
4441 వార్తలు
– మాకు ప్రతిపక్ష హోదా రాదు… అధికారమే– కాంగ్రెస్, బీజేపీలది ఫెవికాల్ బంధం : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్రాష్ట్రంలో జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీఆర్ఎస్ నైతిక మద్దతు తెలుపుతున్నదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. బుధవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు అడుగుతున్న ప్రతి డిమాండ్ న్యాయమై నదేనని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ […] The post ఆర్టీసీ సమ్మెకు బీఆర్ఎస్ మద్దతు appeared first on Navatelangana.
– గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం సామరస్యంగా పరిష్కరించుకుంటే కావాల్సింది ఏముంటుంది : సుప్రీంకోర్టు– కొత్త గవర్నర్కు కొంత సమయం కావాలని కోరిన అటార్నీ జనరల్ ొ అందుకు అనుమతిస్తూ… తదుపరి విచారణ జులై 22కి వాయిదానవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో”గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం వంటి రాజ్యాంగబద్ధమైన సంస్థలు సామరస్యంగా సమస్యను పరిష్కరించుకుంటామంటే అంతకంటే కావాల్సింది ఏముంటుంది” అని తెలంగాణ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ నియామక కేసులో సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈ విధంగా రాజ్యాంగ సంస్థలు ఏకాభిప్రాయానికి వస్తే… కోర్టులు […] The post రాజ్యాంగబద్ధమైన వ్యవస్థల మధ్య ఏకాభిప్రాయం మంచిదే.. appeared first on Navatelangana.
– పైగా ప్యాలెస్ మరమ్మతుల గణాంకాలు వాస్తవ విరుద్ధమని ప్రకటననవతెలంగాణ-సిటీబ్యూరోహెచ్ఎండీఏ ప్రస్తుత అమీర్పేట్లోని స్వర్ణజయంతి కాంప్లెక్స్ నుంచి బేగంపేట్లోని చారిత్రక ‘పైగా ప్యాలెస్’కు మారుతున్న నేపథ్యంలో బేగంపేటలోని చారిత్రాత్మక ‘పైగా ప్యాలెస్’ మరమ్మతుల కోసం హెచ్ఎండీఏ రూ.93 కోట్లు ఖర్చు చేస్తోందంటూ బుధవారం నవతెలంగాణ దినపత్రికలో ఒక కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ కథనంపై హెచ్ఎండీఏ అధికారికంగా స్పందించింది. ఆ వార్తల్లో పేర్కొన్న గణాంకాలు వాస్తవ విరుద్ధమని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది.నేపథ్యం ఇదీ..పైగా ప్యాలెస్ను […] The post నవతెలంగాణ కథనంపై స్పందించిన హెచ్ఎండీఏ appeared first on Navatelangana.
– తద్వారా తెలుగు రాష్ట్రాల్లో సీట్లను పెంచుకోవచ్చు : కె.కేశవరావునవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని పార్లమెంటులో సవరించడం ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సీట్ల సంఖ్యను పెంచుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు కె.కేశవరావు సూచించారు. బుధవారం హైదరాబాద్లోని సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రొఫెసర్ కోదండరాం, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిలతో కలిసి ఆయన మాట్లాడారు. ఆ యాక్ట్లోని 26వ సెక్షన్ ద్వారా తెలంగాణలో 119 స్థానాల నుంచి […] The post ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ను సవరించాలి appeared first on Navatelangana.
– 42 ప్రమాణాలతో 75 అంశాల సమాచారాన్ని సేకరించాం : ఇండిపెండెట్ ఎక్స్ పర్ట్ కమిటీ గ్రూప్ వైస్ చైర్మెన్ కంచ ఐలయ్యనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్తెలంగాణ సామాజిక-ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ కుల సర్వే (సీపెక్) దేశానికి ఆదర్శమని ఇండిపెండెట్ ఎక్స్్పర్ట్ కమిటీ గ్రూప్ వైస్ చైర్మెన్ ప్రొఫెసర్ కంచ ఐలయ్య అన్నారు. సభ్యులు ప్రవీణ్ చక్రవర్తి, భాగ్య బుక్యలతో కలిసి బుదవారం హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థలో ఏర్పాటు చేసిన మీడియా […] The post సీపెక్ సర్వే దేశానికి ఆదర్శం appeared first on Navatelangana.
