22655 వార్తలు

వెలుగుతున్న ఆశ ఒకవైపు, కొనసాగుతున్న అల్పత్వము మరోవైపు. నేడు దేశ కదలికను గమనిస్తుంటే భవిష్యత్తు పట్ల ఆశలు చిగురిస్తున్నాయి. ఏం చేయలేమనే నిరాశ నుంచి ఏదైనా చేయగలమనే ధైర్యం నిండుతోంది. మాకిక తిరుగులేదనుకున్నవారికి తలలు తిరిగేట్టు జరగటం చూస్తుంటే సామాజిక శాస్త్రవేత్తలు చెప్పిన విషయాలు, సిద్ధాంతాలు ఎంత వాస్తవికమైనవో అర్థమవుతున్నది. నిరసనల నిప్పురవ్వ అంటుకుంటే ఎంత దావానలమై ముంచెత్తుతుందో స్పష్టపరిచింది నేటి యువత తిరుగుబాటు. గత 38 రోజులుగా ఢిల్లీ జంతర్ మంతర్లో నిరవధికంగా జరుగుతున్న నిరసన […] The post యువరక్తమూ- అల్పత్వము appeared first on Navatelangana.



కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం విద్యార్థుల విజయమని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై హింస, పెల్లెట్ గన్లు ప్రయోగించిన ఘటనలకు కేంద్ర హోం మంత్రి అమిత్షానే బాధ్యులని ఆరోపించారు. విద్యార్థులపై అణిచివేతను పార్లమెంటులో ప్రశ్నిస్తామని చెప్పారు. ప్రభుత్వం తమ కీలకమైన డిమాండ్లను పరిష్కరించేందుకు అంగీకరించడంతో నిరసనలు విరమిస్తున్నట్టు సీజేపీ ప్రకటించిన అనంతరం మీడియాతో రాహుల్ మాట్లాడుతూ, ప్రపంచంలోనే గొప్పదైన మన విద్యా వ్యవస్థలో కొన్నేళ్లుగా ప్రైవేటీకరణ చొచ్చుకొచ్చిందని. ఆర్ఎస్ఎస్ దొడ్డిదారిన మన విద్యావ్యవస్థలో చొరబడి నాశనం చేసిందని తప్పుపట్టారు. ఇందుకు ప్రతిస్పందనగానే తాజా పరిణామాలు చోటుచేసుకున్నాయని అన్నారు. వ్యవస్థను మెరుగుపరచేందుకు ప్రభుత్వం ఇకనైనా గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రశ్నపత్రాల లీకేజీ, విద్యా వ్యవస్థలో సంస్కరణలపై ఉద్యమం సాగించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఎప్పుడూ ఉంటుందని, వారి హక్కులు, భవిష్యత్తును పరిరక్షించేందుకు ఎప్పుడు ఏ అవసరమున్నా తాము అండగా ఉంటామని హామీ ఇచ్చార

రాయ్పూర్ : ఛత్తీస్గఢ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (సిపిఎస్సి)మాజీ ఛైర్మన్ తమన్సింగ్ సోన్వానీని ప్రశ్నపత్రాల లీక్ వ్యవహారంలో మనీలాండరింగ్ ఆరోపణలపై శనివారం నాడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. ఛత్తీస్గఢ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (సిజిపిఎస్సి) 2020 2021 మధ్యకాలంలో నిర్వహించిన పరీక్షల్లో ప్రశ్నపత్రాలు లీక్ కావడమే కాకుండా తమ బంధువులు, మేనల్లుళ్లు, రాజకీయ నాయకులు, అధికారుల కుటుంబ సభ్యులకు లబ్ధి చేకూరేలా పరీక్ష ఫలితాల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఆయనను విచారించిన తరువాత మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద అదుపు లోకి తీసుకున్నారు. సమాధానాలు చెప్పకుండా దాటవేస్తున్నారని ఈడీ అధికారులు పేర్కొన్నారు. రాయ్పూర్ లోని స్పెషల్ పిఎంఎల్ఎ కోర్టులో హాజరు పర్చిన తరువాత కస్టోడియల్ రిమాండ్కు కోర్టును అభ్యర్ధిస్తారు. 2024లోసిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తరువాత మనీలాండరింగ్ దర్యాప్తు ప్రారంభమైంది. కాలేజీ పేరు చెప్పి సిఎస్ఆర్ విరాళాల కింద దాదాపు రూ 45 లక్షల వరకు లంచాలు వసూలు చేశారని ఈడీ ఆరోపించింది.


