3242 వార్తలు
నవతెలంగాణ – కాటారంకాటారం మండల కేంద్రంలోని కోట్లాది రూపాయల విలువైన ఆర్టీసీ బస్టాండ్ భూముల పరిరక్షణతో పాటు నూతన బస్ స్టేషన్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కాంగ్రెస్ నాయకులు కోరారు. ఈ మేరకు డీసీసీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధికార ప్రతినిధి పంతకాని సమ్మయ్య ఆధ్వర్యంలో నాయకులు వరంగల్లో ఆర్టీసీ రీజనల్ మేనేజర్ భవాని ప్రసాద్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఈ […] The post నూతన బస్టాండ్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలి appeared first on Navatelangana.
నవతెలంగాణ-మద్నూర్ రైతులు పండించిన పంటను ప్రయివేటు దళారులకు అమ్ముకొని మోసపోవద్దంటూ సర్కార్ మద్దతు ధర కేంద్రంలోని పంటను అమ్మితే నగదు చెల్లించరని మండల శనగ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంట కొనుగోలు కేంద్రలో ధాన్యాన్ని అమ్మి 38 రోజులవుతున్నా ఇప్పటివరకు డబ్బులు చేతికి అందలేదని వారు వాపోయారు. ఈ క్రమంలో సోమవార తహశీల్దార్ కార్యాలయన్ని వారు ముట్టడించారు. అనంతరం తమకు న్యాయం చేయాలని తహశీల్దార్ ను వేడుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో […] The post ప్రయివేటుకు అమ్మనివ్వరు.. ప్రభుత్వం పైసలివ్వదు appeared first on Navatelangana.
నవతెలంగాణ – కాటారంకాటారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల ఆవేదన ఆగ్రహంగా మారింది. గత ఎనిమిది నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో సోమవారం అంబేద్కర్ సెంటర్ వద్ద పెద్దఎత్తున ధర్నాకు దిగారు. చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ సందర్బంగా కార్మికులు మాట్లాడుతూ..నెలల తరబడి జీతాలు లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, కుటుంబ పోషణ భారంగా మారిందని వాపోయారు. “రోజూ గ్రామాన్ని శుభ్రంగా […] The post రహదారిపై జీపీ కార్మికుల ఆందోళన appeared first on Navatelangana.


– బారదాన,లారీల కొరత వెంటనే పరిష్కరించాలిసీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు కల్లూరి మల్లేశంనవతెలంగాణ-ఆలేరు రూరల్ వడ్ల కొనుగోలు వేగవంతం చేయాలని, బారదాన, లారీల కొరత వెంటనే పరిష్కరించాలని సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు కల్లూరి మల్లేశం డిమాండ్ చేశారు. సోమవారం రోజున ఆలేరు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ ను సీపీఐ (ఎం) ఆలేరు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలేరు మార్కెట్లో గత 15 రోజులకు పైగా వడ్లు పోసినప్పటికీ ఇప్పటివరకు […] The post వడ్ల కొనుగోలు వేగవంతం చేయాలి appeared first on Navatelangana.

డిఎంకె అధినేత, ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ కు తమిళ ప్రజలు బిగ్ షాకిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కొళత్తూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన స్టాలిన్ ఓటమిపాలయ్యారు. కొళత్తూరులో సిఎం స్టాలిన్ పై టివికె అభ్యర్థి విఎస్ బాబు గెలుపొందారు. మరోవైపు, చేపాక్ నుంచి పోటీ చేసిన ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాగా, టివికె విజయ్.. తమిళనాడు రాజకీయాల్లో ప్రభంజనం సృష్టించారు. అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన తొలిసారే అధికారం దిశగా దూసుకుపోతోంది. వందకు పైగా స్థానాల్లో టవికె ముందంజలో కొనసాగుతోంది. దీంతో విజయ్.. ముఖ్యమంత్రిగా తమిళనాడులో చక్రం తిప్పనున్నాడు.
నవతెలంగాణ–కాటారంమంథని–కాటారం రహదారి పనులు నిర్లక్ష్యానికి గురయ్యాయని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ తీవ్రంగా మండిపడ్డారు. కేవలం రూ.3 కోట్లతో ప్రారంభించిన ఈ రోడ్డు పనులు 30 నెలలు గడిచినా పూర్తి చేయకపోవడం దుద్దిళ్ల శ్రీధర్ బాబు అసమర్థతకు నిదర్శనమని అన్నారు. సోమవారం కాటారం మండలం దేవరాంపల్లి సమీపంలో నిర్మాణంలో ఉన్న రహదారిని ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. గతంలో డీఎంఎఫ్టీ నిధులతో రూ.300 కోట్లతో 90 శాతం పూర్తి చేసిన రహదారిని ఇప్పుడు పూర్తిచేయడంలో విఫలమయ్యారని […] The post మంత్రి శ్రీధర్ బాబుపై మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే పుట్ట appeared first on Navatelangana.



