9630 వార్తలు



నవతెలంగాణ-హైదరాబాద్: హిమచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో పారిశుధ్యకార్మికులు కదంతొక్కారు. 10 శాతం వేతనాన్ని పునరుద్ధరించాలని, ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే 4-9-14 పే స్కేల్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, సిమ్లా ఎన్విరాన్మెంట్, హెరిటేజ్ కన్జర్వేషన్ అండ్ బ్యూటిఫికేషన్ సొసైటీ (SEHB) వెల్ఫేర్ వర్కర్స్ యూనియన్ కింద పనిచేస్తున్న 900 మందికి పైగా పారిశుధ్య కార్మికులు శుక్రవారం నిరవధిక సమ్మెకు దిగారు. ప్రభుత్వం తమ ఉద్యోగాల నుండి తొలగించినా అభ్యంతరంలేదని, తమ డిమాండ్లు అమలు చేసేవరకు పోరాటం […] The post సిమ్లాలో పారిశుధ్యకార్మికుల భారీ ఆందోళన appeared first on Navatelangana.




దేశంలోని ప్రముఖ వాహన తయారీ సంస్థలలో ఒకటైన మహీంద్రా ఎలక్ట్రిక్ విభాగంలో అనేక వాహనాలను విక్రయిస్తోంది. నివేదికల ప్రకారం..ఈ నెలలో ఈ సంస్థ అందిస్తున్న అనేక ఎలక్ట్రిక్ ఎస్యూవీలను కొనుగోలు చేయడం ద్వారా లక్షల రూపాయల వరకు ఆదా చేయవచ్చు. ఈ నెలలో సంస్థ అందిస్తున్న ప్రతి వాహనంపై ఎంత ఆదా చేయవచ్చనే ఇప్పుడు తెలుసుకుందాం. మహీంద్రా XUV 400 మహీంద్రా భారత మార్కెట్లో XUV 400ను అందిస్తోంది. ఈ నెలలో ఈ ఎస్యూవీ కొనుగోలు చేయడం ద్వారా అత్యధిక ఆదాను పొందవచ్చు. నివేదికల ప్రకారం..ఈ నెలలో తయారీదారు ఈ ఎస్యూవీ పై రూ. 2.5 లక్షల వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ ఆఫర్లు నగదు తగ్గింపుల రూపంలో ఉన్నాయి. మహీంద్రా BE6 మహీంద్రా ఈ నెలలో BE6 ఎస్యూవీ పై రూ.2 లక్షల వరకు ఆదా చేసుకునే అవకాశాన్ని అందిస్తోంది. తయారీదారు ఈ అవకాశాన్ని నగదు తగ్గింపు రూపంలో అందిస్తున్నట్లు సమాచారం. మహీంద్రా XEV 9e మహీంద్రా భారత మార్కెట్లో XEV 9e ని కూడా అందిస్తోంది. ఈ నెలలో ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ పై తయారీదారు రూ.1.40 లక్షల వరకు ఆదాను అందిస్తోంది.




నవతెలంగాణ-హైదరాబాద్: పశ్చిమ బెంగాల్ సీఎం సువేంద అధికారి నందిగ్రామ్ నియోజకవర్గానికి రాజీనామా చేశారు. శుక్రవారం అందుకు సంబంధించిన రాజీనామా పత్రాన్ని ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రథీంద్ర బోస్కు అందజేశారు. గత నెల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సువేంద రెండు నియెజకవర్గాల నుంచి పోటీ చేశారు. నందిగ్రామ్, భవానిపూర్ నుంచి బరిలో నిలిచారు. అధికారి తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లో, TMC అభ్యర్థి పవిత్ర కర్ పై 9,665 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. అదే […] The post ‘నందిగ్రామ్’కు బెంగాల్ సీఎం రాజీనామా appeared first on Navatelangana.


నవతెలంగాణ-హైదరాబాద్: వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ పరీక్ష(NEET UG 2026) తేదీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. జూన్ 21వ తేదీ, ఆదివారం రోజున పరీక్ష నిర్వహించనున్నట్లు ఎన్టీఏ వెల్లడించింది. మే 3వ తేదీన జరిగిన నీట్ యూపీ పరీక్ష పేపర్ లీకైన విషయం తెలిసిందే. దీంతో ఆ ఎగ్జామ్ను ఎన్టీఏ రద్దు చేసింది. అయితే విద్యార్థులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వం రీ ఎగ్జామినేషన్ తేదీని ప్రకటించింది. ఎన్టీఏకు చెందిన అధికార […] The post జూన్ 21న నీట్-యూజీ పరీక్ష appeared first on Navatelangana.


నవతెలంగాణ-హైదరాబాద్ : ఆఫ్రికా దేశం కాంగోలో ఎబోలా వైరస్ మళ్లీ విజృంభించింది. తాజా నివేదికల ప్రకారం, ఇప్పటివరకు 65 మంది మరణించగా, సుమారు 246 అనుమానిత కేసులు నమోదయ్యాయి. ఆఫ్రికా CDC సేకరించిన 20 శాంపిల్స్లో 13కి ఎబోలా సోకినట్లు ప్రాథమిక పరీక్షల్లో తేలింది. ఇటూరి ప్రావిన్స్లో అత్యధిక మరణాలు సంభవించాయి. దీంతో, కాంగో సరిహద్దు దేశాలైన ఉగాండా, సౌత్ సూడాన్లను సీడీసీ అప్రమత్తం చేసింది. 1976లో కాంగోలోనే ఎబోలా తొలి కేసు నమోదైంది. The post ఎబోలా వైరస్ కలకలం..65 మంది మృతి! appeared first on Navatelangana.


లక్నో: ప్యాంట్, షర్ వేసుకుంటుందని భార్యను భర్త హత్య చేసి అనంతరం అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం గోరఖ్పూర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... షాదాబ్ (25) అనే యువకుడు, మేనమామ కూతురు నిఖత్ నిషాను(24) పెళ్లి చేసుకున్నాడు. షాదాబ్ తండ్రి దుబాయ్ లో పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. షాదాబ్ పెళ్లైన తరువాత ఉద్యోగం లేకపోవడంతో పలుమార్లు ఉద్యోగం చూసుకోవలని భార్య హెచ్చరించింది. మేనమాయ కుటుంబ ముంబయిలో ఉండడంతో నిఖత్ ప్యాంట్, టీ షర్ట్ ధరించేది. షాదాబ్ గ్రామంలో ఉండడంతో అతడి కట్టుబాట్లు ఎక్కువగా ఉండేవి. భార్యను పలుమార్లు టీ షర్ట్, జీన్స్ ప్యాంటు వేసుకోవద్దని హెచ్చరించాడు. దీంతో ఇద్దరు మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. భార్య చంపి అనంతరం అతడు ఉరేసకున్నాడు. గదిలో నుంచి ఉలుకుపలుకు లేకపోవడంతో స్థానికుల సహాయంతో బలవంతంగా డోర్ ను ఓపెన్ చేసి చూడగా ఇద్దరు విగతజీవులుగా పడి ఉన్నారు. పోలీసులు కేసు న మోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో వాట్సప్ సందేశాలలో చాటింగ్ ఉండడంతో ఇద్దరు మధ్య గొడవ జరిగినట్టు తెలిసింది.



హైదరాబాద్: మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. గోకుల్ ఫ్లాట్స్లో సిఎ చదువుతున్న కుమ్మరి జనార్ధన్ అనే యువకుడుఅనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తన గదిలో ఉరికి వేలాడుతూ ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గదిలో రక్తపు మరకలు కూడా ఉండటంతో జనార్థన్ మృతిపై తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


