23584 వార్తలు

మేషంవృత్తి, వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు చూస్తారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి, మొండిబాకీలు వసూలవుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు మరియు ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వృషభం కార్యాలయాలలో పని ఒత్తిడి కొద్దిగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి సహోద్యోగులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. అనవసరపు ఖర్చులను తగ్గించుకుని పొదుపుపై దృష్టి పెట్టడం అవసరం. మానసిక ప్రశాంతత కోసం కొంత సమయం కేటాయించండి. కుటుంబంలో సామాన్య వాతావరణం ఉంటుంది. మిధునం నూతన పరిచయాలు వ్యాపార విస్తరణకు తోడ్పడతాయి మరియు ఉద్యోగంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. పెట్టుబడులకు ఇది అనుకూలమైన రోజు. ఇరుగుపొరుగు వారితో సఖ్యత పెరుగుతుంది. కర్కాటకం శ్రమకు తగిన ప్రతిఫలం ఆలస్యంగానైనా లభిస్తుంది. పట్టుదలతో పనులను పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు కాస్త అప్రమత్తంగా ఉండాలి. ఎవరికీ పెద్ద మొత్తంలో అప్పులు ఇవ్వవద్దు. జీవిత భాగస్వామి సలహాలు కలిసివస్తాయి. ఉదర సంబంధిత సమస్యల పట్ల జాగ్రత్త అవసరం. సింహం మీ నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి మరి

గత 24 గంటల్లో నాలుగుసార్లు చర్చలకు ఆహ్వానంసమస్యలకు సంభాషణ ద్వారానే పరిష్కారం.. విద్యార్థుల సూచనలకూ ప్రభుత్వం సిద్ధమే.. న్యూఢిల్లీ: నిరసన చేపట్టిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) మరోసారి ప్రభుత్వంతో చర్చలకు ముందుకు రావాలని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ గురువారం విజ్ఞప్తి చేశారు. సమస్యలకు పరిష్కారం, ముందడుగు రెండూ సంభాషణ ద్వారానే సాధ్యమవుతాయని స్పష్టం చేశారు. పీటీఐ వీడియోస్తో మాట్లాడుతూ.. గత 24 గంటల్లోనే ప్రభుత్వం కనీసం నాలుగుసార్లు సీజేపీని చర్చలకు ఆహ్వానించిందని తెలిపారు. ఈ ఆందోళనలో పాల్గొంటున్న విద్యార్థులు, యువత మరోసారి చర్చలకు రావాలని ప్రభుత్వ తరఫున వినయపూర్వకంగా కోరుతున్నాను. మా ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉన్నాయి అని అన్నారు. నిరసన చేస్తున్న విద్యార్థి ప్రతినిధులతో కేంద్ర ఆరోగ్య మంత్రి, బీజేపీ సీనియర్ నేత జేపీ నడ్డా నేతృత్వంలో సమావేశం జరుగుతుందని జితేంద్ర సింగ్ చెప్పారు. నడ్డా అధికారిక నివాసంలో గానీ, ఆయన కార్యాలయంలో గానీ సమావేశం నిర్వహించవచ్చు. ఏ ప్రదేశం కావాలన్నది విద్యార్థి ప్రతినిధులే నిర్ణయించుకోవచ్చు. నేను కూడా సమావేశానికి హాజరవుతాను అని తెలిపారు.నీట్ అంశంతో పాటు దానికి సంబంధించ


న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ జంతర్మంతర్ వద్ద సీజేపీ నిరసనలకు కొనసాగిస్తుండటంతో కేంద్ర హోం శాఖ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. జంతర్మంతర్కు 1.5 కిలోమీటర్ల పరిధిలో ఇంటర్నెట్ సేవలను గురవారం అర్ధరాత్రి వరకూ నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రజాభద్రత, పబ్లిక్ ఎమర్జెన్సీ నివారణ దృష్ట్యా టెలికమ్యూనికేషన్ చట్టం-2023, టెలికమ్యూనికేషన్స్ (తాత్కాలికంగా సేవలు నిలిపివేత) నిబంధనలు-2024 కింద ఈ చర్యలు తీసుకున్నట్టు ఎంహెచ్ఏ తెలిపింది. జూలై 17 నుంచి జంతర్ మంతర్ ఏరియాలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను సస్పెండ్ చేస్తూ హోం శాఖ ఆదేశాలివ్వడం ఇది ఐదోసారి. పోటీ పరీక్షల్లో అవకతవకలపై జవాబుదారీతనం. విద్యావ్యవస్థలో సంస్కరణలు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ సీజేపీ సారథ్యంలో జూన్ 20 నుంచి విద్యార్థులు ఆందోళనలు సాగిస్తున్నారు.






అహల్యానగర్: ఢిల్లీలో నిరసన చేస్తున్న విద్యార్థులకు మద్దతుగా గురువారం మహారాష్ట్ర లోని అహల్యానగర్ లో రెండు గంటల పాటు సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారీ మౌన్ అందోళన్ చేపట్టారు. ఉదయం 11 గంటలకు అహల్యానగర్ లోని మహాత్మాగాంధీ విగ్రహం దగ్గర ఆయన నిరసన మొదలు పెట్టి మధ్యాహ్నం ఒంటిగంటకు ముగించారు. ఆ తర్వాత తన గ్రామం రాలేగణ్ సిద్ధికి వెళ్లిపోయారు. అంతకుముందు ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి రాసిన లేఖలో విద్యార్థులపై హింస, పోలీసుల చర్యల వార్తలు తీవ్రంగా కలచి వేస్తున్నాయని పేర్కొన్నారు. నిరసనకారుల ఆగ్రహాన్ని శాంతిభద్రతల సమస్యగా కాకుండా సమాజం అనుభవిస్తున్న వేదన, ఆశల ప్రతిబింబంగా చూడాలని లేఖలో తెలిపారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయిస్తే ప్రభుత్వం కూలిపోదని, దాంతో ప్రభుత్వ పనితీరు మరింత జవాబుదారీతనంతో , సమర్ధంగా మారుతుందన్నారు.






