22277 వార్తలు

మన తెలంగాణ/హైదరాబాద్ః విద్యార్థుల ఫీజు రీయంబర్స్మెంట్ విడుదల చేయండి ఫ్లీజ్ అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ ఎంపీ వి. హనుమంత రావు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కను కోరారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో విద్యార్థులు ముఖ్య భూమిక పోషించారని ఆయన సోమవారం విలేకరుల సమావేశంలో అన్నారు. తెలంగాణ కోసం ఎంతో మంది విద్యార్థులు మరణించారని, బలిదానాలు చేశారని ఆయన తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఫీజు రియంబర్స్మెంట్ పక్కాగా జరిగిందన్నారు. వైఎస్ ఉన్నంత వరకూ సక్రమంగా జరిగిందని ఆయన చెప్పారు. ఆ తర్వాత రియంబర్స్మెంట్ సక్రమంగా చేయడం లేదన్నారు. వైఎస్ శిష్యునిగా చెప్పుకునే భట్టివిక్రమార్క ఈ విషయంలో ఆలోచన చేయాలని ఆయన కోరారు. బిసిలంతా తనపై వత్తిడి తెస్తున్నారని ఆయన చెప్పారు. కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం తలవంచిందన్నారు. విద్యార్థుల పోరాటం శుభసూచికంగా ఆయన అభివర్ణించారు. ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయడం దేశ రాజకీయాల్లో చరిత్ర సృష్టించిందన్నారు. విద్యారులకు నష్టం జరుగుతుందని ఏఐసిసి అగ్ర నేత రాహుల్ గాంధీ ప్రధాని ఇంటి ముందు ధర్నా చేశారని ఆయన తెలిపారు. 21 ఏళ్ళకే యువత ఎన

చెన్నై: తమిళనాడు సిఎం నటించిన ఆఖరి చిత్రం ‘జన నాయగన్’. అన్ని అడ్డంకులు దాటుకొని ఈ సినిమా జులై 23న విడుదలై మంచి పాజిటివ్ టాక్ని సంపాదించుకుంది. అయితే తాజాగా ఈ చిత్రానికి మరో సమస్య వచ్చి పడింది. చెన్నైలోని కొన్ని థియేటర్లలో ఈ సినిమా షోలను నిలిపివేశారు. సినిమా మధ్యలోనే షోను నిలిపివేయడంతో గందరగోళం నెలకొంది. ఈ చిత్రానికి సెన్సార్బోర్డు ‘ఎ’ సర్టిఫికెట్ జారీ చేసిన విషయం తెలిసిందే. కానీ, సినిమాను ప్రదర్శిస్తోన్న కొన్ని థియేటర్లకు మైనర్లు రావడంతో.. షోను ఉన్నట్టుండి నిలిపివేశారు. ఆదివారం ఉదయం చెన్నైలోని కొన్ని మల్టీప్లెక్స్లలో పోలీసులు హఠాత్తుగా తనిఖీలు చేశారు. ‘ఎ’ రేటెడ్ సినిమాలకు మైనర్లను తీసుకురావడం నిబంధనలకు విరుద్ధం కావడంతో ప్రదర్శనను నిలిపివేశారు. ఈ క్రమంలో పిల్లలతో వచ్చిన తల్లిదండ్రులను బయటకు పంపించేందుకు దాదాపు గంట సమయం పట్టింది. దీంతో షో ఆలస్యం కావడంతో కొన్ని చోట్ల గందరగోళం నెలకొంది. ఈ ఘటన నేపథ్యంలో సెన్సార్ బోర్డు నిబంధనలను కఠినంగా అమలు చేయడంపై మల్టీప్లెక్స్ యాజమాన్యాలు మరింత దృష్టి పెట్టాయి. మైనర్లతో వచ్చే వారిని లోపలికి అనుమతించబోమని స్పష్టం చేశాయి.

న్యూఢిల్లీ: విపక్షాల ఆందోళన నడుమ లోక్సభ మంగళవారానికి వాయిదా పడింది. పేపర్ లీకులకు పాల్పడే వారికి కఠిన శిక్షలు విధించేలా 2014 పరక్షల (అకరమ పద్ధతుల నివారణ’) చట్ట సవరణ బిల్లు ఇవాళ లోక్సభ ముందుకు వచ్చినా.. బిల్లపై చర్చించడం సాధ్యం కాలేదు. ఓ వైపు విపక్షాల ఆందోళనలు కొనసాగుతుండానే.. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఉదయం ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు అనంతరం లోక్ సభను స్పీకర్ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. సభ తిరిగ ప్రారంభమైన వెంటనే.. ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభను అడ్డుకున్నారు. దీంతో స్పీకర్ మరోసారి సభను మధ్యాహ్నం 5 గంటలకు వాయిదా వేశారు. ఆ తర్వాత కూడా చర్చ చేపట్టకుండా విపక్షాలు అడ్డుకున్నాయి. ఈ క్రమంలో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. పేపర్ లీక్ (సవరణ) చర్చకు రాకుండా విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు విమర్శించారు. ఈ బిల్లుపై సభలో మంగళవారం చర్చించి.. అనంతరం ఓటింగ్ నిర్వహించనున్నారు.



యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇటీవలే జాతీయ జట్టులో టి-20ల్లోకి అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ 15 ఏళ్ల కుర్రాడిని వన్డేల్లో కూడా ఆడిస్తే బాగుంటుందని మాజీ ఆటగాడు ఫారూక్ ఇంజనీర్ అభిప్రాయపడ్డారు. రోహిత్కు జోడీగా వైభవ్ను ఓపెనర్గా పంపించి శుభ్మాన్ గిల్ను నాలుగో స్థానంలో ఆడించాలని సూచించారు. దీంతో మిడిలార్డర్ బలంగా మారుతుందని పేర్కొన్నారు. ‘‘గిల్ ఒక క్లాస్ ప్లేయర్. ప్రస్తుతం జట్టులో అతనే అత్యుత్తమ బ్యాటర్ అని నా అభిప్రాయం. అయితే శుభ్మాన్ ఆరంభంలోనే దూకుడగా ఆడే రకం కాదు. వన్డేల్లో ఎడమ, కుడి చేతి వాటం కాంబినేషన్ బాగుంటుంది. రోహిత్కు జోడీగా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటరైన వైభవ్ను పంపాలి. వైభవ్ దూకుడుగా ఆడుతుంటే మరో ఎండ్లో రోహిత్ ఎక్కువగా నాన్స్ట్రైకింగ్ ఎండ్లో ఉండటానికి ప్రయత్నిస్తాడు. వైభవ్ ఉన్నంతసేపు రోహిత్ బ్యాట్కి పని చెప్పాల్సిన అవసరం లేదు. కోహ్లీ మూడు, గిల్ నాలుగో స్థానంలో బ్యాటింగ్కి రావాలి. అప్పుడు బ్యాటింగ్ లైనప్ పటిష్టం అవుతుంది’’ అని ఫారూక్ అన్నారు.



అతిలోక సుందరి శ్రీదేవి నటించిన చివరి సినిమా ‘మామ్’. 2017లో వచ్చిన ఈ థ్రిల్లర్ సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది. 2018లో శ్రీదేవి చనిపోయిన తర్వాత ఈ చిత్రంలో ఆమె నటనకు గాను ఉత్తమ నటిగా జాతీయ పురస్కారం లభించింది. అయితే ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ రాబోతుంది. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్ నటిస్తోంది. ‘ది ఆర్చీస్’ చిత్రంతో తెరంగేట్రం చేసిన ఖుషీ.. ఆ తర్వాత ‘నాదానియాన్’, ‘లవ్యాపా’ వంటి చిత్రాల్లో నటించారు. కానీ, ఆమెకు సక్సెస్ను అందించలేకపోయాయి. దీంతో మామ్ 2తో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు ఈ ముద్దుగుమ్మ సిద్ధమైంది. గిరీశ్ కోహ్లీ దర్శకత్వంలో.. బోనీ కపూర్ నిర్మిస్తున్న ఈ సినిమాని నోయిడా, గ్రీస్ ప్రాంతాల్లో అత్యంత భారీ స్థాయిలో చిత్రీకరించారు. ఈ ఏడాది నవంబర్లో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రంలో జిషు సేన్గుప్తా, కరిష్మా తన్నా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.




