9630 వార్తలు

నవతెలంగాణ-డిచ్పల్లి: ఇందల్ వాయి మండల కేంద్రంలోని తిర్మన్ పల్లి, వెంగల్ పాడ్ గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం తహసిల్దార్ గుర్రం బాలయ్య ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. కొనుగోలు కేంద్రాలలో రైతులు పడుతున్న ఇబ్బందులు తదితర విషయాలను, రైతులకు, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇంచార్జీ లను అడిగి తెలుసుకుని జిల్లా స్థాయి అధికారులకు కొనుగోలు,లారిలు, రైస్ మిల్లర్లు తదితర వాటిపై ఫోన్లో వివరించారు. ధాన్యాన్ని వెంటది వెంట కంట చేస్తూ లారీలలో ధాన్యాన్ని కేటాయించిన రైస్ […] The post కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన తహసిల్దార్ appeared first on Navatelangana.

దశాబ్దాలుగా కొనసాగుతున్న మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఉన్న భోజ్శాల/ -కమాల్ మౌలా మసీదు సముదాయంలోని వివాదాస్పద ప్రాంతంపై అక్కడి హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ వివాదాస్పద స్థలం దేవీ సరస్వతి ఆలయానికే చెందుతుందని ఇందౌర్ ద్విసభ్య ధర్మాసనం హిందూ పిటిషనర్లకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ సందర్భంగా 2003లో భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ) జారీ చేసిన, భోజ్శాల ప్రాంగణంలో ముస్లింలకు శుక్రవారం ప్రార్థనలు నిర్వహించేందుకు అనుమతి ఇచ్చిన ఉత్తర్వులను కోర్టు రద్దు చేసింది. అయితే భోజ్శాల నిర్వహణ బాధ్యతలు భారత పురావస్తు శాఖ ఆధీనంలోనే కొనసాగుతాయని కోర్టు స్పష్టం చేసింది. కానీ ఆ ప్రదేశంలో మతపరమైన ఆచారాలు, పూజలు నిర్వహించే హక్కు మాత్రం హిందూ పక్షానికేనని పేర్కొంది. ఈ ఆలయంలో సరస్వతి విగ్రహం ఏర్పాటు చేసుకోవచ్చని కేంద్రానికి సూచించింది.ముస్లిం సమాజం కోసం జిల్లా పరిధిలో వేరే ప్రదేశంలో మసీదు నిర్మాణానికి భూమి కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించాలని కూడా కోర్టు సూచించింది. న్యాయమూర్తులు విజయ్కుమార్ శుక్లా, అలోక్ అవస్థి ధర్మాసనం తమ తీర్పులో భోజ్శాలలో సంసృ్కత విద్యాకేంద్రం, దేవీ సరస్వతి ఆలయం ఉన్నట్లు


దేశవ్యాప్తంగా ఈనెల 20న మెడికల్ షాపులు బంద్ కానున్నాయి.ఈ బంద్ కారణంగా సాధారణ మందుల కొనుగోలు ఒకరోజు పాటు తీవ్రంగా ప్రభావితం కానుంది. ఈ బంద్లో సుమారు 12.40 లక్షలకు పైగా కెమిస్టులు, ఫార్మాస్యూటికల్ డిస్ట్రిబ్యూటర్లు పాల్గొంటారని ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్(AIOCD) తాజాగా ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ నేపథ్యంలో అత్యవసర మందులను ముందుగానే కోనుగోలు చేయాలని వారు కోరుతున్నారు. ఏఐఓసిడి ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలోని మెడికల్ షాపులు, కొన్ని ఔషధ సరఫరా సంస్థలు కూడా బంద్ కానున్నాయి. ఆన్ లైన్ ఫార్మసీలు భారీ డిస్కౌంట్లు ఇస్తూ చిన్న మెడికల్ షాపులకు నష్టం కలిగిస్తున్నాయని కెమిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్న ఫార్మసీ కంపెనీలు ఈ పోటీని తట్టుకోలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని వారు చెబుతున్నారు.

