22285 వార్తలు




నవతెలంగాణ -ముధోల్ రెండు మెగావాట్ల పీఎం-కుసుమ్ సోలార్ ప్రాజెక్ట్ నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోని పిప్రి శివారులో రైతు పొద్దుటూరు ప్రేమలతాదేవి కిష్టరెడ్డి వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు కావటం తో గ్రిడ్ కు అనుసంధానంచేశారు. సోమవారం మధ్యాహ్నం ఎన్పీడీసీఎల్, రెడ్కో అధికారులు ఎస్ఈ జె.సుభాష్,డీఇఇ తిలక్, సమీప 33/11 కేవీ తరోడ సబ్ స్టేషన్ వద్ద గ్రిడ్కు విజయవంతంగా అనుసంధానం చేసి సాంకేతిక పరీక్షలు నిర్వహించారు. సందర్భంగా ఎస్ఈ జె సుభాష్ మాట్లాడుతూ.. రైతులు తమ పంటపొలాల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి […] The post గ్రిడ్ కు సోలార్ ప్రాజెక్ట్ అనుసంధానం appeared first on Navatelangana.


నవతెలంగాణ-కుభీర్ మండలంలోని సిరిపెల్లి తండా 3కు చెందిన మాజీ సర్పంచ్ జాదవ్ విజయ్ ఇటీవల కొన్ని రోజుల కిందట గుండె పోటుతో మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న ముధోల్ నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నారాయణ్ రావు పటేల్ సోమవారం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలు గుర్తు చేసి కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారి కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ అండగా […] The post బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే appeared first on Navatelangana.

చిత్తు కాగితాలపై బిల్లులు రాసిస్తే కఠిన చర్యలు : ఏఓ రాజు నవతెలంగాణ-మద్నూర్ఈమధ్య నవతెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన ఓ శీర్షికకు స్పందన లభించింది. “నిబంధనలు పాటించని ఫర్టిలైజర్ దుకాణ యజమానులపై చర్యలు” అనే వార్తకు మండల వ్యవసాయ అధికారి రాజు స్పందించారు. ఇందులో భాగంగా సోమవారం ఆయన మద్నూర్ మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ షాపులను మళ్ళీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఫార్టిలైజర్ షాప్ యజమానులను హెచ్చరిస్తూ..చిత్తు కాగితాలపై బిల్లులు ఇస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని, రైతులకు […] The post నవతెలంగాణ వార్తకు స్పందన appeared first on Navatelangana.

హాంగ్ఝౌలో జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్లో హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్ అదరగొట్టింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో ఒలింపిక్ పతక విజేత మనూ బాకర్ను ఓడించి స్వర్ణ పతకం సాధించింది. ఫైనల్లో ఈ హైదరాబాదీ షూటర్ నిలకడగా ప్రదర్శించి 40 హిట్స్తో బంగారు పతకాన్ని గెలుచుకుంది. ఈ పోటీలో కాంస్య పతకం కోసం మనూ బాకర్ పోరాడాల్సి వచ్చింది. షూట్ ఆఫ్ను దాటుకుని వచ్చిన మనూ.. 28 హిట్స్తో మూడో స్థానంలో నిలిచింది. అంతకు ముందు జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్లో భారత షూటర్లు సత్తా చాటారు. మనూ బాకర్ 586-20x స్కోర్తో అగ్రస్థానంలో నిలవగా.. 21 ఏళ్ల ఇషా సింగ్ 585-18x స్కోర్తో రెండో స్థానంలో నిలిచింది. అయినప్పటికీ ఫైనల్లో మాత్రం అదిరిపోయే ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని కొల్లగొట్టింది.



నవతెలంగాణ-మద్నూర్మండలంలోని పెద్ద షక్కర్గ గ్రామంలో రెండో విడత మంజురమైన ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి ఆ గ్రామ సర్పంచ్ విశాలాక్షి రాం పటేల్ సోమవారం మార్కౌట్ వేయించి, భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు సహకారంతో పెద్ద షక్కర్గా గ్రామంలో అర్హులైన, గుడిసెల్లో నివసించే ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారని తెలిపారు. నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పని చేస్తుందని, అర్హులైన ప్రతి […] The post రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమిపూజ appeared first on Navatelangana.