నకిలీ కరెన్సీతో వ్యాపారిని మోసం చేసిన ఇద్దరు విదేశీయులను మియాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.10లక్షల నగదు, రసాయనాలు స్వాధీనం చేసుకున్నారు. మియాపూర్ ఇన్స్పెక్టర్ జయరాం, డిఐ విజయ్ నాయక్ శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.ఆఫ్రికాలోని కెమరూన్ దేశానికి చెందిన తురే ఎల్ హాడ్జి మహమనే(49) నగరంలోని ఖజానగర్, అత్తాపూర్లో ఉంటూ ఆన్లైన్ వ్యాపారం చేస్తున్నాడు. నిందితుడు గుజరాత్లో 2022లో మోసం చేయడంతో చీటింగ్ కేసు, హైదరాబాద్లో కేసు ఉంది. ఆఫ్రికాకు చెందిన ట్చౌయాన్యు అడోల్ఫ్ ఆన్లైన్ వ్యాపారం చేస్తు ఢిల్లీలోని వసంత్కుంజ్లో ఉంటున్నాడు. ఈ నెల 20వ తేదీన కృష్ణ కాంత్ వడ్లాని అనే వ్యాపారితో నిందితులు ఆన్లైన్లో పరిచయం చేసుకున్నారు. ప్రత్యేక కెమికల్ ద్వారా డబ్బును రెట్టింపు (డబుల్) చేయవచ్చని బాధితుడిని నిందితులు నమ్మించారు. నల్లటి కాగితాలు, రసాయనాలను ఉపయోగించి డబ్బును రెట్టింపు చేసే నకిలీ డెమో చూపించి బాధితుడిని నమ్మించారు. వారి మాటలు నమ్మిన బాధితుడు రూ. 20లక్షల నగదు వారికి ఇచ్చాడు, నిందితులు ఆ నగదును ఒక పెట్టెలో పెట్టి, తాము మళ్లీ ‘స్పెషల్ కెమికల్

దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రాజన్న ఆలయ అభివృద్ధిలో భాగంగా ఇప్పటికే 2023.24 బడ్జెట్లో రూ.50 కోట్లు, 2024.-25 బడ్జెట్లో రూ.100 కోట్లు విడుదల చేయగా శనివారం మరో రూ.99.40 కోట్ల నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో రూ.150 కోట్లతో సుమారు 45 శాతం పనులు పూర్తికాగా మరో రూ.99 కోట్లు నిధులు విడుదల కావడంతో రాజన్న ఆలయ అభివృద్ధి విస్తరణ పనులు మరింత వేగంగా పూర్తి కానున్నాయి. కాగా నిధులు మంజూరుకు విశేష కృషిచేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్ బాబు, పొన్నo ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్లకు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు.


కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం దురదృష్టకరమని, దీని వెనుక విదేశీ శక్తుల కుట్ర దాగి ఉందని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ వ్యాఖ్యానించారు. నీట్-యూజీ పరీక్షలో అక్రమాల ఆరోపణల నేపథ్యంలో దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవడంతో ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ వ్యవహారంపై శనివారం రాజా సింగ్ ఒక వీడియో విడుదల చేశారు. జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు చేస్తున్న వారి వెనుక విదేశీ హస్తం ఉందని రాజా సింగ్ ఆరోపించారు. గతంలో నేపాల్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు అనుసరించిన వ్యూహాలనే ఇక్కడ కూడా అమలు చేస్తున్నారని, యువతకు భారీగా నగదు చెల్లించి వివిధ రాష్ట్రాల నుంచి విమానాల్లో తరలించి మరీ నిరసనలు చేయిస్తున్నారని విమర్శించారు. భారత యువతను పావులుగా వాడుకుంటూ దేశంలో అశాంతిని రేకెత్తించేందుకు జరుగుతున్న తొలి ప్రయత్నం ఇదేనని ఆయన అభిప్రాయపడ్డారు. ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి విద్యా రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారని రాజా సింగ్ గుర్తుచేశారు. పేపర్ లీకేజీలు అనేవి అనేక రాష్ట్రాల్లో జరుగుతుంటాయని, దానికి కేవలం కేంద్ర మంత్రిని లేదా ప్రభుత్వాన్ని బాధ్యులను చేయడం సమంజసం కా

