9630 వార్తలు

నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక,విద్యా వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం చౌటుప్పల్ పట్టణంలో పుస్తక ప్రదర్శన ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అదనపు కలెక్టర్ భాస్కరరావు ప్రదర్శనను ప్రారంభించి మాట్లాడారు.పుస్తకాలు జ్ఞానానికి నిధులని, పుస్తక ప్రదర్శనలు ప్రతి ఒక్కరి జీవితాల్లో సానుకూల మార్పు తెస్తాయని ఆయన అన్నారు.విద్యార్థులు,యువత పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మున్సిపల్ చైర్పర్సన్ మోగుదాల పావని రమేష్ గౌడ్ చౌటుప్పల్ ఆర్డీఓ వెల్మ శేఖర్ రెడ్డి […] The post పుస్తక ప్రదర్శన…అదనపు కలెక్టర్ భాస్కరరావు ప్రారంభం appeared first on Navatelangana.




చేబ్రోలు: గుంటూరు జిల్లాలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. పాడైన ఆహారం తిని 50 మంది అస్వస్థతకు గురయ్యారు. చేబ్రోలు మండలం కొత్తరెడ్డి పాలెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ కార్యక్రమం సందర్భంగా బుధవారం భోజనాలు వడ్డించారు. ఆ రోజు మిగిలిన బిర్యానీని గురువారం కొందరు గ్రామస్థులు తిన్నారు. అదే రోజు రాత్రి నుంచి 50 మంది వాంతులు, విరేచనాలతో ఇబ్బందులు పడ్డారు. వారిలో 44 మంది కోలుకోగా.. మరో ఆరుగురిని తెనాలి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఫుడ్పాయిజన్ సమాచారం అందుకున్న డిఎంహెచ్వొ విజయలక్ష్మి కొత్తరెడ్డి పాలెం గ్రామాన్ని సందర్శించి స్థానిక వైద్యారోగ్య సిబ్బందికి పలు సూచనలు చేశారు.


నవతెలంగాణ-మద్నూర్: బాన్సువాడలో రూ. 50.00 లక్షల ఎస్ డి ఎఫ్ నిధులతో నిర్మించిన నూతన ఆర్డీఓ క్యాంప్ కార్యాలయ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ప్రజల సమస్యలను అధికారులు సత్వరమే గుర్తించి, పారదర్శకంగా పరిష్కరించే విధంగా పని చేయాలని సూచించారు.ప్రభుత్వ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి, వారి సమస్యలను వినడం మాత్రమే కాకుండా వాటి పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేయాలని కోరారు.ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలకు సేవలు అందించే కేంద్రాలుగా […] The post ప్రజా సమస్యలను అధికారులు సత్వరమే పరిష్కరించాలి: ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు appeared first on Navatelangana.

నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్: సీసీ కెమెరాలు నేరాల నియంత్రణకు ఎంతో ఉపయోగపడతాయని హుస్నాబాద్ ఏసిపి సదానందం అన్నారు శుక్రవారం హుస్నాబాద్ మండలంలోని తోటపల్లి గ్రామంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ బంక లక్ష్మీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను హుస్నాబాద్ ఏసీపీఎస్. సదానందం, హుస్నాబాద్ ఎస్సై పి.లక్ష్మారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బంక చందు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాళ్ ఆధ్వర్యంలో జిల్లాలో గ్రామాల భద్రత కోసం సీసీ కెమెరాల ఏర్పాటు […] The post నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు కీలకం: హుస్నాబాద్ ఏసిపి appeared first on Navatelangana.



నవతెలంగాణ-కంఠేశ్వర్: తెలంగాణ రాష్ట్ర తొలి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ తెలంగాణ విద్యార్థి ఉద్యమ నేత డాక్టర్ పిడమర్తి రవి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో పిడమర్తి రవి పోరాటాన్ని గుర్తుచేసుకొని కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదిగ జేఏసీ జిల్లా నాయకులు విజయ్ మాదిగ,అరుణ్, అన్న బాహుసాటే జిల్లా అధ్యక్షులు గంగాధర్ గాయక్వాడ్, మేనత్కర్ శంకర్, గణేష్ జెట్టే, తదితరులు పాల్గొన్నారు. The post ఘనంగా డాక్టర్ పిడమర్తి రవి జన్మదిన వేడుకలు appeared first on Navatelangana.

