24157 వార్తలు



హైదరాబాద్: మహబూబాబాద్ జిల్లా భవానీనగర్ లో దారుణం జరిగింది. భర్తను భార్య, కుమారుడు కర్రతో కొట్టి చంపారు. భర్త చంద్రయ్య (50), భార్య విజయలక్ష్మి, కుమారుడు వీరాచారి, కుమార్తె కలిసి జీవిస్తున్నారు. గత కొంత కాలంగా చంద్రయ్య మద్యానికి బానిసయ్యాడు. ఒక రోజు అర్థరాత్రి మద్యం మత్తులో తల్లిని కొడుతుండగా కుమారుడు అడ్డుకున్నాడు. భార్య, కుమారుడు తిరిగి కర్రతో కొట్టడంతో చంద్రయ్య మృతి చెందాడు. పోస్ట్ మార్టం నిమిత్తం మృత దేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుమార్తె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఢిల్లీ: నీట్ పేపర్ లీక్ చేయడం మనేది ఘోరమైన పాపమని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. తొలి సారి నీట్ పేపర్ లీకేజీపై మోడీ ప్రసంగించారు. ఇలాంటి లీక్లు నివారించడం అనేది జాతీయ బాధ్యత అని తెలియజేశారు. మంగళ్ మిలన్ పేరిట మంగళవారం ఆయన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పిఎం మోడీ మాట్లాడారు. రాజకీయంగా పార్టీల మధ్య విభేదాలు ఉండొచ్చని, దేశ భవిష్యత్తు, యువత సంక్షేమం కోసం ప్రతిపక్షాలు కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్లో నిర్మాణాత్మక చర్చలు జరిగేలా అందరూ సహకరించాలని నరేంద్ర మోడీ కోరారు. పిల్లలను రెచ్చగొట్టడం మానుకోవాలని, తప్పుడు మార్గంలోకి వెళ్లడం చాలా సులభం అని పేర్కొన్నారు. తిరిగి సరైన మార్గంలో రావడంతో చాలా కష్టంగా ఉంటుందని మోడీ వివరించారు .








‘ఏక్ దిన్’ (తెలుగు డబ్ పేరు: ‘ఒక్క రోజు’) సాయి పల్లవి, జునైద్ ఖాన్ (అమీర్ ఖాన్ కుమారుడు) ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ డ్రామా. ఈ చిత్రానికి సునీల్ పాండే దర్శకత్వం వహించగా, అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మించింది. ఇది థాయ్ చిత్రం వన్ డేకి రీమేక్.కథ : దినేష్ (జునైద్ ఖాన్) ఒక సిగ్గరి యువకుడు. తనతో పనిచేసే మీరా (సాయి పల్లవి)ను మౌనంగా ప్రేమిస్తుంటాడు. వీరిద్దరూ ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తూ ఉంటారు. మీరా ఆ సాఫ్ట్ వేర్ కంపెనీ ఓనర్ నకుల్ ను ప్రేమిస్తూ ఉంటుంది. నకుల్ కు ఆల్రెడీ పెళ్లయింది కానీ ఆమెకు అబద్ధం చెబుతూ ఉంటాడు పెళ్ళానికి విడాకులు ఇచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెబుతూ ఉంటాడు.కంపెనీ ఎంప్లాయిస్ అంతా జపాన్ ట్రిప్ కి వెళ్తారు.. అక్కడ ఓ ప్రమాదంలో మీరా గతం మరిచిపోతుంది ఒక్కరోజు మాత్రమే ఆమ్నిషియా ఉంటుంది. ఈ ప్రమాదం తర్వాత మీరాకు టాన్సిట్ గ్లోబల్ అమ్నేషియా అనే పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో ఆమెకు ఒక రోజు జరిగిన విషయాలు గుర్తుండవు. ఆ ఒక్క రోజులో వారిద్దరి జీవితాల్లో జరిగే సంఘటనలే సినిమా ప్రధాన కథ. ప్రేమ, జ్ఞాపకాలు, భావోద్వేగాలకు ఈ చిత్రం ప్రాధాన్యం ఇస్తుంది. ఆమెకు ఆ ఒక్కరోజు తర్వాత గత






హైదరాబాద్: బిజెపిలోకి పెద్ద నేతలు ఎవరు రారని, వస్తామన్నతన వాళ్లు రానివ్వరని ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. ఉన్నవాళ్లనే ఇబ్బంది పెడుతుంటే కొత్తవాళ్లు ఎలా వస్తారు? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంపిలు, ఎమ్మెల్యేల మధ్య ఈగో ప్రాబ్లమ్స్ ఉన్నాయని, కేంద్రమంత్రి బండిసంజయ్, బిజెపి ఎంపి ఈటల రాజేందర్ ఎప్పుడో కలవాలని సూచించారు. టిబిజెపి అధ్యక్షుడు రామచందర్ రావు చేతులు కట్టేసి యుద్ధం చేయమని అంటున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శించారు. తెలంగాణలో తనకు మర్యాద ఇవ్వరని, ఇక్కడ రాజకీయాల్లో ఉండనని తెలియజేశారు. బిజెపికి నష్టం జరగాలని తాను ఎప్పుడు కోరుకోలేదని ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు.




