
3369 వార్తలు

మేష రాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మధ్యలో ఆగిపోయిన పనులు పూర్తిచేస్తారు. వ్యాపారములు లాభసాటిగా సాగుతాయి. సహోదరి సహోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. విదేశీ వ్యవహారాలు విదేశాలలో ఉండి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. పోటీ పరీక్షలలో ఇంటర్వ్యూలలో పాల్గొనేవారు ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి. వృత్తి ఉద్యోగాలలో సమస్యలను దైర్యంగా పరిష్కరించుకుంటారు. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. మీ వ్యవహార శైలికి విరుద్ధంగా ఏ పని చేయరు. వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.వృషభ రాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగ పరంగా వ్యాపారపరంగా సానుకూలమైన ఫలితాలను సాధించగలుగుతారు. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. కొన్ని వ్యవహారాలలో ఆప్తులతో వివాదాలు కలుగుతాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతు
నవతెలంగాణ-హైదరాబాద్ : ఒంటిపై డీజిల్ పోసుకొని నిప్పంటించుకుని బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్లోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కీర్తి(21) గండిపేటలోని ఎంజీఐటీ కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతోంది. అయితే ఎప్పటి లాగానే కాలేజీకి వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చిన కీర్తి ఇంట్లో ఉన్న డీజిల్ పోసుకొని నిప్పంటించుకుని సూసైడ్ చేసుకుంది. ఇందుకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఆమె సోదరుడు నాగరాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు […] The post డీజిల్తో నిప్పంటించుకుని బీటెక్ విద్యార్థిని సూసైడ్.. appeared first on Navatelangana.







రిటైర్మెంట్ బెనిఫిట్ చెల్లింపుల కోసం విడుదల చేస్తాంతక్షణమే పిఆర్సి నివేదిక సమర్పించాలని కమిటీకి ఆదేశంనివేదిక ఆధారంగా తుది నిర్ణయం తీసుకుంటాంజూన్ 1లోగా ఉద్యోగులకు ఆరోగ్య భద్రత కార్డులు ప్రతి రెండు నెలలకు ఒకసారి గుర్తింపు సంఘాలు సమావేశమైఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వానికి రిపోర్టు ఇవ్వాలిఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారం మా బాధ్యత ఉద్యోగులు రాజకీయ నాయకులుగా వ్యవహరించవద్దు ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకుల భేటీలో సిఎం రేవంత్రెడ్డి ఉద్యోగ సంఘాల నేతల సంతృప్తి 5న తలపెట్టిన నిరసన కార్యక్రమాల ఉపసంహరణ స్పష్టం చేసిన జేఏసీ నేతలుమన తెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగు ల సమస్యల పరిష్కారంపై కీలక ముందడుగు ప డింది. రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై కూడా ప్రభు త్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలోనే నా లుగు అంశాలపై సిఎం రేవంత్రెడ్డి ఉద్యోగ సం ఘాలకు స్పష్టమైన హామీనిచ్చారు. వంద రోజుల్లో ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపుల కోసం రూ.6 వేల కోట్లు విడుదల చేస్తామని సిఎం రేవంత్రెడ్డి ఉద్యోగ సంఘాల జేఏసి నాయకులతో సిఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఎన్నో రోజులుగా ఉద్యోగులు ఎదురు చూస్తున్న పీఆర్సీ అ