ఇప్పుడు పెంచిన పెట్రోల్, డీజిల్ ధరల మూలంగా సాధారణ మధ్యతరగతి ప్రజానికం పై నిత్యవసర సరుకుల ధరలు పెరిగి ప్రజలపై మరింత భారం పడుతుందని ఇది సరైన పద్ధతి కాదని ,ప్రభుత్వం వెంటనే పెంచిన ధరలను తగ్గించాలని ఐదు రాష్ట్రాల ఎన్నికల కన్నా ముందు ప్రజలకు చెప్పిన మాటను నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేనియెడల రాబోయే కాలంలో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని ఆయన హెచ్చరించారు. రేపు పార్టీ ఆధ్వర్యంలో ఆయా […] The post పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలి appeared first on Navatelangana.

నవతెలంగాణ-జన్నారం: వరి కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యం లారీలను రైస్ మిల్లుల వద్ద త్వరగా అన్లోడ్ చేయాలని డీఎస్వో బ్రహ్మయ్య, డీఎం శ్రీలత ఆదేశించారు. శుక్రవారం జన్నారం మండలం మొర్రిగూడ సమీపంలోని రాఘవేంద్ర రైస్ మిల్లును వారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం నిల్వలు, అన్లోడ్ ప్రక్రియను పరిశీలించి యజమానులకు పలు సూచనలు చేశారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా, లారీలు వేచి ఉండకుండా చూడాలని స్పష్టం చేశారు. ఎంపీడీవో ఉమర్ షరీఫ్ తాసిల్దార్ నక్కయ, మార్కెట్ […] The post రైస్ మిల్లుల్లో అధికారుల ఆకస్మిక తనిఖీ appeared first on Navatelangana.


హైదరాబాద్: కేంద్ర మంత్రి బండి సంజయ్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. ఫోక్సో కేసులో భవిష్యత్తులో తన పేరు వాడొద్దని పిటిషన్ వేశారు. తన పేరుతో ఇప్పటివరకు వాడిన వీడియోలు తొలగించేలా ఆదేశాలు జారీ చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. మరోవైపు బండి భగీరథ్ కేసులో బాలిక వివరాలు సోషల్మీడియాలో ప్రసారం కావడంపై కేసు నమోదైంది. బాలిక ఫోటోలు, వీడియోలు, తల్లిదండ్రుల వివరాలు ప్రసారంపై కేసు నమోదు చేశారు. మేడ్చల్ జిల్లా బాలల సంక్షేమ కమిటీ ఛైర్పర్సన్ ఫిర్యాదు మేరకు పేట్ బషీరాబాద్ పోలీసులు చర్యలు చేపట్టారు. సోషల్మీడియా నిర్వాహకులపై కేసులు పెట్టినట్లు తెలిపారు.

పోక్సో కేసులో కానిస్టేబుల్ కి 30 ఏళ్ల జైలు శిక్ష పడింది. బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో ఫోక్సో స్పెషల్ కోర్టు తీర్పు వెల్లడించింది. పోలీస్ కానిస్టేబుల్ వరదరాజ్ సుదేశ్ పై నమోదైన అత్యాచారం, పోక్సో కేసులో నేరం రుజువు కావడం తో పోక్సో ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పింది. నిందితుడికి రూ.12000 జరిమానాతో పాటు 30 ఏళ్ళు కఠిన కారాగార శిక్ష విధించింది. అలాగే బాధిత బాలికకు రూ.1 లక్ష పరిహారం చెల్లించాలని ఆదేశించింది.

నవతెలంగాణ-జన్నారం: రాబోయే బక్రీద్ పండుగను పురస్కరించుకొని పశువుల అక్రమ రవాణాను అరికట్టడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మంచిర్యాల ఏసీపీ ఆర్.ప్రకాష్ జన్నారం పోలీస్ స్టేషన్ పరిధిలోని కలమడుగు గ్రామం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక చెక్పోస్టును తనిఖీ చేశారు.ఈ సందర్భంగా చెక్పోస్టు వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ఏసీపీ పలు కీలక సూచనలు చేశారు.ఆయన మాట్లాడుతూ, పండుగ నేపథ్యంలో పశువులను అక్రమంగా తరలించే వాహనాల తనిఖీల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం […] The post పశువుల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా appeared first on Navatelangana.