రూ.90 కోట్ల భూమికి ఫెన్సింగ్నవతెలంగాణ-సిటీబ్యూరోరంగారెడ్డి జిల్లా శంషాబాద్లో 9.05 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా బుధవారం కాపాడింది. దీని విలువ రూ.90 కోట్లకు పైగా ఉంటుందని రెవెన్యూ అధికారుల అంచనా. రెవెన్యూ రికార్డుల ప్రకారం సర్వే నెంబర్ 626/2లో మొత్తం 176.05 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఖస్రా పహాణీ(గ్రామ పాత రికార్డుల) ప్రకారం కూడా మొత్తం 176.05 ప్రభుత్వ భూమిగా రికార్డుల్లో నమోదైంది. అటవీ అభివృద్ధి సంస్థకు 166 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. మిగిలిన […] The post శంషాబాద్లో 9 ఎకరాలను కాపాడిన హైడ్రా appeared first on Navatelangana.
– మొహిసిన్, షమీ, ప్రిన్స్ యాదవ్లకు రెండేసి వికెట్లు– లక్నోపై రాజస్తాన్ రాయల్స్ సంచలన విజయంలక్నో : ఐపిఎల్ సీజన్-19లో తొలిసారి బౌలర్ల హవా నడిచింది. లక్నోలోని ఏక్నా క్రికెట్ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్లో తొలుత లక్నో బౌలర్లు సమిష్టిగా చెలరేగగా.. ఆ తర్వాత రాజస్తాన్ రాయల్స్ బౌలర్లు మెరిసారు. దీంతో రాజస్తాన్ నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో లక్నో జట్టు 119పరుగులకే కుప్పకూలింది. స్వల్ప ఛేదనలో భాగంగా లక్నో 11 పరుగులకే […] The post కదం తొక్కిన బౌలర్లు appeared first on Navatelangana.

కోల్కతా : పశ్చిమ బెంగాల్లో గురువారం (నేడు) అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ జరుగుతుంది. చాలా కాలంగా రాజకీయ ఘర్షణలకు వేదిక అయిన బెంగాల్లో ఎన్నికలు ఎన్నికల సంఘానికి సవాలుగా మారాయి. ఇక్కడ రాజకీయ అదికారంతో పాతుకుపోయిన మమత బెనర్జీ సారధ్యపు టిఎంసికి , ఈ రాష్ట్రంలో వేళ్లూనుకోవాలని బలంగా యత్నిస్తున్న బిజెపికి మధ్య పోటాపోటీ నెలకొంది. ఎన్నికల దశ వచ్చేసరికి ఓటర్లు రెండు భిన్న ధృవాల మధ్య తమ ఓటును ఖరారు చేసుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. బెంగాల్లో అధికార పక్షం టిఎంసి అవినీతి, బంధుప్రీతి, ఉద్యోగాల స్కామ్లు, రాజకీయ హింసాకాండపై బిజెపి దృష్టి సారించింది. ఇక బిజెపికి తొత్తుగా కేంద్ర ఎన్నికల సంఘం మారిందని, వ్యక్తుల గుర్తింపు , ఉనికి, వారి పౌరసత్వాలను, చివరికి ఓటు హక్కును హరించి వేసిందని మమత బెనర్జీ విరుచుకుపడుతూ వచ్చారు. తీవ్రస్థాయిలో తమ రాజకీయ ఎదురుదాడితో ముందుకు సాగారు. జాతీయ స్థాయిలో బిజెపికి పూర్తి సవాలు విసురుతూ వస్తోన్న మమతకు టిఎంసి తిరిగి అధికారంలోకి రావడం అత్యంత కీలక సవాలు అయింది. సర్ ప్రక్రియతో ఓటర్ల జాబితాలను కేంద్రం హైజాక్ చేసిందనే వాదనను టిఎంసి బలీయంగా ఓటర్ల వద్దకు తీసుకువెళ్లింది. రెం
లారీని ఢీకొన్న కరీంనగర్ డిపో బస్సుముగ్గురికి తీవ్ర గాయాలు సమ్మెను అణచివేసేందుకుప్రయివేట్ డ్రైవర్లతో రోడ్లపైకి బస్సులునవతెలంగాణ – కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధిరాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె సెగలు రేపుతుంటే, అధికారులు చేస్తున్న ‘ప్రయివేటు’ ప్రయోగాలు ప్రయాణికుల ప్రాణం మీదకొస్తున్నాయి. అనుభవం లేని వ్యక్తుల చేతికి స్టీరింగ్ అప్పగించి, బస్సులు నడపాలన్న పంతం నిండు ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతోంది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అల్గూనూర్కు వెళ్లే ప్రధాన రహదారిపై అనుభవం లేని ప్రయివేటు డ్రైవర్ అతివేగం కారణంగా అదుపుతప్పిన ఆర్టీసీ […] The post అదుపుతప్పిన ‘ఆర్టీసీ ప్రయివేట్ డ్రైవింగ్’ appeared first on Navatelangana.
