22289 వార్తలు


ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీసుల్లో ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడిన సంజు శాంసన్ను జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేయలేదు. అయితే అతడిని ఎందుకు తప్పించారని కొందరు ప్రశ్నిస్తే.. మరికొందరు మాత్రం అతడిని పక్కన పెట్టడాన్ని సమర్థించారు. ఇక జింబాబ్వే పర్యటనలో యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ అందరగొట్టాడు. అద్భుతమైన ఆటతీరుతో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు. దీంతో ఇప్పటికైతే ఓపెనింగ్ ప్లేస్ ఖాళఈగా లేదనే చెప్పుకోవాలి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంజు శాంసన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘మన దేశంలో నిరంతరం పోటీ ఉంటుందని తెలుసు. అయితే, 2026 టి-20 ప్రపంచకప్ ముందు ఇందులో నేను భాగం కాకూడదని నిర్ణయించుకున్నా. నా గేమ్ను ఆస్వాదించడంపైనే దృష్ట పెట్టా. దేవుడి దయ వల్ల నేను చాలా సాధించా. ఇప్పుడు నా వయసు 31 ఏళ్లు. ఇంకా చాలా కాలం క్రికెట్ ఆడగలను. అందుకే, సొంత శైలిలోనే ఆడాలని అనుకుంటున్నా. ఎలా బ్యాటింగ్ చేయాలో నాకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సంజు ఎలా ఆడాలో సంజునే డిసైడ్ చేస్తాడు. 2024 వరల్డ్ కప్ తర్వాత 2026లో ఆడతానని అనుకోలేదు. కనీసం 15 మంది స్వ్కాడ్లో కూడా ఉంటానని భావించలేదు. అయినా నాకు అవకాశం వచ్చింది. అనుకోకుండా వచ్చిన ఛాన్స

నవతెలంగాణ-హైదరాబాద్: నీట్ పేపర్ లీకేజ్ ను నిరసిస్తూ ఈ నెల 25న బీహార్ బంద్ కు పిలుపునిచ్చాయి విద్యార్థి సంఘాలు. రాష్ట్రవ్యాప్త బంద్ సందర్భంగా అనేక జిల్లాల్లో విద్యార్థి సంఘాలు భారీ స్థాయిలో నిరసనలు చేపట్టాయి. పలు ప్రాంతాల్లో నిరసనకారులు మరియు పోలీసుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నట్లు సమాచారం.పాట్నాతో పాటు పలు జిల్లాలో విద్యార్థులు భారీ ర్యాలీ తీశారు.అయితే సివాన్ జిల్లాలో చేపట్టిన విద్యార్థుల ర్యాలీపై ఓ కానిస్టేబుల్ ఏకే-47తో కాల్పులు జరిపారు. పలువురు విద్యార్థులు తీవ్రంగా […] The post విద్యార్థులపై ఏకే-47తో కాల్పులు..కానిస్టేబుల్ సస్పెండ్ appeared first on Navatelangana.

నవతెలంగాణ-సత్తుపల్లి సత్తుపల్లి మండలం కొత్తూరులోని మదర్ థెరెసా కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లో టీజీడీఈసెట్ (టీజీ డీ.ఈఎల్.ఈడీ) 2026–28 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలు పొందేందుకు ఈనెల 30వ తేదీన స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎల్వీఆర్ దీక్షితులు తెలిపారు. ఈ ప్రవేశ పరీక్షలో తెలుగు మాధ్యమంలో అర్హత సాధించి, ఇప్పటికే ధ్రువపత్రాల పరిశీలన (సర్టిఫికెట్ వెరిఫికేషన్) పూర్తి చేసుకున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. ఈ నెల 30న […] The post మదర్ థెరెస్సా కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు appeared first on Navatelangana.






తమిళ నటుడు ఎలన్.. హీరోగా పరిచయమవుతూ.. దర్శకత్వం కూడా చేసిన సినిమా ‘ప్యార్ ప్రేమ కళ్యాణం’. తెలుగమ్మాయి శాన్వి మేఘన ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. గతేడాది ఈ సినిమా గురించి న్యూస్ వచ్చింది. అయితే ఈ సినిమాను నేరుగా ఒటిటిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆగస్టు 21న ఈ సినిమా ప్రముఖ ఒటిటి వేదిక ‘నెట్ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఇది అందుబాటులో ఉండనుంది. ఈ సినిమా విషయానికొస్తే.. పెళ్లి తర్వాత అత్తారింటికి వెళ్లకుండా తన ఇంట్లోనే ఉండాలని ఓ అమ్మాయి (శాన్వి మేఘన) నిర్ణయించుకుంటుంది. దీంతో ఆమె భర్త (ఎలన్) ఇల్లరికం వస్తాడు. ఈ కారణంగా ఇరు కుటుంబాల్లో ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? చివరకు తమ జీవితాన్ని తాము ఎలా మలుచుకోవాలనే విషయాన్ని ఈ జంట ఎలా తెలుసుకుంటుంది? అనేది స్టోరీలా అనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో రాధిక శరత్కుమార్, యోగి బాబు, ఎం.ఎస్. భాస్కర్, గీతా కైలాసం తదితరులు కీలక పాత్రలు చేశారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు.

