25151 వార్తలు



హైదరాబాద్, జులై 18: శనివారం నగరం నలువైపులా హైడ్రా భారీ ఆపరేషన్లు చేపట్టింది. ఒకే రోజు 840 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడేందుకు చర్యలు తీసుకుంది. మార్కెట్లో ఈ భూముల విలువ రూ. 30 వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా రెవెన్యూ అధికారుల విజ్ఞప్తి మేరకు హైడ్రా చర్యలు చేపట్టారు. పోలీసు బందోబస్తు మధ్య హైడ్రా, రెవెన్యూ, మున్సిపల్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ప్రభుత్వ భూములకు ఫెన్సింగ్ వేశారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలో 84 ఎకరాలు స్వాధీనం చేశారు. రాయదుర్గం విలేజ్లోని సర్వే నంబరు 46లో ఉన్న ఈ భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ వేసి.. పక్కనే అర ఎకరం పట్ట ల్యాండ్ లో ఈ ప్రభుత్వ భూమిలోకి చొరబడి గజాల చొప్పున అమ్మకాలు చేస్తున్నవారిపై చర్యలు తీసుకున్నారు. మేడ్చల్ - మల్కాజిగిరి, హైదరాబాద్ జిల్లాల పరిధిలో 106 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం చేసి.. కంటోన్మెంట్ ప్రాంతంలో కల జీఎల్ ఆర్( జనరల్ ల్యాండ్ రిజిస్టర్) నంబరు 243, 255లలో ఉన్న 106 ఎకరాల ప్రభుత్వ భూమికి హైడ్రా ఫెన్సింగ్ వేశారు. మైనింగ్ కార్యక








‘మంజుమ్మల్ బాయ్స్’ చిత్రంతో మలయాళంతో పాటు తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు చిదంబరం. ఆయన దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘బాలన్ - ది బాయ్’. చందు సలీమ్ కుమార్, టొవినో థామస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఇటీవల విడుదలై పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఒటిటిలోకి వచ్చేందుకు సిద్ధమైంది. జులై 31 నుంచి జీ5 వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంటుంది. హత్య కేసులో జైలుకు వెళ్లిన మహిళ అక్కడ ఓ అబ్బాయకి జన్మనిస్తుంది. శిక్ష పూర్తయి బయటకు వచ్చాక తన గతం గురించి ఎవరికీ చెప్పకుండా మారుపేర్లతో అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఉంటుంది. కల్లోలభరితమైన బాల్యం, ఆ తర్ావత అదృశ్యమైన తన తల్లి కోసం వెతుకుతున్న ఓ టీనేజ్ అబ్బాయి కథగా ‘బాలన్ - ది బాయ్’ రూపొందింది. మే నెలలో జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లోనూ ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ సినిమాపై ప్రముఖ నటులు సూర్య, నాగచైతన్య తదితరులు ప్రశంసలు కురిపించారు.


ఆసిఫాబాద్: చాయ్ తాగేందుకు 20 రూపాయలు ఇవ్వలేదని వృద్ధుడిని గొడ్డలితో నరికి తల, మొండెం వేరు చేసిన సంఘటన కొమురంభీం జిల్లా రెబ్బెన మండల కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... పర్సనంబాల గ్రామానికి చెందని మసాడి సోమయ్య(65) అనే వ్యక్తి భార్య తానుబాయితో కలిసి నంబాలలో ఉంటున్న చిన్న కూతురు సుజాత ఇంటికి వెళ్లారు. హైదరాబాద్లో ఉంటున్న పెద్ద కూతురు లక్ష్మి కూడా అక్కడికి రావడంతో ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. పెద్ద కూతురు లక్ష్మిని హైదరాబాద్కు వెళ్లేందుకు రెబ్బెన రైల్వే స్టేషన్కు వచ్చారు. ట్రైన్ ఆలస్యం కావడంతో స్టేషన్ ముందు టీతాగుతూ మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో తుంగెడ గ్రామానికి చెందిన బోగారపు నగేష్ అనే వ్యక్తి సోమయ్య గొడ్డలితో వెంబడించాడు. కొంచెం దూరం వెళ్లిన టీ తాగడానికి 20 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. తన దగ్గర డబ్బులు లేవని చెప్పడంతో సోమయ్యను వెంబడించాడు. అనంతరం గొడ్డలి తీసుకొని సోమయ్య మెడపై నగేష్ వేటు వేశాడు. తల, మొండెం వేరు చేసి అక్కడి నుంచి నగేష్ పారిపోయాడు. డిఎస్పి అశోక్, రెబ్బెన సిఐ సంజయ్, ఎస్ఐ వెంకటకృష్ణ అక్కడికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. తానుబాయ




అమరావతి: ఆంధ్రరాష్ట్రానికి చెందిన ఏలూరు జిల్లా పొలవరం గోదావరి తీరంలో విషాదం చోటు చేసుకుంది. చేపల వేటకు వెళ్లి గోదావరిలో ఐదుగురు మహిళలు గల్లంతయ్యారు. ఎటపాక మండలం గొల్లగూడెం వద్ద ఈ ఘటన చేసుకుంది. ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో ముగ్గురు కోసం స్థానిక మత్స్యకారులు గాలింపు చర్యలు చేపట్టారు. గొమ్ముకొత్త గూడెంకి చెందిన మహిళలుగా మత్స్యకారులు గుర్తించారు.


