19780 వార్తలు



అమరావతి: నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలో దారుణం జరిగింది. మామను, అల్లుడు కత్తితో చంపాడు. ఈ ఘటన ముత్తూరు మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గత కొంత కాలంగా అల్లుడు గున్నస్వామికి, తన భార్యకు తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఒక రోజు అర్థరాత్రి భార్యా, భర్తకు వివాదం జరగడంతో మధ్యలో మామ ఏడుకొండలు అడ్డుపడ్డాడు. అందుకు మామపై కత్తితో పొడిచి చంపాడు. కుటుంబసభ్యులు నెల్లూరు ఆస్పత్రికి తరలిస్తుండగా ఏడుకొండలు మృతి చెందాడు. భార్య మస్తానమ్మకు స్వల్పగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


కింగ్ అక్కినేని నాగార్జున తన కెరీర్ లో ఎంతో ముఖ్యమైన అడుగును చాలా జాగ్రత్తగా వేయబోతున్నాడు. ఆయన చాలా ప్రతిష్టాత్మకంగా చేస్తోన్న 100వ సినిమా ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. ఈ సినిమా నాగార్జున కెరీర్లో మైల్ స్టోన్ మూవీగా నిలవబోతోంది. అందుకోసం మేకర్స్ ఈ ప్రాజెక్ట్పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ సినిమాను తమిళ యంగ్ డైరెక్టర్ రా కార్తీక్ తెరకెక్కిస్తుండగా, అన్నపూర్ణ స్టూడియోస్తో కలిసి మనం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై నాగార్జున స్వయంగా నిర్మిస్తున్నారు. స్త్రుతం నాగార్జున.. తన 100వ మూనీని ఎంతో ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి ‘కింగ్100’ లేదా ‘లాటరీ కింగ్’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరో క్రేజీ అప్డేట్ను అన్నపూర్ణ స్టూడియోస్ ప్రకటించింది. భారతీయ సినిమా రంగంలో అత్యంత ప్రసిద్ధి చెందిన సంగీత దర్శకులలో ఒకరైన రాక్స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (డీఎస్పీ) ఈ ప్రాజెక్ట్కు సంగీత దర్శకుడిగా అధికారికంగా చేరారు. నాగార్జున దేవిశ్రీ ప్రసాద్లది సక్సెస్ఫుల్ కాంబినేషన్. నాగార్జున ‘మన్మథుడు’, ‘మాస్’, ‘కింగ్’, ‘కుబేర’ చిత్రాలకు డీఎస్పీ అందించిన సంగీతం చార్ట్బస్టర్గా






తైపీ: భారత యువ షట్లర్ తన్వి శర్మ ప్రతిష్ఠాత్మకమైన తైపీ ఓపెన్ బ్యాడ్మింటన్ టైటిల్ను సొంతం చేసుకుంది. 2008లో సైనా నెహ్వాల్ చివరి సారిగా తైపీ ఓపెన్ టైటిల్ను గెలుచుకుంది. ఇక 18 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత యువ సంచలనం తన్వి ఈ టైటిల్ను గెలిచి ఔరా అనిపించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో తన్వి 2116, 2116తో వియత్నాంకు చెందిన లిన్ ఎంగుయెన్పై విజయం సాధించింది. ఆరంభం నుంచే తన్వి దూకుడుగా ఆడింది. అద్భుత షాట్లతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడుతూ లక్షం దిశగా సాగింది. ఇదే క్రమంలో ఎలాంటి ఇబ్బంది లేకుండానే వరుసగా రెండు సెట్లను గెలిచి టైటిల్ను సొంతం చేసుకుంది. తన్వికి కెరీర్లో ఇదే తొలి బిడబ్లూఎఫ్ వరల్డ్ టూర్ 300 టైటిల్ కావడం విశేషం. కొన్నేళ్లుగా అంతర్జాతీయ బ్యాడ్మింటన్లో టైటిల్స్ కోసం ఎదురు చూస్తున్న భారత అభిమానులకు తన్వి విజయం పెద్ద ఊరట ఇచ్చిందనే చెప్పాలి. కొన్ని రోజుల క్రితం భారత స్టార్ షట్లర్ పివి సింధు కూడా ఓ టైటిల్ను సాధించిన సంగతి తెలిసిందే.






ప్రతి సంవత్సరం ఆగస్టు 3ను భారతదేశంలో జాతీయ హృదయ మార్పిడి దినోత్సవంగా పాటిస్తారు. ఈ రోజు ఉద్దేశ్యం అవయవదానం ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడం, ముఖ్యంగా గుండె దానం ద్వారా అనేక మంది ప్రాణాలను కాపాడవచ్చనే అవగాహన కల్పించడం.గుండె వైఫల్యం చివరి దశకు చేరుకున్న రోగులకు మందులు, యాంజియోప్లాస్టీ లేదా బైపాస్ శస్త్రచికిత్సలు కూడా ఫలితం ఇవ్వని పరిస్థితులు ఉంటాయి. అలాంటి సందర్భాల్లో హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ఒక్కటే ప్రాణాలను కాపాడే మార్గంగా మారుతుంది. ఆరోగ్యవంతమైన మెదడు మరణం చెందిన దాత గుండెను సరైన రోగికి మార్పిడి చేయడం ద్వారా అతనికి కొత్త జీవితం అందించవచ్చు. భారతదేశంలో గత రెండు దశాబ్దాలుగా హార్ట్ ట్రాన్స్ప్లాంట్ శస్త్రచికిత్సలు గణనీయంగా అభివృద్ధి చెందాయి. ఆధునిక వైద్య సాంకేతికత, నైపుణ్యం కలిగిన కార్డియాక్ సర్జన్లు, సమర్థవంతమైన అవయవ రవాణా వ్యవస్థ వల్ల ఈ చికిత్స విజయవంతంగా జరుగుతోంది. అయినప్పటికీ, మన దేశంలో అవయవదానం చేసే వారి సంఖ్య ఇంకా అవసరానికి చాలా తక్కువగా ఉంది. ఫలితంగా అనేక మంది రోగులు సరైన సమయంలో గుండె దొరకక ప్రాణాలు కోల్పోతున్నారు. అవయవదానంలో అత్యంత కీలకమైన అంశం బ్రెయిన్ డెత్ను గుర్తించడం, కుటుం

బెంగళూరు: చిప్స్ ప్యాకెట్ లోని చిన్న బంతి బాలుడి ప్రాణం తీసిన సంఘటన కర్నాటక రాష్ట్రం మైసూరు జిల్లా హుణసూరు ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... గౌరీపుర గ్రామంలో సంతోష్, ఐశ్వర్య అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు మయూర్(3) అనే బాలుడు ఉన్నాడు. ఇంటికొచ్చిన బంధువులలో ఒకరు మయూర్ కు చిప్స్ ప్యాకెట్ కొనిచ్చాడు. చిప్స్ తింటుండగా ప్యాకెట్ లో ఉన్న బంతి నోట్లో పెట్టుకున్నాడు. బంతి గొంతులో ఇరుక్కోవడంతో స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. చిప్స్ ప్యాకెట్ చిన్నారి ప్రాణం తీసిందని బంధువులు రోదిస్తున్నారు. గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.