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర 3వ మహాసభల నేపథ్యంలో బుధవారం హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్రోడ్లో గల రాష్ట్ర కార్యాలయంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ. ఏప్రిల్ 23, 24, 25 తేదీల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జరగనున్న మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. గడిచిన మూడేండ్లలో జరిగిన పోరాటాలను సమీక్షించుకోవడానికీ, […] The post రైతు సంఘం కార్యాలయంలో జెండావిష్కరణ appeared first on Navatelangana.
వయోజనుల్లో అక్షరాస్యత పెంపుపై ప్రజా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో విద్యా రంగంలో వేగంగా సంస్కరణలు తెలంగాణ దూకుడునవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్మారుతున్న కాలానికి తగినట్టు మారితేనే మనుగడ సాధ్యమవుతుంది. ఈ క్రమంలోనే విద్యా రంగంలోనూ పలు సంస్కరణలకు ప్రజా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా శాఖను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. పిల్లలంతా బడుల్లో ఉండడమే కాదు. పెద్దలు సైతం అక్షరాలు నేర్చుకోవాలనీ, ఆధునిక కాలపు అవసరాలకు తగినట్టు తమను […] The post పెద్దల చదువుకు పెద్ద పీట appeared first on Navatelangana.
– 1:4 నిష్పత్తిలో ప్రతిపాదనలు పంపండి : ఉప ముఖ్యమంత్రి భట్టినవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్రాష్ట్రంలో మూడేండ్ల క్రితం బ్రిడ్జిలు నిర్మించినప్పటికీ వాటికి అప్రోచ్ రోడ్లు నిర్మించకపోవడం మూలంగా అవి నిరుపయోగంగా ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న అప్రోచ్ రోడ్ల నిర్మాణాన్ని రూ.148 కోట్లతో వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బుధవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్యాపిటల్ వర్క్స్ […] The post రూ.148 కోట్లతో అప్రోచ్ రోడ్ల నిర్మాణం appeared first on Navatelangana.
మంత్రులు శ్రీధర్బాబు, వాకిటి శ్రీహరినవతెలంగాణబ్యూరో-హైదరాబాద్రాష్ట్ర వ్యాప్తంగా మే 18 నుంచి 23 వరకు యువజన క్రీడోత్సవాలను నిర్వహించాలని మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, వాకిటి శ్రీహరి అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్లోని మినిస్టర్స్ క్వార్టర్స్లో అందుకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం క్రీడల షెడ్యూల్ ప్రకటించారు.మే 1 నుంచి 12 వరకు జిల్లా కేంద్రాల్లో ఉద్యోగ మేళాలుమే 18 నుంచి 23 వరకు యువజన కేంద్రీకృత కార్యక్రమాలుమే 18 రాష్ట్రవ్యాప్తంగా మరథాన్ రన్ మరియు ఫిజికల్ లిటరసీ కార్యక్రమాలుమే […] The post మే 18 నుంచి 23 వరకు యువజన క్రీడోత్సవాలు appeared first on Navatelangana.