న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ నిరసనల నేపథ్యంలో శనివారం ఢిల్లీ పోలీసులు పాకిస్థాన్ కేంద్రంగా నడుస్తోన్న 480 ఖాతాలను బ్లాక్ చేశామని ఢిల్లీ పోలీసులు మీడియా సమావేశంలో వెల్లడించారు. కాక్రోచ్ జనతాపార్టీ ఆందోళనల గురించి సోషల్ మీడియాలో భారీగా నకిలీ వార్తల ప్రచారం జరుగుతోందని, దీంతో శాంతి భద్రతలకు ముప్పు వాటిల్లుతోందని పేర్కొన్నారు. “ప్రజలు నకిలీ, వాస్తవ సమాచారానికి మధ్య తేడా గుర్తించ గలిగేలా , మా సోషల్ మీడియా ఖాతాల్లో ఏఐ, డీప్ఫేక్, ఎడిట్ చేసిన క్లిప్లు, తప్పుదోవ పట్టించే పోస్ట్ల గురించి నిరంతరం అప్రమత్తం చేస్తున్నాం” అని పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు.

లక్నో: ఉత్తర ప్రదేశ్ లోని మోదీ నగర్కు చెందిన ఆశా తన దివ్యాంగుడైన భర్త సచిన్ కోరికను మన్నించి ఏకంగా 180 కిలోమీటర్లు మోసుకొని కాలినడకన ప్రయాణించడం ఆశ్చర్యం కలిగించింది. ఆశా, సచిన్లకు ఇద్దరు పిల్లలు. 12 ఏళ్ల క్రితం ఓ ప్రమాదంలో సచిన్ వెన్నెముకకు గాయమైంది. చికిత్స చేసినా ఫలితం కనిపించలేదు. నడవలేని స్థితికి చేరాడు. శివభక్తుడైన సచిన్ హరిద్వార్ లోని శివాలయాన్ని దర్శించాలన్న కోరిక కలగడంతో భార్య ఆశా బాధ్యతగా భావించింది. అతన్ని మోసుకొని 180 కిమీ దూరం కాలినడకన ప్రయాణించింది. గత ఏడాదిలోనూ ఆమె హరిద్వార్ లోని కన్వర్ యాత్రకు సచిన్ను భుజాన తీసుకెళ్లడం విశేషం. భర్త దివ్యాంగుడు కావడంతో అధైర్య పడకుండా భర్తకు అండగా ఉంటూ కుటుంబాన్ని పోషిస్తోంది.



పరీక్షల అక్రమాల నిరోధక సవరణ బిల్లు 2026ముసాయిదా విడుదల చేసిన కేంద్రం సోమవారం లోక్సభ ముందుకు బిల్లు న్యూఢిల్లీ: పేపర్ లీకేజీలు, అవకతవకలకు శాశ్వతంగా చెక్ పేట్టేందుకు కేంద్రం వేగంగా అడుగులు వేస్తోంది. రెండేళ్ల క్రితం తీసుకువచ్చిన పేపర్ లీక్ నిరోధక చట్టానికి సవరణలు చేస్తూ బిల్లును తీసుకువస్తోంది. ఇందులో భాగంగా పబ్లిక్ పరీక్షల అక్రమాల నిరోధక సవరణ బిల్లు-2026 డ్రాఫ్ట్ ను కేంద్రం శనివారంనాడు విడుదల చేసింది. ఈ కీలక సవరణ బిల్లును లోక్సభలో సోమవారంనాడు ప్రవేశపెట్టనుంది. బిల్లు ప్రతులను లోక్సభ సభ్యులకు సర్క్యులేట్ చేసింది. సవరణ బిల్లు ప్రకారం, పరీక్షల్లో సాధారణ మోసాలు, అక్రమాలకు పాల్పడే వారికి కనిష్టంగా 5 ఏళ్ల నుంచి పదేళ్లకు పెంచారు. రూ.50 లక్షల వరకూ జరిమానా విధిస్తారు. వ్యవస్థీకృత నేరాలకు పాల్పడితే కనీస జైలు శిక్ష ఏడేళ్లు, రూ.10 కోట్ల వరకూ జరిమానా విధిస్తారు. పరీక్షలు నిర్వహించే ఏజెన్సీలు, సర్వీసు ప్రొవైడర్లు అక్రమాలకు పాల్పడినట్లయితే రూ.5 కోట్ల వరకూ జరిమానా ఉంటుంది. అక్రమాలకు పాల్పడే సంస్థలను ఎనిమిదేళ్లు బ్లాక్లిస్ట్ లో ఉంచుతారు. పేపర్ లీక్ కేసుల్లో విచారణ రెండు నెలల్లో పూర్తి చేయాలి. కేస


జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. టీమిండియా నిర్దేశించిన 220 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 17.5 ఓవర్లలో కేవలం 129 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టులో ఓపెనర్ బ్రయాన్ బెనెట్ (32) మాత్రమే రాణించాడు. మరుమాని (24), ర్యాన్ బర్ల్ (20), బ్రాడ్ ఎవాన్స్ (19), డియోన్ మైయర్స్ (12)లు పెద్దు స్కోరు చేయడంలో విఫలమయ్యారు. భారత బౌలర్లలో అభిషేక్ శర్మ 3 వికెట్లు పడగొట్టగా.. ప్రిన్స్ యాదవ్, యశ్ ఠాకూర్ లు చెరో వికెట్ తీయగా.. శివమ్ దూబె, రవి బిష్ణోయ్, తిలక్ వర్మకు తలో వికెట్ దక్కింది. దీంతో భారత్ 90 పరుగులు భారీ తేడాతో గెలుపొంది. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్ ను భారత్ 2-0తో కైవసం చేసుకుంది. ఇక, ఇరుజట్ల మధ్య నామమాత్రపు మూడో టీ20 ఆదివారం జరగనుంది.

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. అధికారంలో ఉన్నవారి కంటే ప్రజల శక్తి ఎప్పుడూ గొప్పది అని పేర్కొన్నారు. జెన్ జెడ్ అంటూ విక్టరీ సిబల్ చూపిస్తూ ట్వీట్ చేశారు. మాజీ మంత్రి, బిఆర్ఎస్ఎల్పి ఉపనేత హరీష్రావు స్పందిస్తూ, దేశంలోని యువతకు ఇది ఒక గొప్ప విజయం అని వ్యాఖ్యానించారు. సామాజిక దృక్పథంలో వస్తున్న మార్పు నిజంగానే కనిపిస్తోందని పేర్కొన్నారు. విద్యార్థులందరికీ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పందిస్తూ , కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దేశ యువత మొక్కవోని పోరాట పటిమతో సాధించిన ప్రజాస్వామ్య విజయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో మాజీమంత్రి,బిఆర్ఎస్ఎల్పి ఉపనేత తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రజాస్వామ్య విజయం, విద్యార్థుల విజయం అని అభివర్ణించారు. బిఆర్ఎస్ పార్టీ తరపున విద్యార్థులకు అభినందనలు తెలిపారు. విద్యార్థులను చూసి దేశం గర్విస్తోందని వ్యాఖ్యానించారు. విద్యార్థుల ఉద్యమం ఏ స్థాయిలో ఉంటుందో ప్




వయనాడు: నీట్ పరీక్షల్లో అవకతవకలపై గళం విప్పిన విద్యార్థులపై పోలీసుల దమనకాండకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. పోలీసుల అమానుషకాండకు బాధితులైన విద్యార్థులకు ప్రధాని క్షమాపణ చెప్పడానికి బదులు సిల్లీ వీడియోలు చేయడంలో బిజీగా ఉన్నారని విమర్శించారు. దేశం నలుమూలల నుంచి విద్యార్థులు వీధుల్లోకి రావడానికి ఆయనే బాధ్యులని, విద్యార్థులపై టెర్రరిస్టుల తరహాలో పెల్లెట్ గన్లు ప్రయోగించడానికి కూడా ఆయనే బాధ్యులని అన్నారు. దీనిపై దేశ ప్రజలకు మోదీ సమాధానం చెప్పాలన్నారు. పార్లమెంటుకు హాజరై విద్యార్థులు అడుగుతున్న మార్పులు చేపట్టాలన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో 152 ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని, విద్యార్థుల భవిష్యత్తు చెల్లాచెదురైందని చెప్పారు. పరీక్ష రాయాలంటేనే బెంబేలెత్తే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రశ్నపత్రం లీక్ అయితే కొందరు ధనవంతుల పిల్లలు 30 నుంచి 40 లక్షలలకు కొనుక్కుంటారని, తక్కిన విద్యార్థుల పరిస్థితి ఏమిటని ఆమె నిలదీశారు. ఈ వ్యవస్థపై విశ్వాసం కోల్పోయిన వారికి ఒక పరిష్కారం చూపించాల్సిన బాధ్యత ప్రధానిపైనే ఉందన్నారు. కఠినమైన చట్టాలు ఉన్నందున ఎవరూ ఆం