నవతెలంగాణ-జన్నారం: పోనకల్ గ్రామపంచాయతీలోని ఆశ్రమ పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భాగంగా ఆశ్రమ పాఠశాల కాంపౌండ్ వాల్ను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. పాఠశాలలు ప్రారంభానికి ముందే ప్రహరీ గోడ నిర్మాణాన్ని పూర్తిచేసి విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు.కార్యక్రమంలో తహసీల్దార్ బక్కాయ, ఎంపిడిఓ ఉమర్ షరీఫ్, మార్కెట్ కమిటీ, AMC చైర్మెన్ లక్ష్మినారాయణ,మాజీ సర్పంచ్ జక్కు భూమేష్,వార్డు సభ్యులు మోసిన్,పంచాయతీ కార్యదర్శి రాహుల్, బిల్ కలెక్టర్ అనిల్ కుమార్ పాల్గొన్నారు. The post కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ appeared first on Navatelangana.

నవతెలంగాణ-జక్రాన్పల్లి: మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన 295/5 సర్వేనెంబర్ ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారిపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయానికి బ్రాహ్మణపల్లి గ్రామస్తులందరూ తరలివచ్చి తమకు న్యాయం చేయాలంటూ తాసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. జిల్లా కలెక్టర్కు ఇచ్చిన ఫిర్యాదు ను కూడా తాసిల్దార్ కు వినతిపత్రం సమర్పించారు. తొరికొండ గ్రామానికి చెందిన దుబ్బాల చిన్న దేవన్న బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన ప్రభుత్వ […] The post బ్రాహ్మణపల్లి అసైన్మెంట్ భూమి కబ్జా.. కలెక్టర్కు ఫిర్యాదు appeared first on Navatelangana.

నవతెలంగాణ-ఆర్మూర్: ప్రజా పాలన ప్రగతి పాలనలో భాగంగా పట్టణ శాఖ గ్రంథాలయంలో శుక్రవారం పుస్తక ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్ పర్సన్ గోనే లహరి హాజరై పుస్తక ప్రదర్శనను సందర్శించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ నిర్వహకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో లైబ్రేరియన్ స్వామి, కృప, లైబ్రరీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. The post పట్టణ లైబ్రరీలో పుస్తక ప్రదర్శన appeared first on Navatelangana.


నవతెలంగాణ-చౌటుప్పల్రూరల్: చౌటుప్పల్ మండలం చిన్నకొండూరు గ్రామంలో శుక్రవారం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రధాన శాస్త్రవేత్త ప్రభావతి మాట్లాడుతూ.. రైతులకు పలు సూచనలు చేశారు.ఎకరానికి 2 బస్తాల యూరియా మాత్రమే వాడాలని, వానాకాలంలో సర్టిఫైడ్ విత్తనాలనే వినియోగించాలని సూచించారు. సాగు ఖర్చులు తగ్గించుకోవాలని, పచ్చిరొట్ట ఎరువుగా జీలుగ వేసి కలియదున్నాలని కోరారు. సర్టిఫైడ్ పురుగు మందులను మాత్రమే కొనుగోలు చేయాలని, నారుమడిలో 2 కేజీల గుళికలు వేయాలని […] The post రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు appeared first on Navatelangana.


నవతెలంగాణ-బెజ్జంకి: మండల పరిధిలోని వడ్లూర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలను ఎస్ఐ తిరుపతి ఏఎంసీ చైర్మన్ పులి క్రిష్ణ,పంచాయతీ పాలక వర్గం సభ్యులతో కలిసి శుక్రవారం ప్రారంభించారు.సీపీ రష్మీ పెరుమాళ్ చేపట్టిన సురక్ష నేత్రలో సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి గ్రామ రక్షణకు తోడ్పాటును అందించడం సంతోకరమని.. మండలంలోని ప్రజలు శాంతిభద్రతల పరిరక్షణకు సహాయసహకారాలందించాలని ఎస్ఐ కోరారు.స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుడు మంకాలి అనిల్,పలువురు గ్రామస్తులు ఎస్ఐ తిరుపతిని శాలువతో సన్మానించారు.అనంతరం తోటపల్లి గ్రామంలో సీసీ కెమెరాలను […] The post వడ్లూర్లో సీసీ కెమెరాలు ఏర్పాటు appeared first on Navatelangana.