మేడిపల్లి: మేడ్చల్ జిల్లా మేడిపల్లి పీఎస్ పరిధి పీర్జాదిగూడ శంకర్ నగర్ లో విషాదం చోటు చేసుకుంది. మానసిక ఆందోళనలతో ఓ యువతి గత అర్ధరాత్రి నగ్నంగా పరుగులు తీసి అనంతరం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... విజయనగరం జిల్లాకు చెందిన తేజస్విని (27) అనే యువతి రెంట్ యాప్ లో ఇల్లు వెతికి మూడు నెలల క్రితం శంకర్ నగర్ లోని ఓ ఇంటిలో తల్లితో కలిసి నివాసం ఉంటుంది. కాగా గత అర్థరాత్రి తల్లి పడుకున్న సమయంలో తేజస్విని ఇంటి బయట నుంచి గడియ పెట్టి నగ్నంగా బయటికి పరుగులు తీసింది. ఇంటికి దగ్గరలోని బీరప్ప గుడిలో నుండి ఓ విగ్రహాన్ని తీసుకుని సమీపంలోని పీర్జాదిగూడ చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తేజస్విని నగ్నంగా పరుగులు పెట్టి చెరువు వైపు వెళ్తున్న దృశ్యాలు సిసిటివి కెమెరాలలో రికార్డయ్యాయి. కాగా మానసిక ఆందోళనతోనే సదరు యువతి నగ్నంగా పరుగులు తీసి ఆత్మహత్య చేసుకుని ఉంటుందని అనుమానిస్తున్నారు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు చరిత్ర సృష్టించింది. తొలిసారి జపాన్ ఓపెన్ సూపర్ 750 టోర్నీలో ఫైనల్స్కు చేరిన తొలి భారతీయ షట్లర్గా రికార్డు నమోదు చేసింది. సెమీస్లో చైనాకు చెందిన చెన్ యుఫీయ్పై 21-19, 15-10 తేడాతో విజయం సాధించింది. రెండో సెట్లో సింధు ఆధిక్యంలో ఉండగానే యుఫీయ్ రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగింది. దీంతో సింధు ఫైనల్లోకి అడుగుపెట్టింది. రెండేళ్ల తర్వాత ఓ ఫైనల్కి చేరడం సింధుకు ఇదే తొలిసారి. చివరిసారి 2024లో సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ టోర్నీ విజేతగా సింధు నిలిచింది. ఇక జపాన్ ఓపెన్ ఫైనల్లో అకనె యమగుచితో సింధు తలపడనుంది. సెమీస్లో 9-21, 21-16, 21-14 తేడాతో పుత్రి కుసుమ వర్దానిపై జపాన్కు చెందిన యవగురి విజయం సాధించి ఫైనల్కు చేరింది. ఆదివారం టైటిల్ పోరు జరుగనుంది. ఇందులోనూ గెలిస్తే జపాన్ ఓపెన్ను సొంతం చేసుకున్న తొలి భారతీయ మహిళా షట్లర్గా సింధు అవతరించనుంది.

హైదరాబాద్: తెలంగాణ అమరవీరుల స్మారకం అమర జ్యోతి వద్ద ప్రజా కవి అందె శ్రీ జయంతి సందర్భంగా ఆ మహనీయుని చిత్రపటానికి ఎమ్మెల్సీ కోదండరాం, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ , మోతె శోభన్ రెడ్డి, కవులు కళాకారులతో కలిసి నివాళులు అర్పించడం జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అనంతరం తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన కవులు, కళాకారులు ,రచయితలతో ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి గౌరవించడానికి కళాకారుల సలహాలు సూచనలు అభిప్రాయాలు రికార్డు చేశామని పొన్నం తెలియజేశారు. "జయ జయహే తెలంగాణ" గీతంతో తెలంగాణ ఆత్మగౌరవాన్ని విశ్వవ్యాప్తం చేసిన మహోన్నత వ్యక్తి, తన కలాన్ని ఉద్యమ జెండాగా మలిచి తెలంగాణ ఉద్యమానికి ప్రాణం పోసిన ప్రజాకవి డాక్టర్ అందెశ్రీ (అందె ఎల్లయ్య) జయంతి సందర్భంగా ఆయనకు మంత్రి పొన్నం ఘన నివాళులర్పించారు. పొన్నం తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు.