వాషింగ్టన్: అమెరికా, ఇరాన్ పరస్పర దాడులతో పరిస్థితి తీవ్రరూపం దాలుస్తున్న నేపథ్యంలో ఇరాన్కు మద్దతుగా నిలుస్తున్న హౌతీలు మరోసారి దాడులకు దిగారు. ఎర్ర సముద్రంలో ప్రయాణిస్తున్న సౌదీ అరేబియాకు చెందిన చమురు నౌకపై యెమెన్ సమీపంలో హౌతీలు బుధవారం రాత్రి క్షిపణితో దాడి చేశారు. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. తామే ఈ దాడి చేసినట్టు హౌతీలు ప్రకటించారు. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ మండిపడ్డారు. ఇరాన్కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. హౌతీలు దాడులకు పాల్పడినా టెహ్రాన్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని, సైనిక చర్య చేపడతామని హెచ్చరించారు. గత ఏడాది వాణిజ్య నౌకలపై దాడి జరిపిన హౌతీలకు అమెరికా గట్టి బుద్ధి చెప్పిందని, మళ్లీ ఇప్పుడు దాడులు మొదలుపెట్టారని ట్రంప్ పేర్కొన్నారు. హౌతీలు ఇరాన్ ప్రతినిధులే అయినందున ఈ దాడులకు ఇరాన్ బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. హర్మూజ్ జలసంధిలో ఇరాన్ ఇకనుంచి ఏదైనా నౌకపై దాడి చేసినప్పుడల్లా ఆ దేశంలోని ఒక వంతెన లేదా విద్యుత్ కేంద్రంపై బాంబులేస్తామని కూడా ట్రంప్ ఇంతకుముందు హెచ్చరించారు. అయితే దీనిపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. పౌర వ్యవస్థలపై అమెరికా దాడి చేస్తే దెబ్బ





మన తెలంగాణ/హైదరాబాద్: ఎపిలో వైసిపి నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు పలాస కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. రోడ్డు ప్రమాదం కేసులో తన కుమారుడిని రక్షించేందుకు ప్రయత్నించారన్న తీవ్ర ఆరోపణలపై పోలీసులు ఆయనను బుధవారం అరెస్ట్ చేసి, గురువారం కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.ఇటీవల అప్పలరాజు కుమారుడు ఆరవ్ నడిపిన బైక్ ఢీకొని దానయ్య అనే గొర్రెల కాపరి మృతి చెందాడు. ఈ కేసులో తన 18 ఏళ్ల కుమారుడిని కాపాడేందుకు అప్పలరాజు ప్రయత్నించారని పోలీసు లు ఆరోపించారు. ప్రమాదానికి కారణమైన తన కుమారుడి స్థానంలో సిద్ధార్థ్ అనే మరో కుర్రాడిని నిందితుడిగా చిత్రీకరించేందుకు ఆయన యత్నించారని అభియోగాలు నమోదు చేశారు. అంతేకాకుండా మృతుడి కుటుంబాన్ని డబ్బుతో ప్రలోభపెట్టాలని చూశారని, కేసుకు సంబంధించిన కీల క సాక్ష్యాధారాలను తారుమారు చేసి దర్యాప్తును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారని పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.


న్యూఢిల్లీ: విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో పలు మెట్రో స్టేషన్లను మూసివేయడంతో న్యాయవాదులు, వ్యాజ్యదారులు సుప్రీంకోర్టుకు చేరుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్సీబీఏ) చేసిన విజ్ఞప్తిపై భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సూర్యకాంత్ స్పందించారు. మధ్యాహ్న భోజన విరామంలోగా సమస్య పరిష్కారం కాకపోతే తానే నేరుగా జోక్యం చేసుకుంటానని స్పష్టం చేశారు.గురువారం ఉదయం విచారణ ప్రారంభంలోనే ఎస్సీబీఏ అధ్యక్షుడు వికాస్ సింగ్ ఈ అంశాన్ని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. సుప్రీంకోర్టు మెట్రో స్టేషన్తో పాటు ఇతర స్టేషన్లను మూసివేయడంతో న్యాయవాదులు, వ్యాజ్యదారులు, కోర్టు సిబ్బంది కోర్టుకు చేరుకోవడం కష్టంగా మారిందని తెలిపారు. కనీసం వీరికి పరిమిత ప్రవేశం కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా న్యాయవాదులు హాజరు కాలేకపోయిన సందర్భాల్లో వారి గైర్హాజరును మాత్రమే కారణంగా చూపి ఏ కేసులోనూ ప్రతికూల ఉత్తర్వులు జారీ చేయరాదని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు.వికాస్ సింగ్ ఓ ప్రత్యామ్నాయ ప్రతిపాదనను కూడా సూచించారు. సుప్రీంకోర