నవతెలంగాణ-కామారెడ్డి: అత్యవసర పరిస్థితులు, విపత్తుల సమయంలో జిల్లా స్థాయి సన్నద్ధత, శాఖల మధ్య సమన్వయం, స్పందన వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన రాష్ట్రస్థాయి టేబుల్టాప్ ఎక్సర్సైజ్లో కామారెడ్డి జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఐడీఓసీసీ కలెక్టరేట్ నుంచి ఆన్లైన్ విధానంలో నిర్వహించబడగా, జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ టేబుల్టాప్ ఎక్సర్సైజ్లో పాల్గొని జిల్లా సన్నద్ధత చర్యలను సమీక్షించారు. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) విక్టర్, అదనపు కలెక్టర్ గిరి (లోకల్ బాడీస్)తో […] The post రాష్ట్రస్థాయి టేబుల్టాప్ ఎక్సర్సైజ్లో పాల్గొన్న కామారెడ్డి జిల్లా అధికారులు appeared first on Navatelangana.

నవతెలంగాణ-మల్హర్రావు: మండల కేంద్రమైన తాడిచెర్ల వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ ఇప్ప మొండయ్యను కాంగ్రెస్ నాయకులు జంగిడి సమ్మయ్య,జనగామ బాపు,బత్తుల తిరుపతి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేసి, శాలువాతో ఘనంగా సన్మానించారు. హైకోర్టు ఉత్తర్వులతో ప్రభుత్వం మళ్ళీ పాత పాలక వర్గాలకు పగ్గాలు అప్పజెప్పిన నేపథ్యంలో మొoడయ్య మళ్ళీ చైర్మన్ బాధ్యతలు చేపట్టడం ద్వారా తాడిచెర్ల సొసైటీ మరింతగా అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడ్డారు. The post పిఏసీఎస్ చైర్మన్ మొండయ్యకు కాంగ్రెస్ నాయకుల సన్మానం appeared first on Navatelangana.

హోసపెటే: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ఢీకొట్టడంతో వంతెనపై నుంచి పడి ఏడాది చిన్నారితో సహా ఆరుగురు మృతి చెందారు. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కొప్పల తాలూకా మునీరాబాద్ వద్ద వంతెనపై ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగే సమయానికి ట్రాక్టర్లో 16 మంది ఉన్నారు. మునీరాబాద్ సమీపంలోని హులిగమ్మ దర్శనానికి ట్రాక్టర్లో భక్తులు వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. మృతులను సండూరు, కూడ్లిగి ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. ఘటనాస్థలాన్ని కొప్పల, విజయనగర ఎస్పీలు పరిశీలించారు.

నవతెలంగాణ-వనపర్తి: భవిష్యత్తులో వచ్చే ప్రకృతి విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కోడానికి జిల్లా యంత్రాంగం కార్యాచరణ సిద్ధం చేసుకున్నట్లు అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్ తెలిపారు. భవిష్యత్తులో వచ్చే పర్యావరణ విపత్తులను ఏవిధంగా ఎదుర్కోవాలి ఎలా సన్నద్ధం కావాలి అనే అంశాల పై కేంద్ర, రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖలు జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల ద్వారా టేబుల్ ప్రాక్టీస్ కు ఆదేశించగా శుక్రవారం కలెక్టర్ ఎన్.ఐ.సి. హాల్లో ఆయా శాఖల అధికారులు టేబుల్ టాప్ శిక్షణ పొందారు. […] The post విపత్తులు ఎదుర్కోవడానికి కార్యాచరణ సిద్ధం: అదనపు కలెక్టర్ appeared first on Navatelangana.


నవతెలంగాణ-మునుగోడు: కల్వకుంట్ల నుండి వెల్మకన్నె వరకు గత రెండు సంవత్సరాల క్రితం మంజూరైన బీటీ రోడ్డు నిర్మాణాన్ని అసంపూర్తిగా వదిలేశారని రోడ్డు పనులు తక్షణమే ప్రారంభించి పూర్తి చేయాలని డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా సహాయక కార్యదర్శి కట్ట లింగస్వామి మాట్లాడుతూ గతంలో ఉపఎన్నికల సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ హామీ ఇచ్చి హామీ ప్రకారంగా శంకుస్థాపన చేయడం జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక […] The post అసంపూర్తిగా వదిలేసిన రోడ్డును తక్షణమే పూర్తి చేయాలి… appeared first on Navatelangana.