– అందుకే సోషల్ మీడియాకు క్రేజ్– అర్హులందరికీ అక్రిడేషన్ కార్డులు– సవరణ అంశాల నోట్ డీపీఆర్వోలకు పంపిస్తాం : మీడియా అకాడమీ చైర్మెన్ శ్రీనివాస్రెడ్డినవతెలంగాణ-నిజామాబాద్సిటీసమాజంలోని అంతరాలను మెయిన్ స్ట్రీమ్ మీడియా పట్టించుకోనందునే సోషల్ మీడియా క్రేజ్ పెరిగిందని మీడియా అకాడమీ చైర్మెన్ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. నిజామాబాద్ నగర ప్రెస్క్లబ్ జర్నలిస్టులకు వెల్నెస్ ఆస్పత్రి ఆధ్వర్యంలో బుధవారం ఉచిత ఫ్యామిలీ హెల్త్ కార్డుల పంపిణీని న్యూ అంబేద్కర్ భవన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరై ఆయన మాట్లాడారు. అర్హులైన […] The post అంతరాలను పట్టించుకోని మెయిన్ స్ట్రీమ్ మీడియా appeared first on Navatelangana.
రాష్ట్ర మంత్రి సీతక్కనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్పిల్లల సమగ్ర ఎదుగుదలలో మేఘాలయ రాష్ట్రం మెరుగైన ఫలితాలను సాధిస్తున్నదని తెలంగాణ రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అభినందించారు. బుధవారం మంత్రితో పాటు ఆ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ శృతి ఓజా, జాయింట్ డైరెక్టర్ మోతి మేఘాలయలో అధికారిక పర్యటన నిర్వహించారు. అక్కడ అమలవుతున్న అంగన్వాడి సేవలు, వినూత్న కార్యక్రమాల అనుభవాలను అధ్యయనం చేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి, చిన్నారుల అభివృద్ధి కోసం […] The post పిల్లల సమగ్ర ఎదుగుదలలో.. మేఘాలయ మెరుగైన ఫలితాలు appeared first on Navatelangana.
– వయోభారంతో ఆస్పత్రిలో తుదిశ్వాస– నేడు అంత్యక్రియలు నవతెలంగాణ-బంజారాహిల్స్/జూబ్లీహిల్స్ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు(90) కన్నుమూశారు. వయో సంబంధిత అనారోగ్య సమస్యలతో హైదరాబాద్లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికకాయాన్ని జూబ్లీహిల్స్లోని స్వగృహానికి తీసుకువచ్చారు. గురువారం మధ్యాహ్నం నాలుగు గంటలకు పంజాగుట్ట హిందూ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. నాదెండ్ల భాస్కరరావు మృతిపై పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన […] The post మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత appeared first on Navatelangana.
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలి: సీపీఐ(ఎం)నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ ప్రకటించారు. ఆర్టీసీ కార్మికుల జేఏసీతో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం, ఉద్యోగాల భర్తీ, కార్మికుల బకాయిల చెల్లింపు, కార్మిక […] The post ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు appeared first on Navatelangana.
– నేటి నుంచి 25 వరకూ తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మూడో మహాసభ– హాజరుకానున్న 600 మంది ప్రతినిధులు..– 5000 మందితో ప్రారంభ సభనవతెలంగాణ – కొత్తగూడెంతెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మూడో మహా సభకు కొత్తగూడెం ఆతిథ్యం ఇస్తోంది. చారిత్రాత్మక సింగరేణి భూతలం కార్మిక వాడలో కర్షకులు కదం తొక్కేందుకు సిద్ధమయ్యారు. రైతు సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఈ మహాసభ కోసం అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది. గురు, శుక్ర, శనివారాలు […] The post కార్మికవాడకు కర్షకులు ముస్తాబైన కొత్తగూడెం appeared first on Navatelangana.
– పేద విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందించడం– గొప్ప విషయం : ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబునవతెలంగాణ – ముషీరాబాద్మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ వ్యాపారంలోనే కాదు ప్రజాసేవ చేయడంలోనూ ముందుందని, పేద విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందించడం గొప్ప విషయం అని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ 2026-27 ఆర్థిక సంవత్సరానికిగాను ప్రకటించిన రూ.200 కోట్ల సీఎస్ఆర్ నిధుల కేటాయింపులో భాగంగా తెలంగాణలోని 5,050 మంది విద్యార్థులకు […] The post సేవలోనూ మలబార్ సంస్థ ముందడుగు appeared first on Navatelangana.