తమిళనాడులో నటుడు విజయ్ పార్టీ టివికె సంచలనం సృష్టించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికే ౧౧౦కి పైగా స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. దీంతో విజయ్ అభిమానులు ఆయన ఇంటిముందు సంబరాలు జరుపుకుంటున్నారు. అయితే, టివికె.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ సాధించకపోవడంతో తమిళనాడులో హంగ్ వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో టివికె పార్టీ, కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. ఈ మేరకు విజయ్ తండ్రి చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ.. టివికె గెలుపు చాలా గర్వంగా ఉంది. విజయ్ ముఖ్యమంత్రి అవుతానని చాలా నమ్మకంతో ఉన్నాడు. ఒక్క శాతం కూడా విజయ్కి డౌట్లేదు. పొత్తులకు వెళ్లకుండా సింగిల్గా పోటీ చేశాడు. ఇది చారిత్రాత్మక విజయం అని ఆనందం వ్యక్తం చేశారు. ఇక, ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ మద్దతు కోరినట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చంద్రశేఖర్ తెలిపారు.
నవతెలంగాణ – హైదరాబాద్ : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ తన సొంత నియోజకవర్గమైన కొలత్తూరులో ఓటమి పాలయ్యారు. ఇది దేశ రాజకీయ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం పార్టీ అభ్యర్థి వీఎస్ బాబు, ముఖ్యమంత్రి స్టాలిన్పై విజయం సాధించారు. గత మూడు ఎన్నికలుగా కొలత్తూరు నుండి వరుసగా విజయం సాధిస్తూ వస్తున్న స్టాలిన్కు, ఈసారి టీవీకే […] The post సీఎం స్టాలిన్ను ఓడించిన టీవికే అభ్యర్థి appeared first on Navatelangana.
– సీసీ రోడ్ల కోసం రూ.30 లక్షల నిధులు విడుదలమంత్రి శ్రీధర్ బాబు, శ్రీను బాబులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన యూత్ కాంగ్రెస్ నాయకులు మొగిలి రాజ్ కుమార్ యాదవ్ నవతెలంగాణ – కాటారంజయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని రేగులగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని రేగులగూడెం, గోపాలపూర్, దేవరాంపల్లి, బూడిదపల్లి గ్రామాలకు అభివృద్ధి దిశగా మరో ముందడుగు పడింది. ఈ గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం కోసం సీఆర్ఆర్ నిధుల నుండి రూ.30 లక్షల గ్రాంట్ను రాష్ట్ర ప్రభుత్వం […] The post రేగులగూడెం గ్రామాల అభివృద్ధికి ముందడుగు appeared first on Navatelangana.
నవతెలంగాణ-హైదరాబాద్: హార్మూజ్ జలసంధిలోకి ప్రవేశించినా, లేదా సమీపించినా అమెరికా దళాలపై దాడలు చేస్తాం అని ఇరాన్ సైన్యం సోమవారం హెచ్చరించింది. హోర్ముజ్ జలసంధిలో చిక్కుకుపోయిన నౌకలకు మార్గనిర్దేశం చేసేందుకు ‘ప్రాజెక్ట్ ఫ్రీడమ్’ అనే పేరుతో ఒక నావికాదళ మిషన్ను కొన్ని గంటల్లోనే ప్రారంభిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే హార్మూజ్ జలసంధిలోకి ప్రవేశించినా, లేదా దాన్ని సమీపంలోకి వచ్చినా సరే అమెరికా దళాలపై తాము దాడులు జరుపుతామని ఇరాన్ సైన్యం హెచ్చరించింది. కాగా, […] The post ‘హార్మూజ్’లో కన్పిస్తే దాడులే: ఇరాన్ appeared first on Navatelangana.
అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలునవతెలంగాణ-కాటారం కాటారం పట్టణంలో కల్తీ బీర్ల విక్రయం జరుగుతోందన్న ఆరోపణలు స్థానికంగా ఆందోళన కలిగిస్తున్నాయి. తక్కువ ధర గల బీర్లపై ప్రీమియం బ్రాండ్ల స్టిక్కర్లు అతికించి విక్రయిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా “కింగ్ ఫిషర్ లైట్” పేరుతో నకిలీ స్టిక్కర్లు ఉపయోగించి వినియోగదారులను మోసం చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారం వినియోగదారుల ఆరోగ్యానికి ముప్పుగా మారే అవకాశం ఉన్నప్పటికీ, నియంత్రణ బాధ్యత కలిగిన ఎక్సైజ్ శాఖ నుంచి తగిన చర్యలు కనిపించకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. […] The post కాటారంలో కల్తీ బీర్ల దందా appeared first on Navatelangana.
నవతెలంగాణ – హైదరాబాద్ : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే గెలుస్తుందని తాము ఎగ్జిట్ పోల్స్లో అంచనా వేసినప్పుడు, దేశంలోని రాజకీయ పండితులు, విశ్లేషకులు, ఇతర పోలింగ్ ఏజెన్సీల వాళ్లు తమను చూసి నవ్వారని యాక్సిస్ మై ఇండియా ఛైర్మన్ ప్రదీప్ గుప్తా అన్నారు. నేడు వెలువడుతున్న ఎన్నికల ఫలితాల్లో టీవీకే అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్న నేపథ్యంలో ఆయన ఎన్డీటీవీతో మాట్లాడారు. తొలిసారి ఎన్నికల బరిలో దిగిన విజయ్ పార్టీకి 234 స్థానాల […] The post తమిళనాడులో విజయ్ గెలుపును ముందే చెప్పాం: యాక్సిస్ మై ఇండియా appeared first on Navatelangana.