నేను మాట తప్పితే అమరవీరుల స్తూపం వద్ద స్తంభానికి కట్టేసి కొట్టాలిఅన్ని విషయాల్లో సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తర్వాతే హామీలు ఇచ్చానుసర్వోదయ తెలంగాణ లక్ష్యంగా ముందుకు వస్తున్నాంప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నిండటమే లక్ష్యంమా నాన్న కెసిఆర్ను తిట్టలేదు.. బిఆర్ఎస్ అధ్యక్షుడిని విమర్శించాను20 ఏళ్లుగా ఇచ్చిన మాట, పట్టిన తోవను విడవలేదుప్రజాస్వామ్యంలో పార్టీ ఉండటమే పవర్ ఆ పార్టీ అధికారంలోకి వస్తుందా.. లేదా.. అన్నది ఆ పార్టీ నడిపే వ్యక్తిని బట్టి ఉంటుందిటిఆర్ఎస్ నాకు రాసిపెట్టి ఉండటం దైవ సంకల్పంగా భావిస్తున్నావెయ్యి రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించుతాంమేము అధికారంలోకి వచ్చాక తల్లి మాదిరి పాలన చేస్తాంమీట్ ది ప్రెస్లో తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవితమనతెలంగాణ/హైదరాబాద్ : ప్రజలకు ఉచితంగా విద్య, వైద్యం ఇవ్వకుంటే రాళ్లతో కొట్టాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ రక్షణ సేన ప్రకటించిన పాంచజన్యంలోని ఐదు అంశాలు, ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాల విషయంలో తాను ఇచ్చిన మాట తప్పితే గన్పార్క్లోని అమరవీరుల స్తూపం వద్ద స్తంభానికి కట్టేసి కొట్టాలని అన్నారు

మ.2 నుంచి సా.5 వరకుఉ.11 గంటల నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిమ.1.30 గంటలకు గేట్లు మూత విద్యార్థులు అరగంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచనవిద్యార్థులు డ్రెస్ కోడ్ పాటించాలి బూట్లు వేసుకుని రావద్దు...చెప్పులతోనే రావాలి మనతెలంగాణ/హైదరాబాద్: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆదివారం(మే 3) దేశవ్యాప్తంగా నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) యుజి (నీట్ యుజి 2026) నీట్ పరీక్ష జరుగనున్నది. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా సుమారు 22,79,743 మంది విద్యార్థులు రిజిష్టర్ చేసుకోగా, వారిలో 13,22,928 మంది బాలికలు, 9,46,815 మంది బాలికలు ఉన్నారు. రాష్ట్రం నుంచి నుంచి 70 వేలకుపైగా దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 552 నగరాలలో, విదేశాలలో 14 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇంగ్లీష్, హిందీతో పాటు 11 ప్రాంతీయ భాషల్లో పెస్ అండ్ పేపర్ పద్ధతిలో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1.30 గంటల లోపు పరీక్షా కేంద్రాలకు అనుమతిస్తారు. నీట్ పరీక్షా కేంద్రాల వద్ద మూడంచెల భద్రతా ఏర్పాట్లను చేస్తున్నట్లు ఉన్నతాధికారు

పలు చోట్ల ధర్నాలు, నిరసనలుదుబ్బాక ప్రజాపాలనలో మైకు నేలకేసి కొట్టిన ఎమ్మెల్యే ఎర్ర జొన్న ఉద్యమంలా వరి ఉద్యమం..హెచ్చరించిన నిజామాబాద్ రైతులు రాజన్న సిరిసిల్ల, హన్మకొండలో కొనసాగిన రైతుల ఆందోళనలు కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపొయిన ధాన్యం రాశులు జిపిఎస్, ఆటోమెయిల్ ట్యాగ్ విధానంతో ధాన్యం తరలింపునకు చిక్కులు ఉపసంహరించుకున్నా కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం వర్షాల నేపథ్యంలో బిక్కుబిక్కుమంటున్న అన్నదాతలు మన తెలంగాణ/హైదరాబాద్ : ఆరుగాలం కష్టపడి ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంటూ పంటలు పండిస్తే వాటిని అమ్ముకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంటుందని రైతులు వాపోతున్నారు. కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చే ధాన్యం కొనుగోలు ఆలస్యం కావడంతో రైతులు లబోదిబో మంటున్నారు. పలు చోట్ల మొక్క జొన్న కొనుగోళ్లకు సైతం ఇదే పరిస్థితి ఉందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శనివారం అనేక ప్రాంతాల్ల్లో రాజకీయ నాయకులతో కలిసి రైతులు ధర్నాలు, నిరసలు తెలియజేశారు. రాష్ట్రంలోని వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్ంగలో మొక్క జొన్న కొనుగోళ్లు వేగవంతం చేయాలని నర్సంపేట మండలం మహేశ్వరంలో వరంగల్ ప్రధాన రహదారిపై మ