హైదరాబాద్: ఇంగ్లాండ్, ఐర్లాండ్ జరిగిన సిరీస్లను కోల్పోవడంతో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్తో కోచ్ గౌతమ్ గంభీర్పై కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రధాన కోచ్ గంభీర్కు విశ్రాంతిని ఇచ్చి జింబాబ్వే టూర్కు వివిఎస్ లక్ష్మణ్ కోచ్గా నియమించారు. వివిఎస్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో జింబాబ్వేను భారత జట్టు క్లీన్ స్వీప్ చేయడంతో ఆయనకు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ప్రశంసించారు. వివిఎస్ లక్ష్మణ్ సర్ నిరంతరం ప్రోత్సహించడంతో భారత జట్టు ఆటగాళ్లలో స్ఫూర్తిని నింపారన్నారు. మైదానంలో దిగిన ప్రతిసారి లక్ష్మణ్ సర్ చెప్పిందే నిజమైందని కొనియాడారు. పరిస్థితులకు తగ్గట్టుగా ఆడడంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదని, జట్టులో ప్రతి ఒక్కరూ సహాయ సిబ్బందితో కలిసి నిరంతరం శ్రమించామన్నారు. ఈ సిరీస్లో వదిలేసిన క్యాచ్లు మినహా ఎక్కడ ఎటువంటి లోపాలు లేకుండా ఆడామని శ్రేయస్ తెలియజేశారు. ఈ సిరీస్ విజయం క్రెడిట్ మాత్రం శ్రేయస్ దక్కుతుందని వివిఎస్ లక్ష్మణ్ తెలిపాడు. శ్రేయస్ నాయకత్వం ప్రయాణం చాలా కష్టంతో ప్రారంభమైందని, జింబాబ్వే సిరీస్లో సూపర్ కమ్ బ్యాక్ అని లక్ష్మణ్ కొనియాడారు. జట్టులో చాలా మంది యువకులు ఉన్నారని, ఇంగ్లాండ్ సిరీస్ లో నలుగురు మాత్రమ


అమరావతి: ఎంతో భవిష్యత్ ఉన్నగిరిజన బిడ్డ ముర్రం శివాని ఇలా తనువు చాలించడం బాధాకరమని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. కారణాలు ఏమైనా తన కలలు నిజం కాకుండానే విద్యార్థిని దూరమవడం కలచివేస్తోందని అన్నారు. రంపచోడవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ముర్రం శివాని ఆత్మహత్యపై చంద్రబాబు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పిటిఎం వేదికపై ఉత్సాహంగా మాట్లాడిన శివాని బలవన్మరణం ఆవేదన కలిగించిందని, ఆ రోజు తన చదువు, ఉన్నత లక్ష్యాలపై శివాని చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. శివాని మృతిపై పూర్తి దర్యాప్తు జరపాలని అధికారులను ఆదేశించానని అన్నారు. సమస్యలు, కష్టాలు వచ్చినా విద్యార్థులు, యువత ధైర్యంగా నిలబడాలని సూచించారు. ఎవరూ ఒత్తిడి, నిరాశ, నిస్పృహలకు లోనుకావద్దని కోరుతున్నానని, ఎంతటి సమస్యకైనా పరిష్కారం ఉంటుందని పేర్కొన్నారు. తమ బాధ, ఆవేదనను తమ కుటుంబసభ్యులు, స్నేహితులతో పంచుకొండని, ఒత్తిడిని అధిగమించి తమ కలలను నిజం చేసుకునేలా ముందుకు సాగండని సూచించారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు.







ఢిల్లీ: కేంద్రం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవట్లేదని కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధి సౌరవ్ దాస్ ఆరోపించారు. నిరసనకారులపై కేసులు ఉపసంహరించుకుంటామని చెప్పారని అన్నారు. సౌరవ్ దాస్ కీలక ప్రకటనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వివిధ రాష్ట్రాల్లో నిరసకారులపై కేసులు పెడుతున్నారని, కేసులు పెట్టినట్లు పలు రాష్ట్రాల నుంచి తమకు సమాచారం వస్తోందని, కేసుల గురించి సిజెపి లాయర్లను సంప్రదిస్తుందని సూచించారు. ప్రత్యేకించి అసోం, బెంగాల్, బిహార్ లో ఎక్కువ కేసులు పెట్టారని, ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని మంత్రులకు గుర్తుచేస్తున్నామని అన్నారు. రేపటిలోగా దేశవ్యాప్తంగా అన్ని కేసులు ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీలపై నమ్మకంతో ఆందోళన విరమించామని తెలిపారు. కేసులపై మాటతప్పడం నమ్మకం ద్రోహమని, కేసులు పెటడం లక్షలాది విద్యార్థులను వంచించడమేనని మండిపడ్డారు. కేంద్రం చేసిన నమ్మకద్రోహాన్ని యువత అంగీకరించదని సౌరవ్ దాస్ హెచ్చరించారు.

హైదరాబాద్: విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం.. హౌస్ నెం.47’. గతంలో వెంకటేష్ నటించిన ‘నవ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరీ’ సినిమాలకు త్రివిక్రమ్ రచయితగా పని చేశారు. ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే సినిమాను తెరకెక్కిస్తున్నారు త్రివిక్రమ్. ఇక ఈ సినిమాలో వెంకటేష్కు జోడీగా శ్రీనిధి శెట్టి నటిస్తుండగా.. నారా రోహిత్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. తాజాగా వెంకటేష్ పాత్రను పరిచయం చేస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. ఈ సినిమాలో వెంకీ ‘చిట్టిబాబు’గా సందడి చేయనున్నారు. తాజాగా విడుదల చేసిన వీడియో నవ్వులు పూయిస్తుంది. ఇంకెందుకు లేటు వీడియోను మీరు చూసేయండి..

