21908 వార్తలు





నవతెలంగాణ-హైదరాబాద్ : దక్షిణ ఐరోపా దేశాలను కార్చిచ్చు కకావికలం చేస్తోంది. ఫ్రాన్స్లో చెలరేగిన మంటలు అదుపులోకి రాకుండా విస్తరిస్తుండగా, గ్రీస్లో విధి నిర్వహణలో ముగ్గురు ఫైర్ఫైటర్లు ప్రాణాలు కోల్పోయారు. తీవ్రమైన వేడి, కరవు, బలమైన గాలుల కారణంగా ఫ్రాన్స్, గ్రీస్, స్పెయిన్ దేశాల్లో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. నైరుతి ఫ్రాన్స్లోని గిరోండే ప్రాంతంలో రాజుకున్న కార్చిచ్చు పారిస్ నగరానికి నాలుగు రెట్ల విస్తీర్ణంలో వ్యాపించిందని అధికారులు తెలిపారు. మంటలు మరింత విస్తరించే ప్రమాదం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. […] The post దక్షిణ ఐరోపా దేశాలను కకావికలం చేస్తున్న కార్చిచ్చు.. appeared first on Navatelangana.

నవతెలంగాణ-హైదరాబాద్ : వాయుగుండం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భద్రాద్రి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వానలు పడే ఛాన్స్ ఉందని ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. The post నేడు ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు.. appeared first on Navatelangana.

నవతెలంగాణ-హైదరాబాద్ : విజయనగరం జిల్లా తాటిపూడి ఏపీ రెసిడెన్షియల్ కళాశాలలో 52 మంది విద్యార్థినులు జ్వరం, ఒళ్లు నొప్పుల బారిన పడ్డారు. తీవ్రంగా ఉన్న 7 మందిని ఎస్.కోట ఏరియా ఆస్పత్రికి తరలించగా, మిగిలిన వారికి కళాశాలలోని వైద్య శిబిరంలో చికిత్స అందిస్తున్నారు. డిసిఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ, డీఈఓ బాధితులను పరామర్శించారు. ఈ ఘటనతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. The post ఏపీ రెసిడెన్షియల్ కళాశాలలో 50 మందికిపైగా విద్యార్థినులకు అస్వస్థత appeared first on Navatelangana.











మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల భద్రతపై సమావేశం కానున్న జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీబ్యారేజీల మరమ్మతులు, భవిష్యత్ నిర్వహణపై చర్చించనున్న ఎన్డిఎస్తెలంగాణలో ధాన్యం కుంభకోణం చేసిన వారిని అరెస్టు చేస్తాంఎస్ఎల్బిసి టన్నెల్ను తమ హయాంలోనే పూర్తి చేసి ఎన్నికలకు వెళతాంకర్ణాటక ముఖ్యమంత్రి డికె శివకుమార్తో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సమావేశంమన తెలంగాణ/హైదరాబాద్: మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి ఈనెల 31వ తేదీన జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సమావేశం నిర్వహించనుందని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ నీటి పారుదల శాఖ అధికారులు కూడా పాల్గొంటారని ఆయన తెలిపారు. బ్యారేజీల భద్రత, మరమ్మతులు, భవిష్యత్ నిర్వహణపై ఈ సమావేశంలో చర్చిస్తామని ఆయన పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణలో ధాన్యం కుంభకోణం చేసిన వారిని అరెస్టు చేస్తామని మంత్రి ఉత్తమ్ హామీనిచ్చారు. అటు ఎస్ఎల్బిసి టన్నెల్ను తమ హయాంలోనే పూర్తి చేసి ఎన్నికలకు వెళతామని మంత్రి ఉత్తమ్ చాలెంజ్ చేశారు.ఢిల్లీలోని కర్ణాటక భవన్లో కర్ణాటక ముఖ్యమంత్రి డికె శివ కుమార్తో తెలంగాణ రా