నవతెలంగాణ-మద్నూర్మండల పరిధిలోని హెచ్ కేలూర్ లో కొందరు వ్యక్తులు గ్రామ పంచాయతీ స్థలాలను ఆక్రమించి, మురికి కాలువలను కబ్జా చేసి, షెడ్లను ఏర్పాటు చేసుకుని, వీటిమీద వ్యాపారాలు చేసుకుంటూ ఏండ్లుగా జీవనం సాగిస్తున్నారు. అదేవిధంగా రామ్ నగర్, బీసీ కాలనీలలో కూడా జీపీ స్థలాలు కబ్జాకు గురయ్యాయి. ఈ విషయం అందరికీ తెలిసిన విషయమే అయినా గత పాలకులు ఏనాడు పట్టించుకోలేదు. అయితే తాజాగా గ్రామపంచాయతీ పాలకవర్గం కబ్జాకు పాల్పడిన వ్యక్తులను అందరినీ వదిలేసి, కేవలం ఒకే […] The post తహశీల్దార్, ఎంపీడీఓలకు హెచ్ కేలూరు గ్రామస్తుల వినతి appeared first on Navatelangana.

నవతెలంగాణ-హైదరాబాద్: ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ ఢిల్లీలోని రాజ్ఘాట్ను సందర్శించారు. ఆయన సతీమణితో కలిసి మహాత్మా గాంధీకి నివాళులర్పించారు.నీట్ పేపర్ లీకేజీని వ్యతిరేకిస్తూ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ ఢిల్లీలోని మెదాంత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆరోగ్యం కుదటపడటంతో వైద్యులు ఆయనను సోమవారం డిశ్చార్జ్ చేశారు. కాగా, నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా […] The post మహాత్మా గాంధీకి వాంగ్ చుగ్ నివాళి appeared first on Navatelangana.


నవతెలంగాణ-హైదరాబాద్: హైడ్రా కమిషనర్ పదవి నుంచి రంగనాథ్ను తొలగించాలంటూ తెలంగాణ హైకోర్టు.. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి (సీఎస్) కీలక ఆదేశాలు జారీ చేసింది. సెక్రటరీ ర్యాంక్ స్థానంలో ఉన్న ఉన్నతాధికారి.. కోర్టు ఉత్తర్వులను ధిక్కరించడం ఏ మాత్రం సమంజసం కాదని ధర్మాసనం పేర్కొంది. అర్హత కలిగిన అధికారిని హైడ్రా కమిషనర్గా నియమించాలని హైకోర్టు సూచించింది. 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం.. లోతుకుంట ప్రైవేటు భూములపై హైడ్రా జోక్యాన్ని తప్పుబట్టింది. హైడ్రా […] The post 63 కోర్టు ధిక్కరణ కేసులు.. హైడ్రా కమిషనర్ ను తొలగించాలి appeared first on Navatelangana.