పూడికతీత పనులు చేపట్టి చెరువుల పునరుద్ధరణ చేపట్టాలి పునరుద్ధరణకు జిల్లా స్థాయిలో కమిటీల ఏర్పాటు చెరువుల అక్రమణలపై ఉక్కుపాదం తక్షణమే ఎఫ్టిఎల్ లెవల్ను గుర్తించాలి జూరాల, మూసీ ప్రాజెక్టుల పూడికతీతకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి చిన్న నీటిపారుదల చెరువులపై వ్యవసాయ శాఖ కమిషన్ రూపొందించిన నివేదిక ప్రశంశనీయం - ఇరిగేషన్ శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి మనతెలంగాణ/హైదరాబాద్: వేసవికాలంలో రాష్ట్ర వ్యాప్తంగా పూడికతీత పనులు చేపట్టి చిన్న తరహా చెరువులన్నింటిని పునరుద్ధరించాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పూడికతీత తో పునరుద్ధరించిన చెరువులు వచ్చే వర్షాకాలంలో జలాశయాలతో కళకళలాడేలాచూడాలని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చిన్ననీటి పారుదల చెరువులపై సీనియర్ కాంగ్రెస్ నేత వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ అధ్యక్షుడు ఎం.కోదండ రెడ్డి ఆధ్వర్యంలో రూపొంచిన నివేదిక అభినందనీయమని ఆయన కొనియాడారు. ఈ నివేదికను తదుపరి చర్యల కోసం ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డికి పంపనున్నట్లు మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి వెల్లడ

సాగునీటి ప్రాజెక్టులు, రైతుల అంశాలపై చర్చప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు, 100 రోజుల్లో రిటైర్మెంట్ ఉద్యోగుల బెనిఫిట్స్పై కీలక నిర్ణయాలు మనతెలంగాణ/హైదరాబాద్: కేబినెట్ భేటీ ఈనెల 04వ తేదీన జరుగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు సచివాలయంలో మంత్రి మండలి సమావేశం కానుంది. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టుగా తెలిసింది. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులు, రైతుల అంశాలపై చర్చించనున్నట్లుగా సమాచారం. దీంతోపాటు ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం అంగీకరించిన నేపథ్యంలో ఈ అంశంపై చర్చించనున్నట్టుగా తెలిసింది. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కొన్ని కీలక అంశాలపై చర్చించి వాటిని కేబినెట్లో ఆమోదించే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీ నివేదిక, ఫిట్మెంట్, పెండింగ్ డిఏలు, పెండింగ్ బిల్లుల గురించి కేబినెట్ చర్చించనున్నట్టుగా తెలిసింది. 100 రోజుల్లో రిటైర్మెంట్ ఉద్యోగుల బెనిఫిట్స్ను అందించే విషయంతో పాటు ఈహెచ్ఎస్ కార్డులకు సంబంధించి కేబినెట్లో చర్చించే అవకాశం ఉందని సమాచారం.