జిల్లా వ్యవసాయ అధికారి వెంకటరమణారెడ్డినవతెలంగాణ – ఆలేరు రూరల్తక్కువ యూరియా వినియోగం, పంటల మార్పిడి, సేంద్రీయ వ్యవసాయం,పచ్చిరొట్ట పంటల సాగు వంటి పద్ధతులు నేల ఆరోగ్యాన్ని కాపాడటానికి ఎంతో అవసరమని జిల్లా వ్యవసాయ అధికారి వెంకటరమణారెడ్డి తెలిపారు.సోమవారం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న “రైతు వారం” కార్యక్రమం కింద ఆలేరు మండలంలోని పటేల్గూడెం రైతు వేదికలో సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రైతులకు ముఖ్యంగా నేల ఆరోగ్యం పరిరక్షణపై అవగాహన కల్పించారు.ఇదే కార్యక్రమం […] The post నేల ఆరోగ్య పరిరక్షణకు సేంద్రియ పద్ధతులే మేలు appeared first on Navatelangana.

డిప్యూటీ సీఎం వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలించాలి నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలి మృతి చెందిన గొర్రెలకు నష్టపరిహారం చెల్లించాలి షరతులు లేకుండా రైతుల పంటను పూర్తిగా కొనుగోలు చేయాలి పాతర్లపాడు లోనే నష్టం సుమారు రూ.2 కోట్లుసీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు నవతెలంగాణ – బోనకల్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే అగ్నికి రైతుల పంట ఆహుతి అయిందని, ఎటువంటి షరతులు లేకుండా రైతుల పంటను పూర్తిస్థాయిలో మద్దతు ధరతో కొనుగోలు చేయాలని, నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని, మృతి చెందిన గొర్రెలకు నష్టపరిహారం చెల్లించి […] The post ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతి: సీపీఐ(ఎం) appeared first on Navatelangana.
నవతెలంగాణ-హైదరాబాద్ : తమిళనాడు రాజకీయాల్లో ఒక ఊహించని బ్లాక్బస్టర్… ఎవరూ అంచనా వేయని ఒక అద్భుతమైన స్క్రిప్ట్ ఆవిష్కృతమైంది. ఆరు దశాబ్దాలకు పైగా ద్రవిడ పార్టీల ఆధిపత్యంలో ఉన్న రాజకీయ చరిత్రను తిరగరాస్తూ, నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) చారిత్రక విజయం దిశగా దూసుకెళుతోంది. తొలిసారి ఎన్నికల బరిలోకి దిగి, అధికారాన్ని కైవసం చేసుకునే అంచున నిలిచి, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మధ్యాహ్నం 1 గంట […] The post ఆరు దశాబ్దాల చరిత్రకు బ్రేక్.. appeared first on Navatelangana.
నవతెలంగాణ-హైదరాబాద్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రాష్ట్రంలోని ఐదు నియోజకవర్గాల్లో లెఫ్ట్ ఫ్రంట్ ఆధిక్యం సాధించింది. తాజా నివేదికల ప్రకారం.. ఐదు స్థానాల్లో సిపిఐ(ఎం), సిపిఐ అభ్యర్థులు గణనీయమైన ఆధిక్యంతో ముందున్నారు. తిరుత్తురైపూండి, తాలి, శ్రీవిల్లిపుత్తూరు, పద్మనాభపురం, కిల్వె వెలూరు నియోజకవర్గాల్లో లెఫ్ట్ ఫ్రంట్ ఆధిక్యంలో ఉంది. పద్మనాభపురంలో సిపిఐ(ఎం) అభ్యర్థి ఆర్. చెల్లస్వామి 10,344 ఓట్లు సాధించి, 822 ఓట్ల ఆధిక్యంతో ముందంజలో ఉన్నారు. కిల్వె వెళూరులో సిపిఐ(ఎం) అభ్యర్థి టి. లతా […] The post Tamil Nadu: ఐదు నియోజకవర్గాల్లో లెఫ్ట్ ఫ్రంట్ ఆధిక్యం appeared first on Navatelangana.

నవతెలంగాణ – జుక్కల్ మండలంలోని ఏడు క్లస్టర్ల పరిధి రైతు వేదికలలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు వారోత్సవాలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా నాగుల్గావ్, పెద్ద ఏడ్గి , పెద్ద గుల్ల, హంగర్గ, ఖండేబల్లూర్, డోన్ గావ్, జుక్కల్ మండలాల రైతులకు ఎంఈవో సతీష్ కుమార్ కీలక విషయాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ జాదవ్ సునంద, ఉప సర్పంచ్, రైతులు, పెద్దలు జాదవ్ విజయ్ పాటీల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా […] The post మండలంలోని ఏడు క్లస్టర్లలో రైతు వారోత్సవాలు appeared first on Navatelangana.