రీడా రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. ఆఫ్రికాలోని కిలిమంజారో, యూరప్లోని ఎల్బ్రస్, అర్జెంటీనాలోని అకాంకాగువా వంటి ప్రపంచ ప్రఖ్యాత శిఖరాలను విజయవంతంగా అధిరోహించిన జయసింహ, నేపాల్ మరియు లడాఖ్ ప్రాంతాల్లో […] The post ప్రపంచ పర్వత శిఖరాలను అధిరోహిస్తూ భారత గౌరవాన్ని చాటుతున్న జయసింహ appeared first on Navatelangana.
నవతెలంగాణ – అశ్వారావుపేటఅశ్వారావుపేట పురపాలక సంఘ మూడో కమిషనర్గా తూడి దిలీప్ రెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. బదిలీ అయిన కమిషనర్ బి. నాగరాజు నూతన కమిషనర్కు పుష్పగుచ్ఛం అందించి బాధ్యతలు అప్పగించారు. నూతన కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన టి. దిలీప్ రెడ్డి వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపురం మండలం సల్కెలాపురం గ్రామానికి చెందినవారు. 2024–25 సంవత్సరానికి నిర్వహించిన గ్రూప్–1 పరీక్షల్లో ఎంపికై, అశ్వారావుపేట గ్రేడ్–II కమిషనర్గా నియమితులయ్యారు. ఇంతకుముందు 2019–20లో ఎస్ఐగా ఎంపికైన దిలీప్ రెడ్డి, […] The post అశ్వారావుపేట మున్సిపల్ కమిషనర్గా దిలీప్ రెడ్డి బాధ్యతల స్వీకరణ appeared first on Navatelangana.
కొనుగోలు కేంద్రంలో రైతుల పడిగాపులు!నవతెలంగాణ – పరకాల పరకాల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన పీఏసీఎస్ కొనుగోలు కేంద్రం వద్ద రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. అష్టకష్టాలు పడి పండించిన మక్కలను అమ్ముకుందామంటే అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. గత రెండు వారాలుగా ఈ కేంద్రంలో కాంటాలు నిలిచిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా హమాలీల కొరత వేధిస్తుండటంతో అటు తూకాలు జరగక, ఇటు లారీలు రాక మార్కెట్ యార్డులోనే ధాన్యం కుప్పలపై రైతులు పడిగాపులు కాస్తున్నారు. […] The post హమాలీల కొరతతో నిలిచిన ‘కాంటాలు’.. appeared first on Navatelangana.

హైదరాబాద్: నగరంలోని కూకట్పల్లిలో దారుణం చోటు చేసుకుంది. నవదంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరికి రెండు నెలల క్రితం వివాహం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. భర్త కార్తీక్ ఉరి వేసుకోగా, భార్య మంజుల విషం తాగి బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనస్థలి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
– ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డినవతెలంగాణ – ఊరుకొండతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తూ చక్కని విద్యను అందిస్తున్న తరుణంలో మండలంలో మొదటి ర్యాంకు సాధించిన నౌషిన్ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ రెడ్డి ఆకాంక్షించారు. శనివారం ఊరుకొండ మండల పరిధిలోని ఊరుకొండ పేట ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించి పదవ తరగతిలో చక్కని ప్రతిభ కనబరిచి ఊరుకొండ మండలంలో ప్రభుత్వ పాఠశాల విభాగంలో మొదటి […] The post భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరాలి.. appeared first on Navatelangana.
నవతెలంగాణ – జుక్కల్మండలంలోని లొంగన్ గ్రామంలో ఓ వ్యక్తి అనుమానస్పదంగా చేప వల చిక్కుకుపోయి మరణించినట్లు గ్రామస్తులు అనుమానిస్తున్నారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని లొంగన్ పెద్ద చెరువులో ముదిరాజ్ మారుతి (45) మద్యం కృపా మినిస్ట్రీ గ్రామంలో కూలి పని చేసుకుని జీవితం గడిపే వాడని తెలిపారు. శుక్రవారం నుండి గ్రామంలో కనిపించడం లేదని, గ్రామంలో ఎక్కడైనా ఉండొచ్చని అనుకున్నామని వెల్లడించారు. అయితే మృతుడి భార్య కూడా గ్రామంలో ఉండట్లేదని, తల్లిదండ్రులు వృద్ధులు కావడంతో వస్తాడులే […] The post లొంగన్ చెరువులో వ్యక్తి అనుమానాస్పద మృతి appeared first on Navatelangana.
నవతెలంగాణ – ఆలేరు రూరల్ఉపాధి కూలీల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జూకంటి పౌలు డిమాండ్ చేశారు. ఆలేరు మండలంలోని కంది గడ్డ తండాలో ఉపాధి హామీ పనుల్లో పనిచేస్తున్న కూలీల సమస్యలను సంఘం నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా జూకంటి పౌలు మాట్లాడుతూ, ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరచే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను తీవ్రంగా విమర్శించారు. కూలీలను పనుల నుండి దూరం చేయడానికి కొత్త విధానాలను అమలు […] The post ఉపాధి కూలీల సమస్యలు పరిష్కరించాలి: జూకంటి పౌలు appeared first on Navatelangana.