ఓటిటిలోకి వచ్చే సినిమాలో ప్రేక్షకులను ఎంత అలరిస్తాయో.. అందులో వచ్చే వెబ్ సిరీస్లకు కూడా అంతే క్రేజ్ ఉంటుంది. అలా మంచి క్రేజ్ సంపాదించుకున్న వెబ్ సిరీస్ ‘వదంది’. 2022లో ఈ సిరీస్ తొలి సీజన్ వచ్చింది. ఎస్జె సూర్య ఇందులో ప్రధాన పాత్ర పోషించారు. తెలుగులో కూడా వచ్చిన ఈ సిరీస్కి ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సిరీస్లో రెండో సీజన్ని కొత్త స్టోరీ, కొత్త పాత్రలతో తెరకెక్కించారు. ఆగస్టు 07 నుంచి అమెజాన్ ప్రైమ్లో ఇది స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. ‘వదంది : ది మిస్టరీ ఆప్ మణి’ పేరిట తీసిన ఈ వెబ్ సిరీస్లో శశి కుమార్ కీలక పాత్ర పోషించారు. ఆండ్రూ లూయిస్ ఈ సీజన్కు దర్శకుడు కాగా స్టార్ డైరెక్టర్స్ పుష్కర్-గాయత్రి క్రియేటివ్ దీన్ని నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సీజన్లో ప్రధాన పాత్రధారి అయిన ఎస్సై చేసిన తప్పు వల్ల ఓ అమాయకుడు జీవిత ఖైదు అనుభవిస్తాడు. తన తప్పు తెలుసుకున్న ఎస్సై.. ఆ వ్యక్తిని ఎలా జైలు నుంచి విడిపించాడు? చివరకు ఏమైంది అనేదే ఈ సిరీస్ స్టోరీ.


సంవత్సరం గడిచినా ప్రారంభం కానీ పనులుమాజీ మున్సిపల్ చెర్మన్ ఎడ్ల నర్సింహ గౌడ్ నవతెలంగాణ-అచ్చంపేటఅచ్చంపేట మున్సిపాలిటీ అభివృద్ధి ప్రశ్నార్ధకంగా మారిందని, సంవత్సరం గడిచినా వివిధ కాలనీలో పనులు ప్రారంభం కాలేదని మాజీ మున్సిపల్ చైర్మన్ ఎడ్ల నరసింహ గౌడ్ విమర్శించారు. సోమవారం మాజీ కౌన్సిలర్లు మన్ను పటేల్ రమేష్ రావులతో కలిసి ఐదవ వార్డులో పర్యటించారు. ఈ క్రమంలో ఆయన స్థానికులను వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ లోని వివిధ వార్డులో ఎక్కడ వేసిన గొంగళి […] The post అచ్చంపేట మున్సిపాలిటీ అభివృద్ధి ప్రశ్నార్థకం appeared first on Navatelangana.





నవతెలంగాణ -ముధోల్ రెండు మెగావాట్ల పీఎం-కుసుమ్ సోలార్ ప్రాజెక్ట్ నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోని పిప్రి శివారులో రైతు పొద్దుటూరు ప్రేమలతాదేవి కిష్టరెడ్డి వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు కావటం తో గ్రిడ్ కు అనుసంధానంచేశారు. సోమవారం మధ్యాహ్నం ఎన్పీడీసీఎల్, రెడ్కో అధికారులు ఎస్ఈ జె.సుభాష్,డీఇఇ తిలక్, సమీప 33/11 కేవీ తరోడ సబ్ స్టేషన్ వద్ద గ్రిడ్కు విజయవంతంగా అనుసంధానం చేసి సాంకేతిక పరీక్షలు నిర్వహించారు. సందర్భంగా ఎస్ఈ జె సుభాష్ మాట్లాడుతూ.. రైతులు తమ పంటపొలాల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి […] The post గ్రిడ్ కు సోలార్ ప్రాజెక్ట్ అనుసంధానం appeared first on Navatelangana.


నవతెలంగాణ-కుభీర్ మండలంలోని సిరిపెల్లి తండా 3కు చెందిన మాజీ సర్పంచ్ జాదవ్ విజయ్ ఇటీవల కొన్ని రోజుల కిందట గుండె పోటుతో మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న ముధోల్ నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నారాయణ్ రావు పటేల్ సోమవారం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలు గుర్తు చేసి కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారి కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ అండగా […] The post బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే appeared first on Navatelangana.

చిత్తు కాగితాలపై బిల్లులు రాసిస్తే కఠిన చర్యలు : ఏఓ రాజు నవతెలంగాణ-మద్నూర్ఈమధ్య నవతెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన ఓ శీర్షికకు స్పందన లభించింది. “నిబంధనలు పాటించని ఫర్టిలైజర్ దుకాణ యజమానులపై చర్యలు” అనే వార్తకు మండల వ్యవసాయ అధికారి రాజు స్పందించారు. ఇందులో భాగంగా సోమవారం ఆయన మద్నూర్ మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ షాపులను మళ్ళీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఫార్టిలైజర్ షాప్ యజమానులను హెచ్చరిస్తూ..చిత్తు కాగితాలపై బిల్లులు ఇస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని, రైతులకు […] The post నవతెలంగాణ వార్తకు స్పందన appeared first on Navatelangana.