పిసిసి పనితీరుపై ఏఐసిసి సీరియస్ పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయ లోపంమంత్రులకు, ఎంఎల్ఎలకు మధ్య అంతరం ‘సర్’ ఆశించిన విధంగా సాగడం లేదు జెడ్పిటిసి, ఎంపిటిసి, ఐదు కార్పొరేషన్ల ఎన్నికలకు పార్టీ సమాయత్తం ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికకు కమిటీ నామినేటెడ్ పదవులపైనా సమాలోచనలుతాజా రాజకీయాలు, పార్టీ బలోపేతంపై చర్చించిన నేతలుమన తెలంగాణ/హైదరాబాద్: పిసిసి పని తీరుపై అధిష్టానం అసంతృప్తి వ్యక్తం చేసింది. పలు జిల్లాల్లో మంత్రులకు-ఎమ్మెల్యేలకు మధ్య, ప్రభుత్వానికి-పార్టీకి మధ్య సమన్వయం కొరవడిందని, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ (సర్) ఆశించిన విధంగా జరగడం లేదని కాంగ్రెస్ పెద్దలు పెదవి విరిచారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయం (ఇందిరా భవన్)లో బుధవారం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు దామోదర రాజనర్సింహ, ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, ఏఐసిసి కార్యదర్శి సచిన్ సావంత్ తదితరులు హాజరయ్యారు. ఈ భేటీలో రాష్ట్ర అభి

పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, సీతమ్మ సాగర్ బ్యారేజ్, గౌరవెల్లి ప్రాజెక్టుల పర్యావరణ అనుమతులు సురక్షితం2021 నాటి ఆఫీస్ మెమోరాండంను కొట్టివేసిన సర్వోన్నత ధర్మాసనం2021 ఓఎం ద్వారా పొందిన అనుమతులన్నీ పూర్తిస్థాయిలో చెల్లుబాటుమన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక సాగునీటి ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, సీతమ్మ సాగర్ బ్యారేజ్, గౌరవెల్లి ప్రాజెక్టుల పర్యావరణ అనుమతులు సురక్షితమని సర్వోన్నత ధర్మాసనం స్పష్టం చేసింది. సీజేఐ జస్టిస్ సూర్య కాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కీలక తీర్పును వెలువరించింది. కేంద్ర పర్యావరణ శాఖ 2021 నాటి ఆఫీస్ మెమోరాండం (ఓఎం)ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అయితే ఈ తీర్పును భవిష్యత్ వర్తింపు విధానంలో అమలు చేయాలని ఆదేశించింది. దీనివల్ల గతంలో 2021 ఓఎం ద్వారా పొందిన అనుమతులన్నీ పూర్తిస్థాయిలో చెల్లుబాటులో ఉంటాయని, ఇప్పటికే మంజూరైన పర్యావరణ అనుమతులకు ఎలాంటి డోకా లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కార్యనిర్వాహక ఉత్తర్వులతో చట్టాలను భర్తీ చేయడం కుదరదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. అత్యవసర పరిస్థితుల్లో మినహాయింపులు

నాలుగు రోజులుగా పడుతున్న వర్షాలతో రైతుల్లో చిగురించిన ఆశలు నాట్లకు సిద్ధమౌతున్న రైతులు వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా అతలాకుతలం వేములవాడ మూలవాగుకు భారీగా వరద గోదావరిఖని, మంథనిల మధ్య నిలిచిపోయిన రాకపోకలు అత్యధికంగా ఏటూరు నాగారంలో 152 మి.మీ. వర్షపాతం ఎల్లంపల్లికి జలకళ నంది పంపుహౌస్లో 4 బాహుబలి మోటార్లు ప్రారంభంమన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతుల్లో కొత్త ఆశలను నింపుతున్నా యి. మరో రెండు రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో రైతుల్లో సా గుపై ఆశలు చిగురిస్తున్నాయి. ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో వ ర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశముందని వాతావరణ శా ఖలు, వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తుండగా, తాజాగా కురిసిన వర్షాలు గ్రామీణ ప్రాంతాల రైతుల్లో ఆనందాన్ని తీసుకొచ్చాయి. చాలా రోజులుగా ఎండిపోయిన వాగులు, వంకలు, చెరువుల్లోకి నీరు చేరడం ప్రారంభమవడంతో రైతులు సాగు పనులపై దృష్టి సారిస్తున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గత నాలుగు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయి.