ఢిల్లీ: కొత్త బొగ్గుబ్లాక్ ల వేలంలో సింగరేణి సంస్థ పాల్గొనకుండా మాజీ సిఎం కెసిఆర్ అడ్డుకున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఆనాడు కెసిఆర్ అవలంభించిన వైఖరి వల్ల సింగరేణికి కొత్త బ్లాక్ లు లేకుండా పోయాయని అన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కెసిఆర్..సింగరేణి వ్యతిరేక విధానాలు అవలంభించారని విమర్శించారు. ప్రభుత్వం చొరవ తీసుకుంటే ఆనాడే నైనీ కోల్ బ్లాక్ సింగరేణికే దక్కేవని, ఇవాళ కేంద్రం చొరవ తీసుకుని తాడిచర్ల2 కోల్ బ్లాక్ సింగరేణికి దక్కిందని కిషన్ రెడ్డి తెలియజేశారు. తాడిచర్ల1 కోల్ బ్లాక్ సింగరేణికి దక్కకుండా కెసిఆర్ అడ్డుకున్నారని మండిపడ్డారు. ఇప్పుడు సింగరేణికి పోటీగా జెన్ కో వేసిన టెండర్ ఉపహరించుకోవాలని, నైనీ, తాడిచర్ల2, నికెవొసి బ్లాక్ లు సింగరేణికి దక్కితే సంస్థ లాభపడుతుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మూడు కోల్ బ్లాక్ లు సింగరేణికి దక్కితే 6,500 మందికి ఉపాధి లభిస్తుందని, మూడు కోల్ బ్లాక్ ల ద్వారా సింగరేణికి రూ.1.95 లక్షల కోట్ల టర్రోవర్ వస్తుందని అన్నారు. పరీక్షల అక్రమాలకు నిరోధక బిల్లును కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టిందని, చాలా కఠినమైన కొత్త చట్టాన్నిప


ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీసుల్లో ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడిన సంజు శాంసన్ను జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేయలేదు. అయితే అతడిని ఎందుకు తప్పించారని కొందరు ప్రశ్నిస్తే.. మరికొందరు మాత్రం అతడిని పక్కన పెట్టడాన్ని సమర్థించారు. ఇక జింబాబ్వే పర్యటనలో యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ అందరగొట్టాడు. అద్భుతమైన ఆటతీరుతో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు. దీంతో ఇప్పటికైతే ఓపెనింగ్ ప్లేస్ ఖాళఈగా లేదనే చెప్పుకోవాలి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంజు శాంసన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘మన దేశంలో నిరంతరం పోటీ ఉంటుందని తెలుసు. అయితే, 2026 టి-20 ప్రపంచకప్ ముందు ఇందులో నేను భాగం కాకూడదని నిర్ణయించుకున్నా. నా గేమ్ను ఆస్వాదించడంపైనే దృష్ట పెట్టా. దేవుడి దయ వల్ల నేను చాలా సాధించా. ఇప్పుడు నా వయసు 31 ఏళ్లు. ఇంకా చాలా కాలం క్రికెట్ ఆడగలను. అందుకే, సొంత శైలిలోనే ఆడాలని అనుకుంటున్నా. ఎలా బ్యాటింగ్ చేయాలో నాకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సంజు ఎలా ఆడాలో సంజునే డిసైడ్ చేస్తాడు. 2024 వరల్డ్ కప్ తర్వాత 2026లో ఆడతానని అనుకోలేదు. కనీసం 15 మంది స్వ్కాడ్లో కూడా ఉంటానని భావించలేదు. అయినా నాకు అవకాశం వచ్చింది. అనుకోకుండా వచ్చిన ఛాన్స

నవతెలంగాణ-హైదరాబాద్: నీట్ పేపర్ లీకేజ్ ను నిరసిస్తూ ఈ నెల 25న బీహార్ బంద్ కు పిలుపునిచ్చాయి విద్యార్థి సంఘాలు. రాష్ట్రవ్యాప్త బంద్ సందర్భంగా అనేక జిల్లాల్లో విద్యార్థి సంఘాలు భారీ స్థాయిలో నిరసనలు చేపట్టాయి. పలు ప్రాంతాల్లో నిరసనకారులు మరియు పోలీసుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నట్లు సమాచారం.పాట్నాతో పాటు పలు జిల్లాలో విద్యార్థులు భారీ ర్యాలీ తీశారు.అయితే సివాన్ జిల్లాలో చేపట్టిన విద్యార్థుల ర్యాలీపై ఓ కానిస్టేబుల్ ఏకే-47తో కాల్పులు జరిపారు. పలువురు విద్యార్థులు తీవ్రంగా […] The post విద్యార్థులపై ఏకే-47తో కాల్పులు..కానిస్టేబుల్ సస్పెండ్ appeared first on Navatelangana.