యూఎస్ను శాశ్వతంగా వదిలి వెళ్లాలనుకుంటున్నాం40 శాతం మంది భారతీయుల మనోగతంరాజకీయ పరిస్థితులు, గ్రీన్ కార్డ్ కష్టాలు, వీసా అనిశ్చితినిరాశలో ఇండో-అమెరికన్లున్యూఢిల్లీ : అమెరికా వెళ్లాలి, డాలర్లు సంపాదించి, సిలికాన్ వ్యాలీలో స్థిరపడాలన్నది కోట్లాది మంది భారతీయులు కల. అయితే ఇప్పుడు ఆ ‘అమెరికన్ డ్రీమ్స్’ కొంత మందికి కల్లగా, మరికొంత మందికి నిరాశగా మారుతున్నాయి. తాజా సర్వే ప్రకారం యూఎస్లో ఉన్న భారతీయులలో 40 శాతం మంది అక్కడి నుంచి శాశ్వతంగా వెళ్లిపోవాలని ఆలోచిస్తున్నారు. దీని వెనుక […] The post కూలుతున్న అమెరికా కల appeared first on Navatelangana.
– ఈ రంగంలో చైనా, భారత్లు ముందంజ– మందకొడిగా పశ్చిమ దేశాలున్యూఢిల్లీ, బీజింగ్ : ఇక భవిష్యత్ ఇంధనంగా రూపొందనున్న హరిత హైడ్రోజన్ రంగంపై పట్టు సాధించేందుకు చైనా, భారత్లు చాలా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. పెద్ద ఎత్తున గ్రీన్ హైడ్రోజన్ (పునర్వినియోగ ఇంధనాన్ని ఉపయోగించడం ద్వారా నీటి ఎలక్ట్రాలసిస్ ద్వారా ఉత్పత్తయ్యే హైడ్రోజన్) ఉత్పత్తి సామర్ధ్యాన్ని నిర్మించుకునేందుకు ఇరు దేశాలు పెద్ద మొత్తంలో నిధులను ఖర్చు చేస్తున్నాయి. పారిశ్రామిక ఆధిపత్యాన్ని నిలుపుకోవడంపై చైనా దృష్టి కేంద్రీకరించగా, […] The post ఇక భవిష్యత్ ఇంధనం గ్రీన్ హైడ్రోజన్ appeared first on Navatelangana.
ప్రస్తుత పోస్టింగ్లలోనే కొనసాగింపునవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధిరాష్ట్రానికి చెందిన ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)లు గా పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 1995 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన మహేశ్ భగవత్, స్వాతి లక్రా, వి.వి శ్రీనివాస్రావు, 1996 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన చారుసిన్హా, వీ.సీ సజ్జనార్, అనిల్ కుమార్లకు డీజీపీలుగా పదోన్నతులు లభించాయి. రాష్ట్ర శాంతి భద్రతల విభాగం అదనపు డీజీగా మహేశ్ భగవత్, రాష్ట్ర హౌంగార్డ్ విభాగం […] The post ఆరుగురు సీనియర్ ఐపీఎస్లకు డీజీపీలుగా పదోన్నతి appeared first on Navatelangana.
డిపోలకే పరిమితమైన బస్సులురాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ సమ్మెతొలిరోజు విజయవంతంరాజకీయపార్టీలు, కార్మిక సంఘాల మద్దతుకరీంనగర్లో రోడ్డు ప్రమాదంసర్కార్ కుయుక్తులు..తప్పుకున్న సూపర్వైజర్ల సంఘంనవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె తొలిరోజు విజయవంతమైంది. సర్కారుతో చర్చలు విఫలమైన నేపథ్యంలో మంగళవారం అర్థరాత్రి నుంచే ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రంలోని 97 బస్ డిపోల్లో వేలాదిగా ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందు లు ఎదుర్కొంటున్నారు. సమ్మెకు ప్రభుత్వ మే కారణమనీ, […] The post కదలని చక్రాలు appeared first on Navatelangana.