ఈరోజుల్లో అనారోగ్యకరమైన జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తోంది. వీటిలో ప్రధానంగా బరువు పెరగడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం ఒక పెద్ద సమస్యగా మారింది. దీంతో చాలామంది కొవ్వును తగ్గిచడానికి జిమ్లో గంటల తరబడి చెమటోడుస్తుంటారు. అయినా ఎలాంటి ఫలితం లేకుండాపోతుంది. అయితే, బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి సరైన ఆహారం తీసుకోవడం మరింత ముఖ్యమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ విషయంలో అధిక ప్రోటీన్ ఉన్న ఆహారాలు చాలా ప్రయోజనకరమైనవిగా పరిగణిస్తున్నారు. ఎందుకంటే ప్రోటీన్ శరీరానికి ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగిస్తుంది. ఇది తరచుగా పదే పదే తినే అలవాటును నివారిస్తుంది. అందుకే బరువు తగ్గించే ఆహార ప్రణాళికలలో ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ నేపథ్యంలో బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి సహాయపడే ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా? బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి సహాయపడే అధిక ప్రోటీన్ ఆహారాలు ఇవే గుడ్లు గుడ్లు అత్యంత సులభమైన, ప్రభావవంతమైన అధిక ప్రోటీన్ ఆహారాలలో ఒకటి. వాటిలో మంచి మొత్తంలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, అవసరమైన విటమిన్లు

నవతెలంగాణ-మిరుదొడ్డి: నేరాలు అరికట్టడానికి సీసీ కెమెరాలు ఎంతో ప్రాముఖ్యతమని దుబ్బాక సీఐ రాజేష్, ఎస్సై హరీష్ లు అన్నారు.అక్బర్ పేట భూంపల్లి మండలం బేగంపేట గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎవరైనా అనుమానితులుగా కనబడితే వెంటనే పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని తెలిపారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వలన ఎవరైనా నిందితులను సులువుగా గుర్తించవచ్చని అన్నారు. నేరాలు అరికట్టడానికి ఎంతో ముఖ్యమన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చంద్రశేఖర్తో […] The post నేరాలు అరికట్టడానికి సీపీ కెమెరాలో ఎంతో అవసరం appeared first on Navatelangana.

నవతెలంగాణ- అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లాలో పశువులు (మూగజీవాలు) అక్రమ రవాణాపై ప్రత్యేక నిగా పెట్టినట్లు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ తెలిపారు. బక్రీద్ పండుగను పురస్కరించుకొని శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ పోలీసులను ఆదేశించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా పశువుల అక్రమ రవాణా పై తీసుకుంటున్న చర్యల గురించి శుక్రవారం జిల్లా ఎస్పీ తో నవతెలంగాణ వివరాలు సేకరించింది. పశువుల అక్రమ రవాణాను […] The post పశువుల అక్రమ రవాణా పై ప్రత్యేక నిఘా: ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ appeared first on Navatelangana.

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం పాలనను గాలికొదిలేసిందని బిఆర్ఎస్ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. 70 సార్లు ఢిల్లీకి వెళ్లిన సిఎం రేవంత్ రెడ్డి పాలమూరు-రంగారెడ్డిపై మాట్లాడలేదని అన్నారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు పాలమూరు-రంగారెడ్డిని సందర్శించిన దాఖలేవని విమర్శించారు. కాంగ్రెస్ వచ్చాక ఒక్క ఎకరాకు సాగునీరు ఇచ్చారా? అని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. మక్కజొన్న, వరి రైతులు అరిగోస పడుతున్నారని, తరుగు పేరుతో రైతులను దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. బిఆర్ఎస్ సాగునీరు ఇవ్వలేదని కొందరు మాట్లాడుతున్నారని, తెలంగాణ రాక ముందు యాసంగిలో 4-5 లక్షల ఎకరాల్లో వరిసాగు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2026 యాసంగిలో 65 లక్షల వరిసాగు, జలసంపద, పాడి పంటలు వృద్ధి చేసి తెలంగాణ దశదిశను మార్చామని నిరంజన్ రెడ్డి తెలియజేశారు. ట్రాన్స్ ఫోర్ట్ టెండర్లు అనర్హులకు ఇవ్వడం వల్లే సమస్య అని నిరంజన్ రెడ్డి ధ్వజమెత్తారు.