విపక్షాల నిరసనల మధ్య మూజువాణి ఓటుతో ఆమోదంబిల్లుపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై సభలో రభసవిద్యార్థులపై పోలీసుల దమనకాండకు హోంమంత్రి అమిత్షాయే బాధ్యుడని తీవ్ర ఆరోపణ ఎన్డిఎ నేతల అభ్యంతరం అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్యుద్ధంరాహుల్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించిన స్పీకర్ న్యూఢిల్లీ: దేశంలోని లక్షలాది మంది అభ్య ర్థుల ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్రం తీ సుకువచ్చిన ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు- 2026’కు లోక్సభ బుధవారం ఆమో దం తెలిపింది. విపక్షాలు పలు సవరణలు కోరినప్పటికీ అవి వీగిపోయాయి. పేపర్ లీ క్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని. బిల్లులో ఇందుకు అవ సరమైన సవరణలు పొందుపరిచామని కేం ద్రం తెలిపింది. అనుభవాల నుంచి పాఠాల ను నేర్చుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందనడానికి తాము తీసుకు వచ్చిన స వరణ బిల్లే నిదర్శనమని పేర్కొంది. నీట్ పేపర్ లీక్, అవకతవకలు, విద్యా వ్యవస్థపై పారదర్శకత, జవాబుదారీతనం కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో విద్యార్థులు పెద్దఎత్తున నిరసనలకు దిగడం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం, విద్యార్థుల డిమాండ్లకు కేంద్రం అంగీకరించడం వంటి వరుస పరి

ట్రైనీ ఐపిఎస్ వేధింపులపై ప్రాథమిక ఆధారాలు లభ్యం ఇన్స్టాగ్రామ్లో బాధితురాలు పరిచయం ప్రేమకు దారితీసిన స్నేహంఎన్పీఏ శిక్షణలో ఇద్దరి మధ్య బలపడిన సంబంధంఆ తర్వాత మనస్పర్ధలు బెదిరింపులకు దిగిన ఉదయ్కృష్ణారెడ్డి కేసు వివరాలు వెల్లడించిన కమిషనర్ సజ్జనార్ 14 రోజుల రిమాండుకు ఉదయ్మన తెలంగాణ/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం రేపిన సహచర మహిళా ట్రైనీ ఐపిఎస్ అధికారిణి వేధింపుల కేసులో నిందితుడు ట్రైనీ ఐపిఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి రాజేంద్రనగర్లోని ఉప్పరపల్లి కోర్టు బుధవారం 14 రోజుల రిమాండ్ విధించింది. వచ్చే ఆగస్టు 11 వరకు ఆయనకు రిమాండ్ ఖరారు చేస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. దీంతో పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిని చంచల్గూడ జైలుకు తరలించారు. కేసు నేపథ్యాన్ని హైదరాబాద్ నగర కమిషనర్ వి.సి సజ్జనార్ బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ట్రైనీ ఐపిఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి నేరానికి పాల్పడినట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ తెలిపారు. ఉదయ్కృష్ణారెడ్డి గతంలో కానిస్టేబుల్గా పని చేశాడని, యూపిఎస్సి రాసి 2025 బ్యాచ్లో ఐపిఎస్గా ఎంపికయ్యాడని, ఉదయ్కృష్ణారెడ్డి 2025 డిసెంబర్ నుంచి ఎన్పీఏ శ