ప్రతి గింజ కొంటామన్న కేంద్రం 25 శాతం మాత్రమే కొంటోందిరైతుల భారాన్ని మోస్తున్న రాష్ట్రం ఎంఎస్పికి చట్టబద్దత కల్పించాల్సింది కేంద్రమే బండి సంజయ్కు తుమ్మల లేఖ మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రతి గింజ కొంటామన్న కేంద్రం కేవలం 25 శాతం మాత్రమే కొంటోందని, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రమంత్రి బండి సంజయ్కు కౌంటర్ వేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ రాసిన బహిరంగ లేఖకు తుమ్మల ఘాటుగా సమాధానమిచ్చారు. ఈ మేరకు శనివారం ఏడు పేజీల లేఖలో కేంద్ర విధానాలను ఎండగట్టారు. ఎంఎస్పికి చట్టబద్ధత కల్పించాలని రాష్ట్రాన్ని అడగడం రాజకీయ విజ్ఞతకే వదిలేస్తున్నానని, అసలు ఆ విషయం రాష్ట్ర పరిధిలోనిదే కాదని స్పష్టం చేశారు. రాష్ట్రం రైతుల కోసం అనే పథకాలు అమలు చేస్తోందని, రైతు భరోసా, రైతు రుణమాఫీ లాంటి పథకాలు బిజెపి పాలిత రాష్ట్రాల్లో అమలు చేశారా అని నిలదీశారు. కేంద్రం ప్రతి ఏటా మద్దతు ధర ప్రకటించి, ఇక మీరు ఎక్కడైనా అమ్ముకోండి అన్నట్లుగా చోద్యం చూస్తోందని, పండించిన పంటలో కేవలం 25 శాతమే కొనుగోలు చేస్తే మిగిలిన పంటను రైతు ఎక్కడ అమ్ముకోవాలని ప్రశ్నించారు. ఇందిరా గాంధీ 1966లో ఎంఎస్పి విధానాన్ని తెస్తే, 2014 త

రెండున్నర ఇళ్ల పాలనలో కాంగ్రెస్ చేసిన మోసాలు చూసి ప్రజలు మరో 20 ఏళ్లు ఓటు వేయరుకాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలు చూసి ప్రజలు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారుబిజెపి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కొనసాగిస్తూనే ఉన్నదిగ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ ఎక్కడికక్కడ నిరసనలు చేయాలిబిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పార్టీ నేతలతో కెటిఆర్ సమావేశంపార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపైన దిశానిర్దేశంమనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో రెండున్నర సంవత్సరాల కాంగ్రెస్ పాలన చూసిన తర్వాత ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్కు ఓటు వేసే అవకాశమే లేదని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు.తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కనీసం 20 సంవత్సరాల పాటు తిరిగి అధికారంలోకి రావడం కల్ల అని పేర్కొన్నారు. అడ్డగోలుగా హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ సబ్బండ వర్గాలను మోసం చేసిందని, దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అవినీతి అరాచకాలు, కుంభకోణాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నేతలతో శనివారం నందినగర్ నివాసంలో కెటిఆర్ సమీక్ష సమావేశం ని

ఐదు రాష్ట్రాల శాసనసభలకు ఇటీవలే ముగిసిన ఎన్నికల ఫలితాలు సరిగ్గా 24 గంటల తర్వాత వెలువడబోతున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో పుదుచ్చేరి, అసోం రెండు చోట్ల భారతీయ జనతా పార్టీకే విజయావకాశాలు ఉన్నాయని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఈసారి గెలిస్తే అసోంలో బిజెపి హ్యాట్రిక్ కొట్టినట్టే. పుదుచ్చేరి కేవలం 30 స్థానాలతో చాలా చిన్న రాష్ట్రం కాబట్టి లెక్కల్లోకి రాదు. ఇక మిగిలింది తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్ ఈ మూడు రాష్ట్రాల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో తమ అడుగుపడాలని భారతీయ జనతా పార్టీ ఎప్పటినుంచో తహతహలాడుతున్న విషయం తెలిసిందే. 2014 నుంచి మూడు పర్యాయాలు కేంద్రంలో అధికారంలోకి వచ్చి కూడా ఈ మూడు రాష్ట్రాల్లో తాము అధికారంలోకి రాకపోవడం ఏమిటి అనే అసంతృప్తి భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వంలో నెలకొని ఉన్న విషయం అప్పుడప్పుడు స్పష్టంగా బయటపడుతూనే ఉంటుంది. కేరళ, తమిళనాడు రాష్ట్రాలు రెండు దక్షిణాదిలో ఉన్నాయి. కేరళలో వామపక్షాల అధికారం నడుస్తున్నది. తమిళనాట ద్రవిడ పార్టీలు జాతీయ పార్టీలను అడుగుపెట్టనివ్వని స్థితి. ఇక పశ్చిమబెంగాల్ రాష్ట్రానిది ఒక ప్రత్యేక పరిస్థితి. అక్కడ మూడు పర్యాయాలుగా అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్ర