ముంబై: మహిళల టి-20 ప్రపంచకప్ ఈ ఏడాది జూలై 12 నుంచి ప్రారంభంకానుంది. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్కి ఇంగ్లాండ్ వేదిక కానుంది. అయితే ఈ మెగా టోర్నీలో బరిలోకి దిగే భారత జట్టును శనివారం సెలక్టర్లు ప్రకటించారు. అమితా శర్మ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ.. బిసిసిఐ కార్యదర్శి దేవ్జిత్ సైకియా, ప్రధాన కోచ్ అమోల్ మజుందార్, కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్లతో సమావేశం అయింది. అనంతరం మెగా టోర్నీలో పాల్గొనే 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించారు. టి-20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు: హర్మన్ప్రీత్ కౌర్(కెప్టెన్), స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, భారతి పుల్మాలి, దీప్తి శర్మ, రిచా ఘోష్, శ్రీ చరణి, యాస్తికా భాటియా, నందిని శర్మ, అరుంధతి రెడ్డి, రేణుకాసింగ్ ఠాకూర్, క్రాంతి గౌడ్, శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్.

కొత్త స్మార్ట్ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే, మునుపటి కంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే భారతదేశ టెక్ మార్కెట్లో అనేక ప్రధాన స్మార్ట్ఫోన్ కంపెనీలు తమ జనాదరణ పొందిన మోడళ్ల ధరలను పెంచాయి. వీటిలో వన్ప్లస్, రియల్మీ, రెడ్మీ, నథింగ్ వంటి ప్రముఖ బ్రాండ్లు ఉండటం విశేషం. ఈ ధరల పెరుగుదలకు ప్రపంచవ్యాప్త సరఫరా గొలుసులో అంతరాయాలు, మెమరీ చిప్ల కొరత కారణమని సమాచారం. స్మార్ట్ఫోన్ ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? ప్రపంచ మార్కెట్ ప్రస్తుతం డీఆర్ఏఎం (DRAM), నాండ్ (NAND) స్టోరేజ్ వంటి కీలకమైన భాగాల తీవ్ర కొరతను ఎదుర్కొంటోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం వేగంగా పెరుగుతున్నందున, ప్రధాన టెక్ కంపెనీలు డేటా సెంటర్ల కోసం పెద్ద మొత్తంలో ర్యామ్ (RAM), జీపీయూలను (GPUs) కొనుగోలు చేస్తున్నాయి. ఇది మెమరీ తయారీదారులను అధిక బ్యాండ్విడ్త్ మెమరీ ఉత్పత్తిపై ఎక్కువ దృష్టి పెట్టేలా చేసింది. ఫలితంగా, స్మార్ట్ఫోన్ కంపెనీలకు అవసరమైన భాగాలు మరింత ఖరీదైనవిగా మారాయి. తయారీ ఖర్చులు పెరిగినప్పుడు, అవి నేరుగా తుది ధరపై ప్రభావం చూపుతాయి. అందుకే స్మార్ట్ఫోన్ ధరలు నిరంతరం పెరుగుతున్నాయి. ఇప్పుడు ఏ కంపెనీ తయారీదార




నవతెలంగాణ-డిచ్ పల్లి డిచ్ పల్లి మండల కేంద్రంలోని ఘన్పూర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పదో తరగతిలో ఘనమైన ఉత్తీర్ణత సాధించారు. శనివారం పాఠశాలలో ఏర్పాటు చేసిన సన్మాన సభకు ముఖ్య అతిథిగా సర్పంచ్ కె రవికిరణ్ పాల్గొని మాట్లాడుతూ..విద్యార్థులు పదో తరగతి లో 521 మార్కులు సాధించిన కొత్త పేట ప్రవళిక, బి సునీత రాణి 507, అంతేకాకుండా ఘన్పూర్ పాఠశాలలో 521 మార్కులు సాధించడం ఇదే మొదటిసారన్నారు. మండలంలో ప్రభుత్వ పాఠశాలలో సెకండ్ ర్యాంక్ రావడం చాలా గొప్ప […] The post పదో తరగతిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు సన్మానం appeared first on Navatelangana.

