22297 వార్తలు




ఢిల్లీ: కేంద్రం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవట్లేదని కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధి సౌరవ్ దాస్ ఆరోపించారు. నిరసనకారులపై కేసులు ఉపసంహరించుకుంటామని చెప్పారని అన్నారు. సౌరవ్ దాస్ కీలక ప్రకటనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వివిధ రాష్ట్రాల్లో నిరసకారులపై కేసులు పెడుతున్నారని, కేసులు పెట్టినట్లు పలు రాష్ట్రాల నుంచి తమకు సమాచారం వస్తోందని, కేసుల గురించి సిజెపి లాయర్లను సంప్రదిస్తుందని సూచించారు. ప్రత్యేకించి అసోం, బెంగాల్, బిహార్ లో ఎక్కువ కేసులు పెట్టారని, ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని మంత్రులకు గుర్తుచేస్తున్నామని అన్నారు. రేపటిలోగా దేశవ్యాప్తంగా అన్ని కేసులు ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీలపై నమ్మకంతో ఆందోళన విరమించామని తెలిపారు. కేసులపై మాటతప్పడం నమ్మకం ద్రోహమని, కేసులు పెటడం లక్షలాది విద్యార్థులను వంచించడమేనని మండిపడ్డారు. కేంద్రం చేసిన నమ్మకద్రోహాన్ని యువత అంగీకరించదని సౌరవ్ దాస్ హెచ్చరించారు.

హైదరాబాద్: విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం.. హౌస్ నెం.47’. గతంలో వెంకటేష్ నటించిన ‘నవ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరీ’ సినిమాలకు త్రివిక్రమ్ రచయితగా పని చేశారు. ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే సినిమాను తెరకెక్కిస్తున్నారు త్రివిక్రమ్. ఇక ఈ సినిమాలో వెంకటేష్కు జోడీగా శ్రీనిధి శెట్టి నటిస్తుండగా.. నారా రోహిత్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. తాజాగా వెంకటేష్ పాత్రను పరిచయం చేస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. ఈ సినిమాలో వెంకీ ‘చిట్టిబాబు’గా సందడి చేయనున్నారు. తాజాగా విడుదల చేసిన వీడియో నవ్వులు పూయిస్తుంది. ఇంకెందుకు లేటు వీడియోను మీరు చూసేయండి..



ఢిల్లీ: మత మార్పిడితో ఎస్సీ హోదా కోల్పోతారని సుప్రీంకోర్టు తెలిపింది. క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తికి ఎస్సీ హోదా వర్తించదని సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. హిందూ, సిక్కు, బౌద్ధం తప్ప ఇతర మతాలకు మారితే ఎస్సీ స్టేటస్ రద్దు అవుతుందని పేర్కొంది. క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తికి ఎస్సీ హోదా వర్తించదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తిరిగి హిందూ, సిక్కు, బౌద్ధంలోకి వస్తేనే హోదా పునరుద్ధరణ జరుగుతుందని వివరించింది. ఏపీ హైకోర్టు తీర్పును సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. మార్చి 2026 తీర్పుపై రివ్యూ పిటిషన్ ను తిరస్కరించింది.



లక్నో: తల్లిని చంపేసిన తండ్రిని పోలీసులకు ఐదేళ్ల కుమారుడు పట్టించిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం మహోబా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం....... బిజ్రారీ గ్రామంలో హనీఫ్(32), మనీషా(27) అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఐదేళ్ల కుమారుడు, రెండేళ్ల కూతురు ఉంది. ప్రస్తుతం మనీషా ఎనిమిది నెలల గర్భవతిగా ఉంది. భార్య ఇంట్లో అనుమానాస్పదంగా చనిపోయిందని పోలీసులకు హనీఫ్ సమాచారం ఇచ్చారు. పోలీసులు బిజ్రారీ గ్రామానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హనీఫ్ మద్యం మత్తులో ఇంటికి వచ్చిన తరువాత భార్యతో గొడవకు దిగాడు. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో భార్య తలపై కొడవలితో విచాక్షణ రహిత కొట్టి చంపేశాడు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చాడు. మృతురాలు ఎనిమిది నెలల గర్భిణీగా గుర్తించారు. కడుపులో ఉన్న బిడ్డ కూడా మరణించిందని పోలీసులు వెల్లడించారు. తల్లి హత్య చూసినప్పటి నుంచి కుమారుడు భయంతో వణికిపోయాడు. తన తల్లిని తండ్రి చంపాడని పోలీసులకు కుమారుడు తెలిపాడు. దీంతో తండ్రిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. బాలుడు భయాందోళనకు గురికావడంతో వైద్యుడి పర్యవేక్షణలో ఉంచారు.