నవతెలంగాణ-మల్హర్రావు: అంగన్ వాడి కేంద్రాలకు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో టీచర్లు, ఆయాలు చిన్నారులకు,బాలింతలకు,చిన్న పిల్లల తల్లులకు తదితర లబ్ధిదారులకు పోషకాహారాలను ఇంటింటా వెళ్లి సరుకులు పంపిణీ చేయాలని మండల ఎంపిడిఓ క్రాoతికుమార్ ఆదేశించారు. శుక్రవారం కొయ్యుర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ కొండ రాజమ్మతో కలిసి బాలింతలకు,చిన్నారులకు,చిన్న పిల్లల తల్లులకు గుడ్లు,పప్పులు,పాల ప్యాకేట్స్, ముర్కులు,పల్లి పట్టీలు,బాలామృతం తదితర పోషకాహారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్ వాడి సిబ్బంది, లబ్ధిదారులు పాల్గొన్నారు. The post బాలింతలకు సరుకుల పంపిణీ appeared first on Navatelangana.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటేనే ఫ్యాన్స్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. స్టేడియంలో ఈ మ్యాచ్లు చూసేందుకు అభిమానులు క్యూలు కడతారు. లేని పక్షంలో టివి, మొబైల్ ఇలా తమకు అందుబాటులో ఉన్న పరికరంలో ఈ మ్యాచ్లు వీక్షిస్తారు. అందుకే ఐపిఎల్కి ఎక్కడా లేనన్ని వ్యూస్ వస్తాయి. ఇక ప్రస్తుతం జరుగుతున్న ఐపిఎల్కి కూడా ఏ మాత్రం ఆదరణ తగ్గలేదు. మొన్నటి వరకూ ఎన్నికల హడావుడి ఉన్నా.. దాన్ని తట్టుకొని మరీ అద్భుత గణాంకాలను నమోదు చేసింది. ఐపిఎల్ చరిత్రలోనే అత్యధిక వ్యూయర్షిప్ ఈ సీజన్లో రావడం గమనార్హం. టివి, డిజిటల్ వ్యూస్లో భారీ పెరుగుదల కనిపించింది. రెండు ఫ్లాట్ఫామ్ల్లో 1.1 బిలియన్ వ్యూస్ వచ్చినట్లు జియో హాట్స్టార్ వెల్లడించింది. టివి వ్యూయర్షిప్ 50 కోట్ల మార్క్ను తాకింది. ఇటు డిజిటల్ విభాగంలో 15 శాతం వృద్ధి నమోదు చేసినట్లు జియో వెల్లడించింది. ఇందులో మ్యాచ్లను వీక్షించిన సమయం 7 శాతం పెరిగిందని తెలిపింది. స్థానిక భాషల్లోనూ 42 శాతం పెరగడం గమనార్హం. ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా మారడంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం లేకపోలేదు.

నవతెలంగాణ-హైదరాబాద్: రోజురోజుకు రూపాయి విలువ పడిపోతుంది. శుక్రవారం యూఎస్ డాలర్ తో పోలిస్తే.. రూపాయి విలువ 0.3 శాతం క్షీణించి 96.07 వద్దకు పడిపోయింది. గత సెషన్లో రూపాయి విలువ 95.9575 కనిష్టానికి చేరుగా.. తాజాగా మరింత పతనమై కొత్త రికార్డును నమోదు చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (Crude Oil) ధరలు పెరగడం, విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడిదారులు (FPIs) భారత మార్కెట్ల నుంచి నిధులను ఉపసంహరించుకోవడం.. అంతర్జాతీయ మార్కెట్లో అమెరికన్ డాలర్ మరింత బలపడటానికి […] The post క్షిణించిన రూపాయి విలువ appeared first on Navatelangana.

జియో, ఎయిర్టెల్ భారతదేశంలోని రెండు ప్రముఖ టెలికాం ఆపరేటర్లు. రెండూ సంస్థలు రూ.349 ధరతో ప్రీపెయిడ్ ప్లాన్ను అందిస్తున్నాయి. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలు దాదాపు ఒకేలా ఉన్నప్పటికీ, వినియోగదారులకు అందించే అదనపు ప్రయోజనాలలో తేడా ఉంటుంది. ఈ ప్లాన్లు రోజువారీ డేటా వినియోగం, అపరిమిత కాల్స్, వ్యాలిడిటీ పీరియడ్స్ పరంగా ఒకే రకమైన ప్రయోజనాలను అందిస్తాయి. అయితే, అందించే అదనపు సేవల్లోనే ప్రధాన వ్యత్యాసం ఉంది. జియో, ఎయిర్టెల్ తమ ప్లాన్లలో అదనపు డిజిటల్ కంటెంట్ను చేర్చడం ద్వారా వినియోగదారులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తాయి. ఇప్పుడు జియో రూ.349, ఎయిర్టెల్ రూ.349 ప్లాన్లను చూద్దాం. జియో రూ. 349 ప్రీపెయిడ్ ప్లాన్జియో రూ. 349 ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ప్రతిరోజూ 2GB వేగవంతమైన ఇంటర్నెట్ వినియోగంతో పాటు, మొత్తం 56GB డేటాను అందిస్తుంది. కస్టమర్లు అపరిమిత టాక్ టైమ్, రోజుకు 100 SMSలను కూడా పొందవచ్చు. ఈ ప్లాన్లో మూడు నెలల ఉచిత జియోహాట్స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్, 50GB జియోఏఐ క్లౌడ్ స్టోరేజ్ వంటి అదనపు ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రీఛార్జ్తో జియో రూ. 35,100 విలువైన 18 నెలల గూగుల్