ఎంపీపీఓ క్రాంతికుమార్నవతెలంగాణ – మల్హర్ రావుజాబ్ కార్డున్న ప్రతి కూలి ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండల ఎంపిడిఓ క్రాంతికుమార్ సూచించారు. శనివారం తాడిచెర్ల, మల్లారం సర్పంచ్లు బండి స్వామి, మేకల రాజయ్య,ఏపిఓ హరీష్ లతో కలిసి పని ప్రదేశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఫిష్ బ్రీడింగ్, వాటర్ హర్విస్టింగ్ పనులను పరిశీలించారు. కొలతల ప్రకారం పనిచేస్తే ఒక్కరోజుకు కూలీకి రూ.307 చొప్పున,100 రోజుల కు రూ.30,700 పొందవచ్చని తెలిపారు. మండుతున్న ఎండలతో రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు […] The post జాబ్ కార్డున్న ప్రతి ఒక్కరూ ఉపాధి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి appeared first on Navatelangana.

రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి నవతెలంగాణ-రాజన్న సిరిసిల్ల తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పూర్వ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ ఉపాధ్యాయ ఉద్యమ నిర్మాత దాచురి రామిరెడ్డి 10వ వర్ధంతి సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని పద్మనాయక కళ్యాణమండపం లో “రాజకీయ క్రీడలో విద్యారంగం- పెరుగుతున్న అసమానతలు” అనే అంశంపై రామిరెడ్డి స్మారక ఉపన్యాసం నిర్వహించడం జరిగింది. ప్రధాన వక్తగా పాల్గొన్న ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి మాట్లాడుతూ.. నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలోని […] The post విద్య వ్యాపారీకరణ.. కేంద్రీకరణను ఆపాలి appeared first on Navatelangana.
చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎస్సైపార్వతమ్మ గూడెం గ్రామ సర్పంచ్ ఏదేళ్ల పూలమ్మ నవతెలంగాణ-నెల్లికుదురు మండలంలోని పార్వతమ్మ గూడెం గ్రామానికి కావలసిన అన్ని మౌలిక వసతులను త్వరలో ఒక్కొక్కటిగా ఏర్పాటు చేస్తామని ఆ గ్రామ సర్పంచ్ ఎదెళ్ల పూలమ్మ అన్నారు. శనివారం స్థానిక ఎస్సై చిర్రా రమేష్ బాబు చదివేంద్రాన్ని గ్రామపంచాయతీ వార్డు సభ్యులను కలుపుకొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ వేసవికాలంలో ఎండలు విపరీతము కొట్టడంతో పాదాచారులకు వివిధ గ్రామాలకు వెళ్లి పనుల నిమిత్తం చూసుకొని తిరిగి ఇంటికి […] The post ప్రజలకు దాహార్తిని తీర్చడమే లక్ష్యం appeared first on Navatelangana.
నవతెలంగాణ-సిర్పూర్ (టి )గ్రామంలో నాటుసారా తయారీతో పాటు బెల్ట్ షాపుల ద్వారా మద్యం విక్రయాలు విస్తృతంగా కొనసాగుతున్నాయన్న ప్రజల ఫిర్యాదుపై పాలకమండలి స్పందించింది. గ్రామస్తుల వినతిని పరిగణలోకి తీసుకున్న సర్పంచ్ ఒడ్డెటి నాగమణి, పాలకమండలి సభ్యులు గత నెల 13న నిర్వహించిన గ్రామసభలో ఈ అంశంపై చర్చించారు. గ్రామంలో అక్రమ మద్యం విక్రయాలను పూర్తిగా అరికట్టాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ మేరకు శనివారం కాగజ్నగర్లోని ఎక్సైజ్ శాఖ కార్యాలయాన్ని సంప్రదించి సంబంధిత అధికారులకు వినతిపత్రం సమర్పించారు. […] The post నాటు సారాయి, మద్యం అమ్మకాలు నిలిపివేయాలి appeared first on Navatelangana.