
4315 వార్తలు



నవతెలంగాణ – హైదరాబాద్ : రాష్ట్రంలో ద్రోణి, క్యూములోనింబస్ మేఘాల ప్రభావం నెలకొందని వాతావరణశాఖ తెలిపింది. శుక్రవారం నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, SRD, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. అలాగే రాష్ట్రంలో రానున్న 3 రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 1-2 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. The post నేడు పలు జిల్లాల్లో వర్షాలు appeared first on Navatelangana.






బెంగళూరు: ఓ యువతి బాత్రూమ్ లో బిడ్డకు జన్మనిచ్చి అనంతరం పసికందు గొంతు కోసి హత్య చేసిన సంఘటన కర్నాటక రాష్ట్రం దేవనహళ్లిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... ఫాక్స్ కాన్ సంస్థలో 19 ఏళ్ల యువతి పని చేస్తోంది. సదరు యువతి గర్భం దాల్చింది. జాబ్ చేస్తుండగా యువతికి కడుపులో నొప్పి రావడంతో బాత్రూమ్ లోకి వెళ్లింది. పండింటి బిడ్డకు జన్మనివ్వడంతో పరువు పోతుందని భావించింది. వెంటనే బిడ్డను గొంతు కోసి హత్య చేసింది. అనంతరం మరొకరు వాష్ రూమ్ వెళ్లడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. యువతికి ఆస్పత్రిలో చికిత్స అందస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నవతెలంగాణ – హైదరాబాద్: రిటైర్డ్ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాబోయే 100 రోజుల్లోగా వారికి సంబంధించిన రూ.6,200 కోట్ల బకాయిలు చెల్లించాలని నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. తక్షణమే ‘రెవెన్యూ రిసోర్సెస్ మొబిలైజేషన్ కమిటీ’ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వచ్చే నెల 4న రాష్ట్ర మంత్రివర్గం మరోసారి సమావేశం కానుంది. ఆ రోజున.. ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల ప్రయోజనాలను ఎలా, ఎంత త్వరగా చెల్లించాలనే దానిపై స్పష్టమైన నిర్ణయం తీసుకోనుంది. The post రిటైర్డ్ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త appeared first on Navatelangana.
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ సమ్మెలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్తో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన నర్సంపేట డిపో డ్రైవర్ కోల శంకర్గౌడ్ (55) మృతి చెందారు. 80 శాతం కాలిన గాయాలతో హైదరాబాద్లోని అపోలో డీఆర్డీవో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ పిలుపు మేరకు గురువారం రాష్ట్రవ్యాప్తంగా సమ్మె కొనసాగింది. […] The post సమ్మెలో విషాదం..ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి appeared first on Navatelangana.

అమరావతి: ఆన్ లైన్ రమ్మీ జూదం ఓ కుటంబాన్ని బలితీసుకుంది. అన్ లైన్ రమ్మీలో డబ్బులు పెట్టి ఆడడంతో అప్పుల పాలు కావడంతో తల్లి, భార్య నుంచి భర్త రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంటుండగా కూతుళ్లు కాపాడాబోయి వారు కూడా మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతిలో పుత్తూరు ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... నారాయణవనం మండలం వెంకటకృష్ణపాలెం గ్రామంలో మోహన్(38), హరిత(33) అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు కౌశిక్(14), హరిణి(12) అనే కూతుళ్లు ఉన్నారు. మోహన్ తల్లి చంద్రకళ కూడా వారితో కలిసి ఉంటుంది. మోహన్ తండ్రికి రైల్వేలో ఉద్యొగం ఉండడంతో కారుణ్యనియమాకం కింద అతడికి ఇచ్చారు. రైల్వే ఉద్యోగం మానేసి ఇంటి వద్దే ఉంటున్నారు. కొన్నిరోజులగా ఆన్ లైన్ లో రమ్మీకి బానిసగా మారాడు. అన్ లైన్ లో డబ్బుల పెట్టి రమ్మీ ఉండడంతో పెద్ద మొత్తంలో డబ్బులు పొగొట్టుకున్నాడు. భార్య బ్యూటీ పార్లర్, టైలరింగ్ తో పాటు చిట్టీల వ్యాపారం నిర్వహిస్తోంది. అన్ లైన్ రమ్మీలో డబ్బులు పొగొట్టుకోవడంతో ఎక్కువగా అప్పులు కావడంతో ఆర్థికంగా కుంగిపోయాడు. రూ.20 లక్షలు చిట్టీల డబ్బులు తీసుకొచ్చి అప్పులు కట్టిన కూడా తీరకపోవడంతో

నవతెలంగాణ – హైదరాబాద్: ఐపీఎల్-2026లో భాగంగా శుక్రవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం RCB నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. గుజరాత్ ఏడో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్లో గెలవాలని ఇరు జట్లు ఊవిళ్లూరుతున్నాయి. The post IPL-2026 : నేడు ఆర్సీబీ vs జీటీ appeared first on Navatelangana.

నవతెలంగాణ – హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్ధృతమవుతోంది. నర్సంపేట డిపో డ్రైవర్ శంకర్ గౌడ్ మృతికి నిరసనగా ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లా (వరంగల్ , హన్మకొండ, జనగామ, MHBD, భూపాలపల్లి, ములుగు) బంద్కు ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. కాగా శంకర్ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ఆయన నేడు నర్సంపేట వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో అల్లర్లు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. The post నేడు ఉమ్మడి వరంగల్ జిల్లా బంద్ కి పిలుపు appeared first on Navatelangana.