హైదరాబాద్: దేశంలో ఏ రాష్ట్రంలోనూ విద్యార్థులు అల్పాహార పథకం కార్యక్రమం లేదని డిప్యూటీ సిఎం భట్టివిక్రమార్క తెలిపారు. ఖాళీ కడుపుతో విద్యార్థులు ఎవరూ ఉండవద్దని ఈ కార్యక్రమం చేపట్టామని అన్నారు. హరేకృష్ణ ఫౌండేషన్ నిర్వహించిన హోమంలో భట్టి పాల్గొన్నారు. హరేకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులు అల్పాహార పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా మధిరలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 26 లక్షల మంది విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్నామని, రాబోయే 3 నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయబోతున్నామని భట్టి తెలియజేశారు. అల్పాహార పథకాన్ని ప్రారంభించినపుడు సందేహాలు వ్యక్తమవుతాయని జోష్యం చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించబోతున్నామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.



పాట్నా: బిహార్ లో విద్యార్థులపై కాల్పులు జరిగాయంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. విద్యార్థులపై ఎఫ్ఐఆర్ లు ఉండవని కేంద్రం ఇచ్చిన హామీ ఏమైంది? అని ప్రశ్నించారు. విద్యార్థులను అరెస్టు చేసి ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారని రాహుల్ గాంధీ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఢిల్లీలో పెల్లెట్లు, పాట్నాలో ఎకే 47 ప్రయోగించారని రాహుల్ గాంధీ విమర్శించారు. విద్యార్థుల గొంతు నొక్కడానికే ప్రభుత్వం ప్రయత్నం చేసిందని మండిపడ్డారు. విద్యార్థులను అణిచివేయడంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ తీరు ఎక్కడైనా ఒక్కటేనని, విద్యార్థులకు మోడీ క్షమాపణ చెప్పాల్సిందేనని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.


హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ జట్టులోకి వచ్చేందుకు కఠినంగా శ్రమిస్తున్నాడు. సూర్య ఫామ్ కోల్పోవడంతో జట్టులో తీసేశారు. ఐపిఎల్లో కూడా పెద్ద రాణించకపోవడంతో అతడి స్థానం ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం సూర్యకు 35 ఏళ్లు ఉండడంతో పిట్నెస్తో పామ్ను కొనసాగించాల్సి ఉంటుంది. గత కొన్ని రోజులుగా నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. మూడు గంటల్లోనే వెయ్యి బంతులు ఎదుర్కొన్నాడు. నిమిషానికి ఐదు బంతులతో బ్యాటింగ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. భారత్కు టి20 వరల్డ్ కప్ కూడా అందించారు. సూర్య కెప్టెన్సీలో టీమిండియా ఎన్నో విజయాలు సాధించింది. బ్యాట్స్మెన్గా విఫలం కావడంతో జట్టు నుంచి స్థానం కోల్పోయాడు.

టీం ఇండియాకు సారథిగా టి-20 ప్రపంచకప్ను అందించిన సూర్యకుమార్ యాదవ్.. ఆ తర్వాత జట్టులో చోటు కోల్పోయాడు. ఫామ్ లేమి కారణంగా అతడిని సెలక్టర్లు జట్టు నుంచి తప్పించారు. అతడి స్థానంలో శ్రేయస్ అయ్యర్కు కెప్టెన్సీ ఇచ్చారు. అయితే తిరిగి పొట్టి ఫార్మాట్లో జట్టులో చోటు దక్కించుకోవాలంటే.. 35 ఏళ్ల సూర్యకు ఫిట్నెస్తో పాటు ఫామ్ను అందుకోవడం కూడా ముఖ్యమే. అందుకోసం అతడు నెట్స్లో కఠోరంగా శ్రమిస్తున్నాడు. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియోని అతడు షేర్ చేశాడు. దాదాపు మూడు గంటల్లో సుమారు 1000 బంతులను ఎదురుకున్నట్లు అతడు రాసుకొచ్చాడు. అంటే నిమిషానికి కనీసం ఐదు బంతులను ఎదుర్కొవడం గమనార్హం. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. సూర్య శ్రమను అభినందిస్తూ.. నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.




