25140 వార్తలు







జోగిపేట: ముక్కుపచ్చలారని పసికందును కన్నతండ్రే దారుణంగా హతమార్చిన ఘటన సంగారెడ్డి జిల్లా జోగిపేటలో చోటు చేసుకుంది. సిఐ అనిల్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. జోగిపేట పట్టణానికి చెందిన కృష్ణ, గౌరమ్మ దంపతులు పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నారు. గత కొన్ని రోజులుగా వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఇవాళ ఉదయం కూడా తన భార్యతో గొడవపడిన కృష్ణ.. పాలు తాగుతున్న బిడ్డను లాక్కొని.. చిన్నారి చెంపలపై కొట్టాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించింది. దీంతో కోపోద్రిక్తుడైన కృష్ణ.. చేతిలో ఉన్న పసికందును నేలకేసి కొట్టాడు. గౌరమ్మ గట్టిగా కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోయాడు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న పసికందును జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. కృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.



హైదరాబాద్: ప్రజలకు కాంగ్రెస్ పై కోపం ఉందని, బిఆర్ఎస్ పై నమ్మకం లేదని బిజెపి ఎంపి లక్ష్మణ్ తెలిపారు. బిజెపిలో కీలక నేతల మధ్య విభేదాలపై అధిష్టానం దృష్టి పెట్టిందని అన్నారు. ఎంపి లక్ష్మణ్ నివాసంలో ఇరువురి నేతలతో గంటపాటు సమావేశం అయ్యారు. కేంద్రమంత్రి బండిసంజయ్, ఈటల రాజేందర్ తో అభయ్ పాటిల్ సమావేశమయ్యారు. పార్టీ బలోపేతం పై దృష్టి సారించాలని బండిసంజయ్, ఈటల రాజేందర్ కు లక్ష్మణ్ సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారంలోకి రావడంపై చర్చించామని, వచ్చే ఎన్నికల నాటికి అసెంబ్లీ, లోక్ సభ సీట్లు పెరుగుతాయని అన్నారు. బిజెపిని అధికారంలోకి తెచ్చేందుకు తామంతా కలిసి పనిచేస్తామని ఎంపి లక్ష్మణ్ తెలియజేశారు.

బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్కు గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చాయి. బిష్ణోయ్ సోదరుడు అర్జూ, మరో వ్యక్తి టైసన్లకు సంబంధించిన ఓ ఆడియో క్లిప్ బయటకు వచ్చింది. ఆమిర్ మూడో వివాహం చేసుకొని మతపరమైన వివాదానికి తావిచ్చారని.. ఇది భారతీయ సంస్కృతికి వ్యతిరేకమని వారు హెచ్చరించారు. త్వరలోనే దీనికి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ ఆడియోలో బెదిరింపులకు పాల్పడ్డారు. ఇటీవల ఆమిర్ ఖాన్ తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనపై మతపరమైన విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడీ విషయంపైనే బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి హెచ్చరికలు వచ్చాయి. ఇటీవల కొందరు బాలీవుడ్ ప్రముఖులను కూడా ఈ గ్యాంగ్ బెదిరించింది.

అమరావతి: చెత్త నుంచి సంపద సృష్టించడమే కూటమి లక్ష్యం అని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. చెత్త పేరుకోవడం వల్ల అనేక రోగాలు వస్తాయని అన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో సిఎం పర్యటించారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఎన్టిఆర్ గ్రౌండ్ లోని ప్రజావేదిక సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రంలో అక్టోబర్ 2 నాటికి చెత్త లేకుండా చేస్తామని, మే 23 నుంచి జూన్ 20 వరకు ఆపరేషన్ క్వీన్ స్వీప్ కార్యక్రమం పెట్టామని తెలియజేశారు. చాలామంది ఆపరేషన్ క్వీన్ స్వీప్ లో పాల్గొన్నారని, ఇంట్లో ఎవరికి వారే తడి, పొడి చెత్తలను వేరు చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. తడి, చెత్తను కంపోస్ట్ గా తయారు చేసుకోవాలని, 12 ఏళ్ల ముందు కృష్ణా డెల్టాకు నీళ్లు వచ్చేవి కావని అన్నారు. కృష్ణా జిల్లా దేశానికి అన్నం పెట్టిన స్థలం అని కవుల నుంచి హీరోల వరకు ఎంతో మంది ఈ గడ్డ మీద పుట్టిన వారేనని పేర్కొన్నారు. 12 ఏళ్లలో ఎంతో కృషి చేసి పట్టిసీమ నుంచి కృష్ణా జిల్లాకు నీరు తెచ్చామని, వానలు లేక ఎల్ నినో ప్రభావంతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నదులన్ని అనుసంధానం చేస్తామని..కరువు లేకుండా చేస్తామని, రూ.1




హైదరాబాద్, జులై 18: శనివారం నగరం నలువైపులా హైడ్రా భారీ ఆపరేషన్లు చేపట్టింది. ఒకే రోజు 840 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడేందుకు చర్యలు తీసుకుంది. మార్కెట్లో ఈ భూముల విలువ రూ. 30 వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా రెవెన్యూ అధికారుల విజ్ఞప్తి మేరకు హైడ్రా చర్యలు చేపట్టారు. పోలీసు బందోబస్తు మధ్య హైడ్రా, రెవెన్యూ, మున్సిపల్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ప్రభుత్వ భూములకు ఫెన్సింగ్ వేశారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలో 84 ఎకరాలు స్వాధీనం చేశారు. రాయదుర్గం విలేజ్లోని సర్వే నంబరు 46లో ఉన్న ఈ భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ వేసి.. పక్కనే అర ఎకరం పట్ట ల్యాండ్ లో ఈ ప్రభుత్వ భూమిలోకి చొరబడి గజాల చొప్పున అమ్మకాలు చేస్తున్నవారిపై చర్యలు తీసుకున్నారు. మేడ్చల్ - మల్కాజిగిరి, హైదరాబాద్ జిల్లాల పరిధిలో 106 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం చేసి.. కంటోన్మెంట్ ప్రాంతంలో కల జీఎల్ ఆర్( జనరల్ ల్యాండ్ రిజిస్టర్) నంబరు 243, 255లలో ఉన్న 106 ఎకరాల ప్రభుత్వ భూమికి హైడ్రా ఫెన్సింగ్ వేశారు. మైనింగ్ కార్యక