హైదరాబాద్: జహీరాబాద్ ను పారిశ్రామిక కారిడార్ గా మారుస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. గ్రామంలో కాలుష్య నీరు ప్రవహించకుండా రీసైక్లింగ్ చేస్తున్నారని అన్నారు. సంగారెడ్డి జిల్లా తోగర్ పల్లి-అలియాబాద్ లో కెజిఎస్ పరిశ్రమకు మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. యువత నైపుణ్యాలు మెరుగుపర్చి రాష్ట్రాన్ని శక్తిమంతంగా మార్చేందుకు చర్యలు చేపట్టామని, పరిశ్రమలు, పెట్టుబడుల కోసం పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నామని తెలియజేశారు. పెట్టుబడుల ద్వారా యువతకు ఉపాధి అవకాశాల కోసం..జాతీయ ఉత్పత్తిలో రాష్ట్రంలో వాటా 10 శాతం ఉండేలా కృషి చేస్తున్నామని అన్నారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. క్యూర్, ప్యూర్, రేర్ ప్రాంతాలుగా గుర్తించి ముందుకు సాగుతున్నామని, వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు కేంద్రం తోడ్పాటు కావాలని శ్రీధర్ బాబు కోరారు.

నవతెలంగాణ-హైదరాబాద్: మూడో దఫా ఓటర్ల జాబితా సవరణకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్దమైన విషయం తెలిసిందే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్ మూడో దశ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. వచ్చే నెల 21 నుంచి తెలంగాణలో సర్ ప్రక్రియ మొదలు కానుంది. ఈక్రమంలోనే కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డిని […] The post బండి సంజయ్, కిషన్ రెడ్డి దొంగ ఓట్లతోనే గెలిచారు: కాంగ్రెస్ appeared first on Navatelangana.

ఐపిఎల్లో పంజాబ్ కింగ్స్పై ముంబై ఇండియన్స్ సంచలన విజయం సాధించింది. ఈ అద్భుతమైన విజయంతో పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్ ఆశలను సంక్లిష్టం చేసింది. ఈ విజయంలో తిలక్ వర్మ కీలక పాత్ర పోషించాడు. తన 75 పరుగుల అజేయమైన ఇన్నింగ్స్తో ముంబైని గెలిపించాడు. ఈ సందర్భంగా అతడు చేసుకున్న సెలబ్రేషన్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి. అయితే, ఇవన్నీ రోహిత్ శర్మ కోసమే అని ఆ తర్వాత తిలక్ వర్మ తెలిపాడు. ‘45’ అంకెలను చూపిస్తూ.. ఇది నీ కోసమని చెప్పడం విశేషం. దీంతో డగౌట్లో ఉన్న రోహిత్ నవ్వుతూ కనిపించాడు. అనంతరం డ్రెస్సింగ్ రూంలోకి వెళ్లాక.. సైడ్ఆర్మ స్పెషలిస్ట్ ముర్తుజా హుస్సేన్తో రోహిత్, తిలక్ వీడియో కాల్లో మాట్లాడారు. ‘‘మనతో ఆర్ఎస్ 45 ఉన్నారు. నేనెప్పుడు రోహిత్ భాయ్ మాటే వింటా’’ అని తిలక్ హార్ట్ సింబల్ చూపించాడు. అనంతరం తిలక్ ఇన్నింగ్స్ను రోహిత్ ప్రశంసించాడు. తన ఇన్నింగ్స్ను చూడొద్దని తిలక్ ఆటను చూడాలని చెప్పడం గమనార్హం.

నవతెలంగాణ-హైదరాబాద్: ఉన్నావ్ అత్యాచార కేసులో మాజీ బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ కు బెయిల్ మంజూరు చేస్తూ, శిక్షను నిలిపివేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును సుప్రీంకోర్టు శుక్రవారం నిలిపివేసింది. ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది. వీలైతే ఈ అంశాన్ని జూన్ లో కోర్టుల వేసవి సెలవులు ప్రారంభమయ్యే లోపు, తిరిగి నిర్ణయించాలని హైకోర్టును ఆదేశించింది. సెంగార్ కు […] The post ఉన్నావ్ అత్యాచార కేసు: మాజీ బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్కు మరోసారి ఎదురుదెబ్బ appeared first on Navatelangana.