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో 10న జరగనున్న జనాగ్రహ సభకు భారీగా ఏర్పాట్లుబహిరంగ సభను సక్సెస్ చేయడానికి కమలనాథుల కసరత్తు ప్రతి మండలం నుంచి 800 మందిని, డివిజన్ నుంచి 300 మందిని తీసుకురావాలని పార్టీ సూచనలుకేంద్రమంత్రులు, ఎంఎల్ఎలు, ఎంఎల్సిలకు జనసమీకరణ బాధ్యతలుసిఎం రేవంత్రెడ్డిపై వాగ్బాణాలు సంధించనున్న ప్రధాని మోడీ మన తెలంగాణ/హైదరాబాద్ః ‘జన ఆగ్రహ సభ’ పేరిట ఈ నెల 10న నిర్వహించనున్న బహిరంగ సభను బిజెపి రాష్ట్ర నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. రెండేళ్ళ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొననున్న బహిరంగ సభకు బిజెపి భారీగా ఏర్పాట్లు చేస్తున్నది. పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే జన ఆగ్రహ సభకు సుమారు పది లక్షల మందిని తీసుకుని వచ్చేందుకు ముమ్మర ఏర్పాట్లు చేపట్టారు. ప్రతి మండలానికి, డివిజన్ల నేతలకూ టార్గెట్లు పెట్టారు. ప్రతి మండలం నుంచి ఎనిమిది వందల మందిని, డివిజన్ నుంచి మూడు వందల మందిని తీసుకుని వచ్చేందుకు ఏర్పాటు చేసుకోవాలని మండల, డివిజన్ నాయకులకు సూచనలు ఇచ్చారు. కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలకు జిల్లాల వారీగా జనసమీకరణను పర్యవేక్షించే బాధ్యతను అప్పగించారు. ఇంకా రాష్ట్

మే 16 నుంచి జూన్ 16 వరకు సుదీర్ఘ వడగాలులువెల్లడించిన తెలంగాణ వెదర్ మ్యాన్ మన తెలంగాణ/హైదరాబాద్ : ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు అండమాన్, కేరళకు సకాలంలో చేరినా రాష్ట్రానికి మాత్రం ఆలస్యం కానున్నాయని, జూన్ 16 తర్వాతే రాష్ట్రంలోకి రుతుపవనాల ప్రవేశం ఉంటుందని తెలంగాణ వెదర్ మ్యాన్ వెల్లడించారు. ఈ నెల 16 నుంచి జూన్ 16 వరకు రాష్ట్రంలో సుదీర్ఘకాలం వడగాలులు కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. బంగాళాఖాతంలో రీకర్వింగ్ సైక్లోన్ ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉందని, దీని ప్రభావంతో ఈ నెల 16నుంచి జూన్ 16 వరకు రాష్ట్రంలో భయంకరమైన వడగాలులు వస్తాయని హెచ్చరించారు. అయితే వాతావరణ పరిస్థితుల్లో మార్పుల ఆధారంగా స్వల్ప మార్పులు మాత్రమే ఉంటాయని స్పష్టం చేశారు. ఈ క్రమంలో రాష్ట్రంలో వేడి వాతావరణ కొనసాగుతోందని శనివారం తూర్పు తెలంగాణలోని సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి, నల్గొండ, వరంగల్ జిల్లాలతో పాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో తీవ్ర వడగాలులు వీచాయని వెల్లడించారు. నిజామాబాద్లో అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, నల్గొండ, నిర్మల్, సిద్దిపేటలో 45.9, ఆదిలాబాద్, పెద్దపల్లిలో 45.8. కామారెడ్డి, ఆసిఫాబాద్లో 45.7, జగిత్యాలలో 45.6,